mutual fund
-
తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నవారి కోసం.. ‘ఛోటీ సిప్’
తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారి కోసం కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (కేఎంఏఎంసీ) ‘ఛోటీ సిప్’ను ప్రవేశపెట్టింది. నెలవారీగా అత్యంత తక్కువగా రూ. 250తో కూడా సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టొచ్చు. దీని కింద కనీసం 60 నెలల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడేలా ఇది గ్రోత్ ఆప్షన్తో మాత్రమే లభిస్తుంది. కొత్త ఇన్వెస్టర్లలో క్రమశిక్షణతో కూడుకున్న పొదుపు అలవాటును పెంపొందించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు.ఆదిత్య బిర్లా సన్ లైఫ్లోనూ..ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ కూడా తాజాగా ఛోటీ సిప్ను (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించింది. డెట్, సెక్టోరల్, థీమ్యాటిక్లాంటి కొన్ని ఫండ్స్కి తప్ప మిగతా అన్ని రకాల స్కీములకు ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. నెలవారీగా రూ. 250 నుంచి ఈ సిప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.కనీసం 60 వాయిదాలు కట్టాల్సి ఉంటుందని సంస్థ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ తెలిపారు. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని అలవర్చుకునేందుకు ఈ విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో, ముందస్తుగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. -
రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్..
ఇటీవలి కాలంలో మన మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇది చూసి దీర్ఘకాలానికి ఈక్విటీలు బ్రహ్మాండమైన రాబడులు ఇస్తాయన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అన్న సందేహాలు కూడా కొందరు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయి. ఈ సమయంలో ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలా? లేక డెట్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్న సంశయం కూడా ఎదురుకావచ్చు. కానీ, పెట్టుబడుల ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. దీర్ఘకాల లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకోవాలని కోరుకునే ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాలి. అదే సమయంలో పెట్టుబడినంతా ఈక్విటీల్లోనే పెట్టేయడం సరికాదు. డెట్కు సైతం కొంత కేటాయింపులు అవసరం. ఈక్విటీ, డెట్ పెట్టుబడులకు వీలు కల్పించే పథకాల్లో కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో కోటక్ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్లో రాబడి 7.30 శాతంగా ఉంది. గత ఐదు నెలలుగా మార్కెట్లు తీవ్ర కుదుపులను చూస్తున్నాయి. అలాంటి తరుణంలోనూ ఏడాది కాలంలో రాబడి సానుకూలంగా ఉండడం గమనార్హం. ఏడాది కాల పనితీరు విషయంలో ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ విభాగంలో ఈ పథకం రెండో స్థానంలో నిలిచింది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్లలో చూస్తే 21 శాతం, ఏడేళ్లలో 14 శాతం, 10 ఏళ్లలో 12.75 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగంతో పోల్చి చూస్తే అన్ని కాలాల్లోనూ ఈ పథకంలోనే రాబడి అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు. పెట్టుబడుల విధానం ఈ పథకం అగ్రెస్సివ్ అలోకేషన్ విధానాన్ని అనుసరిస్తుంది. 75 శాతం వరకు ఈక్విటీలకు, 25 శాతం వరకు డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వివిధ మార్కెట్ క్యాప్ల మధ్య తగినంత వైవిధ్యాన్ని పాటిస్తుంది. అధిక వేల్యూషన్లకు చేరితే లాభాలు స్వీకరించి, అదే సమయంలో చౌక విలువల వద్ద అందుబాటులో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగంగా గుర్తించొచ్చు.ఇందుకు నిదర్శనం గత ఆరు నెలల్లో క్యాపిటల్ గూడ్స్, ఆటోల్లో అమ్మకాలు చేయగా, అదే సమయంలో టెక్నాలజీ, కెమికల్స్, ఫార్మా, హెల్త్కేర్లో ఎక్స్పోజర్ పెంచుకుంది. ఈ విధానంతో నష్టాలను పరిమితం చేసి లాభాలను పెంచుకునే వ్యూహాన్ని ఫండ్ నిర్వహణ బృందం అమలు చేసింది. ఈ తరహా విధానాలతో రిస్క్ తగ్గించి, రాబడులు పెంచుకునే విధంగా పథకం పనిచేస్తుంటుంది. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,324 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 73 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 25 శాతం పెట్టుబడులు పెట్టగా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 0.43 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. 1.64 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే 68 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 30 శాతం ఇన్వెస్ట్ చేస్తే, స్మాల్క్యాప్ కంపెనీలకు 1.92 శాతం కేటాయించింది.ఈక్విటీల్లో టెక్నాలజీరంగ కంపెనీల్లో అత్యధికంగా 18 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత 15 శాతం మేర బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు, 9.68 శాతం మెటీరియల్స్ కంపెనీలకు, 8 శాతం హెల్త్కేర్ కంపెనీలకు కేటాయించింది. డెట్ పెట్టుబడుల్లో రిస్క్ దాదాపుగా లేని ఎస్వోవీల్లో (ప్రభుత్వ బాండ్లు) 20 శాతం ఇన్వెస్ట్ చేయగా, మెరుగైన క్రెడిట్ రేటింగ్కు నిదర్శనంగా ఉండే ఏఏఏ సెక్యూరిటీల్లో 3.41 శాతం పెట్టుబడులు ఉండడాన్ని గమనించొచ్చు.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్కంపెనీ పెట్టుబడులు శాతంభారతీ ఎయిర్టెల్ 4.49 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.89 ఇన్ఫోసిస్ 3.18 ఫోర్టిస్ హెల్త్ 2.90 అల్ట్రాటెక్ సిమెంట్ 2.88 విప్రో 2.74 ఎన్టీపీసీ 2.39 పవర్ఫైనాన్స్ 2.25 ఒరాకిల్ ఫైనాన్స్ 1.96 ఐసీఐసీఐ బ్యాంక్ 1.89 -
సెబీ కొత్త రూల్స్: ఏప్రిల్ 1 నుంచే..
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) పనిచేసే ఉద్యోగులకు సెబీ నిబంధనల పరంగా ఊరట కల్పించింది. మఖ్య నిర్వహణ అధికారి (సీఈవో), ముఖ్య పెట్టుబడుల అధికారి (సీఐవో), ఫండ్ మేనేజర్లు తదితర ఎంపిక చేసిన కీలక ఉద్యోగులు తమ వార్షిక వేతనంలో 20 శాతం మేర తమ సంస్థ నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అంతేకాదు ఇలా చేసిన పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. దీన్నే ‘స్కిన్ ఇన్ ద గేమ్’గా చెబుతారు.ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులో కొంత ఉపశమనాన్ని సెబీ కల్పించింది. స్థూల వార్షిక పారితోషికం ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ఉద్యోగులు సొంత నిర్వహణ పథకాల్లో చేయాల్సిన పెట్టుబడుల శాతంలో మార్పులు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ ఉద్యోగుల నైతిక నడవడిక, సొంత పథకాల నిర్వహణలో బాధ్యతను పెంచడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ ఇందులోని ఉద్దేశ్యాలుగా ఉన్నాయి.కొత్త నిబంధనలు..కొత్త నిబంధనల కింద రూ.25 లక్షలకు మించని వేతనం ఉన్న వారు సొంత మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.రూ.25 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారు 10 శాతం ఇన్వెస్ట్ చేయాలి. ఇసాప్లు/ఉద్యోగ స్టాక్ ఆప్షన్లు కూడా కలుపుకుంటే 12.5% పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య వేతనం ఉన్న వారు కనీసం 14 శాతం మేర (ఒకవేళ స్టాక్ ఆప్షన్లు కూడా ఉంటే 17.5 శాతం) పెట్టుబడులు పెట్టాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో అమ్మకాల సెగ
డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఫిబ్రవరి నెలలో నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. రూ.6,525 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. అంతకుముందు నెల జనవరిలో రూ.1.28 లక్షల కోట్లను డెట్ ఫండ్స్ ఆకర్షించడం గమనార్హం. మొత్తం 16 విభాగాలకు గాను 10 విభాగాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.‘స్వల్పకాలానికి పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పటికీ పోర్ట్ఫోలియో పరంగా డెట్ ఫండ్స్ ఎంతో ముఖ్యమైనవి. మార్కెట్ పరిస్థితులు కుదుటపడితే రానున్న రోజుల్లో పెట్టుబడుల రాక స్థిరపడొచ్చు’ అని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ తెలిపారు. నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం డెట్ పెట్టుబడుల విలువ (డెట్ ఏయూఎం) ఫిబ్రవరి చివరికి రూ.17.08 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. జనవరి చివరికి ఇది రూ.17.06 లక్షల కోట్లుగా ఉంది.పాజిటివ్–నెగెటివ్లిక్విడ్ ఫండ్స్లోకి నికరంగా రూ.4,977 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.1,065 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.473 కోట్ల చొప్పున ఆకర్షించాయి.మీడియం టు లాంగ్ డ్యురేషన్ ఫండ్స్, గిల్డ్ ఫండ్స్లోకి స్వల్పంగా పెట్టుబడులు పెరిగాయి. అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.4,281 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. మనీ మార్కెట్ ఫండ్స్ రూ.276 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్, ఓవర్నైట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.2,264 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి నెల ఉపసంహరణల్లో ఈ నాలుగు విభాగాల నుంచే 90 శాతం ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..వడ్డీ రేట్ల కోతపై అంచనాలు‘ఆర్బీఐ రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నట్టున్నారు. దీనివల్ల లాంగ్ డ్యురేషన్ ఫండ్స్లో పెట్టుబడుల వృద్ధి జరుగుతుంది. తక్కువ క్రెడిట్ రిస్క్ కారణంగా గిల్ట్ ఫండ్స్కు ఆదరణ కొనసాగుతోంది. ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడులకు దీన్ని మెరుగైన విభాగంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారు’ అని మెష్రామ్ వివరించారు. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు నికరంగా 26 శాతం తగ్గి (జనవరితో పోల్చి చూస్తే) రూ.29,303 కోట్లుగా ఉండడం గమనార్హం. అన్ని విభాగాలూ కలిపి ఫిబ్రవరిలో ఫండ్స్ పరిశ్రమ నికరంగా ఆకర్షించిన పెట్టుబడులు రూ.40,000 కోట్లుగా ఉన్నాయి. -
ప్రతి నెలా రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తం ఎలా?
నేను ప్రతి నెలా రూ.5,000 మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలానికి మెరుగైన పథకాలను సూచించగలరు. – అహ్మద్ వానిదీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవే. మార్కెట్లలో ఉండే ఆటుపోట్ల దృష్ట్యా మీకు సౌకర్యమైన పథకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. ఇవి మూడింత రెండొంతులు పెట్టుబడులను ఈక్విటీలకు, మిగిలినది డెట్కు కేటాయిస్తుంటాయి. మార్కెట్ పతనాల్లో పెట్టుబడుల విలువ క్షీణతకు డెట్ పెట్టుబడులు కుషన్గా పనిచేస్తాయి. ప్రతి నెలా రూ.5,000 చొప్పున గత 20 ఏళ్ల నుంచి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం రూ.51.25 లక్షలుగా మారి ఉండేది.అంటే వార్షిక సిప్ రాబడి 12.18 శాతం. ఒకవేళ పెట్టుబడుల్లో అనుభవం ఉండి, మార్కెట్ ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో.. అది కూడా లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక రిస్క్ తీసుకున్నప్పటికీ 20 ఏళ్ల కాలంలో చూస్తే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో వార్షిక రాబడి 12.66 శాతమే ఉంది. కనుక ఇన్వెస్టర్లు తమ రిస్క్కు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి పలు న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్ఎఫ్వోలు/కొత్త పథకాలు) ప్రారంభం కావడం చూశాను. అవి ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి. కానీ, ఇప్పటికే పెట్టుబడులకు అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేయడం మెరుగైనదా? అన్న విషయంలో నాకు స్పష్టత లేదు. ఎన్ఎఫ్వోల్లో పెట్టుబడులు పెట్టే ముందు చూడాల్సిన అంశాలు ఏవి? – కరుణాకర్మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తరచుగా కొత్త పథకాలను ప్రవేశపెడుతుంటాయి. ప్రస్తుత పథకాలతో పోల్చి చూస్తే వీటిల్లో ఉండే వ్యత్యాసం కొంతే. కొన్ని ఎన్ఎఫ్వోలు మాత్రం కొత్త పెట్టుబడుల అవకాశాలతో ముందుకు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు ఇప్పటికే మంచి పనితీరు చూపిస్తున్న పథకాలకు పరిమితం కావడం మంచిది. ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేసే ముందుకు ప్రశ్నించుకోవాల్సిన అంశాలు చూద్దాం. ఎన్ఎఫ్వోలో కొత్తదనం ఏదైనా ఉందా? అన్నది చూడాలి. చాలా ఎన్ఎఫ్వోలు ప్రస్తుత పథకాలకు మాస్క్ మాదిరిగా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఈక్విటీ, గోల్డ్ ఫండ్స్ తదితర వినూత్నమైన ఆఫర్లు మినహా సాధారణమైన ఎన్ఎఫ్వోలతో పోర్ట్ఫోలియోకు అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏదీ ఉండదు. థీమ్ లేదా సెక్టార్ ఫండ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత ఎన్ఎఫ్వో తమ పెట్టుబడుల అవసరాలను తీర్చే విధంగా ఉందా? అన్నది చూడాలి.మీ ప్రస్తుత పెట్టుబడులు మీ ఆర్థిక లక్ష్యాలను తీర్చే విధంగా ఉంటే, ఎన్ఎఫ్వో మెరుగైన ఆప్షన్ కాకపోవచ్చు. ప్రతీ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో చేరాలనేమీ లేదు. కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్వో మాదిరిగా పెట్టుబడుల విధానాన్ని ఆఫర్ చేస్తున్న పథకాలు ఇప్పటికే ఏవైనా ఉన్నాయేమో పరిశీలించాలి. ఒకవేళ ఉంటే, వాటిల్లో రాబడుల పనితీరు కొన్నేళ్ల నుంచి మెరుగ్గా ఉందా? లేదా అన్నది పరిశీలించాలి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
కొత్త ఫండ్ గురూ: సిల్వర్ ఈటీఎఫ్.. టాప్ 20.. ఫోకస్డ్ 25
పారిశ్రామిక కమోడిటీగాను, విలువైన లోహంగా పెట్టుబడికి అనువైన సాధనంగాను వెండి ద్విపాత్రాభినయం పోషిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పించేలా 360 వన్ అసెట్ మేనేజ్మెంట్ (గతంలో ఐఐఎఫ్ఎల్ అసెట్ మేనేజ్మెంట్) సిల్వర్ ఈటీఎఫ్ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 20 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది దేశీయంగా వెండి ధరలను ట్రాక్ చేస్తూ, దానికి అనుగుణమైన పనితీరు కనపరుస్తుందని సంస్థ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. వెండి ధరల కదలికలకు అనుగుణంగా దీర్ఘకాలిక సంపద సృష్టి, ఆదాయం కోరుకునే ఇన్వెస్టర్లకు అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం అసెట్స్లో 95 శాతాన్ని వెండి లేదా వెండి సంబంధిత సాధనాల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. హెచ్డీఎఫ్సీ ‘నిఫ్టీ టాప్ 20’ ఇండెక్స్ ఫండ్ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నిఫ్టీ టాప్ 20 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ను ప్రవేశపెట్టింది. ఇది మార్చి 21తో ముగుస్తుంది. సమాన వెయిటేజీ పెట్టుబడి విధానం ద్వారా దేశీ బ్లూ చిప్ కంపెనీల దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను, ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ స్కీము అనువైనదిగా ఉంటుంది. ఒకే స్టాక్లో అధికంగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా సమాన స్థాయిలో పెట్టుబడిని కేటాయించడం వల్ల రిస్కులు తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వెయిటేజీ ప్రతి మూడు నెలలకోసారి మారుతుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని సంస్థ ఎండీ నవ్నీత్ మునోట్ తెలిపారు. బజాజ్ అలయంజ్ లైఫ్ ఫోకస్డ్ 25 ఫండ్ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా ఫోకస్డ్ 25 ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ను ప్రకటించింది. కంపెనీకి చెందిన యులిప్ పథకాలతో పాటు ఇది అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా 25 వరకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. ఈ ఎన్ఎఫ్ఓ మార్చి 20 వరకు అందుబాటులో ఉంటుందని సీఎఫ్ఓ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. -
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ’ఛోటీ సిప్’.. రూ. 250 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ తాజాగా ఛోటీ సిప్ను (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించింది. డెట్, సెక్టోరల్, థీమ్యాటిక్లాంటి కొన్ని ఫండ్స్కి తప్ప మిగతా అన్ని రకాల స్కీములకు ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. నెలవారీగా రూ. 250 నుంచి ఈ సిప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.కనీసం 60 వాయిదాలు కట్టాల్సి ఉంటుందని సంస్థ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ తెలిపారు. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని అలవర్చుకునేందుకు ఈ విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో, ముందస్తుగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. -
వెల్త్టెక్ ప్లాట్ఫామ్లకు ఏఐ దన్ను
వ్యక్తిగత రుణంపై 20 శాతం పైగా భారీ వడ్డీ రేటుతో సతమతమవుతున్న ఓ ఐటీ ప్రొఫెషనల్కి కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో సమస్యకు ఓ పరిష్కారం లభించింది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను ఏఐ ఆధారిత వెల్త్టెక్ ప్లాట్ఫాంకు అనుసంధానించడం ద్వారా తన దగ్గరున్న ఫండ్స్పై అత్యంత చౌకగా 10.5 శాతానికే రుణాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఏఐ టెక్నాలజీతో ఆదా చేసుకునే మార్గాలను కూడా అందిపుచ్చుకున్నారు. ఇక ఏళ్ల తరబడి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న మరో ఇన్వెస్టరుకు.. సదరు ఫండ్ పనితీరు అంత గొప్పగా లేదనిపించింది. దీంతో ఓ వెల్త్టెక్ ప్లాట్ఫాం మానిటరింగ్ సాధనాలను ఉపయోగించుకుని మరింత మెరుగైన రాబడినిచ్చే ఫండ్కి మారగలిగారు. మంచి ప్రయోజనం పొందారు.ఇలా సాధారణంగా సంస్థాగత ఇన్వెస్టర్లకే లభ్యమయ్యే పెట్టుబడుల పరిజ్ఞానాన్ని సామాన్య మదుపరులు కూడా అందుకోవడంలో వెల్త్టెక్ స్టార్టప్లు దన్నుగా నిలుస్తున్నాయి. అధునాతనమైన కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), జనరేటివ్ ఏఐ (జెన్ఏఐ) సాంకేతికతల వినియోగంతో ఈ అంకురాలు దూసుకెళ్తుండటంతో దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్లాట్ఫాంలు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వివిధ రకాల మదుపరులకు సంపద నిర్వహణ విషయంలో మరింత వ్యక్తిగత స్థాయిలో సలహాలు ఇస్తున్నాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలోను, రిసు్కలను అధిగమించడంలోను తోడ్పాటునిస్తున్నాయి. టెక్సై రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ సేవల మార్కెట్ 2023లో 429.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2025 నుంచి 2029 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 4.56 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. ఈ ఏడాదే ఏఐ అప్లికేషన్స్ తోడ్పాటుతో ఈ రంగం 1–2 బిలియన్ డాలర్ల మేర పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో సంపన్నులు, టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. వందకు పైగా అంకురాలు..అధ్యయన సంస్థ ట్రాక్షన్ ప్రకారం ప్రస్తుతం దాదాపు 122 అంకురాలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. ఇన్వెస్టర్ఏఐ అనే సంస్థ నేరుగా బ్రోకరేజ్ ప్లాట్ఫాంలతో అనుసంధానమై సరీ్వసులు అందిస్తోంది. చాట్జీపీటీ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బ్రూస్ కీత్ వెల్లడించారు. దీనితో ట్రేడింగ్లో 70% వరకు విజయం సాధించే అవకాశాలు ఉంటున్నాయన్నారు. మైఫై అనే మరో స్టార్టప్ సంస్థ, మార్కెట్ ధోరణులను విశ్లేషించి, తగిన పెట్టుబడి వ్యూహాలను సూచించేందుకు ఏఐ, జెన్ఏఐ సాంకేతికతలను ఉపయోగిస్తోంది. ఆటోమేటెడ్ అసిస్టెంట్లు, రియ ల్ టైమ్ విశ్లేషణలతో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే కచి్చతమైన ఫలితాలనిచ్చే సలహాలను అందిస్తోంది.పెట్టుబడుల జోరు.. వెల్త్టెక్ స్టార్టప్లకున్న సామర్థ్యాలను గుర్తించి, వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకొస్తున్నారు. డిజర్వ్ అనే సంస్థలో 2024 జూలైలో ప్రేమ్జీ ఇన్వెస్ట్ సారథ్యంలో ఇన్వెస్టర్లు 32 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది పోర్ట్ఫోలియోను సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు లక్షల కొద్దీ డేటా పాయింట్లను విశ్లేషించి, తగు సలహాలిస్తుంది. ఇక గురుగ్రామ్కి చెందిన సెంట్రిసిటీ అనే మరో స్టార్టప్ .. 20 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఇది అత్యంత సంపన్నులు, స్వతంత్ర ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థిక సలహాలు అందిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫండ్ పనితీరు మదింపు ఇలా..
భారత్లో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పెట్టుబడి సాధనాల్లో మ్యుచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. 2023లో అద్భుతంగా రాణించిన మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ 2024లోనూ అదే తీరును కొనసాగించడంతో నిర్వహణలోని అసెట్స్ పరిమాణం ఏకంగా రూ.17 లక్షల కోట్లు పెరిగింది. సరైన ఫండ్ ఎంపికపై ఎలాగైతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో, అలాగే ఫండ్ పనితీరును మదింపు చేయడంపై కూడా ఇన్వెస్టర్లు తప్పక దృష్టి పెట్టాలి. ఇందుకు ఉపయోగపడే కొన్ని కీలక కొలమానాల గురించి తెలుసుకుందాం. రిస్క్కు తగ్గ రాబడులు: రాబడులు ముఖ్యమే అయినప్పటికీ, ఇవి పెట్టుబడి ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్నులను అందించగలిగే సామర్థ్యమే, ఫండ్ సిసలైన పనితీరును మదింపు చేసేందుకు కీలకాంశంగా ఉంటుంది. తీసుకుంటున్న రిస్క్కు తగ్గట్లుగా ఫండ్ ఎంత రాబడిని అందిస్తున్నదీ తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. రిస్క్ అడ్జస్టెడ్ రిటర్నులను మదింపు చేసేందుకు విరివిగా ఉపయోగించే సాధనాల్లో షార్ప్ రేషియో కూడా ఒకటి. తీసుకున్న ప్రతి యూనిట్ రిస్క్కు ఫండ్ ఎంత ఎక్కువగా రాబడిని అందించినది తెలుసుకునేందుకు ఈ నిష్పత్తి ఉపయోగపడుతుంది. షార్ప్ నిష్పత్తి అధికంగా ఉందంటే, తీసుకున్న రిస్కుకు మించి అధిక రాబడులను అందిస్తోందని అర్థం. దీర్ఘకాలంలో స్థిరమైన పనితీరును కోరుకుంటున్న ఇన్వెస్టర్లకు ఇది సానుకూల సంకేతం. ఇక ఆల్ఫా అనేది రిస్క్కు అనుగుణంగా సర్దుబాట్లు చేసి, బెంచ్మార్క్ సూచీకి మించి పనితీరును కనపర్చగలిగే ఫండ్ మేనేజర్ సామర్థ్యాలను సూచిస్తుంది. ఆల్ఫా సానుకూలంగా ఉందంటే మార్కెట్ కదలికలను బట్టి, ఊహించిన దానికి మించి ఫండ్ మేనేజరు రాబడులు అందించినట్లు అర్థం. బీటా: మ్యుచువల్ ఫండ్ స్కీములు సాధారణంగా నిర్దిష్ట సూచీని ప్రామాణికంగా తీసుకుంటాయి. సదరు బెంచ్మార్క్లతో పోలిస్తే నిర్దిష్ట స్కీము రాబడులను అందించడంలో ఎంత ఒడిదుడుకులకు లోనవుతున్నదీ తెలుసుకునేందుకు ఉపయోగించే కొలమానం బీటా. మార్కెట్ బీటా సాధారణంగా 1గా ఉంటుంది. మ్యుచువల్ ఫండ్ బీటా 1.0గా ఉందంటే, అచ్చం దాని బెంచ్మార్క్ సూచీని ప్రతిబింబించేంత సెన్సిటివ్గా లేదా ఒడిదుడుకులతో ఉంటుందని అర్థం. బీటా 1.20గా ఉందంటే అది 20% ఎక్కువ సెన్సిటివ్గా లేదా హెచ్చుతగ్గులకు లోనవుతుందని అర్థం. పోర్ట్ఫోలియోలోని మిగతా సాధనాలతో పోలిస్తే రిసు్కలను మదింపు చేసేందుకు ఇదొక కొలమానంగా ఉపయోగపడగలదు. ట్రాకింగ్ ఎర్రర్: నిర్దిష్ట ఫండ్ పనితీరు, దాని బెంచ్మార్క్ సూచీ పనితీరుకు ఎంత దగ్గరగా ఉందనేది ట్రాకింగ్ ఎర్రర్ లెక్కిస్తుంది. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉందంటే, బెంచ్మార్క్కి అనుగుణంగా ఫండ్ పనితీరు అంత దగ్గరగా ఉందని అర్థం. అదే ట్రాకింగ్ ఎర్రర్ అధికంగా ఉందంటే, ప్రామాణిక సూచీకి భిన్నంగా ఫండ్ పనితీరు ఉంటోందని భావించవచ్చు. ప్యాసివ్ ఫండ్స్ ఇన్వెస్టర్లు లేదా ఇండెక్స్ తరహా రాబడులను కోరుకునే మదుపరులకు ట్రాకింగ్ ఎర్రర్ తక్కువ ఉండటం మంచిది. ఎక్స్పెన్స్ రేషియో: ఎక్స్పెన్స్ రేషియో అనేది మ్యుచువల్ ఫండ్ నిర్వహణకయ్యే వార్షిక వ్యయాలను ప్రతిబింబిస్తుంది. దీన్ని ఫండ్ అసెట్స్లో నిర్దిష్ట శాతంగా చూపిస్తారు. ఎక్స్పెన్స్ రేషియో అధికంగా ఉంటే రాబడులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, కాస్త ఎక్కువ ఫీజులు వర్తించినా, యాక్టివ్ మేనేజ్మెంట్ ఉండటం వల్ల ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్తో పోలిస్తే మరింత మెరుగైన రాబడులు పొందడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, స్టాక్స్ ఎంపిక లేదా మార్కెట్ టైమింగ్పై దృష్టి పెట్టే యాక్టివ్ ఫండ్లు, బెంచ్మార్క్కి మించి రాబడులు అందించడం ద్వారా అధిక ఫీజులకు న్యాయం చేకూర్చవచ్చు. కాబట్టి వ్యయాలతో పోలిస్తే ఫండ్ వ్యూహం వల్ల ఒనగూరే విలువను మదింపు చేసుకోవడం అన్నివేళలా శ్రేయస్కరం. బెంచ్మార్క్: మ్యుచువల్ ఫండ్ పనితీరును పోల్చిచూసే మార్కెట్ సూచీని బెంచ్మార్క్గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఈక్విటీ ఫండ్లను సాధారణంగా నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ను ప్రామాణికంగా పోల్చి చూస్తారు. అదే డెట్ ఫండ్లకు బాండ్ సూచీలను బెంచ్మార్క్లుగా పరిగణిస్తారు. ఫండ్ పనితీరును బెంచ్మార్క్తో పోల్చి చూడటం వల్ల ఫండ్ మేనేజర్ వ్యూహం సమర్ధతను, అధిక రాబడులను సాధించగలుగుతున్నారా అనే ది ఇన్వెస్టర్లు తెలుసుకోవచ్చు. అలాగే, వివిధ కాలవ్యవధుల్లో అంటే 1 ఏడాది, 3 ఏళ్లు, లేదా 5 ఏళ్ల వ్యవధిలో నిర్దిష్ట ఫండ్ తన బెంచ్మార్క్తో పోలిస్తే ఏ విధంగా పనిచేస్తోందో పరిశీలించడం కూడా ముఖ్యం. ఇదీ చదవండి: స్టాక్స్ అమ్మి ఫ్లాట్ కొనడం మంచిదా?చివరగా చెప్పాలంటే, మ్యుచువల్ ఫండ్ పనితీరును మదింపు చేయాలంటే అది గతంలో అందించిన రాబడి మాత్రమే చూస్తే సరిపోదు. పైన పేర్కొన్న అంశాల్లో కొన్నింటిని పరిశీలించడం ద్వారా సదరు ఫండ్ సిసలైన సామర్థ్యాలను ఇన్వెస్టరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఫండ్ మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ కొలమానాలన్నింటినీ కలిపి ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడి వృద్ధి, ఆదాయాన్ని కోరుకుంటున్నా లేదా సమతూకమైన విధానాన్ని పాటించాలనుకుంటున్నా ఈ కొలమానాలను అర్థం చేసుకోవడం వల్ల మరింత స్మార్ట్గా, సమగ్రమైన వివరాలతో తగిన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు.-రోహిత్ మట్టూ, నేషనల్ హెడ్ (రిటైల్ సేల్స్) యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ -
రూ.250కే జన్నివేష్ సిప్
ముంబై: తక్కువ మొత్తంతో మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడికి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పరిష్కారం కొనుగొంది. జన్నివేష్ సిప్ పేరుతో రూ.250 నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ దీన్ని ప్రారంభించారు. రూ.250 సిప్ తనకు అత్యంత ఇష్టమైన స్వప్నాల్లో ఒకటని బుచ్ పేర్కొన్నారు. ఈ తరహా అతి స్వల్ప పెట్టుబడుల ఉత్పత్తులు లక్షలాది మందికి సంపద సృష్టిలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.‘భారత్ వృద్ధి చెందే క్రమంలో సంపద సృష్టి జరుగుతుంది. చిన్న మొత్తాల రూపంలో అయినా ప్రతి ఒక్కరికీ అందాలి. జన్నివేష్ అంటే నా దృష్టిలో అర్థం ఇదే’ అని మాధవి పేర్కొన్నారు. గతంలో బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు రూ.100, రూ.500 సిప్లు ప్రవేశపెట్టినప్పటికీ అధిక నిర్వహణ వ్యయాల కారణంగా వాటికి కొనసాగించలేకపోయినట్టు చెప్పారు. సూక్ష్మ సిప్లు ఆర్థికంగా లాభసాటి కావాలంటే, రెండేళ్లలోపే వాటికి సంబంధించి లాభం–నష్టంలేని స్థితి(స్టేబుల్గా ఉండేలా)ని సాధించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: పెట్రోలియం ధరల్లో హెచ్చుతగ్గులు‘డిజిటల్ ప్లాట్ఫామ్ల సాయంతో రూ.250 సిప్ ద్వారా మొదటిసారి ఇన్వెస్టర్లు, అసంఘటిత రంగంలోని చిన్న మొత్తాల పొదుపరులను ఆకర్షించగలం’ అని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నందకిషోర్ ప్రకటించారు. అందరికీ ఆర్థిక సేవలను మరింత సమర్థవంతంగా చేరువ చేసే దిశగా తాము ఉత్పత్తుల అభివృద్ధి, ప్రక్రియలు, టెక్నాలజీలపై దృష్టి సారిస్తామని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్తోపాటు పేటీఎం, జెరోదా, గ్రోవ్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రతీ యూజర్ జన్నివేష్ సిప్ను పొందొచ్చని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. -
ఆర్బిట్రేజ్ ఫండ్స్తో మెరుగైన రాబడులు
వేగంగా మారిపోయే పెట్టుబడుల ప్రపంచంలో సాధారణంగా మనం ఊహించని సందర్భాల్లో అవకాశాలు వస్తుంటాయి. ధరలపరంగా ఉండే వ్యత్యాసాలను ఉపయోగించుకుని, లబ్ధిని పొందే వ్యూహమే ఆర్బిట్రేజ్. మార్కెట్లో ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని, మెరుగైన రాబడులను అందించే లక్ష్యంతో ఏర్పడ్డ కొత్త తరహా మ్యుచువల్ ఫండ్సే ‘ఆర్బిట్రేజ్ ఫండ్స్’. వీటితో ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఏమిటి, ఇవి ప్రాచుర్యంలోకి పొందడం వెనుక కారణాలేంటి, ప్రస్తుతం భారత మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల్లో ఆదరణ ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునేందుకు ఒకసారి ఆర్బిట్రేజ్ ఫండ్స్ కాన్సెప్టు, పని తీరు, సామర్థ్యాల గురించి తెలుసుకుందాం.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇలా..‘అ’ అనే కంపెనీ ఈక్విటీ షేర్లు, క్యాష్ మార్కెట్లో రూ.100 వద్ద, ఫ్యూచర్ మార్కెట్లో రూ.102 వద్ద (ధర ప్రీమియంలో వ్యత్యాసాల వల్ల) ట్రేడవుతున్నాయనుకుందాం. ఫండ్ మేనేజరు ‘అ’ కంపెనీ షేర్లను క్యాష్ మార్కెట్లో రూ.100కు కొని, వాటిని ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.102కు అమ్మాలని అనుకున్నారనుకుందాం. సాధారణంగా నెలాఖరున, ఫ్యూచర్ కాంట్రాక్టు ఎక్స్పైర్ అయిపోయే సమయానికి క్యాష్ మార్కెట్, అటు ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు ఒకే స్థాయికి సర్దుబాటు అవుతాయి. అప్పుడు ఫండ్ మేనేజరు తన ట్రేడింగ్ లావాదేవీని రివర్స్ చేసి, రెండు ధరల మధ్య వ్యత్యాసమైన రూ.2 మొత్తాన్ని రాబడిగా పొందుతారు.స్టాక్స్, డెరివేటివ్స్ మార్కెట్లలో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసే మ్యుచువల్ ఫండ్స్ను ఆర్బిట్రేజ్ ఫండ్స్గా పరిగణిస్తారు. మరింత సరళంగా చెప్పాలంటే ఒక అసెట్ స్పాట్ ధర (స్టాక్ మార్కెట్లో), దాని ఫ్యూచర్ ధర (డెరివేటివ్స్ మార్కెట్లో) మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని ఈ ఫండ్స్ లబ్ధిని పొందుతాయి. అల్గోరిథమ్లు, నిపుణులైన ఫండ్ మేనేజర్ల సహాయంతో స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లలో ధరల వ్యత్యాసాన్ని ఈ ఫండ్స్ నిరంతరం పరిశీలిస్తూ ఉంటాయి. అయితే, అవకాశాలు క్షణాల్లో ఆవిరైపోతాయి కాబట్టి, ఈ వ్యూహాన్ని అమలు చేయడమనేది చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ధరపరంగా వ్యత్యాసం చాలా తక్కువ పర్సెంటేజీ పాయింట్లలోనే ఉండొచ్చు, కానీ మార్కెట్లోని మిగతా వారు కూడా ఆ అవకాశాన్ని గుర్తించే ఆస్కారం ఉంది, కాబట్టి ఆ వ్యత్యాసం చాలా వేగంగా మాయమైపోవచ్చు. కనుక మిగతావారికన్నా వేగంగా స్పందించాల్సి ఉంటుంది.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆకర్షణీయంఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో) సెగ్మెంట్ను ప్రోత్సహించే విధంగా సెబీ ఇటీవలే కొన్ని చర్యలు ప్రకటించింది. 2024 నవంబర్ 29 నుంచి అదనంగా 45 సెక్యూరిటీల్లో ఎఫ్అండ్వో కాంట్రాక్టులను అనుమతించింది. అలాగే, మార్కెట్ వృద్ధికి అనుగుణంగా ఉండేలా 2024 నవంబర్ 20 నుంచి ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టు సైజును రూ.15 లక్షలకు పెంచింది. ఈ చర్యలన్నీ, దేశీయంగా డెరివేటివ్స్ మార్కెట్ను విస్తరించేందుకు, వైవిధ్యభరితంగా మార్చేందుకు, మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు, రిటైల్ ఇన్వెస్టర్లు మరింతగా పాలుపంచుకునేలా ప్రోత్సహించేందుకు దోహదపడతాయి. కొత్త ఫ్యూచర్స్ అందుబాటులోకి రావడం వల్ల ఫండ్లు వివిధ రంగాలు, కంపెనీలు, మార్కెట్ క్యాప్లవ్యాప్తంగా తమ వ్యూహాలను మరింత వైవిధ్యంగా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం లాభాలపై పన్ను ఎంత?పెట్టుబడులతో ప్రయోజనాలుమిగతావాటితో పోలిస్తే తక్కువ రిస్క్: మార్కెట్ గమనంతో పట్టింపు లేకుండా ఈ విధానం చాలా సింపుల్గా ఉంటుంది. మార్కెట్లో స్ప్రెడ్లను గుర్తించి, తదుపరి ఎక్స్పైరీ వరకు ‘లాకిన్’ చేయడంపైనే ఫండ్ దృష్టి పెడుతుంది.ఒడిదుడుకుల మార్కెట్లలో అనుకూలం: మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు రాబడులను అంచనా వేయడమనేది చాలా మటుకు మ్యుచువల్ ఫండ్ స్కీములకు కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. మరోవైపు, మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పుడైనా, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడైనా తక్కువ రిస్క్తో కూడుకున్న వ్యూహాలుగా ఆర్బిట్రేజ్ ఫండ్లు మెరుగ్గా రాణించగలుగుతాయి. మార్కెట్ ఒడిదుడుకుల్లో షేర్ల ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కాబట్టి, వివిధ మార్కెట్లలో వాటిని అప్పటికప్పుడు కొని అమ్మేయడం ద్వారా, ఆ పరిస్థితిని ఆర్బిట్రేజ్ ఫండ్స్ తమకు అనువైనదిగా మార్చుకుంటాయి. పన్ను ప్రయోజనాలు: ఈ ఫండ్స్ స్వభావరీత్యా హైబ్రిడ్ ఫండ్సే అయినప్పటికీ ఈక్విటీ ట్యాక్సేషన్కి అర్హత ఉంటుంది. ఫండ్ మొత్తం అసెట్స్లో కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ఆర్బిట్రేజ్ ఫండ్ను ఏడాదికన్నా ఎక్కువ కాలం అట్టే పెట్టుకుంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) కింద 12.5 శాతం పన్ను రేటే వర్తిస్తుంది (రూ. 1.25 లక్షల మినహాయింపునకు లోబడి). పన్ను ఆదా చేస్తూ, స్థిరమైన రాబడులను అందించే సాధనాలను కోరుకునే ఇన్వెస్టర్లకు, ఆర్బిట్రేజ్ ఫండ్లు ఆకర్షణీయమైన ఆప్షన్గా ఉండగలవు. మార్కెట్లో ఒడిదుడుకులను అవకాశాలుగా మల్చుకునే అధునాతన వ్యూహాలతో ఆర్బిట్రేజ్ ఫండ్స్ పనిచేస్తాయి. హెచ్చుతగ్గులు, లిక్విడిటీ, నియంత్రణపరంగా స్థిరత్వం నెలకొన్న భారత మార్కెట్లో, పెట్టుబడిని కాపాడుకుంటూ స్థిరమైన వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్లు ఆకర్షణీ యమైన ఆప్షన్. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోసం హెడ్జింగ్ కోరుకునే ఇన్వెస్టర్లు, ఆర్బిట్రేజ్ ఫండ్లను తప్పక పరిశీలించవచ్చు.- కార్తీక్ కుమార్, ఫండ్ మేనేజర్, యాక్సిస్, మ్యుచువల్ ఫండ్ -
సులభంగా రూ.కోటి సంపాదన!
స్టాక్ మార్కెట్ అంటే తీవ్ర ఒడిదొడుకులు సహజం. ఒక్క రోజులో సెన్సెక్స్, నిఫ్టీ(NIFTY) సూచీలు భారీగా నష్టపోతాయి. మరో రోజు అవి అంతే వేగంతో పైకి దూసుకుపోతాయి. ఇది సహజమే. దీర్ఘకాలిక లక్ష్యాలతో మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇలా సూచీల్లోని ఒడిదొడుకుల ప్రయోజనమే కలిగిస్తాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) చేసేవారికి ఇదో మంచి అవకాశంగా భావించాలి. మార్కెట్ ఎటు వైపు పయనిస్తున్నా మదుపు చేస్తూ వెళ్లడమే వీరికి లాభాలు పెరిగేలా చేస్తుంది. అసలు సిప్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.మార్కెట్ భారీగా పెరిగినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం మదుపు చేయడం సరికాదు. అలాగని అలా పెరుగుతూ ఎక్కడి వరకు వెళ్తుందో స్పష్టంగా చెప్పలేం. ఒకవేళ తగ్గితే నష్టపోతామనే భయాలుంటాయి. కానీ సిప్ చేసేవారికి అలాంటి భయాలు ఉండకూడదు. ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి లాభాలు అందుకోవచ్చు. ఇదే సిప్ ఉద్దేశం. కొద్ది మొత్తంతో ప్రారంభించి, ఏటా కొంత శాతం పెంచుకుంటూ వెళ్తే తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టవచ్చు.లక్ష్యంపై స్పష్టతఅసలు ఏ ఇన్వెస్ట్ చేసినా అది మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా ఉండాలి. ఏ సమయంలో మనకు ఆ డబ్బు అవసరమో స్పష్టత ఉండాలి. దాన్ని సాధించేందుకు ఏం చేయాలి? అనే స్పష్టమైన ప్రణాళికతోనే సిప్ను ప్రారంభించాలి. మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టే లక్ష్యాలు కాలక్రమంలో మారిపోవచ్చు. మరింత అధిక మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. చాలామంది అనేక పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ, కొన్నిసార్లు తమ అవసరానికి సరిపడా డబ్బు అందుకోకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలపై స్పష్టమైన వైఖరి ఉండాలి. నష్టభయం, రాబడి అంచనాలు, ఆర్థిక లక్ష్యాలు, వ్యవధి ఇలా పలు అంశాలను పరిశీలించాకే తగిన పథకాన్ని ఎంచుకోవాలి. ఏ సమయంలో మదుపు చేస్తున్నాం అనేదానికంటే.. ఎంత కాలం కొనసాగుతున్నాం అనేది ముఖ్యం.కోటి సులభంగానే..మ్యూచువల్ ఫండ్ల(Mutual Funds)లో సిప్ ద్వారా రూ.కోటిని జమ చేయడం కష్టమేమీ కాదు. కానీ, అందుకు దీర్ఘకాలం మదుపు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.2,000తో సిప్ చేసిన ఫండ్ కనీసం 15 శాతం సగటు వార్షిక రాబడి వస్తుందని భావిస్తే రూ.కోటికి మించి జమ అయ్యేందుకు వ్యవధి 28 ఏళ్లు. అదే స్టెప్అప్(ఏటా సెప్ పెంచుకుంటూ వెళ్లే పద్ధతి) ద్వారా మరింత త్వరగానే ఈ లక్ష్యాన్ని చేరవచ్చు. -
ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?
లిక్విడ్ ఫండ్లో ఉన్న నా పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించినట్టయితే, అదే రోజు ఎన్ఏవీ వర్తిస్తుందా? – అజయ్ కుమార్ఏ తరహా మ్యూచువల్ ఫండ్(Mutual Funds)లో పెట్టుబడులు ఉన్నాయి..ఏ సమయంలో అభ్యర్థన (కొనుగోలు/విక్రయం) పంపించారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు లిక్విడ్ ఫండ్ పెట్టుబడులను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విక్రయించేందుకు ఆర్డర్ చేశారని అనుకుందాం. లిక్విడ్ ఫండ్స్కు కటాఫ్ సమయం మధ్యాహ్నం 3 గంటలు. మీ అభ్యర్థన ఈ సమయానికి ముందే చేశారు కనుక, విక్రయించిన యూనిట్లకు శుక్రవారం నాటి ఎన్ఏవీ వర్తిస్తుంది. ఇలా విక్రయించిన పెట్టుబడులు బ్యాంక్ అకౌంట్(Bank Account)లోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? అన్నది తెలుసుకుందాం. ఈ విషయంలోనూ ఏ ఫండ్లో పెట్టుబడులు విక్రయించారన్నది కీలకం అవుతుంది. లిక్విడ్ ఫండ్, ఓవర్నైట్ ఫండ్లో పెట్టుబడులను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేందుకు ఒక పనిదినం పడుతుంది. ఇతర డెట్ ఫండ్స్ అయితే, రెండు రోజుల సమయం తీసుకుంటుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు వెనక్కి వచ్చేందుకు మూడు పనిదినాలు పడుతుంది. టీప్లస్ రూపంలో ఈ విషయాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు తెలియజేస్తాయి.ఉదాహరణకు సోమవారం నాడు ఈక్విటీ ఫండ్స్(Equity Funds)లో పెట్టుబడులు విక్రయించారని అనుకుంటే, ఈ మొత్తం గురువారం నాడు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. రియలైజింగ్ మనీ అంటే.. ఇన్వెస్టర్ కొనుగోలు ఆర్డర్కు సంబంధించిన మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థ (AMC) అందుకోవడం. బ్యాంక్ నుంచి పంపించారనుకుంటే ఆ మొత్తం ఏఎంసీ చేరేందుకు కొన్ని గంటలు లేదా రోజు సమయం తీసుకోవచ్చు. కొనుగోలు ఏ రోజు చేశారన్న దానితో సంబంధం లేకుండా, ఏఎంసీకి ఆ మొత్తం అందిన రోజు ఎన్ఏవీనే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు లిక్విడ్ ఫండ్లో పెట్టుబడులను కటాఫ్ సమయం 3 గంటలు దాటిన తర్వాత విక్రయించారని అనుకుంటే, అప్పుడు తర్వాతి రోజు ఎన్ఏవీ పెట్టుబడులకు వర్తిస్తుంది. ఎందుకంటే తర్వాతి రోజునే ఫండ్స్ సంస్థలు ఆ మేరకు విక్రయాలు చేస్తాయి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..నాకు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్లో పెట్టుబడులు ఉన్నాయి. వాటిని ఇటీవలే విక్రయించి అదే పథకం డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేశాను. కనుక లాభాలపై నేను పన్ను చెల్లించాలా? లేక భవిష్యత్తులో పెట్టుబడులు విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తుందా? – రాజన్ పీ.ఏఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్ నుంచి మరో ప్లాన్లోకి మారినప్పుడు, అది రెగ్యులర్ నుంచి డైరెక్ట్ ప్లాన్ అయినా సరే దాన్ని పెట్టుబడి ఉపసంహరణగానే చూస్తారు. ఆదాయపన్ను చట్టం కింద పెట్టుబడుల విక్రయమే అవుతుంది. దీనర్థం.. మూలధన లాభాలపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మరో ప్లాన్లో ఇన్వెస్ట్ చేసి, భవిష్యత్తులో విక్రయించినట్టయితే.. హోల్డింగ్ పీరియడ్ (ఎంత కాలం పాటు పెట్టుబడులు కొనసాగించారు), వచ్చిన మూలధన లాభాల ఆధారంగా తిరిగి అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పెట్టుబడి నుంచి విక్రయం మధ్య కాలానికి పన్ను వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వాల్యూ రీసెర్చ్ -
కొత్త ఫండ్ గురూ.. ఇన్వెస్ట్ చేసేది ఇక్కడే..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (ICICI Prudential) మ్యుచువల్ ఫండ్ (Mutual Fund) తాజాగా రూరల్ ఆపర్చూనిటీస్ ఫండ్ (rural opportunities fund) పేరిట న్యూ ఫండ్ ఆఫర్ను (NFO) ప్రకటించింది. ఇది జనవరి 9న ప్రారంభమై 23న ముగుస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల సంబంధిత స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీము.దేశ జీడీపీలో గ్రామీణ ప్రాంతాల వాటా గణనీయంగా ఉంటోంది. ప్రభుత్వం కూడా గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఎకానమీని మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. కాబట్టి ఈ థీమ్ అనేది వృద్ధి అవకాశాలను అందించవచ్చు. ఈ ఫండ్, వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రూరల్ థీమ్ ఆధారిత సెక్టార్లకు కేటాయింపులను అటూ, ఇటూ మార్చుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుంది.ఆర్థిక వృద్ధికి దోహదపడే విభాగం అయినందున ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు దేశ గ్రామీణ వృద్ధి గాథలో పాలుపంచుకునే అవకాశం లభించగలదని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈడీ శంకరన్ నరేన్ తెలిపారు. దీనికి నిఫ్టీ రూరల్ ఇండెక్స్ ప్రామాణిక సూచీగా ఉంటుంది. 6 నెలల ఫ్రీ–ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సగటు ఆధారంగా అతి పెద్ద 75 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. శంకరన్ నరేన్, ప్రియాంక ఖండేల్వాల్ ఈ స్కీమును నిర్వహిస్తారు. -
నెలకు రూ. 7వేలతో.. ₹32 లక్షలు: ఎలా అంటే?
తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు రావాలంటే.. 'మ్యూచువల్ ఫండ్స్' (Mutual Funds) ఉత్తమ ఎంపిక. ఇప్పటికే రోజుకు 50 రూపాయల పెట్టుబడితే.. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి? నెలకు రూ. 10వేలు పెట్టుబడిగా పెడుతూ.. రూ.7 కోట్లు ఎలా పొందాలి? అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో నెలకు రూ.7,000 పెట్టుబడి పెడితే.. రూ.32 లక్షలు ఎలా వస్తాయి? దీని కోసం ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి అనే విషయాలు తెలుసుకుందాం.రూ.7వేలుతో.. 32 లక్షల రూపాయలునెలకు రూ.7000 చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మీ ఇన్వెస్ట్మెంట్ (Investment) రూ. 12,60,000 అవుతుంది. దీనికి 11 శాతం రాబడిని ఆశిస్తే.. రిటర్న్స్ రూ. 19,52,003 వస్తాయి. పెట్టుబడి, రిటర్న్స్ కలిపితే 15 ఏళ్లలో మీకు వచ్చే మొత్తం రూ. 32,12,003.మీరు ఎక్కువ లాభాలను పొందాలంటే.. తప్పకుండా దీర్ఘకాలిక పెట్టుబడులు (Long Term Investment) పెట్టడానికి ప్లాన్స్ వేసుకోవాలి. అంతే కాకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎంత తొందరగా ప్రారంభిస్తే.. మీకు లాభాలు కూడా అంత వేగంగానే వస్తాయి. ఉదాహరణకు, మీరు 20 ఏళ్ల వయసులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే.. 35 సంవత్సరాలకు రూ.32 లక్షలు వస్తాయి.పెట్టుబడులు ఆలస్యం చేస్తే.. లాభాలను పొందటానికి కొంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించాలి.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటిగమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎంత డబ్బు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది. -
మంచి మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం ఎలా?
దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే మ్యూచువల్ పండ్ను ఎంచుకునే ముందు చాలామంది సాధారణంగా ఓ తప్పు చేస్తూంటారు. కేవలం గత పనితీరుపైనే ఆధారపడి ఫండ్ను సెలక్ట్ చేసుకుంటారు. అయితే అన్నివేళలా అలాంటి పనితీరు కనిపించకపోవచ్చు. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచ్చిదంటే అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి అంతర్గతంగా అవి ఎంచుకున్న కంపెనీలే కారణం. కాబట్టి ఒక ఫండ్ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ అయి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. -
నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?
డబ్బు ఆదా చేయాలనుకుంటే.. అనేక మార్గాలు కనిపిస్తాయి. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, మరికొందరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఈ కథనంలో నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడుతూ రూ. 7కోట్లు సంపాదించడం ఎలా? అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.ఒక వ్యక్తి సిప్లో నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. సంవత్సరానికి అతని పెట్టుబడి రూ.1.2 లక్షలు అవుతుంది. ఇలా 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూ.36 లక్షలు అవుతాయి. మార్కెట్ ఆధారంగా 15 శాతం వార్షిక రాబడి వస్తే.. పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. దీంతో ఆ వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి అదనంగా రూ. 66 లక్షల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, అదనంగా వచ్చిన మొత్తం డబ్బు కలిపితే రూ.7 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది.ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. 50 ఏళ్ల నాటికి రూ.7 కోట్లు పొందవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉండ్తుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటినోట్: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఖచ్చితంగా ఇంత డబ్బు వస్తుందని చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది. -
రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటి
ఒక్కో నీటి బిందువే.. మహా సముద్రమైనట్లు, ఒక్కో రూపాయి పోగేస్తేనే కోటీశ్వరులవుతారు. కాబట్టి రోజుకు కేవలం రూ.50 ఆదా చేయడం ద్వారా.. కోటి రూపాయలు సొంతం చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇదెలా సాధ్యం? దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.రోజుకి 50 రూపాయలు ఆదా చేస్తే.. నెలకు రూ.1,500, సంవత్సరానికి రూ.18,000 అవుతాయి. అయితే కోటి రూపాయలు కావాలంటే మాత్రం దీనిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కంటే ముందు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయితే కోటి రూపాయల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి అవసరం.రోజుకు రూ.50 పొదుపు చేస్తూ.. రూ.1 కోటి సొంతం చేసుకోవాలంటే, ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. కనీసం 30 ఏళ్ల వరకు ఇన్వెస్ట్మెంట్లలను కొనసాగించాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల 10 నుంచి 20 శాతం వరకు రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపౌండింగ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీరు కోటి రూపాయలు ఎలా పొందుతారో ఇక్కడ చూడండి.➤రోజుకి 50 రూపాయలు కాబట్టి.. 10 సంవత్సరాలలో మీ పెట్టుబడి రూ.1,80,000 అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.2,13,137 వస్తాయి. కాబట్టి ఈ మొత్తం రూ. 3,93,137.➤ఇదే విధంగా 20 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.3,60,000. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.16,14,519. కాబట్టి మొత్తం రూ.19,74,519.➤30 సంవత్సరాలలో.. పెట్టుబడి రూ.5,40,000 అయితే.. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.77,95,583 వస్తాయి. వీటి మొత్తం రూ.83,35,583.➤32 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.5,76,000, దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.1,04,76,949 అవుతుంది. కాబట్టి మీరు పొందే మొత్తం రూ.1,10,52,949.పైన చెప్పిన విధానం ప్రకారం, మీరు పెట్టే పెట్టుబడి, దానికి ఎంత లాభం వస్తుంది. చివరగా చేతికి ఎంత వస్తుందనే వివరాలు స్పష్టంగా అవగతం అవుతాయి.ఇదీ చదవండి: 15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!గమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. -
మిడ్క్యాప్లో మెరుగైన రాబడి
ఈక్విటీల్లో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని భావించే వారు లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్కు పోర్ట్ఫోలియోలో చోటు కల్పించుకోవచ్చు. తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విభాగానికి ఎంత కేటాయింపులన్నవి తేల్చుకోవాలి. లార్జ్క్యాప్తో పోల్చిచూసినప్పుడు కొంత రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ 10–20 ఏళ్ల కాలంలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ అధిక రాబడులు ఇవ్వగలవు. మిడ్క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మిడ్క్యాప్తోపాటు లార్జ్క్యాప్ పెట్టుబడులకూ ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది.రాబడులు ఈ పథకం దీర్ఘకాల పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 38 శాతానికి పైగా ఉన్నాయంటే పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఐదేళ్లలో 27 శాతం, ఏడేళ్లలో 18.47 శాతం, పదేళ్లలో 18.84 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఏడాది, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బెంచ్మార్క్ సూచీ ‘బీఎస్ఈ 150 మిడ్క్యాప్ టీఆర్ఐ’ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. 2007 మే నెలలో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక సగటు రాబడి 15.75 శాతంగా ఉంది. ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ (ఎక్స్పెన్స్ రేషియో) 1.43 శాతంగా ఉంది.పెట్టుబడుల విధానం కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం నష్టాలను పరిమితం చేసింది. ఆ తర్వాతి ర్యాలీల్లో మెరుగైన రాబడులను ఇచ్చింది. వృద్ధికి అవకాశం ఉండి, అంతగా వెలుగులోకి రాని పటిష్టమైన కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్ఫోలియోలో వ్యాల్యూ స్టాక్స్కు ప్రాధాన్యం ఇస్తుంది. మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు ఆ పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది.ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 50,627 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ పెట్టుబడులు 0.21 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 3.7 శాతంగా ఉన్నాయి. ఈక్విటీల్లో 40 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. 58 శాతం పెట్టుబడులను మిడ్క్యాప్లకు కేటాయించింది. స్మాల్క్యాప్ పెట్టుబడులు 1.44 శాతంగా ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో 66 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 29 శాతంగా ఉన్నాయి. పోర్ట్ఫోలియో కాన్సంట్రేషన్ తక్కువ అని అర్థమవుతోంది. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 78 శాతం పెట్టుబడులు ఈ రంగాల కంపెనీల్లోనే ఉన్నాయి.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్కంపెనీ పెట్టుబడులు శాతంపర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.16 ఒరాకిల్ ఫిన్ 3.51 ఎంఫసిస్ 3.31 ఒబెరాయ్ రియల్టీ 3.11 ఫోర్టిస్ హల్త్కేర్ 3.05 ఇప్కా ల్యాబ్ 3.01 కోరమాండల్ 2.49 పీఐ ఇండస్ట్రీస్ 2.39 సోలార్ ఇండస్ట్రీస్ 2.23 సుప్రీమ్ ఇండస్ట్రీస్ 2.19 -
సిప్తో మూడేళ్లలో రూ.10 లక్షలు.. సాధ్యమేనా?
డెట్ ఫండ్స్ ఈల్డ్ టు మెచ్యూరిటీ (వైటీఎం), యావరేజ్ మెచ్యూరిటీ అంటే ఏంటి? – చంద్ర గుణ శేఖర్డెట్ ఫండ్స్ విశ్లేషణకు వైటీఎం, యావరేజ్ మెచ్యూరిటీ రెండూ కీలక కొలమానాలు. ఫండ్ పనితీరు సామర్థ్యాలు, రిస్క్ను వీటి సాయంతో తెలుసుకోవచ్చు. వైటీఎం: మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్ఫోలియోలో బాండ్లను గడువు తీరే వరకు కొనసాగిస్తే వచ్చే రాబడిని తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక డెట్ ఫండ్ వైటీఎం 8గా ఉంటే.. రాబడులు సుమారుగా ఆ స్థాయిలో ఉంటాయని అర్థం. కానీ, ఫండ్స్ పోర్ట్ఫోలియోలో మేనేజర్ చేసే మార్పులతో వాస్తవ రాబడులు వేరుగా ఉండొచ్చు. రోజువారీ ఎక్స్పెన్స్ రేషియో మినహాయింపులు, పెట్టుబడుల రాక, పోక ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చేస్తాయి. ఒక డెట్ ఫండ్లో ప్రస్తుత పోర్ట్ఫోలియో ప్రకారం ఎంత రాబడులు వస్తాయన్నది వైటీఎం తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ: ఫండ్ పోర్ట్ఫోలియోలో వివిధ బాండ్లు వివిధ కాలాలకు మెచ్యూరిటీ అవుతాయి. అన్ని బాండ్ల మెచ్యూరిటీల సగటు మెచ్యూరిటీని ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక పోర్ట్ఫోలియోలో రెండు బాండ్లు ఉండి, ఒకటి 10 ఏళ్లు, మరొకటి 5 ఏళ్లకు మెచ్యూరిటీ తీరుతుందని అనుకుందాం. అప్పుడు వీటి సగటు మెచ్యూరిటీ 7.5 ఏళ్లు అవుతుంది. ఫండ్ పోర్ట్ఫోలియో వడ్డీ రేట్ల సున్నితత్వాన్ని ఇది తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ ఎంత దీర్ఘకాలానికి ఉంటే అంతగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. యావరేజ్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటే ఈ ప్రభావం తక్కువ. వైటీఎం ద్వారా ఫండ్ సగటు రాబడిని, యావరేజ్ మెచ్యూరిటీ ద్వారా ఆ ఫండ్ పోర్ట్ఫోలియోపై వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకోవచ్చు. నా వయసు 35 ఏళ్లు. వచ్చే మూడేళ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. లార్జ్క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్కు ఎక్కువ పెట్టుబడిని కేటాయించాలని అనుకుంటున్నాను. ఇవి ఎక్కువ రాబడులు ఇస్తాయని విన్నాను. నా లక్ష్యానికి ఇది మెరుగైన పెట్టుబడుల వ్యూహమేనా? – జిగ్నేష్మీ లక్ష్యం రాజీపడకూడనిది అయితే, కచ్చితంగా మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడుల ఎంపిక సరైనది కాదు. 2000 సంవత్సరం నుంచి చారిత్రక రాబడుల గణాంకాలను పరిశీలిస్తే.. సెన్సెక్స్లో మూడేళ్ల సిప్ రాబడి మైనస్ 15 శాతంగా ఉంది. అందుకే స్వల్పకాలానికి ఈక్విటీ పెట్టుబడులు ఎంతో రిస్క్తో ఉంటాయి. స్వల్పకాలానికి సంబంధించి ముఖ్యమైన లక్ష్యాల విషయంలో భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. కనుక ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్ను మీరు పరిశీలించొచ్చు.వీటిల్లో ఎంతో స్థిరత్వం, ఊహించతగిన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ మీ లక్ష్యంలో కొంత వెసులుబాటు ఉండి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులు పరిశీలించొచ్చు. అది కూడా కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో సిప్ రాబడులు ప్రతికూలం నుంచి సానుకూలంలోకి మారి, సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. మార్కెట్ అస్థిరతలను అధిగమించి వృద్ధిని చూపించగలవు. -
13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్
మా అమ్మాయికి మంచి విద్య అందించాలనుంది. ప్రస్తుతం రూ.లక్షల్లో ఫీజులున్నాయి. తన వయసు ఇప్పుడు 10 ఏళ్లు. తన పేరుమీద నెలకు రూ.20వేల వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. మంచి రాబడులు వచ్చే పథకాలు ఏవైనా ఉన్నాయా? కనీసం 13 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి అంచనా వేయవచ్చు? - విక్రమ్పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే మీ కోరికకు ధన్యవాదాలు. మీరు అన్నట్లు ప్రస్తుతం ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. మీ పాప వయసు 10 ఏళ్లు. తాను ఉన్నత చదువులు చదివేటప్పటికీ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులు లెక్కేస్తే చాలా డబ్బు అవసరం అవుతుంది. విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతూనే ఉంది. పెట్టుబడిపై అధిక రాబడి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనికి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీరు నెలకు రూ.20వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. 13 ఏళ్ల పాటు 12 శాతం రాబడితో మీ ఇన్వెస్ట్మెంట్ దాదాపు రూ.75,18,623 అయ్యే అవకాశం ఉంది. అయితే ముందుగా మీరు అమ్మాయి భవిష్యత్ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించాలి. అందుకోసం టర్మ్పాలసీను తీసుకోవాలి. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీకు ఏదైనా జరిగినా పాలసీ డబ్బు మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ‘ఎవరికి చెల్లింపులు చేసినా నాకు తెలుస్తుంది’ఇటీవల కాలంలో బంగారం ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా? ఎంత సమయం పెట్టుబడి పెట్టాలి? - ప్రకాశ్పెట్టుబడులను డైవెర్సిఫైడ్గా ఉంచుకోవాలి. ఓకే విభాగంలో ఇన్వెస్ట్ చేయకూడదు. బంగారం ధరల్లో ఒడిదొడుకులు సహజం. తాత్కాలికంగా ధరలు పెరుగుతున్నాయని, తగ్గుతున్నాయని ఇన్వెస్ట్ చేయకూడదు. దీర్ఘకాలం కొనసాగితేనే ఇన్వెస్ట్ చేయాలి. మీ పెట్టుబడిలో 10-15 శాతం మేరకే బంగారంలో ఉండేలా చూసుకోవాలి. అంతకుమించి పెట్టుబడి మంచిది కాదు. మిగతా మొత్తాన్ని విభిన్న ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయండి. కనీసం అయిదేళ్లకు మించి సమయం ఉంటేనే మంచి రాబడులు అందుకోవచ్చు. -
రిస్క్ తక్కువ.. రాబడులు స్థిరం
రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో రాబడుల చరిత్ర స్థిరంగా ఉంది. గతంలో యూటీఐ ఈక్విటీ ఫండ్గా కొనసాగిన ఈ పథకం, 2017 అక్టోబర్లో సెబీ తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకరణ నిబంధనల అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ స్మాల్క్యాప్, మిడ్క్యాప్, లార్జ్క్యాప్ విభాగాల్లో స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేయగలవు. మెరుగైన అవకాశాలున్న చోట ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనల పరంగా వెసులుబాటు ఉంటుంది. రిస్క్–రాబడుల సమతుల్యానికి ఈ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఈ పథకం 2008, 2011, 2020 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్అండ్పీ నిఫ్టీ 500 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం 24 శాతం మేర రాబడులు అందించింది. ఐదేళ్ల కాలంలో సగటున వార్షికంగా 16.47 శాతం రాబడులు ఇచ్చింది.ఏడేళ్ల కాలంలో ఏటా 14 శాతం, పదేళ్ల కాలంలో ఏటా 12.50 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పోటీ పథకాలతో పోల్చితే రాబడులు కొంత తక్కువగా కనిపించినప్పటికీ.. కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడంలో ఈ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడుల చరిత్ర గొప్పగా లేకున్నా, దీర్ఘకాలానికి మెరుగ్గా ఉంది. స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువ కోరుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మెరుగైన రాబడులు అందుకోవచ్చు. పెట్టుబడుల విధానం/ పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.27,706 కోట్ల పెట్టుబడులు (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఉన్నాయి. దీర్ఘకాల చరిత్ర ఉండడంతో పెద్ద పథకాల్లో ఒకటి కావడం గమనార్హం. నిర్వహణ ఆస్తుల్లో 96 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 0.52 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టింది. 3.45 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ దిద్దుబాటులో ఆకర్షణీయ అవకాశాలకు వీలుగా నగదు నిల్వలు కలిగి ఉన్నట్టు అర్థమవుతోంది.ఈక్విటీ పెట్టుబడులు గమనించగా, 70 శాతం వరకు లార్జ్క్యాప్లో ఉంటే, మిడ్క్యాప్లో 28 శాతం, స్మాల్క్యాప్లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. టాప్–10 స్టాక్స్లోనే 42 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులను గమనించినట్టయితే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ వెయిటేజీ ఇస్తూ, 22 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 22 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ రంగానికి 18 శాతం, హెల్త్కేర్ కంపెనీలకు 12 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
టాటా ఇన్నోవేషన్ ఫండ్.. రూ. 5000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
హైదరాబాద్: వినూత్న వ్యూహాలు, థీమ్లతో ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ టాటా ఇండియా ఇన్నోవేషన్ ఫండ్ను ఆవిష్కరించినట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఇది నవంబర్ 11 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటుంది.కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. వివిధ మార్కెట్ క్యాప్లు, రంగాలవ్యాప్తంగా ఇన్నోవేషన్ థీమ్ ద్వారా లబ్ధి పొందే సంస్థల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి ఈ ఫండ్ తోడ్పడుతుందని సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రాహుల్ సింగ్ తెలిపారు.యాక్సిస్ క్రిసిల్–ఐబీఎక్స్ ఇండెక్స్ ఫండ్.. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా యాక్సిస్ క్రిసిల్–ఐబిఎక్స్ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్–సెప్టెంబర్ 2027 ఇండెక్స్ ఫండ్ను ఆవిష్కరించింది. ఇది క్రిసిల్–ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్–సెప్టెంబర్ 2027లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నవంబర్ 21 వరకు ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
మెరుగైన రాబడులకు.. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్..
గడిచిన దశాబ్దకాలంగా దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటిగా మారింది. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ విస్తృతి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు (సిప్) ఆదరణ పెరుగుతుండటం మొదలైన సానుకూలాంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గత పదేళ్లుగా ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2014లో మొత్తం ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) వీటి పరిమాణం 2 శాతమే ఉండగా 2024 జూన్ నాటికి ఏకంగా 17 శాతానికి (మొత్తం ఏయూఎం రూ. 10,00,000 కోట్లకు పైగా ఉంటుంది) ఎగిసింది. ఇంత వేగంగా పరిశ్రమ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన ఉత్పత్తులు, కొత్త వ్యూహాలను ప్రవేశపెట్టడంపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహం తెరపైకి వచ్చింది. అధిక రాబడులనిస్తూ, రిస్కులను తగ్గిస్తూ, మెరుగైన డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను అందించే విధంగా ఇది ఉంటుంది.సెక్యూరిటీస్లో అంతర్గతంగా మెరుగైన రాబడులు అందించే నిర్దిష్ట లక్షణాలను లక్ష్యంగా చేసుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. ఫ్యాక్టర్ ఫండ్స్ అనేవి భారత్లో ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ఫార్మాట్లో తక్కువ వ్యయాలతో అందుబాటులో ఉంటున్నాయి. నాణ్యత (క్వాలిటీ), విలువ (వేల్యూ), పరిమాణం (సైజ్), గతి (మూమెంటమ్), తక్కువ ఒడిదుడుకులు వంటి నిర్దిష్ట గుణాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్ఫోలియోలను తీర్చిదిద్దుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, వేల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో ఒక భాగం. ఇది తక్కువ వేల్యుయేషన్లతో ఉన్న సెక్యూరిటీలను టార్గెట్ చేయడం ద్వారా ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే, మూమెంటమ్ ఇ న్వెస్టింగ్ అనే విధానం, ధర పెరుగుతున్న ట్రెండ్ ఆధారితమైనదిగా ఉంటుంది.సంపద సృష్టి: చారిత్రకంగా మార్కెట్ను మించి రాబడులు పొందడానికి తోడ్పడే నిర్దిష్ట గుణాలను లక్ష్యంగా పెట్టుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. వివిధ మార్కెట్లు, అసెట్ క్లాస్లు, కాలవ్యవధులవ్యాప్తంగా ఇది పనిచేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ ఫ్యాక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను ఎలాంటి ఆరి్థక పరిస్థితుల్లోనైనా, మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిలదొక్కుకోగలిగేలా మరింత పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. పరిశోధనల ప్రకారం చారిత్రకంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మార్కెట్ బెంచ్మార్క్లను మించిన పనితీరు కనపర్చింది. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపద సృష్టించి ఇవ్వగలదు.రిస్క్ మేనేజ్మెంట్: వివిధ మార్కెట్ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే ఫ్యాక్టర్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా రిసు్కలను సమర్ధవంతంగా అదుపులో ఉంచుకునేందుకు ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ సహాయపడుతుంది. ఉదాహరణకు మార్కెట్లు పతనమవుతున్న తరుణంలో, తక్కువ హెచ్చుతగ్గులకు లోనయ్యే స్టాక్స్ మెరుగ్గా ఉంటాయి. నష్టభారాన్ని తగ్గిస్తాయి. తీవ్ర ఒడిదుడుకులు ఉన్న పరిస్థితుల్లో పోర్ట్ఫోలియోను స్థిరపర్చుకునేందుకు ఈ విధానం సహాయపడుతుంది.పారదర్శకత: మిగతా పాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్) తరహాలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు కూడా సాధారణంగా రూల్స్ ఆధారితమైనవిగా ఉంటాయి. అంటే, పెట్టుబడులను పెట్టేందుకు నిర్దిష్ట నిబంధనలను పాటిస్తాయి. పెట్టుబడి నిర్ణయాల వెనుక గల హేతుబద్ధతను అర్థం చేసుకునేందుకు, తమ పోర్ట్ఫోలియోలను సులభతరంగా పర్యవేక్షించుకునేందుకు, నిర్వహించుకునేందుకు ఇన్వెస్టర్లకి ఈ పారదర్శకత ఉపయోగకరంగా ఉంటుంది.డైవర్సిఫికేషన్: ఒకదానితో మరొక దానికి మరీ అధిక స్థాయిలో పరస్పర సంబంధం ఉండని వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది వైవిధ్యానికి సంబంధించిన ప్రయోజనాలను కల్పిస్తుంది. ఏదైనా ఒక ఫ్యాక్టర్ పనితీరు బాగా లేకపోతే పోర్ట్ఫోలియోలో దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రిస్కులకు తగ్గ మెరుగైన రాబడులను అందుకోవడానికి వివిధ ఫ్యాక్టర్లను కలిపి వాడే వ్యూహాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు ఉపయోగిస్తుంటారు.సౌలభ్యం: టెక్నాలజీ, డేటా వంటి అంశాల్లో పురోగతి కారణంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మరింతగా అందుబాటులోకి వచ్చింది. ఫ్యాక్టర్ ఆధారిత వ్యూహాలను సులభతరంగా అమలు చేయడానికి సాధనాలు, ప్లాట్ఫాంలు వీలు కల్పిస్తున్నాయి. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మెరుగైన రాబడులు అందించేలా, రిస్కులను నియంత్రించుకునేలా, తక్కువ వ్యయాలతో కూడుకున్న పెట్టుబడి సాధనాలను వినియోగించుకునేలా పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. ఫ్యాక్టర్స్ కొన్నాళ్ల పాటు అండర్పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు వేల్యూ స్టాక్స్ అనేవి నిర్దిష్ట మార్కెట్ పరిస్థితుల్లో గ్రోత్ స్టాక్స్తో పోలిస్తే వెనుకబడొచ్చు. ఒకే ఫ్యాక్టర్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకవేళ ఆ ఫ్యాక్టర్ పనితీరు సరిగ్గా లేకపోతే గణనీయంగా నష్టాలు రావచ్చు. తప్పిదాల వల్ల పనితీరు దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫ్యాక్టర్ ప్రీమియంలను కచ్చితంగా గుర్తించి, అందిపుచ్చుకోవాలంటే అధునాతన మోడల్స్, విస్తృతమైన డేటా విశ్లేషణ అవసరమవుతుంది. మార్కెట్ పరిస్థితులు గానీ ఇన్వెస్టర్ ధోరణి గానీ మారితే ఫ్యాక్టర్ వ్యూహాల సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఒకవేళ పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు అదే ఫ్యాక్టర్ వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారంటే, ఫ్యాక్టర్ ప్రయోజనం తగ్గిపోవచ్చు. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు అమలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈ రిస్కులను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రిసు్కలను తగ్గించుకునేందుకు వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా డైవర్సిఫికేషన్ పాటించాలి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటే సహాయకరంగా ఉంటుంది. చదవండి: మిడ్క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!రిస్కు సామర్థ్యాలను బట్టి.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దిష్ట ఫ్యాక్టర్స్ను టార్గెట్గా పెట్టుకుని తమ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవచ్చు. ఉదాహరణకు అధిక రిస్కు సామర్థ్యాలున్న ఇన్వెస్టర్లు, మూమెంటమ్ లేదా సైజ్ వంటి ఫ్యాక్టర్లకు మరింత ఎక్కువగా కేటాయించవచ్చు. ఇవి మరింత ఎక్కువ ఒడిదుడుకులకు లోనైనా అధిక రాబడులనిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు నాణ్యమైన, తక్కువ ఒడిదుడుకులుండే ఫ్యాక్టర్లను ఎంచుకోవచ్చు. ఇక, గ్రోత్ కోరుకునే ఇన్వెస్టర్లు, వేల్యూ అలాగే మూమెంటమ్కి ప్రాధాన్యతనివ్వొచ్చు. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు కూడా దాదాపు ఇలాంటి ఫ్యాక్టర్ మేళవింపులనే ఎంచుకుంటూ ఉంటారు. చివరగా చెప్పాలంటే, ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది అధిక రాబడులను అందించే నిర్దిష్ట చోదకాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే ఒక విధానం. రిసు్కలను తగ్గించుకుని, అధిక రాబడులను అందుకునే అవకాశాలను ఇది కల్పిస్తుంది. అదే సమయంలో దీనిలో కూడా ఉండే కొన్ని రిస్కులను దృష్టిలో ఉంచుకుని, తమ వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ను బట్టి ఇన్వెస్టర్లు వ్యూహాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టర్లను అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఎంచుకోగలిగితే ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలను మరింత సమర్ధమంతంగా సాధించుకోగలుగుతారు. -
మిడ్క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!
motilal oswal midcap fund: లార్జ్క్యాప్ స్టాక్స్లో అధిక స్థిరత్వం చాలా మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటుంది. కానీ, కొందరు రిస్క్ ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు రాబడులు అధికంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ తరహా ఇన్వెస్టర్లు స్మాల్క్యాప్ ఫండ్స్ ఎంపిక చేసుకుంటారు. రిస్క్ మధ్యస్థంగా ఉండి, రాబడులు కూడా లార్జ్క్యాప్ కంటే ఎక్కువగా ఉండాలని కోరుకునే వారికి మిడ్క్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంలో లార్జ్క్యాప్ స్టాక్స్ కంటే స్మాల్క్యాప్ స్టాక్స్ అధికంగా రాబడులు ఇచ్చినట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, గడిచిన పదేళ్లలో రాబడుల పరంగా స్మాల్క్యాప్ కంటే మిడ్క్యాప్ సూచీ ముందుంది. బీఎస్ఈ 150 మిడ్క్యాప్ టీఆర్ఐ సూచీ.. బీఎస్ఈ స్మాల్క్యాప్ టీఆర్ఐ సూచీ కంటే 2.13 శాతం అధికంగా 21.32 శాతం చొప్పున ఏటా రాబడులు అందించింది. ఇదే కాలంలో స్మాల్క్యాప్ సూచీ వార్షిక రాబడులు 19.18 శాతంగానే ఉన్నాయి. మిడ్క్యాప్ విభాగంలో అధిక స్థిరత్వం, మెరుగైన రాబడులు కోరుకునే వారికి మోతీలాల్ ఓస్వాల్ మిడ్క్యాప్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది.రాబడులు.. ఈ పథకం డైరెక్ట్ ప్లాన్లో ఏడాది కాలంలో రాబడి 73 శాతంగా ఉంది. అదే రెగ్యుల్ ప్లాన్లో అయితే 71 శాతం రాబడి వచి్చంది. మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్ ఏటా 36 శాతానికి పైనే రాబడి తెచ్చి పెట్టింది. ఐదేళ్లలోనూ 35 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించిన చరిత్ర ఈ పథకం సొంతం. ఇక ఏడేళ్లలో ఏటా 24 శాతం, పదేళ్లలో ఏటా 23 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు రాబడి లభించింది. ఇందులో డైరెక్ట్ ప్లాన్ అన్నది మధ్యవర్తుల ప్రమేయం లేనిది. ఈ ప్లాన్లో ఫండ్స్ సంస్థ ఎవరికీ కమీషన్లు చెల్లించదు. రెగ్యులర్ ప్లాన్లో మధ్యవర్తులకు కమీషన్ వెళుతుంది. ఈ మేర ఇన్వెస్టర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తారు. కనుక రెగ్యులర్ ప్లాన్ కంటే డైరెక్ట్ ప్లాన్లో దీర్ఘకాలంలో రాబడులు ఎక్కువగా ఉంటాయి.పెట్టుబడుల విధానం/ పోర్ట్ఫోలియో... మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నాణ్యత, వృద్ధి, దీర్ఘకాలం, ధర అనే అంశాల ఆధారంగా మిడ్క్యాప్ విభాగంలో భవిష్యత్లో మంచి రాబడులు ఇచ్చే స్టాక్స్ను ఎంపిక చేస్తుంటుంది. బలమైన వృద్ధి అవకాశాలున్న నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. సహేతుక ధరల వద్దే కొనుగోలు చేస్తుంటుంది. ఎంపిక చేసుకునే కంపెనీలకు గణనీయమైన వ్యాపార వృద్ధి అవకాశాలు ఉండేలా జాగ్రత్త పడుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20 శాతానికి పైన ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. బలమైన ఫ్రీ క్యాష్ ఫ్లోను కూడా చూస్తుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.18,604 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 81 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 15 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టింది. 3.89 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 66 శాతం మేర లార్జ్క్యాప్లోనే ఉన్నాయి.చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!మిడ్క్యాప్లో 32.49 శాతం, స్మాల్క్యాప్లో 1.77 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్క్యాప్ విభాగంలో ఎక్కువ పెట్టుబడులు ఉన్నప్పుడు మిడ్క్యాప్ పథకం ఎలా అయిందన్న సందేహం రావచ్చు. ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు మధ్య కాలానికే లార్జ్క్యాప్ కంపెనీలుగా అవతరించడం ఇందుకు కారణం. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, కన్జ్యూమర్ డి్రస్కీషనరీ, ఇండస్ట్రియల్స్ రంగాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తూ.. 61 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. -
ఒకే నెలలో రూ.24,509 కోట్లు రాక!
క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ–సిప్)పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) సెప్టెంబర్ తాజా గణాంకాల ప్రకారం సిప్ల రూపంలో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి.క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు. క్రమంగా ఈక్విటీ మార్కెట్పై మదుపర్లకు నమ్మకం పెరుగుతోంది. దానికితోడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల వద్ద దాదాపు రూ.లక్ష ఇరవైవేల కోట్లు నిలువ ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి స్టాక్లు విక్రయిస్తున్నారు. అందులో నాణ్యమైన స్టాక్లపై ఫండ్ మేనేజర్లు ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: తుక్కుగా మార్చాల్సిన వాణిజ్య వాహనాలు ఎన్నంటే..ఈక్విటీ ఫండ్స్లోకి రూ.34,419 కోట్లు..ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్లోకి ఇన్వెస్ట్మెంట్లు సెప్టెంబర్లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్స్లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది. -
ఎన్ఆర్ఐలకు ఫండ్స్ రూట్!
మెరుగైన ఆరి్థక వృద్ధితో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన చిరునామాగా నిలుస్తోంది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐలు) సైతం భారత ఈక్విటీ అవకాశాలు మెరుగైన ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. తమ పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడంతోపాటు, ఆకర్షణీయమైన రాబడులు, పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. తమ విశ్రాంత జీవనాన్ని స్వదేశంలో ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకునే వారు.. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడులకు అనుకూల విధానాలు, వాతావరణంతోపాటు, మెరుగైన నియంత్రణలు భద్రతకు హామీనిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి లేదా స్థిరమైన ఆదాయం కోసం ఎన్ఆర్ఐలు ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) విదేశీ మారకంలో పెట్టుబడులు స్వీకరించవు. అదే విధంగా ఎన్ఆర్ఐలు భారత్లో సాధారణ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్కు విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) అనుమతించదు. రూపాయి మారకంలో పెట్టుబడులకే అనుమతి ఉంటుంది కనుక ఎన్ఆర్ఐలు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ (ఎన్ఆర్వో), ఫారీన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) అకౌంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం→ ఎన్ఆర్ఈ ఖాతా అయితే.. విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని స్వదేశానికి పంపుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతాలో డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను లేదు. → ఎన్ఆర్వో ఖాతా.. భారత్లో ఆదాయ వనరులను ఇక్కడే డిపాజిట్ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతా ద్వారా భారత్లో ఆదాయాన్ని భారత్లోనే ఇన్వెస్ట్చేసుకోవచ్చు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా మిలియన్ డాలర్లనే ఈ ఖాతా నుంచి విదేశీ ఖాతాకు మళ్లించుకోగలరు.→ విదేశీ కరెన్సీ రూపంలో డిపాజిట్లు కలిగి ఉండేందుకు ఎఫ్సీఎన్ఆర్ ఖాతా అనుకూలిస్తుంది. ఈ ఖాతాతో కరెన్సీ మారకం రేట్ల రిస్క్ లేకుండా చూసుకోవచ్చు. ఎఫ్సీఎన్ఆర్ టర్మ్ డిపాజిట్ ఖాతా కాగా, ఎన్ఆర్ఈ పొదుపు/కరెంటు/రికరింగ్/ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాగా పనిచేస్తుంది. → చెక్, డీడీ, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేస్తే.. ఈ నిధుల మూ లాలు తెలియజేసేందుకు వీలుగా ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ సర్టిఫికెట్ (ఎఫ్ఐఆర్సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఛానళ్లు, బ్రోకరేజీ సంస్థల సాయంతోనూ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవైసీ కీలకంభారత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్పోర్ట్ కాపీ, పుట్టిన తేదీ ధ్రువీకరణ కాపీ, పాన్, ఫొటో, విదేశీ చిరునామా ధ్రువీకరణ కాపీలను సమరి్పంచాలి. ప్రస్తుత నివాసం అది శాశ్వతమైనా లేదా తాత్కాలికమైనా సరే రుజువులు సమరి్పంచాలి. ఫారిన్ పాస్పోర్ట్ కలిగిన వారు ఓసీఐ కార్డ్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.పెట్టుబడుల మార్గాలు.. ఎన్ఆర్ఐలు తామే స్వయంగా లేదంటే పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) ద్వారా ఇతరుల సాయంతో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేరుగా అంటే ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాను తెరిచి వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వీలు కానప్పుడు.. భారత్లో తాము విశ్వసించే వ్యక్తికి ఈ పని అప్పగిస్తూ పీవోఏ ఇవ్వొచ్చు. మీ తరఫున సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వ్యవహారాలు చూస్తారు. ప్రతి లావాదేవీ నిర్వహణ సమయంలో పీవోఏ లేదా నోటరైజ్డ్ కాపీని సమరి్పంచాల్సి ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎన్ఆర్ఐ స్వయంగా హాజరు కావాలని కోరుతున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు యూఎస్ఏ, కెనడాలోని ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు అనుమతించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్ట్ (ఫాక్టా) నిబంధనల అమలు ప్రక్రి య సంక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. ఎన్ఆర్ఐలు, యూఎస్ పౌరుల ఆర్థిక లావాదేవీల వివరాలను అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని ఫాక్టా నిర్దేశిస్తోంది. విదేశీ ఆదాయంపై పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఈ నిబంధన పెట్టారు. పైగా అమెరికా, కెనడా నియంత్రణ సంస్థల వద్ద భారత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్నీ కాకుండా, కొన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు యూఎస్ఏ, కెనడా నుంచి ఎన్ఆర్ఐల పెట్టుబడులను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తున్నాయి. కనుక అమెరికా, కెనడాలోని ఎన్ఆర్ఐలు అదనపు డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావ చ్చు. ఆదిత్య బిర్లా సన్లైఫ్, నిప్పన్ ఇండియా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, సుందరం మ్యూచువల్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కాకుండానే ఆన్లైన్లో, ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కావాలనే సంస్థల్లో.. 360 వన్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, నవీ మ్యూచువల్ ఫండ్, ఎన్జే ఇండియా మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టారస్ మ్యూచువల్ ఫండ్, వైట్ఓక్ క్యాపిటల్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ కేవలం అమెరికాలోని ఇన్వెస్టర్ల నుంచే పెట్టుబడు లు స్వీకరిస్తున్నాయి. ఇవి కూడా ఫిజికల్ మోడ్లో నే (భౌతిక రూపంలో) పెట్టుబడులు అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి లా వాదేవీ భౌతిక రూపంలో, తదుపరి లావాదేవీలు అన్లైన్లో నిర్వహించేందుకు అనుమతిస్తోంది. https://mfuindia.com/usa-canada-residents నుంచి యూఎస్, కెనడాలోని ఎన్ఆర్ఐలు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అవకాశాలు.. మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. రెగ్యులర్ ప్లాన్లు మధ్యవర్తుల ప్రమేయంతో పొందేవి. అంటే పంపిణీదారులకు ఈ ప్లాన్ల ద్వారా కమీషన్ ముడుతుంది. కేవైసీ, డాక్యుమెంటేషన్ ప్రక్రియ, ఎటువంటి పథకాలను ఎంపిక చేసుకోవాలి తదితర సేవలను వీరి నుంచి పొందొచ్చు. వీరికి కమీషన్ చెల్లించాల్సి రావడంతో రెగ్యులర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ) ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు దీనికి విరుద్ధం. ఇందులో మధ్యవర్తులకు కమీషన్ చెల్లింపులు ఉండవు. దీంతో ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో రెగ్యులర్ కంటే డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు అధికంగా ఉంటాయి. ఒక పథకానికి సంబంధించి అది రెగ్యులర్ లేదా డైరెక్ట్ ప్లాన్ ఏది అయినా కానీ.. పెట్టుబడుల పోర్ట్ఫోలియో ఒక్కటే ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు ఎంపిక చేసుకునే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగల అవగాహన కలిగి ఉండాలి. అప్స్టాక్స్, కువేరా, ఎన్ఆర్ఐలకు సంబంధించి వాన్స్ తదితర ప్లాట్ఫామ్లు డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కలి్పస్తున్నాయి. ఉపసంహరణ – పన్ను బాధ్యత భారత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడితే లాభంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. భారత్తో ద్వంద పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఒక చోట పన్ను చెల్లిస్తే సరిపోతుంది. యూఎస్, కెనడా, మధ్యప్రాచ్య దేశాలు సహా మొత్తం 80 దేశాలతో భారత్కు ఈ విధమైన ఒప్పందాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై భారత పౌరులకు, ఎన్ఆర్ఐలకు ఒకే రకమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఎన్ఆర్ఐలు తమ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లోనే విక్రయించుకోవచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు లాభంపై పన్నును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతాకు జమ చేస్తాయి. అన్ని ఏఎంసీలు ఎన్ఆర్ఐలు పెట్టుబడులు విక్రయించిన సందర్భంలో టీడీఎస్ను అమలు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం, అంతకులోపు విక్రయించగా వచ్చిన లాభం (స్వల్ప కాల మూలధన లాభం)పై 15 శాతం టీడీఎస్ అమలు చేస్తాయి. అదే డెట్ ఫండ్స్లో లాభాలపై పన్ను ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డీటీఏఏ కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు తాము నివసిస్తున్న దేశం నుంచి ట్యాక్స్ రెసిడెన్సీ సరి్టఫికెట్ (టీఆర్సీ) సమరి్పంచాల్సి ఉంటుంది. భారత్లో పన్ను చెల్లించిన ఎన్ఆర్ఐలు తమ దేశంలో డీటీఏఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు భారత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా తమ విశ్రాంత జీవనానికి తగినంత నిధి సమకూర్చుకోవచ్చని రిటైర్మెంట్ విషయంలో సలహా, సూచనలు, పరిష్కారాలు అందించే ‘ద్యోత సొల్యూషన్స్’కు చెందిన కౌశిక్ రామచంద్రన్ సూచిస్తున్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో పౌరసత్వం పొందలేరు కనుక రిటైర్మెంట్ తర్వాత స్వదేశానికి రావాల్సిందేనని, అలాంటి వారికి భారత మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇంక్రిమెంట్లు, బోనస్ల పవర్ తెలుసా..?
ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో సంపాదన పెరిగినప్పుడు విలాసాలకు, అనవసర ఖర్చులకు డబ్బు వృథా చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి వంటి పండగలకు చాలా కంపెనీలు బోనస్ను ప్రకటిస్తుంటాయి. ఈ డబ్బును పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ రూపంలో అదనంగా సమకూరే డబ్బును దీర్ఘకాల రాబడులిచ్చే ఈక్విటీ మార్కెట్లోకి మళ్లించాలి. ఇప్పటికే నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఇది మరింత డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మదుపునకు అదనంగా జోడించే ఐదుశాతం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీ నెల జీతం యాభైవేల రూపాయలు అనుకుందాం. ప్రతినెలా రూ.10 వేలు మ్యుచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణనలోకి తీసుకుందాం. మన ఇన్వెస్ట్మెంట్స్పై 12 శాతం వార్షిక రాబడి ఉంటుందనే అంచనాకు వద్దాం. అప్పటి దాకా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక మదుపును ఏటా ఐదు శాతం పెంచుకోవడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. రోజువారీ ఖర్చుల విషయంలో రాజీ పడాల్సిన అవసరమూ రాదు. కానీ, ముప్పై ఏళ్ల తర్వాత.. రూ.3.7 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.5.2 కోట్లు అందుకుంటారు. అంటే, ఏటా ఐదుశాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 కోట్లు ఎక్కువగా సమకూరుతాయి.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని హెచ్చరిక! -
రూ.1000 పెట్టు.. రూ.కోటి పట్టు!
దేశీయ స్టాక్మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్గా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికమవుతోంది. కేవలం నెలకు రూ.వెయ్యి పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.కోటి ఎలా రాబట్టాలో ఈ కథనంలో తెలుసుకుందాం.భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ల వయసు తక్కువగా ఉంటే రిస్క్ తీసుకునే స్వభావం పెరుగుతుంది. ఉద్యోగంలో చేరిన 20 ఏళ్ల వయసులోని యువత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ పదవీ విరమణ సమయానికి రూ.కోటి కార్పస్ను సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు.మార్కెట్లో జెరోధా, అప్స్టాక్స్, ఫైయర్స్, గ్రో, ఏంజిల్ బ్రేకింగ్.. వంటి చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు ఆన్లైన్ సేవలందిస్తున్నాయి. వీటితోపాటు ప్రముఖ బ్యాంకులు సైతం ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో మంచి ప్లాట్ఫ్లామ్ను ఎంచుకుని నెలకు రూ.1000 క్రమానుగత పెట్టుబడి(సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. 20-30 ఏళ్ల వయసు యువత ఈ విధానాన్ని సుమారు 40 ఏళ్లు పాటిస్తే ఏటా 12 శాతం వృద్ధితో ఆ డబ్బు ఏకంగా రూ.1,14,02,420 అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా..? ఒక్క నిమిషం..పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా 40 ఏళ్ల తర్వాత సమకూరే ఈ డబ్బు విలువ తగ్గిపోవచ్చు. అందుకు అనుగుణంగా ఏటా 10 శాతం పెట్టుబడి పెంచుకుంటూపోతే రిటైర్మెంట్ సమయానికి ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చని సలహా ఇస్తున్నారు. అంటే మొదటి ఏడాది నెలకు రూ.1000 సిప్ చేస్తే తర్వాత ఏడాదిలో నెలకు రూ.1,100 ఇన్వెస్ట్ చేయాలి. అయితే రూ.కోటి మార్కును చేరాలంటే మాత్రం క్రమశిక్షణతో 40 ఏళ్లపాటు పొదుపు పాటించడం చాలా ముఖ్యం. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్
ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్ను ప్రారంభించినట్టు ప్రకటించింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మాదిరే ఈ పథకం రాబడులు అందిస్తుందని తెలిపింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లో 15 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం రంగంలో సేవలు అందిస్తున్నవి. సూచీలో ఈ కంపెనీలకు వెయిటేజీకి అనుగుణంగానే ఈ పథకం కూడా పెట్టుబడులు పెడుతుంది. తక్కువ వ్యాల్యూషన్ల వద్ద ఉండడం, ఆయిల్, గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతుండడం పెట్టుబడులకు గొప్ప అవకాశాలను అందిస్తున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ నెల 8న ప్రారంభమైన ఈటీఎఫ్ 18వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
ఇకపై అద్భుతమైన రాబడులు కష్టమే!
ముంబై: ఈక్విటీ మార్కెట్లో రాబడులు వచ్చే మూడేళ్ల కాలంలో క్రితం మూడేళ్ల స్థాయిలో మాదిరి గొప్పగా ఉండకపోవచ్చని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. కాకపోతే వచ్చే మూడేళ్లలో ఈక్విటీ రాబడులు గౌరవనీయ స్థాయిలో, ఇతర పెట్టుబడి సాధనాల కంటే మెరుగ్గా ఉండొచ్చని ఈ సంస్థ ఈక్విటీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఆర్ జానకీరామన్ చెప్పారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నుంచి కొత్తగా మలీ్టక్యాప్ ఫండ్ (ఎన్ఎఫ్వో)ను ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈక్విటీ సూచీలు ఆల్టైమ్ గరిష్ట స్థాయిలకు చేరి, అధిక వ్యాల్యూషన్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో జానకీరామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్ వృద్ధి దశ ఆరంభంలో ఉన్నందునే మార్కెట్ విలువలు అధికంగా ఉన్నట్టు, మరో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్నారు. ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్లపై (ఐపీవో) స్పందిస్తూ.. అదనంగా వచ్చే పెట్టుబడుల ప్రవాహాన్ని సర్దుబాటు చేసుకునేందుకు కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలు వేదిక కాగలవన్నారు. గడిచిన కొన్నేళ్లలో కంపెనీల వృద్ధి కంటే ఈక్విటీ రాబడులే అధికంగా ఉన్నాయని, కనుక దీనికి విరుద్ధమైన పరిస్థితికి ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలని సూచించారు. లార్జ్క్యాప్ స్టాక్స్కు కేటాయించిన పెట్టుబడులు రిస్్కను అధిగమించేందుకు తోడ్పడతాయన్నారు. ఈ సంస్థ నిర్వహణలోని ఆస్తుల్లో సగం మేర మిడ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. భారత్ మరింత వృద్ధి చెందేకొద్దీ మిడ్, స్మాల్క్యాప్ విభాగంలో మరిన్ని కంపెనీలు మెరుగ్గా రాణించడాన్ని చూస్తామంటూ.. ఈ విభాగం పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. రూ.లక్ష కోట్ల మైలురాయి తమ నిర్వహణలోని ఆస్తుల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్లను అధిగమించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ప్రెసిడెంట్ అవినాష్ సత్వాలేకర్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి చివరికి 15వ అతిపెద్ద అస్సెట్ మేనేజర్గా ఉన్నట్టు చెప్పారు. ఈ త్రైమాసికంలోనే పలు ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్) పథకాలను ప్రారంభించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మలీ్టక్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో ఈ నెల 8న ప్రారంభమై, 22 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
నామినీ నిబంధనలు సడలించిన సెబీ
డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్ఫోలియోలో నామినీ పేరును జతచేయాలనే నిబంధనను సడలిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది.గతంలో సెబీ జారీ చేసిన నియమాల ప్రకారం..డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్ఫోలియోలో నామినీ పేరును తప్పకుండా జతచేయాలి. నామినీ అవసరం లేనివారు (ఆప్ట్ ఔట్ ఆఫ్ నామినేషన్) అని ఎంచుకోవాలి. ఇందులో ఏదో ఒకటి జూన్ 30లోపు తెలియజేయాల్సి ఉంది. ఆయా వివరాలు సమర్పించని వారి డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు జూన్30 తర్వాత పనిచేయవని సెబీ గతంలో చెప్పింది.ఈ నిబంధనలను మరోసారి పరిశీలించాలని సెబీకి మార్కెట్ వర్గాల నుంచి భారీగా అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని సెబీ తన పాత ఆదేశాలన్ని సడలిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మదుపు చేస్తున్న డీమ్యాట్ ఖాతాదారులు, ఫండ్ మదుపరులు నామినేషన్ వివరాలు తెలియజేయకపోయినా వారి ఖాతాల విషయంలో ఎలాంటి చర్యలుండవని సెబీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు భౌతిక రూపంలో షేర్ల సర్టిఫికెట్లు ఉన్న వారికీ డివిడెండ్, వడ్డీ, ఇతర చెల్లింపులతోపాటు, అవసరమైన సేవల విషయాలన్నీ నామినేషన్తో సంబంధం లేకుండా అందించాలని పేర్కొంది.నామినీ జత చేయడంపై సెబీ సడలింపు ఇచ్చినా తప్పకుండా డీమ్యాట్, ఫండ్ పెట్టుబడిదారులు ఆయా వివరాలు నమోదు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు కాబట్టి ఏక్షణం ఏదైనా జరగొగ్గచ్చు. మనం ఉన్నా..లేకపోయినా మనం కష్టపడి సంపాదించికున్న పెట్టుబడులు, లాభాలను నామినీకు చెందేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. -
స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఏది బెటర్..?
స్మాల్ క్యాప్ కంటే మిడ్క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చేయడం మంచిదా? – వరుణ్ మిడ్క్యాప్లో ఉండే రాబడులు, సవాళ్లు అనేవి స్మాల్క్యాప్ మాదిరే ఉంటాయి. పేరుకు తగినట్టుగా ఈ పథకాల పెట్టుబడులు ఉండటాన్ని గమనించొచ్చు. మిడ్క్యాప్ పథకాలు ఎక్కువ మొత్తాన్ని మిడ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అదే విధంగా స్మాల్క్యాప్, లార్జ్క్యాప్ స్టాక్స్లోనూ చెప్పకోతగ్గ పెట్టుబడులు కలిగి ఉంటాయి. అదే స్మాల్క్యాప్ ఫండ్ అయితే ఎక్కువగా స్మాల్క్యాప్ స్టాక్స్కు పెట్టుబడులు కేటాయిస్తుంది. అలాగే, మిడ్క్యాప్ కంపెనీల్లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మార్కెట్ విలువ పరంగా టాప్ –100 కంపెనీలను లార్జ్క్యాప్గా, తదుపరి 150 కంపెనీలను మిడ్క్యాప్గా, మిగిలిన కంపెనీలను స్మాల్క్యాప్ కంపెనీలుగా సెబీ నిర్వచించింది. ఈ నిర్వచనాన్నే పథకాలు కూడా అనుసరిస్తుంటాయి. మార్కెట్ విలువ ఆధారంగా ఒక కంపెనీని మిడ్క్యాప్, స్మాల్క్యాప్ అని చెప్పడమే. ఒకవేళ అది చిన్న కంపెనీయే అయినప్పటికీ గొప్పది అయి ఉండొచ్చు. చక్కని నిర్వహణతో, ఎంతో వేగంగా వృద్ధి చెందుతున్న వ్యాపారంతో, భరోసానిస్తూ ఉండొచ్చు. ఇలాంటి అంశాలున్న కంపెనీల విషయంలో అది మిడ్ లేదా స్మాల్ క్యాప్ అన్న నిర్వచనం జోలికి వెళ్లక్కర్లేదు. ఉదాహరణకు ఒక మిడ్క్యాప్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంత కాలానికి నిర్వహణ ఆస్తుల పరంగా అది పెద్ద పథకంగా మారొచ్చు. అప్పుడు అది పేరుకు మిడ్క్యాప్ అయినప్పటికీ లార్జ్క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా పెట్టుబడులు కలిగి ఉంటుంది. పేరుకు మిడ్క్యాప్ కంపెనీలుగా ఉన్నప్పటికీ, పోర్ట్ఫోలియోలని చాలా కంపెనీలు భవిష్యత్తులో లార్జ్క్యాప్గా మారే అవకాశాలు ఉంటాయి. నేను ఆదాయపన్ను 30 శాతం శ్లాబు పరిధిలోకి వస్తాను. దీంతో అత్యవసర నిధిని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – శివ్ గణేశన్ మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. డెట్ ఫండ్స్లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఏటేటా వడ్డీ ఆదాయం పన్ను చెల్లింపుదారు ఆదాయానికి కలుస్తుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను ఆధారపడి ఉంటుంది. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపైనా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను విక్రయించినప్పుడు కూడా నమోదయ్యే లాభంపై ఇంతే మేర పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులను ఇస్తాయి. కానీ, డెట్ ఫండ్స్లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి పెట్టుబడులకు రక్షణ హామీ కూడా ఉండదు. అయినా కానీ, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి. నాణ్యమైన డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసిన పథకాన్నే ఎంపిక చేసుకోవాలి. లేదంటే రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. -
అదిరిపోయే లాభాలు ఇస్తున్న మ్యూచువల్ ఫండ్
-
ఇందులో పెట్టుబడులు పెడితే..‘గుండె మీద చెయ్యేసుకుని బతకొచ్చు’!
మిడ్క్యాప్, స్మాల్క్యాప్లో రిస్క్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో రాబడులు కూడా మెరుగ్గా ఉంటాయి. అస్థిరతలు చూసి చలించకుండా, సహనంతో ఉండే వారికి స్మాల్క్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. లార్జ్క్యాప్తో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక ప్రతిఫలాన్ని మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలు అందిస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక పిల్లల వివాహం, ఉన్నత విద్య, రిటైర్మెంట్ తదితర దీర్ఘకాల లక్ష్యాల కోసం స్మాల్క్యాప్ ఫండ్స్కు తమ పోర్ట్ఫోలియోలో తప్పకుండా చోటు కల్పించుకోవడం ఎంతైనా అవసరం. ఈ విభాగంలో ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకం దీర్ఘకాలంలో మంచి పనితీరుతో ఆకట్టుకుంటోంది. రాబడులు ఏడాది, మూడేళ్ల కాలంలో సూచీలతో పోలిస్తే రాబడుల విషయంలో ఎస్బీఐ స్మాల్క్యాప్ ఫండ్ వెనుక బడింది. కానీ, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో సూచీలకు మించి అధిక రాబడిని ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం ఇన్వెస్టర్లకు 37 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 25 శాతం చొప్పున ఉంది. ఐదేళ్లలో 26 శాతం, ఏడేళ్లలో 21 శాతం, పదేళ్ల కాలంలో 27 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో కనిపిస్తుంది. దీర్ఘకాలంలో స్మాల్క్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే ఎక్కువగా ఉంది. పెట్టుబడుల విధానం 2011, 2013, 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకం నష్టాలను తగ్గించింది. 2014, 2017, 2020–21 బుల్ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. పెట్టుబడుల్లో 65 శాతం వరకు స్మాల్క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంటుంది. అయితే, అన్ని సమయాల్లోనూ స్మాల్క్యాప్ కంపెనీలకు ఇదే స్థాయిలో కేటాయింపులు చేయదు. ఒకవేళ స్మాల్క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు మరీ ఖరీదుగా మారాయని భావించినప్పుడు, మిడ్క్యాప్, లార్జ్క్యాప్నకు కేటాయింపులు పెంచుతుంది. అలాగే, డెట్కు కూడా కొంత కేటాయిస్తుంటుంది. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.24,862 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో జనవరి చివరికి 93.13 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 6.87 శాతం నగదు, నగదు సమానాల్లో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించినట్టయితే, 59.23 శాతం మిడ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. స్మాల్క్యాప్ కంపెనీల్లో 40.77 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్క్యాప్ ఫండ్ అయినప్పటికీ, ప్రస్తుతం అధిక భాగం పెట్టుబడులు మిడ్క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆయా స్మాల్క్యాప్ కంపెనీలు మంచి పనితీరుతో మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలుగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎక్కువ పెట్టుబడులు మిడ్క్యాప్లో కనిపిస్తున్నాయి. పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం 55 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్లోనూ పెట్టుబడులు 28 శాతం మించలేదు. అంటే ఈ పథకంలో ఎక్కువ వైవిధ్యం కనిపిస్తోంది. సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, 18 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీలకు 12 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 12 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు 9.49 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీలకు 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
జనవరిలో 47 లక్షల కొత్త ఫోలియోలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో జనవరిలో 46.7 లక్షల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. డిజిటల్ మార్గాల ద్వారా ఫండ్స్లో సులభంగా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటుకుతోడు, ఆర్థిక సాధనాల పట్ల పెరుగుతున్న అవగాహన ఈ వృద్ధికి తోడ్పుడుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలించినా, నెలవారీగా ఫోలియోల పెరుగుదల 22.3 లక్షలుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తాజా డేటా వెల్లడిస్తోంది. ఈ ఏడాది జనవరి చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఫోలియోలు 16.96 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది జనవరి చివరికి ఉన్న 14.28 కోట్ల ఫోలియోలతో పోలిస్తే 19 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక 2023 డిసెంబర్ చివరి నుంచి ఈ ఏడాది జనవరి చివరికి ఫోలియోలలో 3 శాతం వృద్ధి నమోదైంది. ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి సంబంధించి ఇచ్చే గుర్తింపును ఫోలియో (పెట్టుబడి ఖాతా)గా చెబుతారు. ఒక ఇన్వెస్టర్కు ఒకటికి మించిన పథకాల్లో పెట్టుబడులు కలిగి ఉంటే, అప్పుడు ఒకటికి మించిన ఫోలియోలు ఉంటాయి. పెరుగుతున్న అవగాహన ‘‘డిజిటల్ పరిజ్ఞానం పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆరి్థక అక్షరాస్యత అనేవి సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్లు కాకుండా ఇతర సాధనాల వైపు చూసేలా చేస్తున్నాయి. ఇదే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఇతోధికం కావడానికి దోహం చేస్తున్నాయి’’అని వైట్ఓక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. మెజారిటీ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు డిజిటల్ ఛానళ్లనే ఎంపిక చేసుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరిలో నమోదైన 46.7 లక్షల ఫోలియోలలో ఈక్విటీలకు సంబంధించి 34.7 లక్షలుగా ఉన్నాయి. దీంతో జనవరి చివరికి ఈక్విటీ పథకాలకు సంబంధించిన ఫోలియోలు 11.68 కోట్లకు చేరాయి. జనవరిలో హైబ్రిడ్ ఫండ్స్కు సంబంధించి 3.36 లక్షల ఫోలియోలు కొత్తగా నమోదయ్యాయి. దీంతో హైబ్రిడ్ పథకాలకు సంబంధించి మొత్తం ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. డెట్ పథకాలకు సంబంధించిన ఫోలియోలు వరుసగా ఐదో నెలలోనూ క్షీణతను చూశాయి. జనవరిలో డెట్ పథకాలకు సంబంధించి 74.66 లక్షల ఫోలియోలు తగ్గాయి. గడిచిన కొన్ని సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఫోలియోలు, పెట్టుబడులు గణనీయంగా పెరిగినప్పటికీ.. దేశ జనాభాలో ఈ సాధనాల వ్యాప్తి ఇప్పటికీ 3 శాతం మించలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 45 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు జనవరి చివరికి రూ.53 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. -
యులిప్.. లోతుగా తెలుసుకున్నాకే!
ఆర్యన్ (60) క్రమం తప్పకుండా ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేద్దామని బ్యాంక్కు వెళ్లాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి (ఎఫ్డీ), దానిపై ప్రతి నెలా వడ్డీ రాబడి తీసుకోవాలన్నది ఆయన ప్రణాళిక. కానీ, బ్యాంక్ ఉద్యోగి చేసిన పనికి అతడు నష్టపోవాల్సి వచి్చంది. అనుకున్నది ఒకటి అయింది మరొకటి. ఎఫ్డీ పేరు చెప్పి బ్యాంక్ ఉద్యోగి ఆర్యన్తో యులిప్ పథకంపై సంతకం చేయించాడు. ఆ తర్వాతే అది ఎఫ్డీ కాదని అతడికి తెలిసొచ్చింది. దీంతో క్రమం తప్పకుండా ఆదాయం పొందాలన్న అతడి ప్రణాళిక దారితప్పింది. ఇలా తప్పుదోవ పట్టించి బీమా పాలసీలు, పెట్టుబడి పథకాలను అంటగట్టే ప్రయత్నాలు సహజంగానే కనిపిస్తూనే ఉంటాయి. యస్ బ్యాంక్ కేసులోనూ ఇదే చోటు చేసుకుంది. ఏటీ–1 (అడిషనల్ టైర్) బాండ్లను ఎఫ్డీ పేరు చెప్పి లక్షలాది మంది నుండి పెట్టుబడులు సమీకరించింది. యస్ బ్యాంక్ సంక్షోభంలో పడినప్పుడు ఏటీ–1 బాండ్లను రైటాఫ్ చేసేశారు. అంటే పెట్టుబడి పెట్టిన వారికి రూపాయి ఇవ్వలేదు. ఎఫ్డీల్లో అధిక రాబడి ఇస్తుందని చెప్పారే కానీ, ఏటీ–1 బాండ్లలో ఉండే రిస్క్ గురించి చెప్పలేదు. మన దేశంలో పెట్టుబడి సాధనాలను మార్కెట్ చేసే వారు కేవలం రాబడులు, ఆకర్షణీయమైన ఫీచర్ల గురించే చెబుతుంటారు. ఆయా సాధనాల్లోని రిస్్క ల గురించి తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసే వారి బాధ్యత అని గుర్తించాలి. బీమా పాలసీలను తప్పుడు సమాచారంతో విక్రయించే ధోరణులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో యులిప్లు కూడా ఒకటి. ‘‘ఇవి ఏజెంట్లకు ఎక్కువ కమీషన్ను అందిస్తాయి. దీంతో పాలసీ తీసుకునే వారికి గరిష్ట ప్రయోజనం కల్పించడానికి బదులు, ఏజెంట్కు ఎక్కువ ప్రయోజనం కలిగించే ఉత్పత్తి విక్రయానికి దారితీస్తుంది’’ అని ఆనంద్రాఠి వెల్త్ ప్రొడక్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ చేతన్ షెనాయ్ వివరించారు. ఎండోమెంట్ బీమా ప్లాన్లలో కమీషన్ మెదటి ఏడాది 10–35 శాతం మేర ఏజెంట్లకు అందుతుంది. యులిప్ ప్లాన్ల ప్రీమియంలో 10 శాతం ఏజెంట్ కమీషన్గా వెళుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో కేవలం 0.3–1.5 శాతం మధ్యే ఎక్కువ పథకాల్లో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పనిచేస్తాయంటూ యులిప్లను మార్కెట్ చేస్తుంటారు ఏజెంట్లు. కానీ, పూర్తిగా తెలుసుకోకుండా అంగీకారం తెలపకపోవడమే మంచిది. యులిప్లు – మ్యూచువల్ ఫండ్స్ యులిప్లు, మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటి కావు. వీటి మధ్య సారూప్యత కొంత అయితే, వైరుధ్యాలు బోలెడు. యులిప్లు అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అంటే పెట్టుబడులతో ముడిపడిన బీమా పథకాలు. చెల్లించే ప్రీమియంలో కొంత బీమా కవరేజీకి పోను, మిగిలిన మొత్తాన్ని తీసుకెళ్లి ఈక్విటీ, డెట్ సాధనాల్లో (ఇన్వెస్టర్ ఎంపిక మేరకు) పెట్టుబడిగా పెడతారు. కనుక ఇందులో రిస్క్లు, రాబడుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. బీమా కంపెనీల ఫండ్ మేనేజర్లు యులిప్ పాలసీలకు సంబంధించిన పెట్టుబడులను మార్కెట్ లింక్డ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యులిప్ల ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)గా కొందరు మార్కెట్ చేస్తుంటారు. నెట్ అసెట్ వేల్యూ (ఎన్ఏవీ)ని చూపిస్తుంటారు. యులిప్లను మ్యూచువల్ ఫండ్స్కు ప్రత్యామ్నాయం అంటూ విక్రయిస్తుంటారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులు వస్తాయని కొనుగోలు చేసే వారూ ఉన్నారు. కానీ వాస్తవంలో మెరుగ్గా పనిచేసే యులిప్ల రాబడులను గమనించినప్పుడు.. మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువే ఉండడాన్ని చూడొచ్చు. దీనికి కారణం యులిప్లలో పలు రకాల చార్జీల పేరుతో పాలసీదారుల నుంచి బీమా సంస్థలు ఎక్కువ రాబట్టుకునే చర్యలు అమలు చేస్తుంటాయి. సంక్లిష్టత.. పారదర్శకత లిక్విడిటీ (కొనుగోలు, విక్రయాలకు కావాల్సినంత డిమాండ్), చార్జీలు అనేవి యులిప్లు, ఫండ్స్లో పూర్తిగా భిన్నం. యులిప్లు ఐదేళ్ల లాకిన్ పీరియడ్తో వస్తాయి. ఫండ్స్ పెట్టుబడులను కోరుకున్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు. యులిప్లలో విధించే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా అయితే 0.5–1.5 శాతం మధ్య ఉంటుంది. అదే యులిప్లలో 20 ఏళ్ల కాలానికి లోడింగ్ 60 శాతంగా ఉంటుంది. అంటే ఏటా 3 శాతం చార్జీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు అనంత్ లోధా తెలిపారు. చార్జీల పరంగా సంక్లిష్టత ఇందులో కనిపిస్తుంది. ప్రీమియం అలోకేషన్ చార్జీలు, మోరా్టలిటీ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, పాలసీ అడ్మిని్రస్టేటివ్ చార్జీలు, ఫండ్ స్విచింగ్ (ఫండ్ను మార్చుకున్నప్పుడు) చార్జీలు, పాక్షిక ఉపసంహరణ చార్జీలు, ప్రీమియం రీడైరెక్షన్ చార్జీలు, ప్రీమియం నిలిపివేత చార్జీలు.. ఇన్నేసీ చార్జీలు మరే పెట్టుబడి సాధనంలో కనిపించవు. యులిప్ ప్లాన్లను తీసుకున్న వారిలోనూ చాలా మందికి ఈ చార్జీల గురించి తెలియదు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీల గురించే ఎక్కువ మందికి తెలుసు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడుల నిర్వహణకు గాను ఎక్స్పెన్స్ రేషియో విధిస్తుంటారు. దీన్నే ఫండ్ మేనేజ్మెంట్ చార్జీగానూ భావించొచ్చు. యులిప్ ప్లాన్లలో దీర్ఘకాలంలో రాబడులు 7–9 శాతం మధ్య ఉంటాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలంలో వార్షిక రాబడిని 12 శాతానికి పైనే ఆశించొచ్చు. రాబడులపై గ్యారంటీ లేదు మ్యూచువల్ ఫండ్స్ మాదిరే యులిప్లు సైతం రాబడికి హామీ ఇవ్వవు. వీటిల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్లపై ఆధారపడి ఉంటాయి. కాకపోతే దీర్ఘకాలంలో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడి యులిప్లలో ఉంటుందని భావించొచ్చు. ఎందుకంటే ఇవి పెట్టుబడులను తీసుకెళ్లి ఈక్విటీల్లో పెడుతుంటాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక అన్ని రకాల చార్జీల పేరుతో బాదిన తర్వాత కూడా ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువ రాబడి యులిప్లలో ఉంటుంది. పైగా ఎఫ్డీ రాబడిపై పన్ను ఉంటుంది. యులిప్ మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. అందుకే బీమా ఏజెంట్లు ఎఫ్డీల కంటే మెరుగైనవిగా మార్కెట్ చేస్తుంటారు. యులిప్ పెట్టుబడులను సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డెట్, ఈక్విటీ మధ్య మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ కూడా ఇదే పనిచేస్తుంటాయి. పన్ను పరిధిలో ఉన్న వారికి యులిప్లు అనుకూలమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో పెట్టుబడులు, రాబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉండడమే. ‘బెనిఫిట్ ఇలి్రస్టేషన్’ (ఎంత రావచ్చన్న అంచనాలు)లో రాబడిని 4–8 శాతం మించి చూపించకూడదు. యులిప్లలోనూ కన్జర్వేటివ్, బ్యాలన్స్డ్, అగ్రెస్సివ్ ఫండ్స్ ఉంటాయి. వీటిల్లో రాబడి, రిస్క్ వేర్వేరు. ఏ ఫండ్ ఎంపిక చేసుకుంటున్నారన్నదాని ఆధారంగానే రాబడులు ఆధారపడి ఉంటాయి. అగ్రెసివ్ ఫండ్తో దీర్ఘకాలంలో రాబడి అధికంగా ఉంటుంది. రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణలు కాదు.. అవసరాలు కుటుంబ పెద్దకు అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనే మార్కెటింగ్ ప్రచారం కూడా యులిప్ ప్లాన్ల విషయంలో కనిపిస్తుంది. కానీ, ఇందులో వాస్తవం పాళ్లు కొంతే. ఎందుకంటే యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ తగినంత ఉండదు. అచ్చమైన కవరేజీ కోసం అనువైనది టర్మ్ ఇన్సూరెన్స్. అలాగే, యులిప్లో చెల్లించే ప్రీమియం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిధిలోకి వస్తుందని, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదని కూడా చెబుతారు. కానీ, 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొనుగోలు చేసిన యులిప్ ప్లాన్లకు సంబంధించి అందుకునే మెచ్యూరిటీపై పన్ను ఉండకూడదని కోరుకుంటే, ప్రీమియం రూ.2.5 లక్షలు మించకూడదు. మరీ ముఖ్యంగా యులిప్ ప్లాన్ల విషయంలో వృద్ధులను ఏజెంట్లు లక్ష్యంగా చేసుకోవడాన్ని గమనించొచ్చు. ఎందుకంటే వారికి వీటిపై తగినంత అవగాహన లేకపోవడమే. సింగిల్ ప్రీమియం పాలసీలు, గ్యారంటీడ్ ఇన్కమ్ (హామీతో కూడిన రాబడి) పాలసీల గురించి వృద్ధులు అడుగుతుంటారని, అవి వారి అవసరాలకు అనుకూలమైనవి కావని నిపుణుల సూచన. అలాగే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడికి ఐదేళ్ల పాటు లాకిన్లో ఉంటుంది. దీన్ని కూడా వృద్ధులు గమనించాలి. సీనియర్ సిటిజన్లలో ఎక్కువ మందికి వారు చెల్లించే ప్రీమియానికి పది రెట్ల బీమా కవరేజీ ఇతర ప్లాన్లలో రాకపోవడం ఆకర్షణకు ఒక కారణం. మార్గమేంటి..? అది యులిప్ అయినా, ఎండోమెంట్ ప్లాన్ అయినా సరే బీమాను, పెట్టుబడిని కలపకూడదన్నది ప్రాథమిక సూత్రం. అచ్చమైన బీమా రక్షణ కోరుకుంటే అందుకు టర్మ్ ఇన్సూరెన్స్ మెరుగైన సాధనం. పెట్టుబడి కోసం ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఎన్నో ఉన్నాయి. అటు బీమా, ఇటు పెట్టుబడిపై గరిష్ట ప్రయోజనాన్ని పొందాలంటే వీటిని విడివిడిగానే తీసుకోవాలి. పన్ను ఆదా కోరుకునేట్టు అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కోరుకోవచ్చు. టర్మ్ ప్లాన్లలో గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఎలాంటి ప్రయోజనం అందదు. ఇక పెట్టుబడులపై పన్ను ఆదా కోరుకునే వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. వీటిలో చేసే పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద చూపించి పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో సగటు రాబడి 15 శాతానికి పైనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం.. ఈఎల్ఎస్ఎస్ నుంచి వచ్చే రాబడిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. యులిప్లో అయితే మెచ్యూరిటీపైనా పన్ను మిహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కానీ, ఈల్ఎస్ఎస్ఎస్లో అది లేదు. కాకపోతే యులిప్తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ రాబడులు ఎంతో మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షకు మించిన మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించిన తర్వాత కూడా నికర రాబడి, యులిప్లలో కంటే ఈఎల్ఎస్ఎస్ ప్లాన్లలో ఎక్కువే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. డెట్లో పీపీఎఫ్ సాధనంలో మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ఉండదు. ఇంత చెప్పినా, యులిప్ ప్లాన్ తీసుకుకోవడానికే మొగ్గు చూపేవారు.. బ్యాంకుల నుంచి కాకుండా నేరుగా బీమా సంస్థల నుంచి తీసుకోవడం వల్ల సరైన మార్గనిర్దేశం లభిస్తుందనేది నిపుణుల సూచన. -
పాతికేళ్ల ట్రాక్ రికార్డ్.. మంచి రాబడులు ఇస్తున్న ఈ ఫండ్ గురించి తెలుసా?
స్మాల్క్యాప్ ఫండ్స్, మిడ్క్యాప్ ఫండ్స్, లార్జ్క్యాప్ ఫండ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు పెద్దగా పరిచయం లేని, పట్టించుకోని విభాగం ఒకటి ఉంది. అదే లార్జ్ అండ్ మిడ్క్యాప్ విభాగం. దీర్ఘకాలంలో ఈ విభాగం మంచి సంపద సృష్టిస్తుందని చెప్పడానికి ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఆధారంగా నిలుస్తాయి. లార్జ్క్యాప్ స్థిరత్వానికి, రిస్క్ తక్కువకు వీలు కల్పిస్తుంది. మిడ్క్యాప్ మోస్తరు రిస్క్తో, అధిక రాబడులకు మార్గం కల్పిస్తుంది. ఈ రెండు రకాల విభాగాల్లో పెట్టుబడులకు వీలు కల్పించేదే లార్జ్ అండ్ మిడ్క్యాప్. ఈ విభాగంలో సుదీర్ఘకాల చరిత్ర (25 ఏళ్లకు పైగా) ఉండి, మంచి రాబడులను అందిస్తున్న పథకంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్కు ట్రాక్ రికార్డు ఉంది. పెట్టుబడుల విధానం.. సెబీ నిబంధనల ప్రకారం ఈ పథకం లార్జ్క్యాప్, మిడ్క్యాప్లో 35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో విభాగాల వారీ కేటాయింపుల్లో పరిమిత కాలం స్వేచ్ఛ ఉంటుంది. ఈ పథకం మేనేజర్ టాప్డౌన్, బోటమ్ అప్ విధానాలను స్టాక్ ఎంపికకు వినియోగించుకోవడాన్ని గమనించొచ్చు. ఈ విధానాల ద్వారా లార్జ్క్యాప్, మిడ్క్యాప్ విభాగాల నుంచి స్టాక్స్ ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆకర్షణీయమైన అవకాశాలు ఎక్కడ కనిపించినా, ఫండ్ మేనేజర్ గుర్తించి అందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్మాల్క్యాప్లో ఆకర్షణీయమైన అవకాశాలు కనిపించినా సొంతం చేసుకునే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. ఇన్వెస్టర్లకు అదనపు ఆల్ఫా అందించడమే దీని ఉద్దేశ్యం. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు ఉన్న సందర్భాల్లో 30 శాతం వరకు డెట్ సాధనాలకు సైతం కేటాయించగలదు. పోర్ట్ఫోలియో డిసెంబర్ 31 నాటికి చూసుకుంటే ఈ పథకం నిర్వహణలో రూ.10,268 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.74 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా, డెట్ సాధనాల్లో 0.87 శాతం, నగదు, నగదు సమానాల్లో 5.4 శాతం మేర కలిగి ఉంది. ప్రస్తుతం ఈక్విటీ కేటాయింపులను పరిశీలించగా, 70.42 శాతం లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 26 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్క్యాప్ కంపెనీలకు కేవలం 2 శాతాన్నే కేటాయించింది. ప్రస్తుతం స్మాల్క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు చారిత్రక గరిష్ట స్థాయిలో ఉన్నందున అప్రమత్త ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీతో లాభపడే రంగాలు, స్టాక్స్కు ఎక్కువ కేటాయింపులు చేసినట్టు ప్రస్తుత పోర్ట్ఫోలియోను గమనిస్తే తెలుస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధికి అనుగుణంగా ఆయా స్టాక్స్ ర్యాలీకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించొచ్చు. రాబడులు ఈ పథకం 1998 నవంబర్ 30న ప్రారంభమైనంది. నాటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు వార్షిక రాబడి 18.60 శాతంగా ఉంది. ఈ పథకం ఎక్స్పెన్స్ రేషియో 1.80 శాతంగా ఉంది. అంటే ఇన్వెస్టర్ తన పెట్టుబడుల విలువపై ఏటా ఈ మేరకు చార్జీల రూపంలో కోల్పోవాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఇహబ్ దల్వాయ్ నిర్వహిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 33 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో 25.63 శాతం, ఐదేళ్లలో 20 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 16.62 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఈ పథకం ప్రారంభమైన నాడు ఏకమొత్తంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది ఇప్పుడు రూ.72.15 లక్షలు అయి ఉండేది. ఈ కాలంలో బెంచ్మార్క్ నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్క్యాప్ 250 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. పథకం ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే రూ.4.03 కోట్లు సమకూరి ఉండేది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంక్ 6.84 మారుతి సుజుకీ 4.50 ఎన్టీపీసీ 3.79 భారతీ ఎయిర్టెల్ 3.22 ఇన్ఫోసిస్ 3.14 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.89 ఎస్బీఐ కార్డ్స్ 2.83 రిలయన్స్ 2.53 ఎన్హెచ్పీసీ 2.36 ముత్తూట్ ఫైనాన్స్ 2.35 -
చనిపోయినా సంపద సేఫ్..! కానీ..
చావు పుట్టుకలు చెప్పిరావు.. చావే వస్తే మనం కూడబెట్టిన కొద్ది మొత్తం డబ్బు ఏమౌతుంది.. ఆ డబ్బు మన తర్వాత ఉన్నవాళ్లు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి.. స్టాక్మార్కెట్లో మదుపు చేయాలని చాలా మంది అంటుంటారు. దీర్ఘకాలంగా అందులో మదుపుచేసిన వారు చనిపోతే ఆ డబ్బు ఎవరికి చెందుతుంది.. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.. ప్రభుత్వం అందుకు విధిస్తున్న గడువులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించాలని చాలా మందికి ఉంటుంది. దాంతో అందులో మదుపు చేస్తూంటారు. కానీ చివరకు ఏదైనా జరిగి వారు మరణిస్తే ఆ డబ్బు ఎవరికీ కాకుండా అలా ఉండిపోతుంది. కానీ ఆ సంపద ఎవరికి చెందాలో నామినీగా వారి వివరాలను డీమ్యాట్ అకౌంట్కు జతచేయాలి. ఫలితంగా ఖాతాదారుడు చనిపోయినా నామినీ వెళ్లి ఆ డబ్బును తీసుకునే వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులు తమ నామినీల పేర్లు నమోదు చేయడానికి గడువు 2024 జూన్ 30 వరకు పొడిగిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 వరకు మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల నామినీల పేర్లు నమోదు చేసేందుకు డెడ్ లైన్ విధించింది. కానీ ఆ తేదీని పొడగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది ‘మార్కెట్ భాగస్వాముల నుంచి అభ్యర్థనలు, ఇన్వెస్టర్ల సౌకర్యార్థం డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ మదుపర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేందుకు గడువు పొడిగించాం’ అని సెబీ తన సర్క్యులర్లో పేర్కొంది. డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేలా ప్రోత్సహించాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు.. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ), డిపాజిటరీ పార్టిసిపెంట్లు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లను (ఆర్టీఏ) సెబీ కోరింది. -
కోటీశ్వరులు కావాలనుందా..?
దేశీయ స్టాక్మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్గా ఉండే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్న మొత్తాల పొదుపుతో కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములాను ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మంచి వెల్త్ సృష్టించవచ్చు. మ్యూచువల్ఫండ్లో చాలా మంది పెట్టుబడులు పెడుతూంటారు. తోచినంత మదుపుచేస్తూ దీర్ఘకాల కోరికల కోసం కష్టపడుతుంటారు. అందులో ఒకొక్కరి ఆసక్తులు ఒక్కోలా ఉంటాయి. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి మాత్రం ఒక నియమాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం..నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందులో దాగిఉన్న కాంపౌండింగ్ ఫార్మాలాతో కార్పస్ జనరేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడిగా పెడితే సరిపోతుందన్న మాట. ఇదీ చదవండి: టెస్లా యూనిట్కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు కొనసాగించే పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే రూ.75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. దాంతో మొత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. -
అస్సెట్ అలొకేషన్ అంటే ఇదేనా..?
నా దగ్గరున్న మొత్తంలో 60 శాతాన్ని బ్యాంకు ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేశాను. మిగిలిన 40 శాతం మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టాను. ఇప్పుడు చూస్తే ఈక్విటీ పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగింది. దీంతో ఈక్విటీలకు 50 శాతం, ఎఫ్డీల్లో 50 శాతం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అస్సెట్ అలొకేషన్ అంటే.. 50 శాతం మించి ఈక్విటీలలో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్లలోకి మళ్లించడమేనా? – ఎస్కే సిన్హా అస్సెట్ రీబ్యాలన్స్ అంటే ఒక లకి‡్ష్యత కేటాయింపుల విధానాన్ని అనుకుని.. ఆ మేరకు పెట్టుబడుల మొత్తాన్ని వివిధ పెట్టుబడి సాధనాల మధ్య వర్గీకరించడం. ఒకే కాల వ్యవధిలో కొన్ని సాధనాలు మంచి పనితీరు చూపించడం వల్ల వాటిల్లోని పెట్టుబడుల విలువ ఇతర సాధనాలతో పోలిస్తే గణనీయంగా పెరగొచ్చు. దీంతో అలా మంచి పనితీరు చూపించిన వాటి వెయిటేజీ పెరిగిపోతుంది. అప్పుడు ముందు అనుకున్న కేటాయింపులకు మించి, ఎంత అయితే పెరిగిందో ఆ మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పోర్ట్ఫోలియోలో వెయిటేజీ పడిపోయిన సాధనాలకు ఆ మేరకు కేటాయింపులు పెంచుకోవాలి. అస్సెట్ రీబ్యాలన్సింగ్ వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. మీ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడుల మధ్య సమతూకాన్ని కొనసాగించుకునే వెసులుబాటు ఈ విధానంతో వస్తుంది. అంటే ఈక్విటీకి 60 శాతం, డెట్కు 40 శాతం కేటాయింపులతో అస్సెట్ అలొకేషన్ విధానాన్ని నిర్ణయించుకున్నారని అనుకుందాం. కొంత కాలం తర్వాత మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ వాటా 80 శాతానికి చేరి డెట్ పెట్టుబడులు 20 శాతానికి తగ్గాయని అనుకుంటే.. అప్పుడు మీ పోర్ట్ఫోలియోలో రిస్క్ పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఉండడంతో మార్కెట్ల ఉద్దాన, పతనాల ప్రభావం పెట్టుబడుల విలువపై ప్రతిఫలిస్తుంటుంది. ఇది పెట్టుబడిదారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయవచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని అనుకునే ఇన్వెస్టర్లు ఈక్విటీల పెట్టుబడులను 60 శాతానికి తగ్గించుకుని, డెట్ పెట్టుబడులు 40 శాతానికి అస్సెట్ రీఅలొకేషన్తో పెంచుకోవడం వల్ల తిరిగి వారి విధానానికి తగ్గట్టు పెట్టుబడుల స్వరూపం ఉంటుంది. అస్సెట్ రీబ్యాలన్సింగ్తో ఉన్న మరొక ప్రయోజనాన్ని చూస్తే.. అధిక స్థాయిల్లో విక్రయించి, తక్కువలో కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది. అంటే విలువ గణనీయంగా పెరిగిన చోట విక్రయించి.. అదే సమయంలో పెద్దగా పెరగని చోట కొనుగోలు చేస్తాం. ఉదాహరణకు పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా పెరిగిందంటే.. ఈక్విటీలు బాగా ర్యాలీ చేశాయని అర్థం. దాంతో అస్సెట్ రీఅలొకేషన్ విధానంలో భాగంగా అధిక వ్యాల్యూషన్ల వద్ద పెట్టుబడులను కొంత వెనక్కి తీసుకుని డెట్కు మళ్లిస్తాం. తరచుగా కాకుండా.. ఏడాదికోసారి లేదంటే.. ఒక పెట్టుబడి సాధనంలోని పెట్టుబడుల విలువ నిర్దేశిత పరిమితి కంటే 5 శాతానికి మించి పెరిగిపోయిన సందర్భాల్లోనే దీన్ని చేయడం సూచనీయం. నా వయసు 72 ఏళ్లు. నేను ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమేనా? లేదంటే సంప్రదాయ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎంపిక చేసుకోవాలా? – భాస్కర్ ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో మీకున్న అనుభవం ఏ మేరకు? అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈక్విటీల్లో ముందు నుంచి ఇన్వెస్ట్ చేస్తూ మూడేళ్లకు పైగా అనుభవం ఉండి, మార్కెట్లలో ఎత్తు, పల్లాలను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తం నుంచి ఆదాయం కోరుకోకుండా, పెట్టుబడి కోసమే అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడుల్లో ఎటువంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. -
రూ.10వేల పెట్టుబడితో.. 15 కోట్లు సంపాదన, ఎలా అంటే?
నెలకు 10వేలు 25ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే సుమారు 15 కోట్ల వరకు డబ్బు సంపాదించడం ఎలా? ఈ రహస్యాన్నే హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, యాంఫీ ఛైర్మన్ నవనీత్ మునోత్ బహిర్ఘతం చేశారు. ముంబైలో జరిగిన బిజినెస్ టుడే 500 వెల్త్ క్రియేటర్ సమ్మిట్లో భారతీయ మార్కెట్ల భవిష్యత్తు గురించి, వ్యాపారాలు, పెట్టుబడిదారులు, కొత్తగా పుట్టుకొస్తున్న మార్కెట్ ట్రెండ్లు, సవాళ్లు, అవకాశాల్ని అన్వేషించడం అనే అంశంపై ఆయా కంపెనీల సీఈఓలు మాట్లాడారు. ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, యాంఫీ ఛైర్మన్ నవనీత్ మునోత్ మాట్లాడుతూ..మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ విలువ 17 వేల కోట్లు మూడేళ్ళ క్రితం అది నేటితో పోలిస్తే సగం. మ్యూచువల్ ఫండ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి దాదాపు 25 ఏళ్లు పట్టింది. 2017లో 4,000 కోట్లు, 2018లో 8,000 కోట్లు, ఇప్పుడు 2023లో 17,000 కోట్లుగా ఉందని అన్నారు. అనంతరం.. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులతో భారీ రాబడులే వచ్చాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో నెలకు రూ.10వేల చొప్పున 25 నుంచి 30 ఏళ్లు పెట్టుబడులు పెడితే 18-19 శాతం వడ్డీ ఇలా అసలు వడ్డీ మొత్తం కలుపుకుని రూ.15 కోట్లు వచ్చాయి. అయితే, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పరంగా అంత సానుకూలత లేదు. కాబట్టి రాబోయే 28 సంవత్సరాలలో రూ.10వేలు పెట్టుబడి పెడితే ఇంత భారీ మొత్తంలో డబ్బుల్ని సంపాదించవచ్చా’ అంటే ఖచ్చితంగా చెప్పలేను అని అన్నారు. అయితే ఇది దేశ సామర్ధ్యం ఎలా ఉందో నిరూపిస్తుంది. పెట్టుబడుల పరంగా భారత్ మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు అత్యుత్తమం అంటూ నవనీత్ మునోత్ తన ప్రసంగాన్ని ముగించారు. -
భారతీయుల్లో పదవి విరమణపై పెరిగిన అవగాహన..
-
నజారాలో ఎస్బీఐ ఎంఎఫ్ రూ.410 కోట్ల పెట్టుబడి
ముంబై: ప్రముఖ గేమింగ్, ఈ స్పోర్ట్స్ సేవల కంపెనీ నజారా టెక్నాలజీస్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. నజారా టెక్నాలజీస్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లో పాల్గొని రూ.410 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. నజారా టెక్నాలజీస్ రూ.4 ముఖ విలువ కలిగిన 57,42,296 షేర్లను, ఒక్కోటీ రూ.714 చొప్పున జారీ చేయనుంది. ఈ విలువ రూ.409.90 కోట్లు, ఎస్బీఐ మల్టీక్యాప్ ఫండ్, ఎస్బీఐ మాగ్నమ్ గ్లోబల్ ఫండ్, ఎస్బీఐ టెక్నాలజీస్ అపార్చునిటీస్ ఫండ్ ద్వారా ఎస్బీఐ ఫండ్ ఈ ఇన్వెస్ట్ చేయనుంది. ఈ నెల 4న జెరోదా వ్యవస్థాపకులైన నితిన్, నిఖిల్ కామత్ సోదరులు సైతం ఒక్కో షేరుకు ఇదే ధరపై రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
పెట్టుబడుల వరద, స్మాల్క్యాప్ వైపు ఇన్వెస్టర్ల చూపు.. కారణం అదేనా?
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు స్మాల్క్యాప్ పథకాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్మాల్క్యాప్ పథకాలు నికరంగా రూ.11,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. లార్జ్క్యాప్ విభాగంలో మెరుగైన రాబడుల విషయంలో ఫండ్ మేనేజర్లు సవాళ్లను ఎదుర్కొంటుండడంతో, ఇన్వెస్టర్లు స్మాల్క్యాప్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా. లార్జ్క్యాప్ పథకాలు జూన్తో ముగిసిన మూడు నెలల కాలంలో కేవలం రూ.3,360 కోట్లను ఆకర్షించడం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ స్మాల్క్యాప్ ఫండ్స్లోకి నికరంగా రూ.6,932 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘గడిచిన కొన్ని నెలలుగా మిడ్, స్మాల్క్యాప్ సూచీలు బలమైన ర్యాలీ చేస్తున్నాయి. దీంతో లార్జ్క్యాప్ విభాగంలో ఆల్ఫా నమోదు చేయడం అన్నది చాలా కష్టమైన పనే అవుతుంది. స్మాల్క్యాప్ పథకాల్లోకి భారీ పెట్టుబడులు రావడానికి ఇదే కారణం’’అని క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లీ తెలిపారు. అసాధారణం.. స్మాల్క్యాప్ పథకాల్లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులు వస్తుండడంతో, ఫండ్ మేనేజర్లు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిప్పన్ ఇండియా స్మాల్క్యాప్, టాటా స్మాల్క్యాప్ పథకాలు లంప్సమ్ (ఒకే విడత) పెట్టుబడుల స్వీకరణను నిలిపివేశాయి. కేవలం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులనే అనుమతిస్తున్నాయి. భారీ పెట్టుబడులను సర్దుబాటు చేసేంత లిక్విడిటీ స్మాల్క్యాప్ విభాగంలో ఉండదు. ఇది రాబడులపైనా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఫండ్ మేనేజర్లు ఈ వైఖరి తీసుకున్నట్టు కనిపిస్తోంది. ‘‘ఇటీవలి నెలల్లో స్మాల్క్యాప్ స్టాక్స్ పనితీరు ఎంతో అసాధారణంగా ఉంది. లార్జ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీల మధ్య వ్యాల్యూషన్ పరంగా ఉన్న అంతరమే దీనికి కారణంగా తెలుస్తోంది. మార్కెట్ల వ్యాల్యూషన్ ఖరీదుగా మారినప్పుడు ఇలాంటి ధోరణి కనిపించడం సహజమే. దీంతో ఫండ్ మేనేజర్లు పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్టాక్స్ కోసం అన్వేషిస్తుంటారు’’అని ఏయూఎం క్యాపిటల్ మార్కెట్ వెల్త్ హెడ్ ముకేశ్ కొచ్చర్ తెలిపారు. మిడ్క్యాప్ స్థాయి రిస్క్తో మెరుగైన రాబడులకు అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు స్మాల్క్యాప్ ఫండ్స్కు మొగ్గు చూపిస్తున్నట్టు ఆనంద్ రాథి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారీ రాబడులు మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్క్యాప్ విభాగం భారీ రాబడులు ఇస్తుండడం కూడా ఈ విభాగం వైపు ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా తెలుస్తోంది. ఏడాది కాలంలో ఇవి 30–37 శాతం, మూడేళ్ల కాలంలో 40–44 శాతం, ఐదేళ్లలో 18–21 శాతం చొప్పున వార్షిక కాంపౌండెడ్ వృద్ధితో రాబడులు అందించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ చివరికి స్మాల్క్యాప్ ఫండ్స్ అన్నింటి నిర్వహణలోని ఆస్తులు మార్చి నుంచి చూస్తే 28 శాతం వృద్ధితో రూ.1.7 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ పథకాలు ఆటో, ఆటో విడిభాగాలు, క్యాపిటల్ గూడ్స, ఐటీ కంపెనీలకు పెట్టుబడుల పరంగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో స్మాల్క్యాప్ విభాగానికి గరిష్టంగా 30 శాతం వరకే కేటాయించుకుని, 50 శాతం లార్జ్క్యాప్ ఫండ్స్కు కేటాయించుకోవడం మంచిదని అజీజ్ సూచించారు. -
పన్ను ఆదా.. మెరుగైన రాబడినిచ్చే ఈ ఫండ్ గురించి తెలుసా?
మెరుగైన రాబడులతోపాటు, పన్ను పరిధిలో ఉన్న వారు కొంత ఆదా చేసుకునేందుకు ఉపయోగపడే సాధనాల్లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) కూడా ఒకటి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇదొక విభాగం. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ ఒకటి. రాబడులు టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ రాబడులు అద్భుతంగా ఏమీ లేకపోయినా.. ఈ పథకం అన్ని కాలాల్లోనూ స్థిరమైన, మెరుగైన ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. గత ఏడాది కాలంలో ఈ పథకం 14 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల కాలంలో ఏటా 23 శాతం చొప్పున రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్లలో 13 శాతం, ఏడేళ్లలో 13 శాతం, పదేళ్లలో 17.56 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. బెంచ్ మార్క్ సూచీ అయిన ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐతో పోలిస్తే ఈ పథకం కొన్ని కాలాల్లో మెరుగ్గానూ, కొన్ని కాలాల్లో ఫ్లాట్గానూ పనితీరు నమోదు చేసింది. దీర్ఘకాలంలో సూచీతో పోలిస్తే టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకంలోనే మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకానికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. 1996 మార్చిలో ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా 18.40 శాతం చొప్పున ఇప్ప టి వరకు ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చిపెట్టింది. పెట్టుబడుల విధానం/పోర్ట్ఫోలియో మార్కెట్ అస్థిరతలను అధిగమించేందుకు, దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒకింత సురక్షితమనే చెప్పాలి. మూడేళ్ల పాటు ఇందులో చేసే పెట్టుబడులపై లాకిన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలకు రిడెంప్షన్ (పెట్టుబడులను ఉపసంహరించుకోవడం) ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకునే వెసులుబా టు కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలంలో అధిక రాబడులకూ తోడ్పడుతుంది. ఈ పథకం మల్టీక్యాప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్) స్టాక్స్ మధ్య మార్పులు, చేర్పులు చేస్తుంది. ఉదాహరణకు 2017లో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో ఈ పథకం తన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతాన్ని కేటాయించింది. కానీ, చిన్న, మధ్య స్థాయి షేర్లలో అస్థిరతల నేపథ్యంలో 2018 చివరికి మిడ్, స్మాల్క్యాప్లో పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు తోడ్పడుతున్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి 3557 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 97.57 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. 57 శాతం పెట్టుబడులను లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. మిడ్క్యాప్ కంపెనీలకు 22.64 శాతం, స్మాల్క్యాప్ కంపెనీలకు 10 శాతం వరకు కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10.54 ఐసీఐసీఐ బ్యాంక్ 6.53 రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.84 ఇన్ఫోసిస్ 4.42 ఎస్బీఐ 4.36 యాక్సిస్ బ్యాంక్ 3.49 ఎల్అండ్టీ 2.94 రాడికో ఖైతాన్ 2.65 క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్ 2.58 భారతీ ఎయిర్టెల్ 2.35 -
నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి!
Mutual Funds: ఆధునిక కాలంలో సంపాదించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయాలనీ లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. ఆలా అనుకునే వారికి మ్యుచువల్ ఫండ్స్ ఉత్తమ మార్గం అనే చెప్పాలి. ఈ కథనంలో బెస్ట్ ఫండ్ ఏది? ఎంత పెట్టుబడికి ఎంత వస్తుందనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో పెట్టుబడికి చాలా మార్గాలు ఉన్నాయి, అందులో ఉత్తమ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే మీరు తప్పకుండా ప్రతి నెలా పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. మ్యుచువల్ ఫండ్ సిస్టమాటిక్ ప్లాన్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలను అందుకోవాలనుకుంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రిటర్న్స్.. మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసే డబ్బుని బట్టి మీ రిటర్న్స్ ఉంటాయని తప్పకుండా గుర్తుంచుకోవాలి. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రిటర్న్స్.. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరు ఎంచుకున్న మ్యుచువల్ ఫండ్ వ్యాల్యూ రూ.10 ఉన్న ఒక లక్ష యూనిట్లను కొనుగోలు చేశారనుకుంటే.. మీ పెట్టుబడి రూ. 10 లక్షలు (1,00,000×10) అవుతుంది. మీరు నెలకు రూ. 10000 రిటర్న్ పొందాలంటే.. మొదటి నెలలో ఎన్ఏవీ రూ. 10 ఉన్నప్పుడు 1000 యూనిట్లను విక్రయించి అనుకున్న పదివేలు తిరిగి పొందుతారు. అంటే అప్పుడు మీ వద్ద 99,000 యూనిట్లు మిగిలి ఉంటాయి. రెండవ నెలలో ఫండ్ ఎన్ఏవీ విలువ రూ.12కు పెరిగితే ఆ నెలలు మీకు పదివేలు ఇవ్వడానికి కేవలం 833 యూనిట్లను (10,000/12) మాత్రమే విక్రయించడం జరుగుతుంది. దీంతో మీ ఖాతాలో 98,167 యూనిట్లు ఉంటాయి. ఈ విధంగా మీరు ప్రతి నెలా లెక్కించుకోవచ్చు. ఫండ్ మంచి పనితీరుని కనపరిస్తే పెట్టుబడి అలాగే ఉంటుంది, డబ్బులు వస్తూనే ఉంటాయి. పనితీరు మందగిస్తే పెట్టుబడి కరిగిపోతూ వస్తుంది. నెలకు రూ. 1 లక్ష.. ఈ విధంగా మీకు నెలకు రూ. 1 లక్ష.. 25 సంవత్సరాలు పాటు రావాలంటే ఒకే సారి రూ. 1,55,50,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన 8 శాతం వార్షిక రిటర్న్స్ వచ్చాయంటే ప్రతి నెలా రూ. 1 లక్ష అందుకోవచ్చు. ఇలా 25 సంవత్సరాల తరువాత కూడా మీ పెట్టుబడి ఖాతాలో అలాగే ఉంటుంది. అంతే కాకుండా పాతికేళ్లు నెలకు 1 లక్ష వస్తూనే ఉంటుంది. Disclaimer: ఇలాంటి మ్యుచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, తప్పకుండా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి లేదా నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా గమనించగలరు. -
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
న్యూఢిల్లీ: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ నిలిపివేసిన ఆరు మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ.27,000 కోట్లను చెల్లించింది. 2020 ఆరంభంలో కరోనా వైరస్ రాకతో మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో 2020 ఏప్రిల్ 23న ఆరు డెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్ పథకాలను నిలిపివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుంది. ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనగా, అదే సమయంలో మార్కెట్లో డెట్ సెక్యూరిటీల అమ్మకాలకు కావాల్సినంత లిక్విడిటీ (కొనుగోలుదారులు) లేనట్టు అప్పుడు సంస్థ ప్రకటించింది. ఆరు పథకాలను నిలిపివేసే నాటికి వాటి పరిధిలోని పెట్టుబడుల విలువ రూ.25,125 కోట్ల మేర ఉండగా, దీంతో పోలిస్తే తాము ఇన్వెస్టర్లకు 107 శాతం మేర చెల్లించినట్టు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తాజాగా తెలిపింది. ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ అపార్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్ నిలిపివేసిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ తన ఫిక్స్డ్ ఇన్కమ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ వ్యాపారాలకు కొత్త నియామకాలను ప్రకటించింది. రాహుల్ గోస్వామి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగానికి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ఎండీగా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా ఉన్న సంతోష్ కామత్ ఇకపై ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా పనిచేయనున్నారు. -
వీడియోకాన్ ఫౌండర్ అకౌంట్ల అటాచ్మెంట్.. సెబీ ఆదేశాలు
న్యూఢిల్లీ: రూ. 5.16 లక్షల జరిమానా బకాయిలను రాబట్టుకునే దిశగా వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్కు చెందిన బ్యాంక్, డీమాట్, మ్యుచువల్ ఫండ్ ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలను అనుమతించరాదంటూ బ్యాంకులు, డిపాజిటరీలు (సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్), మ్యుచువల్ ఫండ్ సంస్థలకు సూచించింది. అయితే, క్రెడిట్ లావాదేవీలకు అనుమతించవచ్చని పేర్కొంది. క్వాలిటీ టెక్నో అడ్వైజర్స్, క్రెడెన్షియల్ ఫైనాన్స్, సుప్రీం ఎనర్జీ వంటి సంస్థలతో తనకున్న పెట్టుబడులు, సంబంధం గురించి వెల్లడించకుండా, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ ఏడాది మార్చిలో ధూత్కు సెబీ రూ. 5 లక్షల జరిమానా విధించింది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఇదీ చదవండి ➤ ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్కు సీఈవోగా అంజలీ సూద్ దీంతో అసలుతో పాటు రూ. 15,000 వడ్డీ, రికవరీ వ్యయాల కింద మరో రూ. 1,000 కలిపి మొత్తం రూ. 5.16 లక్షలు బాకీ చెల్లించాలని అటాచ్మెంట్ నోటీసులో సెబీ ఆదేశించింది. వీడియోకాన్ గ్రూప్ సంస్థలకు రుణ సదుపాయాలు కల్పించినందుకు ప్రతిగా అప్పట్లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా పనిచేసిన చందా కొచర్, ఆమె భర్తకు ధూత్ ప్రయోజనం చేకూర్చారని (క్విడ్ ప్రో కో) ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. -
మిరే అసెట్ నుంచి నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్
హైదరాబాద్: మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాలి. ఏక్తా గాలా దీనికి ఫండ్ మేనేజరుగా ఉంటారు. 12 టాప్ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇది ట్రాక్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందనున్న బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు, మెరుగైన రాబడులు పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ హెడ్ (ఈటీఎఫ్ ప్రోడక్ట్) సిద్ధార్థ్ శ్రీవాస్తవ తెలిపారు. మొండి బాకీల సమస్యను వదుల్చుకున్న బ్యాంకింగ్ రంగం గత కొన్నాళ్లుగా మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిన్టెక్ విప్లవంతో ఈ రంగం మరింత వృద్ధి చెందగలదని చెప్పారు. -
ఈక్విటీ పథకాల్లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మరోసారి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాయి. జూన్ నెలలో నికరంగా రూ.8,637 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. వివిధ ఏఎంసీలు కొత్త పథకాల ద్వారా (ఎన్ఎఫ్వోలు) పెట్టుబడులు సమీకరించడం, సిప్ పెట్టుబడులు బలంగా కొనసాగడం, స్మాల్క్యాప్ పథకాలకు చక్కని ఆదరణ లభించడం ఇందుకు దారితీసింది. జూన్ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈక్విటీ పథకాల్లోకి జూన్ నెలలో వచ్చిన పెట్టుబడులు మూడు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. మే నెలలో రూ.3,240 కోట్లను ఈక్విటీ పథకాలు ఆకర్షించగా, ఏప్రిల్లో వచ్చిన పెట్టుబడులు రూ.6,480 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఈక్విటీ పథకాలు భారీగా రూ.20,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ‘‘ఈక్విటీ పథకాల్లోకి మెరుగైన పెట్టుబడులు రావడం అన్నది ప్రధానంగా ఆరు కొత్త పథకాలు రూ.3,038 కోట్లు సమీకరించడం వల్లేనని చెప్పుకోవాలి’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెల్విన్ శాంటారియా పేర్కొన్నారు. జూన్ నెలలో 11 ఎన్ఎఫ్వోలు (ఓపెన్ ఎండెడ్) ప్రారంభం కాగా, ఇవి సమీకరించిన పెట్టుబడులు రూ.3,228 కోట్లుగా ఉన్నాయి. మే నెలతో పోలిస్తే జూన్ పెట్టుబడులు మెరుగ్గా ఉన్నట్టు కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సేల్స్ హెడ్ మనీష్ మెహతా చెప్పారు. గరిష్ట స్థాయిలో అస్సెట్ అలోకేషన్ కారణంగా కొంత లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదన్నారు. అయితే ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా పెట్టుబడులు కొనసాగించుకోవాలని సూచించారు. నికరంగా చూస్తే ఉపసంహరణే జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం మీద నికరంగా రూ.2,022 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ప్రధానంగా డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.14,135 కోట్లను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీనివల్లే మొత్తం మీద పెట్టుబడుల క్షీణత చోటు చేసుకుంది. అంతకుముందు మే నెలలో డెట్ విభాగంలోకి రూ.45,959 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. విభాగాల వారీగా.. ►స్మాల్క్యాప్ పథకాల్లోకి రికార్డు స్థాయిలో రూ.5,472 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►సిప్ రూపంలో ఇన్వెస్టర్లు జూన్లో రూ.14,734 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మే నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,749 కోట్లుగా ఉన్నాయి. ►లార్జ్క్యాప్ పథకాల నుంచి రూ.2,049 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ నుంచి రూ.1,018 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ►వ్యాల్యూ ఫండ్స్ రూ.2,239 కోట్లు, మిడ్క్యాప్ పథకాలు రూ.1,748 కోట్లు, లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.1,147 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ►ఈటీఎఫ్ ల్లోకి రూ.3,402 కోట్లు వచ్చాయి. ►అన్ని ఏఎంసీల నిర్వహణలోని మొత్తం నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ మే చివరికి ఉన్న రూ.42.9 లక్షల కోట్ల నుంచి, జూన్ చివరికి రూ.44.8 లక్షల కోట్లకు పెరిగింది. ►డెట్ విభాగంలో హైబ్రిడ్ ఫండ్స్లోకి రూ.4,611 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ►లిక్విడ్ ఫండ్స్ రూ.28,545 కోట్లు కోల్పోయాయి. -
రిస్క్ ఎక్కువే.. మంచి రాబడులు మాత్రం పక్కా..
దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తూ, ఓపిక పట్టే ఇన్వెస్టర్లకు స్మాల్క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గణనీయమైన రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పథకాలు గడిచిన పదేళ్ల కాలంలో ఏటా 21 శాతం కాంపౌండ్ వార్షిక రాబడిని అందించాయి. మిడ్క్యాప్ (19 శాతం), లార్జ్ క్యాప్ (14 శాతం) పెట్టుబడులతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించాయి. అయితే స్మాల్క్యాప్ పథకాలు అందరికీ అనుకూలం అని చెప్పలేం. కేవలం అధిక రిస్క్ తీసుకునే వారు, కనీసం పదేళ్ల పాటు అయినా తమ పెట్టుబడులు కొనసాగించే అవకాశం ఉన్న వారే వీటిని పరిశీలించొచ్చు. ఈ విభాగంలో గొప్ప రాబడుల చరిత్ర ఉన్న కొద్ది పథకాల్లో నిప్పన్ ఇండియా స్మాల్క్యాప్ ఫండ్ కూడా ఒకటి కావడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం నిప్పన్ ఇండియా స్మాల్క్యాప్ ఫండ్ తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో లార్జ్క్యాప్, మిడ్క్యాప్ కంపెనీలను కూడా కొంత కేటాయింపులు చేస్తుంటుంది. తద్వారా ఫండ్లో అంతర్లీనంగా రిస్క్ తగ్గించే వ్యూహం ఉంది. ముఖ్యంగా టాప్ 250కి పైన ఉన్న (స్మాల్క్యాప్) వాటిల్లోంచి భవిష్యత్తులో పెద్ద కంపెనీలుగా అవతరించే సామర్థ్యాలున్న వాటిని గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. కాలానుగుణంగా ఒక్కో సైకిల్లో ఒక్కో రంగానికి చెందిన కంపెనీలు బుల్ ర్యాలీ చేస్తుంటాయి. అలాంటి అవకాశాలను కూడా ఈ పథకం ముందే గుర్తించి అధిక కేటాయింపులు చేస్తుంటుంది. ఈ పథకానికి 2017 నుంచి సమీర్ రాచ్ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. తేజాస్ షేత్ అనే మరొక ఫండ్ మేనేజర్ కూడా ఈ బాధ్యతలను పంచుకుంటారు. స్మాల్క్యాప్ కంపెనీలు స్థూల ఆర్థికపరమైన మార్పులకు సున్నితత్వాన్ని కలిగి ఉంటాయి. అందుకని స్వల్పకాలంలో వీటిల్లో ఎక్కువ అస్థిరతలు కనిపిస్తాయి. కానీ ఓ కంపెనీని వృద్ధి దశ ఆరంభంలోనే గుర్తించి పెట్టుబడులు పెట్టి, వాటిని కొన్నేళ్లపాటు నిలకడగా కొనసాగించడం ద్వారా మెరుగైన రాబడికి వీలుంటుందని చెప్పడానికి ఈ పథకం పనితీరు నిదర్శనం. రాబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.31,945 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈ పథకం 2010 సెప్టెంబర్ 16న మొదలైంది. అప్పటి నుంచి చూసుకుంటే ఏటా 20 శాతానికి పైనే ఇన్వెస్టర్లకు రాబడులను అందిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 37 శాతం ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. మూడేళ్ల కాలంలోనూ వార్షిక రాబడి 46 శాతంగా ఉంది. ఐదేళ్లలో 21.72 శాతం, ఏడేళ్లలోనూ ఇంతే మేర, పదేళ్ల కాలంలో ఏటా 28.21 శాతం చొప్పున రాబడి అందించింది. అంటే ఏ కాలంలో చూసుకున్నా వార్షిక రాబడుల రేటు 20 శాతానికి పైనే ఉండడం విస్మరించకూడని విషయం. పోర్ట్ఫోలియో ప్రస్తుతం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 96.80 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్క్యాప్ విభాగంలోని కంపెనీలకు 17 శాతం మేర, మిడ్సైజు కంపెనీలకు 38 శాతం వరకు కేటాయింపులు చేయగా, 44.81 శాతం పెట్టుబడులను స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియోలో మొత్తం 179 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 17.14 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 13.44 శాతం చొప్పును కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కెమికల్ కంపెనీల్లో 8.7 శాతం, సేవల రంగ కంపెనీల్లో 8 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7.48 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 6.44 శాతం, ఆటోమొబైల్ రంగ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. -
కొత్త వ్యాపారం ప్రారంభించిన బజాజ్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి బజాజ్ ఫిన్సర్వ్ అడుగు పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో పెద్ద సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. ఈ నెలాఖరులోపు లిక్విడ్, మనీ మార్కెట్ తదితర మూడు ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డెట్) పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నియంత్రణ సంస్థ అనుమతితో మరో 4 కొత్త పథకాలను తీసుకురానున్నట్టు గ్రూప్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ప్రకటించారు. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 42 సంస్థలు ఉన్నాయి. తమ గ్రూపు పరిధిలో ఎనిమిది సబ్సిడరీలు ఉన్నాయని, 7 కోట్ల మంది కస్టమర్లకు ఆర్థిక ఉత్పత్తులను అందిస్తున్నట్టు సంజీవ్ చెప్పారు. -
కేవైసీ ఒక్కసారి చేస్తే చాలదా?
ఫండ్స్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ మరణించినట్టయితే అవి నామీనికి బదిలీ అవుతాయి. నామినీ విక్రయ నిబంధనలు ఏమిటి? – విశ్వ ప్రకాశ్ జాయింట్ హోల్డర్ ఉంటే, రెండో వాటాదారునకు అవి బదిలీ అవుతాయి. ఇది అసలు హోల్డర్ లేని సందర్భంగా బదిలీ చేస్తున్నారు కనుక పన్ను వర్తించదు. సంబంధిత యూనిట్లను పొందిన వారు వాటిని విక్రయించినప్పుడు పన్ను చెల్లించాలి. యూనిట్లను ఎంత కాలం ఉంచుకున్నారనే అంశాల ఆధారంగా, స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాలపన్ను వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏడాది కాలంలోపు విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని, స్వల్పకాల మూలధన లాభాల పన్నుగా పరిగణిస్తారు. ఈ మొత్తంపై 15 శాతం పన్ను పడుతుంది. ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే లాభం దీర్ఘకాల మూలధన లాభాల పన్నుగా చట్టం పరిగణిస్తుంది. మొదటి రూ.లక్ష లాభం మినహా మిగిలిన లాభంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్లో మూడేళ్ల వరకు పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాల మూలధన లాభంగాను, మూడేళ్లకు మించిన పెట్టుబడులపై లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభంగా చూస్తారు. స్వల్పకాల మూలధన లాభం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణాన్ని మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఒకరి నుంచి వారసత్వంగా లేదంటే నామినీగా వచ్చే పెట్టుబడులను విక్రయించినప్పుడు వాటి అసలు కొనుగోలు తేదీ నుంచి హోల్డింగ్ పీరియడ్ అమలవుతుంది. బదిలీ అయిన తేదీ కాదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ రూ.5 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను 2020లో కొనుగోలు చేసి, 2021లో మరణిస్తే, వివిధ మ్యూచువల్ ఫండ్స్కు ఏకీకృత కేవైసీ ప్లాట్ఫామ్ ఉందా?– సమీర్ పటేల్ ప్రస్తుతం సెంట్రల్ కేవైసీ అనేది ఉంది. ఇన్వెస్టర్లు వారి కేవైసీ ప్రక్రియను ఒక్కసారి మాత్రమే పూర్తి చేసేందుకు సెంట్రల్ కేవైసీ అవకాశం కల్పిస్తోంది. వేర్వేరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే ప్రతిసారి కేవైసీ ఇవ్వాల్సిన అవసరం దీంతో ఉండదు. పాన్, చిరునామా ధ్రువీకరణను ఇన్వెస్టర్ పంపిణీదారు లేదా సెబీ వద్ద నమోదు అయిన మార్కెట్ ఇంటర్మీడియరీ అయిన స్టాక్ బ్రోకర్, డిపాజిటరీ పార్టిసిపెంట్కు ఇచ్చినా.. తాజా సమాచారం సెంట్రల్ కేవైసీ రికార్డుల్లో అప్డేట్ అవుతుంది. -
ఇన్వెస్ట్ చేసేందుకు పీపీఎఫ్ మంచిదా? ఈఎల్ఎస్ఎస్ మంచిదా?
ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకం రెగ్యులర్ ప్లాన్ ఎన్ఏవీ, డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీకి భిన్నంగా ఉంటుందా? ఒకే పెట్టుబడికి ఈ రెండు ప్లాన్లలో కేటాయించే యూనిట్లలో వ్యత్యాసం ఉంటుందా? – శామ్ మీరు అడిగింది నిజమే. మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్ల నెట్ అస్సెట్ వ్యాల్యూ (ఎన్ఏవీ) వేర్వేరుగా ఉంటాయి. కారణం ఏమిటంటే..? ఒక ఫండ్ ఎన్ఏవీని నిర్ణయించేవి రెండు అంశాలు. ఆ పథకం పోర్ట్ఫోలియోతోపాటు, ఎక్స్పెన్స్ రేషియో. కనుక ఒక పథకం పోర్ట్ఫోలియో, ఎక్స్పెన్స్రేషియో అనేవి భిన్నంగా ఉండొచ్చు. కనుక ఎన్ఏవీలో మార్పు ఉండొచ్చు. అయితే, ఒక పథకం రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి పోర్ట్ఫోలియో ఒకటే ఉంటుంది. కాకపోతే ఎక్స్పెన్స్ రేడియో మాత్రం వేర్వేరుగా ఉంటుంది. కనుక ఎన్ఏవీపై దీని ప్రభావం పడుతుంది. రెగ్యులర్ ప్లాన్లకు పంపిణీదారుల కమీషన్ను కూడా కలుస్తుంది. కనుక రెగ్యులర్ ప్లాన్ల ఎన్ఏవీ అధికంగా ఉంటుంది. డైరెక్టర్ ప్లాన్లలో ఎలాంటి పంపిణీదారుల కమీషన్ ఉండదు. కనుక వాటి ఎన్ఏవీ తక్కువగా ఉంటుంది. ఒక పథకంలో ఇన్వెస్టర్ పెట్టుబడికి ఎన్ని యూనిట్లు వస్తాయనేది.. యూనిట్ ఎన్ఏవీపైనే ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్టర్ మొత్తం పెట్టుబడిని, ఎన్ఏవీతో భాగిస్తే ఎన్ని యూనిట్లు వస్తాయో తెలుస్తుంది. ఒక పథకం రెగ్యులర్ ప్లాన్ ఎన్ఏవీ రూ.11గా ఉండి.. రూ.10,000 పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. అప్పుడు ఈ పెట్టుబడికి 909.09 యూనిట్లు వస్తాయి. డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీ రూ.10 ఉందనుకుందాం. అప్పుడు అదే రూ.10,000 పెట్టుబడికి 1,000 యూనిట్లు లభిస్తాయి. నా వయసు 51 ఏళ్లు. పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. 2023 మార్చితో 15 ఏళ్ల కాల వ్యవధి ముగుస్తుంది. దీన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉందని తెలిసింది. దాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పట్లో డబ్బులతో పని లేదు. నెలకు రూ.12,500 చొప్పున పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే పీపీఎఫ్ను కొనసాగించుకోవాలా లేదా అది ముగిసిన తర్వాత.. ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలా? పీపీఎఫ్లో పెట్టుబడులు, రాబడులపై పన్ను లేదు. ఈఎల్ఎస్ఎస్లోనూ పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను లేదు. నేను 20 శాతం పన్ను పరిధిలో ఉన్నాను. మంచి సలహా ఇవ్వగలరు? – సెంతిల్ కుమార్ ఈక్విటీల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా డెట్తో పోలిస్తే మెరుగైన రాబడులు సొంతం చేసుకోవచ్చని వ్యాల్యూరీసెర్చ్ తరచూ చెబుతుంటుంది. మీకు సమీప కాలంలో డబ్బుతో అవసరం లేదంటున్నారు. కనుక పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన ఆలోచన అవుతుంది. మీకు ఈక్విటీల పట్ల తగినంత అనుభవం ఉందని అనుకుంటున్నాం. అలాగే, మీ పెట్టుబడుల కాల వ్యవధి కనీసం ఐదేళ్ల నుంచి ఏడేళ్లు ఉంటుందనే అంచనాతో ఈ సూచన చేస్తున్నాం. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందని మర్చిపోవద్దు. ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్ల్లో పన్ను మినహాయింపు పరిశీలిస్తే.. పీపీఎఫ్తో పోలిస్తే పన్ను చెల్లింపుల తర్వాత రాబడులు ఈఎల్ఎస్ఎస్లోనే ఎక్కువ. పన్ను ఆదా కోసం పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనాల్లో ముందు రాబడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ గిఫ్ట్గా ఇవ్వొచ్చా? ఈ విషయాలు తెలుసా?
ఫండ్ పథకంలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చా? – శ్రీలలిత మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే నేరుగా వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది. అటువంటప్పుడు పిల్లలు మేజర్ అయ్యే వరకు తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులపై సంరక్షకులుగా నిర్ణయాధికారం కలిగి ఉంటారు. పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. మీ పేరిట ఉన్న పెట్టుబడులను విక్రయించేసి, వచ్చిన మొత్తాన్ని పిల్లల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత వారి పేరిట కొనుగోలు చేసుకోవాలి. మూడో వ్యక్తి (థర్డ్ పార్టీ) నుంచి పెట్టుబడిని ఫండ్స్ సంస్థలు ఆమోదించవు. ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కనుక బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి నగదు బదిలీ చేసి, కొనుగోలు చేసుకోవడం ఒక్కటే మార్గం. నేను ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఓ మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 లేదా 5 స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా? – రాజ్దీప్ సింగ్ ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్ చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు. 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోండి. విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇది పన్ను ఆదా అవుతుంది. -ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఐటీఐ నుంచి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
ఐటీఐ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఫ్లెక్సి క్యాప్ ఫండ్కు సంబంధించి న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్కు నిఫ్టీ 500 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ప్రామాణికంగా ఉంటుంది. దీని ద్వారా సమీకరించిన నిధులను లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో సంస్థ ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేయాలనుకునే మదుపరులకు ఇది అనువుగా ఉంటుంది. ధీమంత్ షా, రోహన్ కోర్డే ఈ ఫండ్ను నిర్వహిస్తారు. 2019లో కార్యకలాపాలు ప్రారంభించిన ఐటీఐ .. ప్రస్తుతం 16 ఫండ్లను అందిస్తోంది. గతేడాది డిసెంబర్ నాటికి దాదాపు రూ. 3,557 కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. చదవండి: ఆ సూపర్ లగ్జరీ కార్ల క్రేజ్.. అబ్బో రికార్డు సేల్స్తో దూసుకుపోతోంది! -
యాక్సిస్ క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ఫండ్ ఎన్ఎఫ్వో
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ తాజాగా ’క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్డీఎల్ జూన్ 2028 ఇండెక్స్ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జనవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్.. క్రిసిల్ ఐబీఎక్స్ 50:50 గిల్ట్ ప్లస్ ఎస్డీఎల్ జూన్ 2028 సూచీలోని డెట్ సాధనాల్లో 95–100 శాతం ఇన్వెస్ట్ చేస్తుంది. మిగతాది డెట్, మనీ మార్కెట్ సాధనాలు (ఏడాది వ్యవధిలోనే మెచ్యూర్ అయ్యే ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో) పెట్టుబడులు పెడుతుంది. తదనుగుణంగా మెరుగైన రాబడులు అందించేలా ఇది పనిచేస్తుంది. ఇందులో లాకిన్ వ్యవధిలాంటివి ఉండవు కాబట్టి లిక్విడిటీకి సమస్య ఉండదు. తక్కువ డిఫాల్ట్ రిస్కులతో అత్యంత నాణ్యమైన పోర్ట్ఫోలియోను కోరుకునే వారికి, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఇది అనువుగా ఉంటుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ చంద్రేశ్ నిగమ్ తెలిపారు. చదవండి: రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే! -
పెట్టుబడులకు థీమ్... భారత్ !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థిరమైన విధా నాలు, తయారీ సామర్థ్యాలు పెంచుకుంటూ ఉండటం, వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు అంతర్జాతీయంగా చూస్తే భారతదేశం ప్రధాన థీమ్గా ఉండబోతోందని పీజీఐఎం ఇండియా మ్యుచువల్ ఫండ్ సీఐవో శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. ప్రస్తుతం ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్ స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. మరిన్ని వివరాలు.. ► రాబోయే దశాబ్ద కాలంలో పెట్టుబడులకు కొత్తగా ఏ థీమ్లు ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి? ప్రధానంగా మూడు థీమ్లు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా భారత్తో ముడిపడినవే. అంతర్జాతీయ దృష్టికోణంతో చూస్తే భారతదేశమే కొత్త పెట్టుబడి థీమ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం అయిదో అతి పెద్ద ఎకానమీగా ఎదిగింది. స్థిరమైన రాజకీయ పరిస్థితులు, పటిష్టమైన వినియోగంతో కూడుకున్న వృద్ధి, సానుకూల ప్రభుత్వ విధానాలు ఇవన్నీ కూడా రాబోయే దశాబ్దకాలంలో భారత్లో పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక రెండో థీమ్ విషయానికొస్తే భారత్ తన తయారీ సామరŠాధ్యలను పెంచుకుంటూ ఉండటం. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ పరిస్థితులు, ముడి సరుకులపై అనిశ్చితి, చైనా ప్లస్ వన్ వ్యూహాలు మొదలైన ధోరణులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. ప్రస్తుతం మన జీడీపీలో ఎక్కువగా సర్వీసుల వాటా ఉంటుండగా, తదుపరి దశ వృద్ధి తయారీ రంగం నుంచి రాబోతోంది. దేశీయంగా తయారీకి ప్రాధాన్యతనిస్తుండటం, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాలు మొదలైనవి ఇందుకు తోడ్పడనున్నాయి. ఇక మూడో థీమ్ను తీసుకుంటే పెరుగుతున్న తలసరి ఆదాయంతో వినియోగం కూడా పెరుగుతోంది. మరింత మంది ప్రజలు ఆర్థికంగా ఎదిగే కొద్దీ వినియోగ పరిమాణం, నాణ్యత రెండూ పెరగనున్నాయి. ఫైనాన్షియల్స్, డిజిటలైజేషన్లోనూ ఇదే ధోరణి కనిపించనుంది. ► ఒడిదుడుకుల మార్కెట్లో రిటైల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి? ఇన్వెస్టర్లు.. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిందేమిటంటే మార్కెట్లో టైమింగ్ కన్నా ఎంత కాలం పాటు మార్కెట్లో ఉన్నామనేది ముఖ్యం. స్వల్పకాలిక ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిప్ల విధానం సరైనది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి. మార్కెట్లు స్వల్పకాలికంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా, దీర్ఘకాలంలో మాత్రం ఒడిదుడుకులు తక్కువగానే ఉంటాయి. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు ప్రతి రోజూ తమ పోర్ట్ఫోలియోను చూసుకోవడం కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోణంలో వ్యవహరించాలి. అలాగే వయస్సుకు తగిన విధంగా అసెట్ కేటాయింపులపై దృష్టి పెట్టాలి. తద్వారా రిటైర్మెంట్ తదితర దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు వీలవుతుంది. ► ద్వితీయార్ధంలో మార్కెట్లకు పొంచి ఉన్న రిస్కులేమిటి? ఇటీవలి కాలంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత మార్కెట్లు బాగానే రాణించాయి. వేల్యుయేషన్స్ చౌకగా లేకపోయినా చాలా అధికంగా కూడా ఏమీ లేవు. భౌగోళికరాజకీయ అనిశ్చితులు, కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు మొదలైన రిస్కులు ఉన్నాయి. అయితే ఇవన్నీ అంతర్జాతీయంగా కూడా ఉన్నవి, తాత్కాలికమైనవే. ఏదేమైనా రిస్కులనేవి ఈక్విటీ పెట్టుబడుల్లో అంతర్భాగమేనని దృష్టిలో ఉంచుకుని, డైవర్సిఫికేషన్ ద్వారా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ► ప్రస్తుతం ఏయే రంగాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? సాధారణంగా అసెట్ క్వాలిటీ, రుణ వృద్ధి మెరుగుపడుతుండటంతో ఫైనాన్షియల్స్ సానుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే దేశీయంగా తయారీకి ప్రోత్సహిస్తున్నందున ఇండస్ట్రియల్స్ కూడా ఆకర్షణీయంగానే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, యుటిలిటీలు మొదలైనవి అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ► తొలిసారిగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి సూచనలు? ఫస్ట్ టైమర్లు దీర్ఘకాలిక పెట్టుబడుల కోణంతో తక్కువ ఒడిదుడుకులు ఉండే, డైవర్సిఫైడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. డైవర్సిఫైడ్/ఫ్లెక్సి క్యాప్, ఈఎల్ఎస్ఎస్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఈ కోవకు చెందుతాయి. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులకు 3 ఏళ్ల ఆటోమేటిక్ లాకిన్ వ్యవధి ఉంటుంది. ఈక్విటీల్లో రాబడులు అందుకోవాలంటే కనీసం ఆ మాత్రం సమయమైనా ఇన్వెస్ట్ చేయాలి. ఇక వయస్సు, ఇతరత్రా కట్టుకోవాల్సినవి బట్టి ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలు/వయస్సు/వ్యక్తిగత అవసరాల ప్రకారం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లేదా బ్యాలెన్స్డ్/హైబ్రిడ్ ఫండ్స్కు కేటాయించడాన్ని పరిశీలించవచ్చు.స్టాక్, సెక్టార్, మార్కెట్లు .. ఏవైనా కావచ్చు వేలం వెర్రి ధోరణులకు పోవద్దు. మార్కెట్లు ఆశ, నిరాశల మధ్య తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఉంటాయి. కాబట్టి రాబడులకు సంబంధించి భారీగా కాకుండా వాస్తవిక స్థాయిలో అంచనాలు పెట్టుకోవడం మంచిది. -
బరోడా బీఎన్పీ పారిబాస్ నుంచి మల్టీ అసెట్ ఫండ్
బరోడా బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘బరో డా బీఎన్పీ పారిబాస్ మల్టీ అసెట్ ఫండ్’ను (ఎన్ఎఫ్వో/కొత్త పథకం) ప్రారంభించింది. ఈ నెల 12న ఈ ఎన్ఎఫ్వో ముగుస్తుంది. ఈ పథకం ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ), గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెడుతుంది. ఒకటికి మించిన సాధనాల్లో (మల్టీ అస్సెట్) ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. విడిగా ఒక్కో సాధనంమధ్య పెట్టుబడులను వర్గీకరించుకునే నిర్వహణ ఇబ్బంది ఈ పథకం ఎంపికతో ఉండదు. ఎన్ఎఫ్వోలో భాగంగా ఒక్క ఇన్వెస్టర్ కనీసం రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలి. చదవండి అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్టీవీ! -
మధ్య కాలానికి డెట్లో పెట్టుబడులు: ఫండ్ రివ్యూ
ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అంతర్జాతీయంగా అన్ని ప్రముఖ సెంట్రల్ బ్యాంకుల వైఖరి ప్రస్తుతం రేట్ల పెంపు దిశగానే ఉంది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీల్లో మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో వడ్డీ రేట్ల పరంగా అనిశ్చితి నెలకొని ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాల వ్యవధితో కూడిన బాండ్లను ఎంచుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఈ తరుణంలో మీడియం డ్యురేషన్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాల బాండ్లతో పోలిస్తే వడ్డీ రేట్ల మార్పులతో వీటిపై పడే ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. కనుక మధ్య కాలానికి ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. పెట్టుబడుల పరంగా పెద్దగా రిస్క్ తీసుకోకుండా మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. పెట్టుబడుల విధానం/పోర్ట్ఫోలియో పెట్టుబడుల విషయంలో ఈ పథకం ఎక్కువ రిస్క్ తీసుకోదు. ఇందుకు నిదర్శనం పోర్ట్ఫోలియోలో ఎక్కువ భాగం అధిక భద్రతను సూచించే ఏఏఏ, ఏఏ రేటింగ్ సాధనాలు ఉండడాన్ని గమనించొచ్చు. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలోని రూ.1,570 కోట్ల పెట్టుబడుల్లో 20 శాతం నగదు రూపంలోనే ఉంది. వడ్డీ రేట్ల పరంగా స్థిరత్వం లేనందున నగదు నిల్వలు ఎక్కువగా కలిగి ఉందని తెలుస్తోంది. ఇక మిగిలిన 80 శాతం పెట్టుబడుల్లో 94 శాతం అధిక భద్రత సాధనాల్లోనే ఉన్నాయి. రిస్క్ ఉండే ఏ, అంతకంటే దిగువ రేటింగ్ సాధనాల్లో కేవలం 5 శాతం పెట్టుబడులనే కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలోని పెట్టుబడుల కాల వ్యవధి సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. 33 శాతం పెట్టుబడులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఉండడాన్ని గమనించాలి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ 3.5 శాతం రాబడినిచ్చింది. ఇక గడిచిన ఐదేళ్లలో వార్షికంగా 6.5 శాతం చొప్పున రాబడులను తెచ్చి పెట్టింది. ఏడేళ్లలో 7.34 శాతం, పదేళ్లలో 7.89 శాతం చొప్పున ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రతిఫలాన్నిచ్చింది. ఈ విభాగం సగటు రాబడుల కంటే ఈ పథకంలోనే ఎక్కువ ఉన్నాయి. మీడియం డ్యురేషన్ విభాగం సగటు రాబడులు గడిచిన ఐదేళ్లలో వార్షికంగా 5.5 శాతంగా ఉన్నాయి. ఏడేళ్లలో 6.32 శాతం, పదేళ్లలో 7.37 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. బాండ్ ఫండఖ కావడంతో ఈ పథకంలో సిప్ వల్ల ఉపయోగం ఉండదు. దీనికి బదులు ఏకమొత్తంలో నిర్ణీత కాలానికోసారి పెట్టుబడి పెట్టుకోవడం మంచిది -
ఫండ్స్లోకి భారీగా కొత్త పెట్టుబడులు
న్యూఢిల్లీ: డిజిటల్ వేదికల అనుసంధానత, మ్యూచువల్ ఫండ్స్ పథకాల పట్ల పెరుగుతున్న అవగాహన ఫలితాలనిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్ట్) 70 లక్షల కొత్త ఖాతాలు (ఫోలియోలు) ప్రారంభం కావడం గమనార్హం. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాల సంఖ్య 13.65 కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చి చివరికి ఫోలియోలు 12.95 కోట్లుగా ఉన్నాయి. 2020–21లో 81 లక్షలు, 2021–22లో 3.17 కోట్ల చొప్పున కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈ గణాంకాలు ఫండ్స్ మార్కెట్లోకి పెద్ద ఎత్తున కొత్త ఇన్వెస్టర్ల రాకను సూచిస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. డీమోనిటైజేషన్ గృహ పొదుపులు డిజిటలైజ్కు దారితీసిందని, దీనికితోడు రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరగడం మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాకకు సాయపడినట్టు మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. ప్రజల్లో మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహన పెరగడం, ప్రచార కార్యక్రమాలు, సమాచారం సులభంగా అందుబాటులోకి రావడం, డిజిటలైజేషన్ పెరగడం, మహిళల భాగస్వామ్యం ఫోలియోలు పెరిగేందుకు కారణాలుగా ఎల్ఎక్స్ఎంఈ ఎండీ ప్రీతిరాతి గుప్తా పేర్కొన్నారు. అలాగే, సంప్రదాయ సాధనాల నుంచి మ్యూచువల్ ఫండ్స్ వైపు చూడడం పెరిగినట్టు చెప్పారు. ఎల్ఎక్స్ఎంఈ అన్నది కేవలం మహిళల కోసమే ఉద్దేశించిన తొలి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ కావడం గమనించాలి. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా ఈ ఏడాది మార్చి నాటికి 55.2 శాతంగా ఉంటే, ఆగస్ట్ చివరికి 56.6 శాతానికి చేరింది. మ్యూచువల్ ఫండ్స్లో ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి ఒక ఖాతా ఉంటుంది. ఒక ఇన్వెస్టర్కు ఒకే మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పరిధిలో ఒకటికి మించిన పథకాల్లో పెట్టుబడులు ఉండొచ్చు. కనుక ఒకే ఇన్వెస్టర్కు ఎక్కువ సంఖ్యలో ఖాతాలు ఉంటాయి. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
ఫార్మాలో పెట్టుబడుల కోసం.. నిప్పన్ ఇండియా ఫార్మా ఫండ్
ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఫార్మాను ‘సురక్షిత’ రంగంగా చూస్తుంటారు. వినియోగం పరంగా ఫార్మా రంగంలో ఎప్పటికీ వృద్ధి ఉంటుంది. 10–20 ఏళ్ల క్రితంతో పోల్చి చూస్తే నేడు ప్రతి ఇంటికి ఆరోగ్యం, ఔషధ బడ్జెట్ పెరిగిపోయింది. ఈ రంగానికి ఎంత భవిష్యత్తు ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన మూడేళ్లలో ఫార్మా స్టాక్స్ మంచి లాభాలను ఇచ్చాయి. దీర్ఘకాలం కోసం ఫార్మాలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు థీమ్యాటిక్ (ఒకే రంగంలో ఇన్వెస్ట్ చేసేవి) ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా ఫార్మా ఫండ్ పనితీరు దీర్ఘకాలానికి నికలడగా ఉందని చెప్పుకోవాలి. 5 నుంచి 10 ఏళ్లు ఫార్మా రంగంలో స్వల్పకాలం కోసం పెట్టుబడులు అనుకూలం కాదు. ఎందుకంటే ఇవి నియంత్రణల మధ్య పనిచేస్తుంటాయి. ముఖ్యంగా యూఎస్ఎఫ్డీఏ తనిఖీల ప్రభావం స్టాక్స్పై ఉంటుంది. దీర్ఘకాలంలో అయితే ఈ తరహా అస్థిరతల దశ నుంచి కంపెనీలు బయటకు వస్తుంటాయి. తాత్కాలిక ఒడిదుడుకులు ఈ రంగంలో సాధారణం. కనుక దీర్ఘకాలం కోసమే (5–10 ఏళ్లు) సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. పనితీరు... నిప్పన్ ఇండియా ఫార్మా ఫండ్ 2011–16 మధ్య కాలంలో బీఎస్ఈ హెల్త్కేర్ ఇండెక్స్తో పోటీపడి మరీ రాబడులను ఇచ్చింది. ఆ కాలంలో వార్షికంగా 23.8 శాతం చొప్పున రాబడిని అందించింది. అదే కాలంలో బీఎస్ఈ హెల్త్కేర్ రాబడి 24.3 శాతం చొప్పున ఉండడం గమనించాలి. కానీ, 2016–19 మధ్య కాలంలో బీఎస్ఈ హెల్త్కేర్ ఇండెక్స్ కంటే నిప్పన్ ఇండియా ఫార్మా ఫండ్ అధిక రాబడిని అందించింది. కరోనా తర్వాత చూస్తే వార్షిక రాబడి 31.9 శాతంగా ఉంది. కానీ, బీఎస్ఈ హెల్త్కేర్ ఇండెక్స్ 26.9 శాతం రాబడినే ఇచ్చింది. ఈ పథకం ట్రైలింగ్ రాబడులను పరిశీలిస్తే.. గడిచిన ఏడాది కాలంలో 11.47 శాతం, మూడేళ్లలో 24 శాతం, ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 11.56 శాతం, 10 ఏళ్లలో 17.61 శాతం చొప్పున ఉన్నాయి. ఈ పథకం 2004 జూన్ 5న ప్రారంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడి 20.72 శాతంగా ఉంది. పోర్ట్ఫోలియో/పెట్టుబడుల విధానం ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.4,910 కోట్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఏయూఎం) ఉన్నాయి. లార్జ్క్యాప్, మిడ్క్యాప్ ఫార్మా స్టాక్స్, హాస్పిటల్స్, హెల్త్కేర్ కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. జనవరి నాటికి చూస్తే సన్ ఫార్మాకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చింది. అమెరికాలో జనరిక్ ధరల ఒత్తిళ్ల ప్రభావం సన్ స్పెషాలిటీ కెమికల్స్ పోర్ట్ఫోలియోపై పడదు కనుక ఈ పథకం ఎక్కువ కేటాయింపులు చేసి ఉండొచ్చు. టాప్–5 కంపెనీల్లో సిప్లా, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్కు గణనీయ కేటాయింపులు చేసింది. 22 శాతం మేర హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. హెల్త్కేర్ సేవలు మరింత విస్తరించే కొద్దీ ఈ కంపెనీల వ్యాపార అవకాశాలు విస్తృతం అవుతాయి. ఈ పథకం బహుళజాతి ఫార్మా కంపెనీలకు తక్కువ కేటాయింపులు చేస్తుంటుంది. ప్రస్తుతానికి కేటాయింపులు 9 శాతం మేర ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో 24 స్టాక్స్ ఉన్నాయి. లార్జ్క్యాప్ కంపెనీలకు 47 శాతం, మిడ్క్యాప్ కంపెనీలకు 43 శాతం స్మాల్క్యాప్ కంపెనీలకు 10 శాతం చొప్పున కేటాయించింది. గమనిక: సెక్టార్స్ ఫండ్స్/థీమ్యాటిక్ ఫండ్స్ అన్నవి అధిక రిస్క్తో కూడుకుని ఉంటాయి. ఎందుకంటే వైవిధ్యానికి పెద్దగా అవకాశం ఉండదు. సంబంధిత రంగంలోనే పెట్టుబడులు మొత్తం పెట్టడం వల్ల ప్రతికూలతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రత్యేకమైన కాలాల్లో ప్రతికూల రాబడులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం కోసమే ఎంపిక ఉండాలి. అది కూడా మీ మొత్తం పెట్టుబడుల్లో 10 శాతాన్ని మించకుండా చూసుకోవాలి. చదవండి: Mutual Fund Review: హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ బాండ్ ఫండ్ తీరు తెన్నులు -
ఎఫ్వోఎఫ్ లాంచ్ చేసిన ఐసీఐసీఐ ప్రుడెన్నియల్..!
ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ప్యాసివ్ మల్టీ-అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్(ఎఫ్వోఎఫ్) ఆవిష్కరించింది. ఈ ఫండ్ జనవరి 10తో ముగుస్తుంది. కనీసం రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని కింద 25-65 శాతం నిధులను దేశీయంగా ఈక్విటీల్లోను, 25-85 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోనూ, 0-15 శాతం నిధులను బంగారం, 10-80 శాతం మొత్తాన్ని అంతర్జాతీయ సంస్థల షేర్లలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈటీఎఫ్ మార్గంలో పెట్టుబడులు పెడుతుంది. సాధారణంగా ఏ ఆర్ధిక సాధనానికి ఎంత 'మేర ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలో ఇన్వె స్టర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఇన్వెస్టర్లు. ప్యాసివ్ విధానంలో వివిధ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరళతరమైన సాధనంగా ఉపయోగపడుతుందని సంస్థ హెడ్ (ప్రోడక్ట్ డెవలప్మెంట్, స్ట్రాటజీ) చింతన్ హరియాతెలిపారు. దేశీ ఈక్వటీలతో పాటు అంతర్జాతీయ కంపెనీల్లోనూ పెట్టుబడుల వల్ల డైవేర్సిఫికేషన్ మరింత మెరుగ్గా ఉండగలదని పేర్కొన్నారు. ఇతర ఫండ్, పౌస్ల ఈటీఎఫ్లలో కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్కి ఉంటుందని తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఫండ్ దేశంలోనే మొదటే సిల్వర్ ఈటీఎఫ్ను, ఈ నెల 6న ప్రారంభించనుంది. ఇది 19వ తేదీన ముగుస్తుంది. సిల్వర్, సిల్వర్ ఆధారిత సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్ రుణ పత్రాల్లోనూ ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్(ఏడాది కాలం వరకు), సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సిల్వర్. ఈటీఎఫ్ల నిర్వహణ మార్గదర్శకాలను సెబీ గత నవంబర్లో ప్రకటించిన తర్వాత ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఎన్ఫ్వోకు దరఖాస్తు చేసుకుంది. వెండిలో ఇన్వెస్ట్ చేసుకునే వారికి భౌతిక వెండితో పోలిస్తే ఇది మెరుగైన సాధనం అవుతుంది. -
Mutual Fund Review: హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ బాండ్ ఫండ్ తీరు తెన్నులు
ఆర్బీఐ ఇటీవలి సమీక్షలోనూ కీలకమైన రెపో రేటును 4 శాతం వద్దే ఉంచుతూ, సర్దుబాటు విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయించింది. కాకపోతే ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా ఒక్క విడత అయినా రేటును పెంచొచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న దృష్ట్యా.. మూడేళ్ల వరకు స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారికి కార్పొరేట్ బాండ్ ఫండ్స్ అనుకూలమని చెప్పొచ్చు. ఈ విభాగంలో హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ బాండ్ ఫండ్ పనితీరు ఆకర్షణీయంగా, స్థిరంగా కనిపిస్తున్నందున ఇన్వెస్టర్లు దీనిపై ఓసారి దృష్టి సారించొచ్చు. ఎందుకని..? డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను మూడేళ్లు నిండిన తర్వాత వెనక్కి తీసుకుంటే.. వచ్చిన లాభాలపై 20 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసివేసి.. మిగిలిన మొత్తంపైనే పన్ను చెల్లిస్తే చాలు. ఈ రకంగా పన్ను చెల్లించిన తర్వాత రాబడులను పరిశీలించినట్టయితే.. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే కార్పొరేట్ బాండ్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. కాకపోతే ఇందులో రిస్క్ ఉంటుంది. రాబడులు మార్కెట్ ఆధారితమని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ రిస్క్.. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ అన్నవి కనీసం 80 శాతం పెట్టుబడులను అధిక క్రెడిట్ రేటింగ్ కలిగిన నాణ్యమైన కార్పొరేట్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక పోర్ట్ఫోలియో క్రెడిట్ నాణ్యత పెద్దగా మారేదేమీ ఉండదు. అంటే ఈ మేరకు కొంత రక్షణ ఏర్పాటు చేసుకున్నట్టే అవుతుంది. వడ్డీ రేట్ల రిస్క్ను ఇన్వెస్టర్లు గుర్తులో పెట్టుకోవాలి. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో దీర్ఘకాలంతో కూడిన బాండ్లను కలిగి ఉంటే రాబడులపై ప్రభావం పడుతుంది. విధానం.. పనితీరు హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ బాండ్ ఫండ్ అక్రూయల్, డ్యురేషన్ విధానాలను అనుసరిస్తుంది. వడ్డీ రేట్లు పడిపోతున్నాయని.. పెరుగుతున్నాయని గుర్తించినప్పుడు పోర్ట్ఫోలియోలోని పెట్టుబడుల కాలవ్యవధుల్లో మార్పులు చేస్తుంది. దీన్నే డ్యురేషన్ స్ట్రాటజీగా పేర్కొంటారు. అచ్చంగా అక్రూయల్ స్ట్రాటజీతో పోలిస్తే డ్యురేషన్ స్ట్రాటజీ అధిక రాబడులను ఇస్తుంది. ఈ పథకం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు కాలవ్యవధిని పెట్టుబడి సాధనాలకు అమలు చేస్తుంటుంది. 2016 నుంచి చూస్తే కార్పొరేట్ బాండ్ ఫండ్స్ విభాగం ఏడాది, మూడేళ్ల సగటు రోలింగ్ రాబడులు 7.7 శాతంగానే ఉన్నాయి. కానీ, హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ బాండ్ ఫండ్ రాబడులు ఏడాది కాలంలో సగటున 8.4 శాతం, మూడేళ్ల రాబడులు 8.6 శాతం చొప్పున ఉన్నాయి. పదేళ్ల కాలంలో సగటు వార్షిక రాబడి 8.74 శాతంగా ఉండడం గమనార్హం. అయితే డెట్ ఫండ్స్రాబడులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవని గుర్తుంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో నష్టాలను కూడా ఈ పథకం పరిమితం చేస్తుండడం ఆకర్షణీయం. పోర్ట్ఫోలియో ఈ పథకం పెట్టుబడులను గమనిస్తే నాణ్యతకు పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. పోర్ట్ఫోలియోలో 96 శాతం సాధనాలు ఏఏఏ రేటెంగ్ కలిగిన కార్పొరేట్, ప్రభుత్వ డెట్ పేపర్లే ఉన్నాయి. రేటింగ్ పరంగా ఏఏఏ అత్యంత మెరుగైనది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పథకం పోర్ట్ఫోలియోను గమనించినా అత్యంత నాణ్యమైన పేపర్లు 90 శాతానికి పైనే ఉంటూ వస్తున్నాయి. పెట్టుబడుల సగటు మెచ్యూరిటీ 2.74 సంవత్సరాలుగా ఉంది. రేట్లు తిరిగి పెరగడం మొదలైతే ఆ ప్రయోజనాలను సొంతం చేసుకునే అనుకూతలతలు ఈ పథకానికి ఉన్నాయి. చదవండి: Fund Review: స్థిరత్వంతో కూడిన రాబడులు.. మిరే అస్సెట్ లార్జ్క్యాప్ ఫండ్ -
ఐటీఐ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్..
ఐటీఐ మ్యుచువల్ ఫండ్ తాజాగా ఐటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ను ఆవిష్కరించింది. ఇది నవంబర్ 29తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రదీప్ గోఖలే, ప్రతిభ్ అగర్వాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ప్రధానంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రేటింగ్ ఏజెన్సీలు, కొత్త తరం ఫిన్టెక్ సంస్థలు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. నాణ్యమైన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సంస్థ సీఈవో జార్జ్ హెబర్ జోసెఫ్ తెలిపారు. -
ఆదిత్య బిర్లాసన్లైఫ్ నుంచి నిఫ్టీ హెల్త్కేర్ ఈటీఎఫ్
ముంబై: ఆదిత్య బిర్లా సన్లైఫ్ మ్యూచువల్ ఫండ్.. నూతనంగా ‘ఆదిత్య బిర్లా సన్లైఫ్ నిఫ్టీ హెల్త్కేర్ ఈటీఎఫ్’ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. నిఫ్టీ హెల్త్కేర్ టీఆర్ఐ ఇండెక్స్ను అనుసరించి పెట్టుబడులు పెడుతుంది. ఈ నెల 8న మొదలైన ఈ పథకంలో 20వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ (హెల్త్కేర్) రంగంలో ఉన్న అవకాశాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. నిఫ్టీ హెల్త్కేర్ ఇండెక్స్లో 20 వరకు కంపెనీలున్నాయి. వీటిల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఏఎంసీ ఎండీ, సీఈవో ఏ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘ఆదాయం, ఎగుమతులు, ఉపాధి కల్పన పరంగా హెల్త్కేర్ కూడా దేశంలో ఒకానొక ముఖ్య మైన రంగంగా అవతరించింది. ఈ వృద్ధి లిస్టెడ్ కంపెనీల్లోనూ ప్రతిఫలించాల్సి ఉంది. ఇది ప్యాసివ్ పథకం. కనుక వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఈ రంగం వృద్ధిలో పాల్గొనేందుకు ఈ పథకం ఒక చక్కని మార్గం అవుతుంది’’ అని చెప్పారు. -
‘సిప్’కి జై కొడుతున్నారు
ముంబై: ఇంతకాలం చిట్టీలలో పొదుపు చేస్తూ, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడిగా పెట్టిన వారు తమ రూటు మార్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. నెలవారీ చెల్లింపులు చేసే అవకాశం ఉండే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కు క్రమంగా పెరుగుతున్న ఆధారణ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పెరిగిన ఆసక్తి కరోనా సంక్షోభం తర్వాత పొదుపు, పెట్టుబడి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇదే సమయంలో ఇంటర్నెట్ వాడకం కామన్ అయ్యింది. దీంతో టెక్నాలజీని వాడుకుంటూ తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాలను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా మార్చేందుకు రిస్క్ తీసుకుంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువ, అయితే తక్కువ పెట్టుబడితో బ్లూ చిప్ కంపెనీల్లో షేర్ల కొనుగోలు కష్టంగా. దీంతో తక్కువ రిస్క్ కోరుకునే వారు మ్యూచ్వల్ ఫండ్స్కి మొగ్గు చూపేవారు. అయితే ఆగస్టులో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు తగ్గాయి. కేవలం రూ.8,666 కోట్ల రూపాయలే వచ్చాయి. అంతకు ముందు జులైలో ఈ మొత్తం రూ.22,583 కోట్లుగా నమోదు అయ్యింది. జోరుమీదున్న సిప్ నెలవారీగా చిట్టీలు కట్టినట్టు, ప్రతీ నెల ఈఎంఐలు చెల్లించినట్టు మ్యూచవల్స్ ఫండ్స్లో ప్రతీ నెల ఇన్వెస్ట్ చేయడాన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అంటారు. ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఒక సిప్ను ఎంచుకుంటే ప్రతీ నెలా కొంత మొత్తం మన అకౌంట్ నుంచి ఆయా కంపెనీలో పెట్టుబడిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రస్తుతం సిప్లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క ఆగస్టులోనే సిప్కి సంబంధించిన అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏఎమ్యూ) విలువ రూ. 5.26 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మొత్తం సిప్ ఏఎమ్యూ విలువ రూ.17.15 లక్షల కోట్లలో మూడో వంతుగా ఉంది. సిప్లపై చెల్లించే వడ్డీ ఆగస్టులో లైఫ్టైం హైకి చేరుకుని రూ.9,923 కోట్లుగా నమోదు అయ్యింది. ఆగస్టులోనే ఏకంగా 24.92 లక్షల కొత్త సిప్లు మొదలయ్యాయి. మెత్తంగా 4.32 కోట్ల సిప్లు ఉన్నాయి. సిప్లకు సంబంధించి అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్లో 53 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో మ్యూచవల్ ఫండ్స్లో పెట్టుబడులు తగ్గినా సిప్లో ఖాతాలు పెరగడం వల్ల ఓవరాల్గా మ్యూచ్వల్ ఫండ్ మార్కెట్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. 2021 ఆగస్టు నాటికి మ్యూచ్వల్ ఫండ్స్లో పెట్టుబడులు 36.59 లక్షల కోట్లకు చేరుకుని ఆల్టైం హైని టచ్ చేశాయి. చదవండి: ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
ఎస్బీఐ ఎంఎఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్కి సంబంధించి న్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఒడిదుడుకుల ఈక్విటీ మార్కెట్లు పెరిగేటప్పుడు ఒనగూరే అపరిమిత ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు అందించడం, పతనమైనప్పుడు వాటిల్లే నష్టాలను ఓ మోస్తరు స్థాయికి పరిమితం చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల విలువను పెంచడం ఈ ఫండ్ లక్ష్యం. క్రిసిల్ హైబ్రిడ్ 50+50 – మోడరేట్ ఇండెక్స్ టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫర్ ఆగస్టు 25న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. వేల్యు యేషన్లు, ఆదాయాల వృద్ధికి కారణమయ్యే అంశాలు, అధిక రాబడులు అందించగలిగే సామర్థ్యాలు తదితర అంశాల ఆధారంగా ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ సాధనాలు, రీట్స్, ఇన్విట్స్ మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుందని సంస్థ ఎండీ వినయ్ ఎం టోన్సే తెలిపారు. -
రిటైర్మెంట్ ఫండ్: సిప్ను ఎంచుకోవడం బెస్ట్
రిటైర్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్, ఎన్పీఎస్, పీపీఎఫ్ ఇవన్నీ రిటైర్మెంట్కు అనుకూలించే సాధనాలే. వీటిల్లో ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం ఉన్నది ఎన్పీఎస్ ఒక్కటే. సాధారణంగా రిటైర్మెంట్కు సుదీర్ఘకాలం ఉంటుంది. కనుక ఈక్విటీ పెట్టుబడులతో భారీ నిధిని సమకూర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించొచ్చు. ఇందుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈక్విటీ, ఇతర సాధనాలతో కూడిన పెట్టుబడుల విధానంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఎస్బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్ (ఎస్ఆర్బీఎఫ్)’ను ప్రారంభించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 3 వరకు సబ్స్క్రిప్షన్కు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇది పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడుల ఆప్షన్లు.. ఎస్ఆర్బీఎఫ్ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం: అంటే ఇన్వెస్టర్లు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుంటుంది. కాకపోతే ఇందులో చేసే పెట్టుబడులకు ఐదేళ్లపాటు లాకిన్ ఉంటుంది. లేదా 65 ఏళ్లు. ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది. ఈ పథకంలో నాలుగు రకాల పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి. అగ్రెస్సివ్: ఈ ఆప్షన్ ఎంచుకుంటే, ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 80–100 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్: ఈ ఆప్షన్లో ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతం వరకే కేటాయించి, మిగిలిన నిధులను డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా కొంత రిస్క్ను తగ్గించే విధంగా పనిచేస్తుంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్: ఈ ఆప్షన్లో ఈక్విటీ కేటాయింపులు 10 శాతం నుంచి గరిష్టంగా 40 శాతానికే పరిమితం. కన్జర్వేటివ్: ఇందులో ఈక్విటీలకు 20 శాతం పెట్టుబడులు మించనీయదు. బంగారం ఈటీఎఫ్లు, విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రతీ ప్లాన్లో భాగంగా ఉంటుంది. పెట్టుబడుల విధానం ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 50 శాతాన్ని వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్ను ఎంచుకుని, వాటిని దీర్ఘకాలం పాటు కొనసాగించే విధానాన్ని ఈ పథకం అనుసరించనుంది. మిగిలిన ఈక్విటీ పెట్టుబడులను స్థూల ఆర్థిక పరిస్థితులు, బిజినెస్సైకిల్స్, కంపెనీల వ్యాల్యూషన్లు, భారీ రాబడి అవకాశాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ పెట్టుబడులను గౌరవ్ మెహతా, ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుబడులను దినేష్ అహుజా, అంతర్జాతీయ పెట్టుబడులను మోహిత్జైన్ చూడనున్నారు. డెట్ పెట్టుబడులను ఏఏఏ రేటెడ్ కలిగిన పీఎస్యూ, సార్వభౌమ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించాలి. అంటే అధిక భద్రతతో కూడిన డెట్ సాధనాలనే ఈ పథకం ఎంచుకుంటుంది. అందులోనూ 4–7 ఏళ్ల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీలను ఎంచుకుంటుంది. ఇన్వెస్టర్ల వయసును దృష్టిలో పెట్టుకుని నాలుగు రకాల పెట్టుబడి ఆప్షన్లను ఈ పథకంలో ప్రవేశపెట్టారు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంచుకుంటే, ప్రతీ సిప్ పెట్టుబడిపై ఐదేళ్ల లాకిన్ నిబంధన అమలవుతుంది. ఇందులో ఆటో ట్రాన్స్ఫర్ ప్లాన్ కూడా ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ రిస్క్ తక్కువగా ఉండే ఆప్షన్లకు పెట్టుబడులను ఆటోమేటిగ్గా మార్చడం ఇందులో ఉంటుంది. అంటే నాలుగు రకాల పెట్టుబడి ఆప్షన్ల మధ్య మీ మనోభీష్టానికి అనుగుణంగా మారిపోవచ్చు. కానీ, ఇలా మారితే పెట్టుబడులను ఉపసంహరించుకుని, తిరిగి తాజాగా ఇన్వెస్ట్ చేసినట్టు పరిగణిస్తారు. దాంతో మూలధన లాభాల పన్ను పడుతుంది. ఇది నూతన ఫండ్ ఆఫర్ కావడంతో పనితీరు, రాబడులు ఎలా ఉంటాయన్నది ముందే ఊహించడం కష్టం. కొంత కాలం అయితేకానీ పనితీరును అంచనా వేయడం సాధ్యపడదు. కనుక ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని ఎంచుకునేట్టు అయితే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం (లంప్సమ్) కంటే కూడా సిప్ను ఎంచుకోవడం మెరుగైన ఆప్షన్ అవుతుంది. -
‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ షాక్
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ, అకస్మాత్తుగా ఆరు డెట్ ఫండ్స్ను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ప్రభుత్వం నుంచి ప్యాకేజీ మరింత ఆలస్యమవుతుండటం, గిలీడ్ ఔషధం కరోనా చికిత్సలో సత్ఫలితాలనివ్వడం లేదన్న వార్తలు, కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై అంచనాలకు మించిన ప్రభావమే ఉండనున్నదన్న ఆందోళన, గత రెండు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర లాభపడటంతో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం....ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 536 పాయింట్లు క్షీణించి 31,327 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయి 9,154 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతం మేర లాభపడటంతో నష్టాలకు కళ్లెం పడింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్ల మేర నష్టపోయాయి. సెంటిమెంట్పై ‘టెంపుల్టన్’ దెబ్బ.... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఆరు డెట్ స్కీమ్లను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బాగా దెబ్బతీసింది. కరోనా వైరస్ కల్లోలానికి, లాక్డౌన్కు ఇప్పట్లో ఉపశమనం లభించే సూచనలు కనిపించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు 1–2%, యూరప్ మార్కెట్లు ఇదే రేంజ్ నష్టపోయాయి. ఫార్మా షేర్ల పరుగులు.... ఫార్మా షేర్ల పరుగులు కొనసాగుతున్నాయి. అమెరికా ఎఫ్డీఏ నుంచి వివిధ కంపెనీలకు ఆమోదాలు లభించడం, ఇటీవలే వెల్లడైన అలెంబిక్ ఫార్మా ఫలితాలు ఆరోగ్యకరంగా ఉండటం, దీనికి ప్రధాన కారణాలు. అలెంబిక్ ఫార్మా, సన్ ఫార్మా, లారస్ ల్యాబ్స్(ఈ మూడు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి) అల్కెమ్ ల్యాబ్స్, అజంతా ఫార్మా, లుపిన్, ఇప్కా ల్యాబ్స్, జుబిలంట్ లైఫ్ సైన్సెస్, ఎఫ్డీసీ తదితర షేర్లు 2–8 శాతం రేంజ్లో పెరిగాయి. ► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ ఫండ్స్ను మూసేయడంతో ఆర్థిక, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ రంగ షేర్లు క్షీణించాయి. నిప్పన్ ఇండియా షేర్ 18 శాతం నష్టంతో రూ.216కు, హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ 6 శాతం నష్టంతో రూ.2,425కు, శ్రీరామ్ ఏఎమ్సీ 3 శాతం పతనమై రూ.71కు పడిపోయాయి. ► బజాజ్ ఫైనాన్స్ షేర్ 9 శాతం నష్టంతో రూ.1,976 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా రూ.2 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. -
మ్యూచువల్ ఫండ్ ఆస్తులు తగ్గాయ్
న్యూఢిల్లీ: డిసెంబర్ నెలలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు తగ్గుదలను నమోదుచేశాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. గత నెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ చోటుచేసుకుంది. దీంతో ఈ పరిశ్రమలోని 44 సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2% తగ్గి రూ. 26.54 లక్షల కోట్లకు పడిపోయాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు నియంత్రణ సంస్థ సెబీ తీసుకున్న చర్యలతో గతేడాది నవంబర్ నెల్లో మొత్తం నిర్వహణ ఆస్తి గరిష్టంగా రూ. 27.04 లక్షల కోట్లకు చేరుకోవడం తెలిసిందే. కాగా, ఆ సమయంలో భారీగా ఇన్ఫ్లో పెరిగిన రుణ–ఆధారిత పథకాల్లోనే గత నెల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ స్కీముల్లోని లిక్విడ్ ఫండ్స్, నగదు విభాగాల్లోని ట్రెజరీ బిల్లులు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్లు వంటి స్వల్పకాలిక సాధనాల నుంచి రూ. 71,000 కోట్ల మేర ఉపసంహరణ చోటుచేసుకుంది. వీటితో పాటు ఒక రోజులో మెచ్యూర్ అయ్యే ఓవర్ నైట్ ఫండ్స్లో రూ. 8,800 కోట్లు వెనక్కువెళ్లాయి. అయితే, అధిక రేటింగ్ కలిగిన బ్యాంకింగ్ అండ్ పీఎస్యూ ఫండ్స్లో రూ. 4,770 కోట్లు చేరాయి. గత నెల్లో అమ్మకాల వెల్లువకు కారణం రుణ–ఆధారిత పథకాల్లో భారీగా విక్రయాలే అని పైసా బజార్ డాట్ కామ్ కో–ఫౌండర్ అండ్ సీఈఓ నవీన్ కుక్రేజా విశ్లేషించారు. ఈక్విటీ ఆధారిత ఫండ్స్లో జోరు.. గత నెలలో దేశీ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలను తిరగరాసుకుంటూ దూసుకెళ్లిన నేపథ్యంలో ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ రూ. 4,432 కోట్ల ఇన్ఫ్లోను ఆకర్షించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు నిరాశాజనకంగా ఉండడంతో లార్జ్క్యాప్ ఫండ్స్లోకి ప్రవాహం పెరిగిందని కుక్రేజా విశ్లేషించారు. సిప్ సూపర్.. డిసెంబర్లో క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల(సిప్) ద్వారా చేరిన పెట్టుబడులు రూ. 8,518 కోట్లు కాగా, దీంతో సిప్ అసెట్ బేస్ ఏకంగా జీవితకాల గరిష్టానికి చేరింది. గతనెల చివరినాటికి అసెట్ బేస్ రూ. 3.17 లక్షల కోట్లకు పెరిగింది. రిటైల్ ఇన్వెస్టర్లలో ఫండ్స్పై విశ్వాసం పెరిగినందున సిప్ పెట్టుబడులు జోరందుకుంటున్నాయని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్.ఎస్.వెంకటేష్ అన్నారు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూ. 27 కోట్లను ఆకర్షించాయి. -
మ్యూచువల్ ఫండ్ ఏయూఎంలో 13 % వృద్ధి
న్యూఢిల్లీ: గతేడాదిలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు జోరుమీద కొనసాగాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తీసుకున్న చర్యల నేపథ్యంలో భారీ స్థాయి పెట్టుబడులను ఆకర్షించాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) గతేడాదిలో రూ. 3.15 లక్షల కోట్లు (13 శాతం వృద్ధి) పెరిగాయి. దీంతో అంతక్రితం ఏడాది (2018)లో రూ. 23.62 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం పరిశ్రమ నిర్వహణ ఆస్తి.. గత నెల చివరినాటికి రూ. 26.77 లక్షల కోట్లకు చేరుకుంది. -
భారత్ బాండ్.. ఇన్వెస్ట్ చేస్తున్నారా?
భారత్ బాండ్ ఈటీఎఫ్.. నూతన మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 12న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రిస్క్ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఇష్యూను పరిశీలించొచ్చు. ఈ ఇష్యూ ద్వారా కనీసం రూ.7,000 కోట్ల వరకు సమీకరించాలన్నది ప్రణాళిక. దేశంలో తొలి కార్పొరేట్ బాండ్ ఫండ్ ఇదే అవుతుంది. ఈ ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే, అప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా? అన్నది ఇన్వెస్టర్లు సులభంగా నిర్ణయించుకోగలరు. ఆ వివరాలు అందించే ‘ప్రాఫిట్’ కథనమే ఇది. ∙ భారత్ బాండ్ ఈటీఎఫ్ను కేంద్రం తీసుకురావడం వెనుక లక్ష్యాలను పరిశీలిస్తే.. దేశీయ డెట్ మార్కెట్లో లిక్విడిటీని మరింత పెంచడం ఒకటి. రిటైల్ ఇన్వెస్టర్లు సులభంగా పాలు పంచుకునేలా చేయడం రెండోది. తక్కువ ఖర్చుకే బాండ్ ఈటీఎఫ్ను అందించడం.. ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను కొంచెం తక్కువ రేటుకే పొందే మార్గం కల్పించడం మరొకటి. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లు ప్యాసివ్ (క్రియాశీలకం కాని) పనితీరుతో కూడినవి. అవి ఒక ఇండెక్స్ను అనుసరిస్తుంటాయి. రాబడులు కూడా ఆ ఇండెక్స్కు అనుగుణంగానే ఉంటాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్కు సంబంధించి భారత్ బాండ్ ఇండెక్స్– ఏప్రిల్ 2023, భారత్ బాండ్ ఇండెక్స్ – ఏప్రిల్ 2030 సూచీలను ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఈటీఎఫ్లకు భారత్ బాండ్ ఈటీఎఫ్కు మధ్య వ్యత్యాసం.. భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లతో కూడి ఉండడమే. మిగతాదంతా ఇతర ఈటీఎఫ్ల్లో మాదిరే ఉంటుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ మూడేళ్లు (ఏప్రిల్ 2023), పదేళ్లు (ఏప్రిల్ 2030) కాల వ్యవధితో రెండు రకాలుగా ఉంటుంది. కాల వ్యవధి తీరిన తర్వాత అసలు పెట్టుబడి, ఆ మొత్తంపై వడ్డీ రాబడి చెల్లిస్తారు. ఇందులో కేవలం గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది. రాబడులను ఎప్పటికప్పుడు చెల్లించే డివిడెండ్ ఆప్షన్ లేదు. ఎడెల్వీజ్ ఏఎంసీ ఈ ఈటీఎఫ్ నిర్వహణను చూస్తోంది. ఇది ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ కనుక ఇష్యూ ఈ నెల 20న ముగిసినప్పటికీ.. తర్వాత స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడవుతుంటాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ చేయనున్నారు. లిస్ట్ అయిన తర్వాత యూనిట్ల రూపంలో కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. కనుక ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు లావాదేవీలకు అర్హులు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక యూనిట్ (రూ.1,000) నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ‘భారత్బాండ్ డాట్ ఇన్’ పోర్టల్కు వెళ్లి ఎన్ఎఫ్వో ఆఫర్ పత్రాన్ని పొందొచ్చు. దీనిని సమీపంలోని ఎడెల్వీజ్ కార్యాలయంలో సమర్పించడం ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇష్యూ సైజు మూడేళ్ల ఈటీఎఫ్ రూపంలో కనీసం రూ.3,000 కోట్లు, స్పందనను బట్టి అదనంగా మరో రూ.2,000 కోట్లు సమీకరించాలన్నది ప్రణాళిక. అలాగే, పదేళ్ల ఈటీఎఫ్ ద్వారా కనీసం రూ.4,000 కోట్లు, స్పందన అధికంగా ఉంటే మరో రూ.2,000 కోట్ల వరకు సమీకరించనున్నారు. భద్రత ఎక్కువే... భారత్ బాండ్ ఈటీఎఫ్ కచ్చితంగా ఏఏఏ రేటింగ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీల డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనుక భద్రతకు ఢోకా ఉండదు. ఏఏఏ రేటింగ్ తిరిగి చెల్లింపుల విషయంలో అధిక భద్రతను సూచిస్తుంది. అంటే క్రెడిట్ రిస్క్ చాలా చాలా తక్కువ. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. కనుక పెట్టుబడులకు ఎటువంటి రిస్క్ ఉండదు. పన్ను ఎంతో తక్కువ మూడేళ్లకు పైగా పెట్టుబడులను కొనసాగిస్తే, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే పన్ను ఎంతో తక్కువ. ఇన్వెస్టర్ల రిస్క్ ప్రొఫైల్కు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. కన్జర్వేటివ్ (రిస్క్ తీసుకోని) ఇన్వెస్టర్లు 20–22 శాతం పెట్టుబడులను భారత్ బాండ్ ఈటీఎఫ్కు కేటాయించుకోవచ్చు. ఏఏఏ రేటింగ్ రాబడులు, రిస్క్ లేని సాధనం. – పవన్ అగర్వాల్, ప్రైవేటు వెల్త్ (ఇండియా నివేష్) ఎండీ అన్ని విధాలా అనుకూలం అత్యంత చౌక బాండ్ ఫండ్ ఇది. çఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే బయటకు వచ్చేందుకు మూడేళ్లు ఆగాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫండ్ విషయంలో ఎక్సే్ఛంజ్ల్లో రోజువారీగా లిక్విడిటీ ఉంటుంది. రాబడులు, పన్ను, లిక్విడిటీ ఇలా అన్ని అంశాల్లోనూ సంప్రదాయ మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే దీనికి ఎక్కువ మార్క్లు పడతాయి. – నితిన్ జైన్, ఎడెల్వీజ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో రాబడులు/చార్జీలు ఈటీఎఫ్లకు నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లుగా నిర్ణయించారు. కనుక వీటిల్లో రాబడులను సుమారుగా ఊహించొచ్చు. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఎన్ఎఫ్వో డాక్యుమెంట్ ప్రకారం.. ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసి కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఈటీఎఫ్లో కొనసాగితే అప్పుడు.. 2023 ఈటీఎఫ్లో వార్షిక రాబడులు 6.59 శాతం, 2030 ఈటీఎఫ్లో వార్షిక రాబడులు 7.52 శాతం వరకు ఉంటాయి. ఈ రాబడులు గ్యారంటీ కావు. కేవలం సూచనీయమైనవి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో రాబడులకు ఎప్పుడూ హామీ ఉండదు. సూచిత రాబడులను రోజువారీగా ఎడెల్వీజ్ ఏఎంసీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో (పెట్టుబడులపై వసూలు చేసే నిర్వహణ చార్జీ) కేవలం 0.0005 శాతమే. దేశంలో అత్యంత చౌక మ్యూచువల్ ఫండ్ ఇది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత చౌక చార్జీలతో కూడిన డెట్ ఫండ్ కూడా అవుతుంది. డెట్ ఫండ్స్లో రాబడులు తక్కువగా ఉంటాయి కనుక ఎక్స్పెన్స్ రేషియో చాలా కీలక పాత్రే పోషిస్తుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ చార్జీల పరంగా ఎంతో చౌక కనుక నికర రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఈటీఎఫ్లపై రాబడులు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇవే కాల పరిమితుల డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న రేట్ల స్థాయిలోనే ఉంటాయని భావించొచ్చు. ఇక ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 30 రోజుల్లోపు వైదొలిగితే అప్పుడు 0.10 శాతం ఎగ్జిట్లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడిటీ... ఒక సాధనంలో పెట్టుబడి, రాబడులతోపాటు అవసరమైన సందర్భాల్లో వేగంగా వాటిని నగదుగా మార్చుకునే సౌలభ్యం (లిక్విడిటీ) ఉండాలి. అప్పుడే అది ఇన్వెస్టర్లకు సౌకర్యంగా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఎఫ్డీల్లో ఇన్వెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణాల్లో లిక్విడిటీ కూడా ఒకటి. మన దేశంలో చాలా వరకు డెట్ ఈటీఎఫ్ల్లో ట్రేడింగ్ స్వల్పంగానే ఉంటోంది. అయితే, పెద్ద సైజు ఈటీఎఫ్ల్లో ట్రేడింగ్ యాక్టివిటీ చురుగ్గానే ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు భారత్ బాండ్ ఈటీఎఫ్ రూ.7,000 కోట్లకుపైనే సమీకరించనున్న దృష్ట్యా లిక్విడిటీ తగినంత ఉంటుందని ఆశించొ చ్చు. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్లలో తగినంత లిక్విడిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎడెల్వీజ్ ఏఎంసీ చెబుతోంది. ఇందు కోసం పలువురు మార్కెట్ మేకర్లను నియమించనున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. వీరు తగినంత లిక్విడిటీతోపాటు ధర సహేతుకంగా ఉండేలా చూస్తారు. మార్కెట్ మేకర్ల కోసం రూ.20 కోట్లను వెచ్చించేందుకు ఏఎంసీలకు అనుమతి ఉంది. పైగా ఇందులో రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చిన్న మొత్తం కావడంతో లిక్విడిటీ మెరుగ్గానే ఉంటుందని అంచనా. వాస్తవంగా లిక్విడిటీ ఏ మేరకు అన్నది ఈటీఎఫ్ లిస్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఎడెల్వీజ్ ఏఎంసీ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) రకాన్ని కూడా తీసుకురానుంది. ఇది భారత్ బాండ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వారికి లిక్విడిటీ పరంగా ఇబ్బందేమీ ఉండదు. ఇతర డెట్ ఫండ్ పథకాల మాదిరే అవసరమైనప్పుడు విక్రయించి పెట్టుబడులు వెనక్కి తీసేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ లేని వారు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అనుకూలమేనా..? డెట్ ఫండ్ విభాగంలో సంక్షోభాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో అధిక క్వాలిటీ పోర్ట్ఫోలియోతో, ఊహించతగ్గ రాబడులతో, తక్కువ ఖర్చుతో కూడిన భారత్ బాండ్ ఈటీఎఫ్ అనుకూలమే. నిర్ణీత కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించొచ్చు. మూడేళ్లతో పోలిస్తే పదేళ్ల ఈటీఎఫ్లో తొలినాళ్లలో రేట్ల పరంగా అస్థిరత కొంత ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పదేళ్ల కాలంలో వడ్డీ రేట్ల పరంగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ కొనసాగించే వారు ఆందోళన చెందక్కర్లేదు. తక్కువ క్రెడిట్ రిస్క్, అతి తక్కువ నిర్వహణ చార్జీలతో కూడిన కార్పొరేట్ డెట్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది. కొనుగోలు చేసి పూర్తి కాలం పాటు కొనసాగితే వడ్డీ రేట్ల రిస్క్ కూడా ఉండదు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు, పదవీ విరమణ చేసిన వారు, భారత్ బాండ్ ఈటీఎఫ్ల కాల వ్యవధి వరకు కొనసాగేవారు పెట్టుబడులను పరిశీలించొచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల్లో వైవిధ్యానికి ఇది ఉపకరిస్తుంది. పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఒకే విభాగంలో (ఈక్విటీ లేదా రియల్టీ) ఇన్వెస్ట్ చేయడం రిస్క్ కోణంలో సూచనీయం కాదు. డెట్లోనూ కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకో వాలన్నది నిపుణుల మాట. అందుకోసం భారత్ బాండ్ ఈటీఎఫ్ను పరిశీలించొచ్చు. తమ పెట్టుబడుల్లో 10–20 శాతం మేర భారత్ బాండ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను ప్రయోజనాలు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మూడేళ్ల పాటు కొనసాగితే, ద్రవ్యోల్బణ ప్రభావ మినహాయింపు (ఇండెక్సేషన్)ను పొందే అవకాశం ఉంటుంది. మూడేళ్లపైన మూలధన రాబడులపై 20 శాతం పన్ను అమలవుతుంది. అంటే మూలధన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాతే 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి వ్యక్తిగత ఆదాయంలో కలసి, నిర్ణీత శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రాబడి ఎఫ్డీల స్థాయిలో ఉన్నా కానీ, పన్ను ఆదా పరంగా బాండ్ ఈటీఎఫ్ అదనపు ప్రయోజనం. ప్రారంభంలో ఇన్వెస్ట్ చేసిన వారికి మూడేళ్ల ఈటీఎఫ్పై నాలుగేళ్ల ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. దీంతో పన్ను అనంతర రాబడులు అధికంగా ఉంటాయని ఆశించొచ్చు. మూడేళ్ల బాండ్ ఈటీఎఫ్లో పన్ను అనంతరం రాబడులు 6.3%, పదేళ్ల ఈటీఎఫ్లో పన్ను అనంతర రాబడులు 7 శాతంగా ఉంటాయని అంచనా. పారదర్శకత రోజువారీగా పోర్ట్ఫోలియో, ఇండికేటివ్ రిటర్నులు (సూచిత రాబడులు) ఎంత మేర అన్న వివరాలను ఎడెల్వీజ్ ఏఎంసీ తన వెబ్సైట్లో ప్రదర్శించనుంది. అదే సంప్రదాయ డెట్ ఫండ్స్ నెలకోసారి మాత్రమే పోర్ట్ఫోలియో వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటితో పోలిస్తే భారత్ బాండ్ ఈటీఎఫ్లో పారదర్శకత ఎక్కువే. -
బాండ్లలో స్థిరమైన రాబడుల కోసం
ఆర్బీఐ ఇప్పటి వరకు 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించి, తాజా పాలసీలో యథాతథ స్థితికి మొగ్గు చూపించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు నియంత్రణ తప్పొచ్చన్న ఆందోళనలు, అంతర్జాతీయంగా అనిశ్చితి ఇవన్నీ దేశీయ బాండ్ మార్కెట్పై ప్రభావం చూపించేవే. కనుక ఈ రిస్క్లను అధిగమించేందుకు ఇన్వెస్టర్లు (తక్కువ నుంచి మోస్తరు రిస్క్ తీసుకునే వారు) షార్ట్, మీడియం టర్మ్ డెట్ ఫండ్స్ (స్వల్ప కాలం నుంచి మధ్య కాల ఫండ్స్)ను పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ – మీడియం టర్మ్ ప్లాన్ (ఎంటీపీ) మంచి పనితీరుతో అగ్ర స్థానంలో ఉంది. రాబడులు..: ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ ఎంటీపీ గత ఐదేళ్ల పనితీరును గమనించినట్టయితే.. వార్షికంగా 8 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. కానీ, మీడియం టర్మ్ డెట్ విభాగం సగటు రాబడులు ఇదే కాలంలో 7.5 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ ఎంటీపీ వార్షికంగా 7.2 శాతం రాబడులను ఇవ్వగా, ఈ విభాగం సగటు రాబడులు కేవలం 5.9 శాతంగానే ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 11 శాతం రాబడులతో అద్భుత పనితీరు చూపించింది. కానీ, ఈ విభాగం రాబడులు 5.9 శాతం వద్దే ఉన్నాయి. ఏడాది నుంచి ఐదేళ్ల కాలంలో మీడియం టర్మ్ బాండ్ ఫండ్ విభాగం కంటే ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్– ఎంటీపీ పనితీరు ఎంతో మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల విధానం సెబీ మార్గదర్శకాల ప్రకారం మీడియం టర్మ్ బాండ్ ఫండ్స్ మూడు నుంచి నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్ వడ్డీ రేట్ల రిస్క్ను అధిగమించే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక బాండ్లతో పోలిస్తే మీడియం టర్మ్ బాండ్లు వడ్డీ రేట్ల పరంగా తక్కువ అస్థిరతలతో ఉంటుంటాయి. ఐడీఎఫ్సీ బాండ్ ఫండ్ ఎంటీపీ ప్రధానంగా ఏఏఏ రేటింగ్ కలిగిన సౌర్వభౌమ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. క్రెడిట్ రిస్క్ వాతావరణం అననుకూలంగా ఉన్న సమయాల్లో అధిక రేటింగ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ తరహా మ్యూచువల్ ఫండ్ పథకాలను పెట్టుబడుల పరంగా భద్రతగా భావించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ విభాగాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ పథకం ఐడీఎఫ్సీ సూపర్ సేవర్ ఇన్కమ్ ఫండ్ – మీడియం టర్మ్ ప్లాన్ పేరుతో కొనసాగింది. రెండు నుంచి నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీల్లోనే ఈ పథకం ఇన్వెస్ట్ చేయడం వల్ల అస్థిర మార్కెట్లలోనూ మంచి పనితీరు చూపించగలిగింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్ఫోలియోలో 42.8 శాతం కేంద్ర ప్రభుత్వం బాండ్లు, 50.4 శాతం మేర ఏఏఏ రేటింగ్ కార్పొరేట్ బాండ్లు ఉన్నాయి. -
మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి ముత్తూట్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) ముత్తూట్ ఫైనాన్స్ కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రూ.215 కోట్లతో ఐడీబీఐ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఐడీబీఐ ఏఎంసీ), ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ కంపెనీలో నూరు శాతం ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఈ డీల్కు సెబీ తదితర నియంత్రణ సంస్థల ఆమోదం అవసరమని, వచ్చే ఫిబ్రవరి నాటికి కొనుగోలు పూర్తవుతుందని పేర్కొంది. ఐడీబీఐ ఏఎంసీ 2010లో ఏర్పాటు కాగా, రూ.5,300 కోట్ల పెట్టుబడులు నిర్వహణలో ఉన్నాయి. -
మహీంద్రా కొత్త ఈక్విటీ స్కీం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ‘టాప్ 250 నివేష్ యోజన’ పేరుతో కొత్త ఈక్విటీ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీం డిసెంబరు 6న ప్రారంభమై అదే నెల 20న ముగుస్తుంది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధ సెక్యూరిటీల్లో 80 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ఎండీ అశుతోష్ బిష్ణోయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. లార్జ్, మిడ్ క్యాప్ కంపెనీల్లో 65 శాతం వరకు ఈ పెట్టుబడి ఉంటుందని చెప్పారు. 20 శాతం వరకు డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. కంపెనీ నుంచి ఇది ఎనిమిదవ పథకం. మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఏడు ఈక్విటీ పథకాల్లో రాబడులు 17–20 శాతం ఉన్నాయని ఆయన వెల్లడించారు. -
అంతా ఆ బ్యాంకే చేసింది..!
లేహ్: ఆల్టికో క్యాపిటల్లో సంక్షోభానికి ఓ ప్రైవేటు బ్యాంకు స్వార్ధపూరిత వైఖరే కారణమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలు సమకూర్చే బ్యాంకింగేతర ఆరి్థక సంస్థ ఆల్టికో క్యాపిటల్ దేశీయ బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్కు తాజా ఎన్పీఏగా మారే ప్రమాదం వచ్చి పడింది. దీనికి కారణం సదరు సంస్థ గత వారం ఈసీబీ రుణంపై రూ.20 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఓ ప్రైవేటు బ్యాంకు తన రుణాలను కాపాడుకునేందుకు ఆల్టికో ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ (ఫిక్స్డ్ డిపాజిట్)ని సర్దుబాటు చేసుకుంది. దీన్ని ఏక్షపక్ష నిర్ణయంగా రజనీష్ కుమార్ పేర్కొన్నారు. తన సొంత డబ్బులను కాపాడుకునేందుకు అనుసరించిన ఈ చర్య విస్తృతమైన ఆరి్థక వ్యవస్థకు సమస్యలు తెచి్చపెడుతుందన్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు మొత్తంగా రూ.4,500 కోట్ల మేర ఆల్టికో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే, వడ్డీ చెల్లింపుల్లో విఫలం కావడం గత వారమే మొదటి సారి చోటు చేసుకుంది. లేహ్ వచి్చన సందర్భంగా దీనిపై రజనీష్ కుమార్ మీడియా సమక్షంలో స్పందించారు. ‘‘ఏదైనా బ్యాంకు స్వార్ధపూరిత వైఖరి తీసుకుంటే మిగిలిన వ్యవస్థపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రూ.50–100 కోట్ల ఎక్స్పోజర్ను మీరు తీసేసుకుని మీ డబ్బులను కాపాడుకున్నామని సంతోషపడొచ్చు. కానీ, మీరు వ్యవస్థను పాడు చేస్తే అది సరైన విధానం కాదు. పెద్ద కంపెనీల విషయంలోనూ ఓ బ్యాంకు ట్రిగ్గర్ నొక్కితే లేదా రుణాల సరఫరాను నిలిపివేస్తే ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది’’ అని రజనీష్ కుమార్ వివరించారు. సమష్టిగా వ్యవహరించాలి... బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించడం ద్వారా మొత్తం ఆరి్థక వ్యవస్థను కాపాడవచ్చన్నారు రజనీష్ కుమార్. అతిపెద్ద ఎన్పీఏ కేసుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆల్టికో క్యాపిటల్ యూఏఈకి చెందిన మాష్రెక్ బ్యాంకుకు రూ.660 కోట్లు, ఎస్బీఐకి రూ.400 కోట్లు, యూటీఐ మ్యూచువల్ ఫండ్కు రూ.200 కోట్లు, రిలయన్స్ నిప్పన్ ఏఎంసీకి రూ.150 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉందని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. గత వారం మాష్రెక్ బ్యాంకుకు రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమవడమే సంక్షోభానికి కారణం. ఈ నెల 3న ఆల్టికో రేటింగ్ను ఇండియా రేటింగ్స్, కేర్ రేటింగ్స్ జంక్ కేటగిరీకి డౌన్గ్రేడ్ చేశాయి. క్లియర్వాటర్ క్యాపిటల్ పార్ట్నర్స్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్, వర్దే పార్ట్నర్స్ ఈ సంస్థకు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
‘యస్’ ఓవర్నైట్ ఫండ్
న్యూఢిల్లీ: యస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తాజాగా ఓవర్నైట్ ఫండ్ పేరుతో మరో కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా సమీకరించిన నిధులను ఒక్క రోజు వ్యవధి ఉండే టీఆర్ఈపీఎస్, ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్స్ తదితర సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందులో తక్కువ రిస్కు, అధిక లిక్విడిటీ వెసులుబాటు ఉంటుంది. తదనుగుణంగానే రాబడులు కూడా ఉంటాయి. ఆగస్టు 23తో ఈ న్యూ ఫండ్ ఆఫర్ ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1,000. ఎంట్రీ,ఎగ్జిట్ లోడ్ లేదు. డెట్ స్కీమ్– ఓవర్నైట్ ఫండ్ విభాగంలో ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. -
డీఎస్పీ నుంచి హెల్త్కేర్ ఫండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ తాజాగా హెల్త్కేర్కి సంబంధించి కొత్త ఫండ్ ఆఫర్ను ఆరంభించింది. నవంబర్ 12న ప్రారంభమైన ఈ ఫండ్ ఆఫర్ వ్యవధి నవంబర్ 26 దాకా ఉంటుంది. ఈ ఫండ్ సుమారు రూ.500 కోట్ల దాకా పెట్టుబడులు (ఏయూఎం) సమీకరించే అవకాశం ఉందని ఫండ్ మేనేజర్ ఆదిత్య ఖేమ్కా తెలిపారు. ఈ ఫండ్ సుమారు 20–25 హెల్త్కేర్, ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందన్నారు. ‘‘లార్జ్క్యాప్ కన్నా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాం. ఈ షేర్లు ఇప్పటికే గణనీయంగా క్షీణించి ఆకర్షణీయమైన రేటుకు లభిస్తుండటమే దీనికి కారణం. ఇవైతే భవిష్యత్లో మెరుగైన రాబడులు అందించగలవు’’ అని ఖేమ్కా వివరించారు. ఫండ్లో సుమారు పాతిక శాతాన్ని అటు అంతర్జాతీయంగా అమెరికన్ మార్కెట్లో కూడా హెల్త్కేర్, ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయనుండటం ఈ ఫండ్ ప్రత్యేకతగా ఆదిత్య వివరించారు. డాలర్, రూపాయి మారకంలో వ్యత్యాసాల కారణంగా కరెన్సీపరమైన ప్రయోజనాలు కూడా చేకూరగలవన్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాలు, పెరుగుతున్న జనాభా అవసరాలు దేశీయంగా ఫార్మా, హెల్త్కేర్ సంస్థలకు సానుకూలంగా ఉండగలవని తెలిపారు. ఆటుపోట్లు కొనసాగవచ్చు .. సార్వత్రిక ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో రాబోయే ఆరు నెలలు మార్కెట్లలో ఆటుపోట్లు కొనసాగవచ్చని ఆదిత్య వివరించారు. ఫార్మా రంగంలో తీవ్ర పోటీ వల్ల ధరల పరమైన ఒత్తిళ్లు, నియంత్రణ సంస్థల నిబంధనలు తదితర సవాళ్లు ఉండొచ్చని పేర్కొన్నారు. రూపాయి పతనం ప్రయోజనాల ప్రభావం .. కంపెనీల ఖాతాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ఆఖర్లో కనిపించవచ్చని చెప్పారు. -
కార్పొరేట్ గవర్నెన్స్ కట్టుదిట్టం!
ముంబై: కంపెనీల్లో కార్పొరేట్ నైతికతను (గవర్నెన్స్) మరింత కట్టుదిట్టం చేసేలా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక సంస్కరణలకు తెరతీసింది. దీనికి సంబంధించి ఉదయ్ కోటక్ కమిటీ చేసిన సిఫార్సులను బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదించింది. అదే విధంగా లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును రెండుగా విభజించడం, మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పథకాలపై అదనపు చార్జీలను తగ్గించడం, ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్ను మరింత పటిష్టం చేయడం, కంపెనీల టేకోవర్ నిబంధనల్లో సవరణలు, స్టార్టప్లకు మరిన్ని నిధులు వచ్చేలా చూడటం వంటి పలు ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. 80లో 40 సిఫార్సులకు పూర్తిగా ఆమోదం... కార్పొరేట్ గవర్నెన్స్కు సంబంధించి కోటక్ కమిటీ మొత్తం 80 సిఫార్సులు చేయగా... వాటిలో 80 శాతాన్ని సెబీ ఆమోదించింది. 40 సిఫార్సులనైతే యథాతథంగా ఆమోదించామని బోర్డు సమావేశం అనంతరం సెబీ చైర్మన్ అజయ్ త్యాగి విలేకరులతో చెప్పారు. మరో 15 సిఫార్సులను కొద్ది మార్పులతో ఆమోదించామన్నారు. ఇక ఎనిమిదింటిని ప్రభుత్వ, ఇతర విభాగాల పరిశీలనకు పంపామని, 18 సిఫార్సులను పక్కనబెట్టామని వెల్లడించారు. కీలక సమాచారాన్ని ప్రమోటర్లు, ముఖ్యమైన ్న షేర్హోల్డర్లతో పంచుకునే ప్రతిపాదన వంటివి పక్కనబెట్టినవాటిలో ఉన్నాయి. సెబీ ఆమోదించిన నిర్ణయాలివీ... ♦ లిస్టెడ్ కంపెనీల్లో సీఎండీ పోస్టును సీఈఓ/ఎండీ, చైర్మన్గా విభజించనున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) ఆధారంగా టాప్– 500 లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తారు. ♦ 2019 ఏప్రిల్ 1 కల్లా టాప్–500 లిస్టెడ్ కంపెనీలన్నీ కచ్చితంగా కనీసం ఒక స్వతంత్ర మహిళా డైరెక్టర్ను నియమించాల్సి ఉంటుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి టాప్–1000 లిస్టెడ్ కంపెనీలకు దీన్ని అమలు చేస్తారు. ♦ టాప్–1000 లిస్టెడ్ కంపెనీల్లో 2019 ఏప్రిల్ 1 నుంచి కనీసం ఆరుగురు డైరెక్టర్లు ఉండాలి. 2020 ఏడాది ఏప్రిల్1 నుంచి ఈ నిబంధనను టాప్–2000 లిస్టెడ్ కంపెనీలకు వర్తింపజేస్తారు. ♦ ఒక వ్యక్తి ఎనిమిది లిస్టెడ్ కంపెనీల వరకూ మాత్రమే డైరెక్టర్గా ఉండొచ్చుననే నిబంధన ఏప్రిల్ 1, 2019 నుంచి అమల్లోకి వస్తుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి దీన్ని ఏడుకు తగ్గిస్తారు. ప్రస్తుతం ఒక వ్యక్తి 10 కంపెనీల్లో డైరెక్టర్ పదవిలో ఉండేందుకు అవకాశం ఉంది. ♦ స్వతంత్ర డైరెక్టర్ల అర్హత , ఆడిట్, రెమ్యూనరేషన్ (పారితోషికం), రిస్క్ మేనేజ్మెంట్ కమిటీల్లో మరింత పాత్ర ఉండేవిధంగా నిబంధనల్లో మార్పు చేశారు. లిస్టింగ్ నిబంధనలు కఠినతరం... స్టాక్ మార్కెట్లో కంపెనీల లిస్టింగ్ నిబంధనలను కూడా సెబీ మార్చనుంది. ముఖ్యంగా ప్రమోటర్ల వాటాలను ఫ్రీజ్ చేయడం, నిబంధనలను సరిగ్గా పాటించని కంపెనీల షేర్లలో ట్రేడింగ్ సస్పెండ్ చేయటం వంటి కఠిన చర్యలు ఇందులో ఉన్నాయి. ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్ను బలోపేతం చేసేందుకు కూడా సెబీ కార్యాచరణను ప్రకటించింది. స్టాక్ డెరివేటివ్స్లో ఫిజికల్ సెటిల్మెంట్ను విడతలవారీగా ఒక క్రమపద్ధతిలో అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్, ప్రిఫరెన్షియల్ ఇష్యూల ద్వారా సమీకరించే నిధులను ఎలా వినియోగించారనే సమాచారాన్ని కంపెనీలు ఇకపై కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఆడిటర్ల వివరాలు, వాళ్లకిచ్చే ఫీజు, రాజీనామా చేస్తే దానికి గల కారణాలతో పాటు డైరెక్టర్ల నైపుణ్యం, అనుభవం వంటి అంశాలన్నీ కంపెనీలు కచ్చితంగా బహిర్గతం చేయాలి. లిస్టెడ్ కంపెనీలు, వాటికి సంబంధించిన అన్లిస్టెడ్ సంస్థల్లో సెక్రటేరియల్ ఆడిట్ కూడా ఇకపై తప్పనిసరి కానుంది. అదేవిధంగా లిస్టెడ్ కంపెనీలన్నీ 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి కన్సాలిడేటెడ్ త్రైమాసిక ఫలితాలను కచ్చితంగా ప్రకటించాల్సి ఉంటుంది. కంపెనీల విలీనాలు, టేకోవర్ ఒప్పందాల విషయంలో కంపెనీలు తమ ఓపెన్ ఆఫర్ ధరను పెంచేందుకు వీలుగా అదనపు గడువును ఇచ్చేందుకు కూడా సెబీ ఓకే చెప్పింది. ‘దివాలా’ కంపెనీలకు కఠిన నిబంధనలు..! దివాలా చట్టం (ఐబీసీ) ప్రకారం ఈ ప్రక్రియలో ఉన్న లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి నిబంధనలను సవరించాలని సెబీ నిర్ణయించింది. సంబంధిత కంపెనీల్లో కనీస పబ్లిక్ వాటా, ఎక్సే్ఛంజీల్లో ట్రేడింగ్, ప్రమోటర్ల పునర్విభజన వంటి అంశాల్లో అదనంగా మరింత సమాచారాన్ని వెల్లడించడం వంటివి ఇందులో ఉన్నాయి. బోర్డు సమావేశం తర్వాత దీనికి సంబంధించి చర్చా పత్రాన్ని విడుదల చేసింది. మొండిబకాయిల సమస్య కారణంగా ఇటీవలి కాలంలో దివాలా చట్టం కింద పరిష్కార కేసులు పెరిగిపోవడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. ఇక కంపెనీలు రుణ బకాయిల చెల్లింపులో విఫలమైతే(డిఫాల్ట్) ఒక్కరోజులోపే(పనిదినం) దీన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించాలని గతంలో విధించిన నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని త్యాగి చెప్పారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చినప్పటికీ బ్యాంకుల అభ్యర్థన మేరకు వెంటనే దీన్ని సెబీ వాయిదా వేసింది. ఫండ్స్లో అదనపు చార్జీలకు కోత.. మ్యూచువల్ ఫండ్ సలహా కమిటీ (ఎంఏఏసీ) సిఫార్సులు, గణాంకాల ఆధారంగా ఎం ఎఫ్ స్కీములపై ఇప్పుడున్న 20 బేసిస్ పాయింట్ల అదనపు చార్జీలను 5 బేసిస్ పాయింట్లకు (గరిష్ట పరిమితి) తగ్గిస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఎంఎఫ్ స్కీములకు సంబంధించి 5 శాతం ఎగ్జిట్ లోడ్కు బదులుగా రోజువారీ నికర అసెట్ విలువపై (ఏఎన్వీ) 20 బేసిస్ పాయింట్ల వరకూ అదనపు చార్జీలను ఫండ్ సంస్థలు వసూలు చేసేందుకు గతంలో సెబీ అనుమతించింది. అయితే, ఫండ్ ఫథకాలను మరింత మందికి చేరువ చేయడం కోసం ఇప్పుడీ అదనపు చార్జీలో 15 బేసిస్ పాయింట్లను తగ్గించాలని నిర్ణయించింది. 100 బేసిస్ పాయింట్లను 1%గా లెక్కిస్తారు. కో–లొకేషన్ ఇక అందరికీ... స్టాక్ ఎక్సే్ఛంజీలు తమ ట్రేడింగ్ సభ్యులందరికీ కో–లొకేషన్ సదుపాయాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సెబీ స్పష్టం చేసింది. అదేవిధంగా కొన్ని సేవలను ఉచితంగా కూడా అందించాలని పేర్కొంది. ఎక్సే్ఛంజీలు కల్పిస్తున్న కో–లొకేషన్ సదుపాయం వల్ల ట్రేడింగ్ డేటా వేగంగా ట్రాన్స్ఫర్ అయ్యే వీలుంటుంది. నాన్ కో–లొకేటర్ సభ్యులకు (బ్రోకరేజీ సంస్థలు) ఈ అవకాశం లేదు. కో–లొకేషన్ సేవల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో (సర్వర్ల వాడకం, ఇతరత్రా చార్జీలు) చిన్న బ్రోకరేజీ సంస్థలకు ఇది అందుబాటులో లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇకపై కో–లొకేషన్ సదుపాయాన్ని స్టాక్ ఎక్సే్ఛంజీలే ఏర్పాటు చేసి... దీన్ని సభ్యులందరికీ షేరింగ్ పద్ధతిలో అందించాలని సెబీ స్పష్టంచేసింది. దీనివల్ల వ్యయం 90%పైగానే తగ్గుతుందని అంచనా. తద్వారా మరిన్ని బ్రోకరేజీ సంస్థలు దీన్ని వినియోగించుకుని ట్రేడింగ్ వ్యవస్థలో డేటా ట్రాన్స్ఫర్ వేగంలో జాప్యాన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఆల్గోరిథమ్ ఆధారిత ట్రేడింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంబంధిత సాఫ్ట్వేర్ ఉపయోగించే సంస్థలు దీన్ని పరీక్షించుకోవడం కోసం సిమ్యులేటెడ్ మార్కెట్ పరిస్థితులను అందుబాటులో ఉంచాలని సెబీ పేర్కొంది. స్టార్టప్లకు బూస్ట్... దేశంలో ఆరంభస్థాయిలో ఉన్న స్టార్టప్లకు మరింత ఊతమిచ్చేలా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. వెంచర్ క్యాపిటల్ సంస్థలకు సంబంధించిన స్టార్టప్లలో ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) పెట్టుబడి నిధుల గరిష్ట పరిమితిని ఇప్పుడున్న రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏఐఎఫ్ నిబంధనలకు సవరణలను ఆమోదించింది. కనీస పెట్టుబడి పరిమితి మాత్రం ఇప్పుడున్న రూ.25 లక్షలుగానే కొనసాగుతుంది. -
ఎల్టీసీజీ భారం ఫండ్ ఇన్వెస్టర్లపై ఎంత?
మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల తరçఫున షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు నిర్వహిస్తారు కదా! ఇప్పుడు తాజా గా వచ్చిన దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్)ను మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు కూడా చెల్లించాలా ? ఇది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపిస్తుందా ? – రవికాంత్, విజయవాడ పోర్ట్ఫోలియో తరఫున మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు షేర్లు విక్రయించినా, కొన్నా...అది ఇన్వెస్టర్ల తరఫునే. ఆందుచేత ఫండ్ ద్వారా ఒనగూరే లాభనష్టాలు..ఫండ్స్ చేసే చెల్లింపులు అన్నీ ఎన్ఏవీలో ప్రతిబింబిస్తాయి. ఈ ఎన్ఏవీ ఆధారంగానే ఇన్వెస్టర్ల పెట్టుబడులు వుంటాయి. ఇక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ)ను ఫండ్ మేనేజర్లు చెల్లించరు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించిన ఇన్వెస్టర్లే ఈ పన్నును చెల్లించాల్సివుంటుంది. ఇక మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు అనే అంశాన్ని బట్టి మీరు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం నిధుల్లో 65 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఏడాది లోపు విక్రయిస్తే మీరు మీకు వచ్చిన రాబడులపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే, మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఇప్పటి వరకూ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను ఏడాది తర్వాత విక్రయిస్తే, మీకు లక్షకు పైగా లాభాలు వస్తే, ఆ లాభాలపై 10 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నా వయసు 50 సంవత్సరాలు. ప్రస్తుతం నా దగ్గర రూ.3 లక్షలున్నాయి. పదేళ్ల తర్వాత నెల వారీ నాకు కొంత ఆదాయం కావాలంటే ఈ మూడు లక్షలను నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి ? – రియాజ్, హైదరాబాద్ రిటైరైన తర్వాత నెలవారీ ఆదాయం కావాలంటే రెండు మార్గాలున్నాయి. మొదటిది. ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేయడం. ఇక రెండోది ఏదైనా బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం. ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ సిస్టమ్)..రిటైర్మెంట్ అవసరాల కోసం సులభంగా ఉండే ప్లాన్ ఇది. ఈ మూడు లక్షలను ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేయండి. అంతే కాకుండా మీరు పనిచేసినంత కాలమూ మీరు పొందే ఆదాయంలో నెలకు కొంత మొత్తాన్ని ఎన్పీఎస్కు కేటాయించండి. మీకు 65 సంవత్సరాలు వచ్చే వరకూ మీరు ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ తర్వాత ఎన్పీఎస్లో జమ అయిన మొత్తం మీకు పెన్షన్గా లభిస్తుంది. దీంట్లో 60 శాతం మాత్రమే మీకు ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవడానికి వీలవుతుంది. మిగిలిన దాంట్లో నెలకు కొంత మొత్తం చొప్పున మీకు పెన్షన్గా వస్తుంది. మీకు ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేకపోతే, మ్యూచువల్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి, ముందుగా బ్యాలన్స్డ్ ఫండ్ను ఎంచుకోండి. మీ దగ్గరున్న మొత్తం మూడు లక్షలను ఒకేసారి ఏక మొత్తంగా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవద్దు. స్టాక్ మార్కెట్ సంబంధిత ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదనేది మొదటి సూత్రం. ఈ మూడు లక్షలను 12 భాగాలుగా చేసి, ఒక్కో భాగాన్ని ఒక నెల చొప్పున బ్యాలన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున ఈ బ్యాలన్స్డ్ ఫండ్లో కనీసం ఏడు నుంచి ఎనిమిదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేస్తే మీరు రిటైరైన తర్వాత తగిన మొత్తంలో పెన్షన్ పొందగలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్డ్, టాటా బ్యాలన్స్డ్, ఎస్బీఐ బ్యాలన్స్డ్ ఫండ్లను పరిశీలించవచ్చు. వన్ టైమ్ మాండేట్(ఓటీఎమ్) అంటే ఏమిటి ? – మేరీ, విజయవాడ వన్ టైమ్ మాండేట్(ఓటీఎమ్) మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించిన సొమ్ములను చెల్లించే ఒక ప్రత్యామ్నాయ విధానం. మీరు ఒక మ్యూచువల్ఫండ్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుందాం. ఆ మొత్తానికి సరపడా చెక్కును ప్రతినెలా సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థకు పంపించడమో, లేకపోతే సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థకు వెళ్లి డబ్బులు చెల్లించడమో కొంత వ్యయప్రయాసలతో కూడుకున్న పని. దీనికి బదులుగా వన్టైమ్ మాండేట్ ద్వారా మీ సిప్ మొత్తాన్ని సులభంగా, సత్వరంగా సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెల్లించవచ్చు. బ్యాంక్ ఖాతా నుంచి ఆ సిప్ మొత్తాన్ని డెబిట్ చేసుకునే అధికారాన్ని సదరు మ్యూచువల్ ఫండ్కు ఇవ్వడమే వన్ టైమ్ మాండేట్. ఈ ఓటీఎమ్ ఫెసిలిటి కోసం మీ బ్యాంక్లో నమోదు చేసుకోవాలి. మీ సిప్ మొత్తం రూ.10,000 లేదా రూ.5,000 ఇలా ఎంత మొత్తంలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, అంత మొత్తాన్ని సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ మీ బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ చేసుకొని ఫండ్ మేనేజర్ వ్యూహాల ప్రకారం ఇన్వెస్ట్ చేస్తుంది. ఓటీఎమ్ దరఖాస్తును తీసుకొని, సంబంధిత వివరాలు, మీ బ్యాంక్ ఖాతా, చెల్లించాల్సిన మొత్తం, ఎన్ని నెలలు తదితర వివరాలను నింపి, బ్యాంక్కు సమర్పిస్తే సరిపోతుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
యూటీఐ నుంచి కొత్త ఈక్విటీ ఫండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మ్యూచువల్ ఫండ్ సంస్థ యూటీఐ ఎంఎఫ్ తాజాగా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ సిరీస్– V (ఫైవ్)ని ప్రవేశపెడుతోంది. ఈ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ ఈ నెల 20న ప్రారంభమై డిసెంబర్ 4న ముగుస్తుందని సంస్థ ఈవీపీ, ఫండ్ మేనేజర్ వి.శ్రీవత్స శుక్రవారమిక్కడ విలేకరులకు చెప్పారు. ఈ ఫండ్ పరిమాణం సుమారు రూ. 500 కోట్లుగా ఉంటుందని, దీర్ఘకాలిక వ్యవధితో ఇన్వెస్ట్ చేయదల్చుకునేవారికి ఇది అనువైనదిగా ఉంటుందని శ్రీవత్స తెలిపారు. ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలో గరిష్టంగా 25–30 స్టాక్స్ ఉంటాయని తెలిపారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మా, లాజిస్టిక్స్, లైఫ్స్టయిల్ రంగాల షేర్లు ఉంటాయన్నారు. బీఎస్ఈ–200 బెంచ్మార్క్ కన్నా 20–25 శాతం మేర అధిక రాబడులు అందించాలన్నది లక్ష్యమని చెప్పారాయన. ఫిక్సిడ్ డిపాజిట్లు మొదలైన వాటిపై రాబడులు తగ్గడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లవైపు చూస్తున్నారని శ్రీవత్స తెలిపారు. మూడీస్ తాజాగా భారత రేటింగ్ను అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు మరింతగా రాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నిర్వహణలో ఉన్న అసెట్స్ (ఏయూఎం)పరంగా చూస్తే .. తమ ఫండ్ ఆరో స్థానంలో ఉందని, ఏయూఎం సుమారు రూ.2.5 లక్షల కోట్ల మేర ఉంటుందని శ్రీవత్స తెలిపారు. -
మ్యూచువల్ ఫండ్ను ఎంచుకోవడం ఎలా?
మార్కెట్లో వందలాది మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలో తెలియడం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏ తరహా ఫండ్ను ఎందుకు ఎంచుకోవాలో వివరించండి ? –భరత్, విశాఖపట్టణం భారత్లో దాదాపు 4 వేలకు పైగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్లున్నాయి. వీటిల్లో చాలా ఫండ్స్ స్కీమ్ల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. అయితే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనే అంశం ముఖ్యంగా మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి సంబంధించింది. వివిధ రకాలైన ఇన్వెస్టర్ల కోసం పలు రకాల ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. అధిక రిస్క్ భరించేవారికి హై గ్రోత్–హై రిస్క్ ఈక్విటీ ఫండ్స్ ఉండగా, రిస్క్ తక్కువతీసుకోవాలనుకున్నవారు డెట్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఇక రెండవది ఇన్వెస్ట్ చేసే సమయం... మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారనేది మరో ముఖ్య విషయం. ఐదేళ్లు అంతకు మించి ఇన్వెస్ట్ చేసేవారికి ఈక్విటీ ఫండ్స్ సబబుగా ఉంటాయి. స్వల్పకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి డెట్ ఫండ్స్ సరైనవి. ఇక మూడో ముఖ్యమైన అంశం ఏ తరహా ఫండ్ను ఎంచుకోవాలి అనేది. మీరు ఎంచుకునే ఫండ్ లార్జ్, లేదా స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుందా ?భారత లేదా విదేశీ కంపెనీల్లో మదుపు చేస్తుందా? అనే విషయం పరిశీలించాలి. ఈ మూడు ముఖ్యమైన విషయాలే కాకుండా మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఫండ్కు మేనేజర్గా వ్యవహరించే వ్యక్తి ఎంత కాలం నుంచి ఆ ఫండ్ను నిర్వహిస్తున్నారు? పోటీ ఫండ్స్తో పోల్చితే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఫండ్ పనితీరు ఎలా ఉంది ? మీరు పన్ను పరిధిలోకి వస్తారా ? వస్తే ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారు ? మీ ఇతర ఇన్వెస్ట్మెంట్స్, మీ సంపాదన, మీ ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు, ఖర్చులు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నేను కొంత మొత్తాన్ని 15–20 ఏళ్ల తర్వాత నా కానుకగా నా కూతురికి ఇవ్వాలనుకుంటున్నాను. నిలకడగా, మంచి పనితీరు కనబరిచే ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఆ మొత్తాన్ని ఇవ్వాలనేది నా ఆలోచన. నా ఆలోచనకు అనుగుణమైన ఒక ఫండ్ను సూచించండి. –రాధిక, విజయవాడ మీరు దీర్ఘకాలం పాటు అంటే 15–20 ఏళ్ల తర్వాత కొంత మొత్తాన్ని బహుమతిగా మీ కూతురికి ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే ఫండ్ పనితీరు ఎలా ఉంటుందోనని మీరు నిరంతరం గమనించాల్సిన అవసరం ఉండకూడదు. మార్కెట్ పెరుగుతున్నప్పుడైనా, లేదా మార్కెట్ పడిపోతున్నప్పుడైనా, లేదా పరిమిత శ్రేణిలో కదలాడుతున్నçప్పుడైనా, నిలకడగా వృద్ధి చెందే ఫండ్ మీకు అవసరం. ఇలాంటి అంశాలన్నింటి దృష్ట్యా మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎంచుకోవడానికి మూడు ఫండ్స్ సూచిస్తున్నాం... ఐసీఐసీఐ డైనమిక్ ఈక్విటీ ఫండ్, క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, పరాగ్ పరేఖ్ లాంగ్ టర్మ్ఈక్విటీ ఫండ్.. ఈ మూడు ఫండ్స్లో మీరు ఏదైనా ఒక ఫండ్ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేయవచ్చు. నా వయస్సు 52 సంవత్సరాలు. నా పీపీఎఫ్ ఖాతాలో రూ.20 లక్షలు ఉన్నాయి. ఈ మొత్తం త్వరలో మెచ్యూర్ కాబోతోంది. ప్రస్తుతానికైతే నాకు ఈ డబ్బులు అవసరం లేదు. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చా ? నాకు తగిన సూచనలివ్వండి. –హుస్సేన్, హైదరాబాద్ మీరు నిరభ్యంతరంగా ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టవచ్చు. అసలు పీపీఎఫ్లో కంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు మరింతగా రాబడులు వచ్చి ఉండేవి. పీపీఎఫ్ వడ్డీరేట్లు భవిష్యత్తులో మరింతగా తగ్గవచ్చు. పీపీఎఫ్ డబ్బులు మీకు మరో ఐదు, అంతకు మించిన కాలానికి అవసరం లేకపోతే, ఈ డబ్బులను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. స్వల్పకాలంలో ఒకింత ఒడిదుడుకులున్నా, స్టాక్ మార్కెట్ నుంచి మీకు దీర్ఘకాలంలో మంచి రాబడులే పొందుతారు. స్టాక్ మార్కెట్పై అవగాహన లేకున్నా, రిస్క్ అని మీరు భావించినా, ఈ సొమ్ములను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయ వచ్చు. ఏదైనా 1–2 రెండు బ్యాలన్స్డ్ ఫండ్స్ను ఎంచుకోండి. మీ పీపీఎఫ్ మొత్తాన్ని మూడేళ్ల కాలంలో నెలకు ఇంత చొప్పున ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి రాబడులు రావడమే కాకుండా, పన్ను ప్రయోజనాలు కూడా మీరు పొందవచ్చు. ఊరిలో పొలం అమ్మగా పెద్ద మొత్తమే నా చేతికొచ్చింది. ఈ మొత్తాన్ని హైబ్రిడ్ ఫండ్స్లో సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎంత కాలంలో ఎస్టీపీ ద్వారా హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? –రమేశ్, కరీంనగర్ ఎస్టీపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలనే విషయానికి సా«ధారణæ సూత్రాలేమీ లేవు. చిన్న మొత్తాలైతే తక్కువ కాలం తీసుకోవాలి. భారీ మొత్తాలైతే దీర్ఘకాలం ఎస్టీపీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ దీర్ఘకాలం అంటే గరిష్టంగా మూడేళ్లు అని అర్థం చేసుకోవాలి. మూడేళ్లు ఎందుకంటే, మార్కెట్ సైకిల్ సాధారణంగా మూడేళ్లు ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్రయోజనాలు పొందవచ్చు. మూడేళ్లకు మించి ఎస్టీపీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. మీ ఇన్వెస్ట్మెంట్స్ తగిన రాబడులు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మనం ఇన్వెస్ట్చేసే మొత్తాన్ని బట్టే ఎస్టీపీ కాలాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీకు ఏడాదికొకసారి బోనస్ వస్తుందనుకుందాం. ఈ బోనస్ను మూడు నుంచి ఆరు నెలల కాలంలో ఎస్టీపీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. ఇక ఎంత పెద్ద మొత్తమైనా మూడేళ్లకు మించి ఎస్టీపీ ద్వారా ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే ఉత్తమం. – ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
2025కల్లా రూ.94 లక్షల కోట్లకు మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు
ముంబై: ప్రస్తుతం రూ. 20 లక్షల కోట్ల మేర వున్న మ్యూచువల్ ఫండ్ ఆస్తులు 2025 సంవత్సరానికల్లా ఐదు రెట్లు పెరిగి, రూ.94 లక్షల కోట్లకు చేరుకుంటాయని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు చెందిన అసోసియేషన్ యాంఫి అంచనావేసింది. ఈ వృద్ధి సాధించేందుకు ఫండ్స్ యూనిట్లను విక్రయించే డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను ప్రస్తుత 86,000 నుంచి 6 లక్షలకు పెంచుకోవాల్సివుంటుందని యాంఫి ఛైర్మన్ ఏ. బాలసుబ్రమణియన్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో వున్న ఆస్తుల విలువ కొద్దిరోజుల క్రితమే రూ. 20 లక్షల కోట్లకు చేరింది. వచ్చే ఎనిమిదేళ్లలో 23 శాతం చొప్పున వార్షిక వృద్ధితో రూ. 94 లక్షల కోట్లకు చేరుతుందని అంచనావేస్తున్నట్లు బాలసుబ్రమణియన్ చెప్పారు. -
వచ్చే ఏడాది యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ!
ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూపు ముంబై: మ్యూచువల్ ఫండ్ దిగ్గజం యూటీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో ఐపీఓకు వచ్చే అవకాశాలున్నాయని యూటీఐ ఎండీ, లియో పురి చెప్పారు. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, ఏ క్షణమైనా ప్రభుత్వ ఆమోదం లభించగలనది పేర్కొన్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే మర్చంట్ బ్యాంకర్లను నియమిస్తామని, సెబీ ఆమోదం కోసం దరఖాస్తు చేస్తామని వివరించారు. ఐపీఓ నిధులతో ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థలను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సంస్థ విలువ వంద కోట్ల డాలర్లు (సుమారుగా రూ.6,800 కోట్లు) ఉ ండొచ్చని అంచనా. మ్యూచువల్ ఫండ్ రంగంలో యూటీఐదే గతంలో అగ్రస్థానం. యూఎస్ 64 స్కీమ్ సంక్షోభం తర్వాత కష్టాల్లో పడిన ఈ సంస్థ ప్రస్తుతం రూ.1,29,888 కోట్ల నిర్వహణ ఆస్తులతో ఆరో స్థానంలో ఉంది. . యూటీఐ ఐపీఓకు వస్తే, స్టాక్ మార్కెట్లో లిస్టయిన తొలి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇదే అవుతుంది. యూటీఐ మ్యూచువల్ ఫండ్లో ఎస్బీఐ, ఎల్ఐసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్–ఒక్కో సంస్థకు 18.5 శాతం చొప్పున, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ, టి రొవె ప్రైస్కు 26 శాతం చొప్పున వాటాలున్నాయి. -
అధిక రాబడి ఈక్విటీల్లోనే..!
ఏడేళ్ల వ్యవధిలో 20 శాతం రాబడులిచ్చిన ఈక్విటీ ఫండ్స్ * మ్యూచువల్ ఫండ్లలో పెరుగుతున్న పెట్టుబడులు * ఫండ్ల పెట్టుబడుల్లో 85 శాతం షేర్లలోనే... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్చుతగ్గులు, రిస్కులున్నప్పటికీ దీర్ఘకాలంలో ఇతర సాధనాల కన్నా ఈక్విటీలే మెరుగైన రాబడినిస్తున్నాయి. మరి దీర్ఘకాలమంటే ఎంత? రెండేళ్లా? మూడేళ్లా? లేక ఐదేళ్లా? అనే సందేహం రావచ్చు. నిజానికి మూడేళ్లు దాటితే దీర్ఘకాలంగా పరిగణిస్తారు. ఆ రకంగా చూస్తే మన స్టాక్ మార్కెట్లు మెరుగైన రాబడినే ఇచ్చాయి. దాన్ని మన మ్యూచువల్ ఫండ్లు అందిపుచ్చుకున్నాయి కూడా. బహుశా!! ఇది గమనించే కాబోలు! ఇన్వెస్టర్లు మళ్లీ వాటివైపు మళ్లుతున్నారు. 2104లో సుమారు 3.95 కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రయిబర్ల సంఖ్య... ఈ ఏడాది మార్చి నాటికి 4.77 కోట్లకు చేరింది. వీటిలో 4.54 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు కాగా.. మిగిలిన వారు సంస్థాగత.. సంపన్న ఇన్వెస్టర్లు. గతేడాది మేలో రూ. 12.26 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం (ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు) ఈ ఏడాది మే నాటికి 18 శాతం పెరిగి రూ.14.46 లక్షల కోట్లకు చేరాయి. సంస్థాగత ఇన్వెస్టర్లను పక్కన పెడితే ఇందులో దాదాపు సగభాగం రూ.6.58 లక్షల కోట్లు వ్యక్తిగత పెట్టుబడులుగా వచ్చినవే. మ్యూచువల్ ఫండ్ సంస్థల సమాఖ్య (యాంఫీ) గణాంకాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఈక్విటీ ఆధారిత స్కీముల్లో అత్యధికంగా 85 శాతం పెట్టుబడులు రిటైల్, సంపన్న ఇన్వెస్టర్లవే ఉన్నాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు అందిస్తాయన్న విశ్వాసమే దీనికి కారణం. ఏడేళ్లలో అధిక రాబడులు.. వివిధ ఫండ్స్ను కలిపి యాంఫీ, రేటింగ్ సంస్థ క్రిసిల్ రూపొందించిన సూచీ ప్రకారం... ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి వెల్లడైన గణాంకాలను చూస్తే ఈక్విటీల్లోనూ, షేర్ల ఆధారిత పథకాల్లోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్లు దీర్ఘకాలంలో సగటున గణనీయమైన రాబడులు అందించాయి. ఉదాహరణకు.. అయిదేళ్ల క్రితం ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో (ఈఎల్ఎస్ఎస్) చేసిన పెట్టుబడులు సగటున 11.22 శాతం మేర వార్షిక రాబడులిచ్చాయి. అదే మార్కెట్లు కనిష్ట స్థాయిల్లో తిరుగాడుతున్నప్పుడు ఏడేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే సగటున 20 శాతం మేర వార్షిక రాబడులొచ్చాయి. ఇక అటు ఈక్విటీలు ఇటు డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసే బ్యాలెన్స్డ్ ఫండ్లు కూడా ఈ కాలంలో సుమారు 18.79 శాతం మేర వార్షిక రాబడులు అందించాయి. అదే సమయంలో ప్రభుత్వ బాండ్లు మొదలైన సురక్షిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్లు ఒకే స్థాయిలో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం రాబడులందించాయి. అయితే సంవత్సర కాలంలో ఈక్విటీ ఫండ్లు కొంత నష్టాలు పంచినప్పటికీ (దాదాపు 2 శాతం నుంచి 7 శాతం మేర) .. డెట్ ఫండ్ సూచీ మాత్రం సుమారు 7 శాతం స్థాయిలో సానుకూల రాబడులు అందించింది. హెచ్చుతగ్గులు సహా పలు కారణాలు... 2007-08 ప్రాంతంలో మార్కెట్లు గరిష్ట స్థాయిలకి ఎగిశాయి. కనిష్ట స్థాయిలకూ పడిపోయాయి. 2007 ప్రారంభంలో సుమారు 13,000 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ ఆ ఏడాది ఆఖరు నాటికి ఏకంగా 20,287 పాయింట్లకు ఎగిసింది. అదే సెన్సెక్స్.. ఆ మరుసటి ఏడాది 2008 ప్రారంభంలో 20,800 పాయింట్ల స్థాయి నుంచి సంవత్సరం ఆఖరు నాటికల్లా అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల ప్రభావం దరిమిలా 8,450 పాయింట్లకు (గరిష్టం నుంచి 12,000 పైగా పాయింట్ల పతనం) పడింది. సరిగ్గా ఇటువంటి సమయంలో కంగారుపడి ఈక్విటీ ఫండ్స్ నుంచి వైదొలగకుండా స్థిరంగా పెట్టుబడులు కొనసాగించిన వారు గణనీయంగా లాభపడ్డారు. మరోవైపు, అప్పటిదాకా దాదాపు ఏడు శాతం స్థాయిలో కొనసాగిన ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు మందగమన పరిస్థితుల్లో వృద్ధికి ఊతమిచ్చే చర్యల వల్ల 4.25 శాతానికి తగ్గాయి. అటుపైన మూడేళ్ల క్రితం దాకా దాదాపు 8.50 శాతం పైగా తిరుగాడిన రేట్లు మళ్లీ ఇప్పుడు ఆరున్నర స్థాయికి దిగొచ్చాయి. తదనుగుణంగానే వడ్డీ రేట్ల ఆధారిత పథకాలూ ఓ మోస్తరు రాబడులిచ్చాయి. -
మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్కు మారాలంటే..
నేను ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. రెగ్యులర్ ప్లాన్ కంటే అదే స్కీమ్కు సంబంధించి డెరైక్ట ప్లాన్కు వ్యయాలు తక్కువగా ఉంటాయని, రాబడులు ఎక్కువగా ఉంటాయని మిత్రులంటున్నారు. నేను ఈ రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్కు మారవచ్చా? ఇలా మారడాన్ని మ్యూచువల్ ఫండ్ సలహాదారుకు తప్పనిసరిగా వెల్లడించాలా ? మారడానికి సంబంధించిన విధి విధానాలేంటి? - సుధాకర్, ఖమ్మం ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్కు సంబంధించి రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్కు మారవచ్చు. ఈ విషయాన్ని మీ మ్యూచువల్ ఫండ్ సలహాదారుకు వెల్లడించాలా, వద్దా అనేది మీ ఇష్టం. రెగ్యులర్ నుంచి డెరైక్ట్ ప్లాన్కు మారేటప్పుడు ఆన్లైన్లో డెరైక్ట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇక ఆఫ్లైన్లో అయితే సదరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పేరు తర్వాత, ఏఆర్ఎన్ కోడ్ దగ్గర.. ఈ రెండు చోట్లా డెరైక్ట్ అని స్పష్టంగా తెలియజేయాలి. రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్కు ఇన్వెస్టర్లు మారితే వారిపై ఎగ్జిట్ లోడ్ను ఇప్పుడు చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేయడం లేదు. అయినప్పటికీ, మీ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎగ్జిట్ లోడ్ను వసూలు చేస్తోందా లేదా అన్న విషయాన్ని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇలా ఒక ప్లాన్ నుంచి మరో ప్లాన్కు మారడాన్ని... ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడంగా భావిస్తారు. కాబట్టి ఏమైనా మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సి ఉంటుందేమోనని విషయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రస్తుతం నేను ఎస్బీఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్, ఎస్బీఐ ఫార్మా ఫండ్, యూటీఐ టాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్, యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్, యూటీఐ ఎంఎన్సీ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్-క్యాప్ అపర్చునిటీస్ ఫండ్ల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్పై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం నేను ఏమైనా పన్ను రాయితీలు పొందవచ్చా? - ప్రశాంతి, గుంటూరు మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేస్తేనే పన్ను రాయితీలు లభిస్తాయి. దురదృష్టవశాత్తూ మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్( ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్ కాదు. అందుకని మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్పై మీకు ఎలాంటి పన్ను రాయితీలు లభించవు. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. స్థలం కొనుగోలు కోసం ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్) నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుందామనుకుంటున్నాను. దీనికి సంబంధించిన విధి విధానాలేంటి? ఏమేం డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది ? - భవానీ, హైదరాబాద్ నిర్దేశిత ఉద్యోగ సర్వీస్ పూర్తి చేస్తేనే మీరు ఈపీఎఫ్ నుంచి డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. స్థలం కొనుగోలు కోసం ఈపీఎఫ్ నుంచి మొత్తం కాకుండా పాక్షికంగానే డబ్బులను విత్డ్రా చేసుకునే వీలుంది. మీరు ఏ కారణం వల్ల డబ్బులను విత్డ్రా చేయాలనుకుంటున్నారో, దానికి తగ్గట్లుగా మీ సర్వీస్ ఉండాలి. ఉదాహరణకు మీ ఉద్యోగ సర్వీస్ ఐదేళ్లు పూర్తయితేనే మీరు స్థలం కోసం ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లతో పాటు పార్షియల్ విత్డ్రాయల్ పార్మ్ను మీ కంపెనీకి అందజేయాలి. మీ బ్యాంక్ ఖాతా వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. మీ క్లెయిమ్ను వెరిఫై చేసి, డబ్బులను మీ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. కొత్త నిబంధనల ప్రకారం, విత్డ్రాయల్ దరఖాస్తును నేరుగా ఈపీఎఫ్ఓ కార్యాలయంలో కూడా సమర్పించవచ్చు. నేను 2009, మార్చిలో హెచ్డీఎఫ్సీ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్-2లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.12,000 చొప్పున ప్రీమియమ్లు చెల్లించాను. ఇప్పుడు నేను ఈ పాలసీని సరెండర్ చేస్తే, ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - ప్రకాశ్ జైన్, హైదరాబాద్ హెచ్డీఎఫ్సీ యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్ టూ అనేది యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్పీపీ), ఈ ప్లాన్ను ఇప్పుడు ఈ కంపెనీ నిలిపేసింది. ఈ పాలసీలో మీరు ఏడేళ్ల పాటు ప్రీమియమ్లు చెల్లించారు. కాబట్టి మీపై ఎలాంటి సరెండర్ చార్జీల భారం ఉండదు. మీ ఆదాయపు పన్ను స్లాబ్ననుసరించి సరెండర్ వేల్యూపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ పాలసీని సరెండర్ చేసేటప్పుడు ఆ ఫండ్ విలువ ఎంత ఉంటుందో అదే దాని సరెండర్ వేల్యూగా పరిగణిస్తారు. యూఎల్పీపీలు కొంత సంక్లిష్టమైన ప్లాన్లే. ఈ ప్లాన్లపై మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అధిక చార్జీలు వసూలు చేస్తాయి. ఫలితంగా రాబడులు తగ్గుతాయి. రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఇక బీమా కోసం తగిన బీమా కవరేజ్ ఉండే టర్మ్బీమా పాలసీ తీసుకోవాలి - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పీపీఎఫ్ కొత్త వడ్డీరేట్లు పాత ఖాతాలకు వర్తిస్తాయా?
నేను గత ఏడాది మార్చి నుంచి ప్రజా భవిష్య నిధి(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ -పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఖాతా మెచ్యూరిటీ వరకూ నాకు 8.7 శాతం వడ్డీ వస్తుందా? కొత్త వడ్డీరేట్లు కొత్త పీపీఎఫ్ ఖాతాలకే వర్తిస్తాయా ? పాత వాటికి కూడా అమలవుతుందా ? ఈ విషయాలపై తగిన స్పష్టతనివ్వండి. - రాజశేఖర్, విశాఖపట్టణం పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీరేట్లు మెచ్యూరిటీ వరకూ ఒకే విధంగా ఉండకపోవచ్చు. ప్రభుత్వం పీపీఎఫ్ వడ్డీరేట్లును కాలానుగుణంగా మారుస్తూ ఉంటుంది. ఇలా మార్పు చేసినప్పుడల్లా, ఆ మారిన వడ్డీరేట్లు పాత, కొత్త పీపీఎఫ్ ఖాతాలన్నింటికీ వర్తిస్తాయి. గతంలో పీపీఎఫ్ వడ్డీరేట్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నిర్ణయించేవాళ్లు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం(2016-17) నుంచి వడ్డీరేట్లను ప్రతి మూడు నెలలకొకసారి సవరిస్తారు. ఈ ఏడాది మార్చి వరకూ పీపీఎఫ్ వడ్డీరేటు 8.7 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలు(ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకూ) 8.1 శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నా వయస్సు 28 సంవత్సరాలు. ఇటీవలనే ఉద్యోగ జీవితం ప్రారంభించాను. నేను బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. నాకు తగిన పాలసీ సూచించగలరు. - ప్రభు, కరీంనగర్ చిన్న వయస్సులోనే బీమా పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియమ్ తక్కువగా చెల్లించే ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా తగిన ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. ఇక మీ వయస్సుకు తగ్గట్లుగా మూడు బీమా పాలసీలను సూచిస్తున్నాము. సంస్థ బీమా పాలసీ, రూ. కోటి బీమాకు మీరు 32 సంవత్సరాల పాటు (మీ రిటైర్మెంట్ వరకూ)చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం, తదితర వివరాలను కూడా అందిస్తున్నాం. పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. మ్యాక్స్ లైఫ్ ఆన్లైన్ టెర్మ్ ప్లాన్- వార్షిక ప్రీమియమ్ రూ.6,900. ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 98.63 శాతంగా ఉంది. ఇక ఏగాన్ రెలిగేర్ ఐటెర్మ్ ప్లాన్లోనైతే వార్షిక ప్రీమియమ్ రూ.7,866గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 96.59 శాతంగా ఉంది. ఇక మూడో పాలసీ విషయానికొస్తే, హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ ప్లస్ ప్లాన్కైతే ఏడాదికి రూ.9,380 ప్రీమియం చెల్లించాలి. ఈ సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 95.86 శాతంగా ఉంది. కొంత అదనపు ప్రీమియం చెల్లించి అదనపు రైడర్లు పొందవచ్చు. అన్ని విషయాలు సవివరంగా బీమా దరఖాస్తులో వెల్లడించండి. ఇలా చేస్తే పాలసీ క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్లోని ఇన్వెస్ట్మెంట్స్ను మరో మ్యూచువల్ ఫండ్లోకి మారుద్దామనుకుంటున్నాను. ఇలా ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్స్ను సులభంగా బదిలీచేసుకునే మార్గాన్ని సూచించండి? - ప్రతిభ, హైదరాబాద్ ఒక మ్యూచువల్ ఫండ్లోని ఇన్వెస్ట్మెంట్స్ను మరో మ్యూచువల్ ఫండ్లోకి మార్చుకోవడాన్ని.. ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించి, కొత్త మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడంగా పరిగణిస్తారు. ఇక ఒక మ్యూచువల్ ఫండ్లోని ఇన్వెస్ట్మెంట్స్ను మరో మ్యూచువల్ ఫండ్లోకి మార్చుకునేటప్పుడు చెల్లించాల్సిన పన్నులు, ఎగ్జిట్ లోడ్, తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు డెట్ మ్యూచువల్ ఫండ్లోని ఇన్వెస్ట్మెంట్స్ను వేరే మ్యూచువల్ ఫండ్లోకి మార్చాలనుకుంటున్నారనుకుందాం.... ఇన్వెస్ట్ చేసిన మూడేళ్లలోపే ఇలా మార్చాలనుకుంటే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను(షార్ట్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్) చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్ననుససరించి మీరు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మూడేళ్ల తర్వాత మార్చాలనుకుంటే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఇండేక్సేషన్ బెనిఫిట్తో 20 శాతం) చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కైతే పన్నులు భిన్నంగా ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఏడాదిలోపే విక్రయిస్తే, ఆ ఇన్వెస్ట్మెంట్స్పై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా భావించి 15 శాతం పన్ను విధిస్తారు. ఏడాది తర్వాత విక్రయిస్తే, ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఏడాది తర్వాత విక్రయిస్తే, వాటిని దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇక కొన్ని మ్యూచువల్ ఫండ్స్ నిర్ణీత కాలానికి మ్యూచువల్ ఫండ్స్ విక్రయాలపై ఎగ్జిట్ లోడ్ను విధిస్తాయి. అందుకని ఎగ్జిట్ లోడ్ పడనంత కాలం వేచి చూసి, ఆ తర్వాత బదిలీ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ భారం తప్పించుకోవచ్చు. ఏ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఏ మ్యూచువల్ ఫండ్స్లోకి మీ ఇన్వెస్ట్మెంట్స్ను బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో వివరాలను మీరు వెల్లడించలేదు. అందుకని సవివర సలహా ఇవ్వలేకపోతున్నాం. ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్స్ను రెండు సందర్భాల్లో బదిలీ చేయాలనుకుంటారు. మొదటిది. మీరు అనుకున్న/నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యం సాధించగలగడం, రెండోది మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్, ఆ కేటగిరి ఫండ్స్తో పోల్చితే సరైన రాబడులను ఇవ్వలేకపోవడం. మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ ఆశించిన పనితీరు కనబరచకపోవడానికి తగిన కారణాలేంటో అన్వేషించండి. భవిష్యత్తులో కూడా ఈ ఫండ్ పనితీరు అద్వానంగా ఉంటుందని భావిస్తే, అదే కేటగిరిలో మంచి పనితీరు కనబరుస్తున్న మరో మ్యూచువల్ ఫండ్లోకి మీ ఇన్వెస్ట్మెంట్స్ను బదిలీ చేసుకోండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎడెల్వీజ్ చేతికి జేపీ మోర్గాన్ ‘ఫండ్’
డీల్ విలువ రూ. 110 కోట్లు! న్యూఢిల్లీ: ఆర్థిక సేవల దిగ్గజం జేపీ మోర్గాన్కు భారత్లో ఉన్న మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఎడెల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ మంగళవారం తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 110 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ ఫండ్ దాదాపు రూ. 7,000 కోట్ల పైచిలుకు అసెట్స్ను నిర్వహిస్తోంది. డీల్ అనంతరం ఏర్పడే సంయుక్త సంస్థ ఆధ్వర్యంలో దాదాపు రూ. 8,757 కోట్ల అసెట్స్ ఉంటాయి. జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్మెంట్ ఇండియాకి సంబంధించిన మెజారిటీ ఉద్యోగులను తీసుకోనున్నట్లు ఎడెల్వీజ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నుంచి గత కొన్నాళ్లుగా పలు అంతర్జాతీయ సంస్థలు వైదొలుగుతున్నాయి. ఈ కోవలో జేపీ మోర్గాన్ 11వది. రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ గతేడాది గోల్డ్మన్ శాక్స్ భారత ఫండ్ వ్యాపారాన్ని రూ. 243 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాండర్డ్ చార్టర్డ్ తన ఫండ్ వ్యాపారాన్ని 2008లో ఐడీఎఫ్సీకి విక్రయించింది. -
పన్నుకు మందు... ఈఎల్ఎస్ఎస్
ఇది మార్చి నెల. అంటే పన్ను కోతలకు ఆఖరి నెల. ఈ నెల్లో గనక ఇన్వెస్ట్మెంట్ల రుజువు పత్రాలు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు ఇవ్వకపోతే నెలాఖర్లో చేతికి కాస్తయినా జీతం రావటం కష్టం. అయితే పన్ను ఆదా చేయటానికున్న చక్కటి మార్గాల్లో మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) కూడా ఉంటాయి. సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేయడానికి వీలు కల్పించే ఈఎల్ఎస్ఎస్ల లాకిన్ వ్యవధి మూడేళ్లు. ఒకరకంగా మిగతా పథకాలతో పోలిస్తే తక్కువే. వీటిని ఒకసారి చూద్దాం... ♦ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టుబడులు ♦ మూడేళ్ల లాకిన్తో దీర్ఘకాల రాబడులకు అవకాశం ♦ రాబడులపై క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉండదు ♦ మంచి ఫండ్ను ఎంచుకోవటం; సిప్ చేయటం అవసరం దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసి తగిన లాభాలు పొందాలనుకునేవారికి ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడమే చక్కని మార్గమని అందరూ చెబుతుంటారు. ఎందుకంటే స్వల్ప కాలమైతే స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులుంటాయి. వాటిని తప్పించుకోవాలంటే దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించాలి. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడులే కాబట్టి మెరుగైన ఆదాయాన్ని ఆశించవచ్చు. పెపైచ్చు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. వీలుంటే ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే సిప్ పద్ధతిలో దఫదఫాలుగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. వీటిలో ఉండే ప్రయోజనాలేంటంటే... * పన్ను మినహాయింపు * మూడేళ్ల లాకిన్ ఉంటుంది కనక పన్ను లేని ఆదాయం * రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వివిధ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం * పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్ల వంటి సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ ఎక్కువ. ఆర్థిక లక్ష్యాలకు మంచిదే... ఆర్థిక లక్ష్యాల్ని సాధించడానికి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడమనేది చక్కని మార్గం. ఎందుకంటే మార్కెట్ లోతుపాతులు తెలుసుకోవటానికి, పరిణామాల్ని అంచనా వేయటానికి మరీ ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అయితే మీరు ఎంచుకున్న ఫండ్ ఎంత పెద్దది? ఎన్నాళ్ల నుంచి పనిచేస్తోంది? ఫండ్ ఖర్చులుగా ఎంత శాతాన్ని వెచ్చిస్తున్నారు? దాని పనితీరు ఎలా ఉంది? వంటి అంశాల్ని మాత్రం అధ్యయనం చేస్తే చాలు. ఎందుకంటే కాస్త పెద్ద పోర్టుఫోలియో ఉండి, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఫండ్ సంస్థలైతే మార్కెట్ పరిస్థితులు బాగులేనపుడు కూడా స్థిరంగా ఉండే అవకాశముంటుంది. అలాగే ఖర్చుల శాతం ఎక్కువైతే అది మీ రాబడిపై ప్రభావం చూపిస్తుంది. ఖర్చుల్లో కనీసం 0.5 శాతం తక్కువ ఉన్నా... దీర్ఘకాలంలో అది రాబడులపై ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. సంస్థను, ఫండ్ను ఎంచుకున్నాక... ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. అంటే ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయటమా? లేక సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయటమా? అన్నది. ఒకరకంగా సిప్ విధానమే ఉత్తమం. ఎందుకంటే మార్కెట్ పడినా, పెరిగినా కూడా దానిద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పడే పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ యూనిట్లు, పెరుగుతున్నపుడు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ యూనిట్లు వస్తాయి. సరాసరిన మంచి రాబడులుంటాయి. లాకిన్ వ్యవధిపై జాగ్రత్త! ఈఎల్ఎస్ఎస్లో ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ వెనక్కి తీసుకోవటానికి మాత్రం లాకిన్ వ్యవధి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది మూడేళ్లు. ఒకవేళ సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి మొత్తానికీ మూడేళ్ల లాకిన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు... ఈ నెలలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మూడేళ్ల తరవాత వెనక్కి తీసుకోవచ్చు. వచ్చేనెలలో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి... అప్పటి నుంచి మూడేళ్ల గడువు వర్తిస్తుంది. మూడేళ్ల తరవాత తీసుకునే మొత్తానికి క్యాపిటల్ గెయిన్స్ పన్ను ఉండదు కనక ‘గ్రోత్’ ఫండ్ను ఎంచుకోవటమే మంచిది. ఎందుకంటే డివిడెండ్ చెల్లించే ఫండ్ను ఎంచుకుంటే డివిడెండ్పై పన్నును సంస్థ చెల్లిస్తుంది. దీనివల్ల మన లాభాలు తగ్గుతాయి. ఒకవేళ డివిడెండ్ను రీ-ఇన్వెస్ట్ చేస్తే... అలా ఇన్వెస్ట్ చేసే ప్రతి మొత్తానికీ మూడేళ్ల లాకిన్ వ ర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ ఫండ్ల నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవటం ఉండదు కనక... ఈ ఫండ్ల మేనేజర్లు దీర్ఘకాలంలో చక్కని రాబడులొచ్చే షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో మిగిలిన ఫండ్ల కన్నా ఇవి మంచి రాబడులే ఇస్తాయి. మొత్తంగా చూస్తే ఈఎల్ఎస్ఎస్లో సిప్ పద్ధతిలో నెలవారీ పెట్టుబడి పెట్టడమే మంచిదనేది నా సలహా. పెపైచ్చు ఇలా నెలవారీ ఇన్వెస్ట్ చేసే విధానాన్ని ఆటోమేట్ చేసుకుంటే ఆలస్యం కాకుండా ఉంటుంది. పెపైచ్చు ఇలా దఫదఫాలుగా ఇన్వెస్ట్ చేయటం వల్ల బడ్జెట్పై కూడా పెద్దగా ప్రభావం పడదు. - అనిల్ రెగో సీఈవో, రైట్ హొరెజైన్స్ -
ఇక మహీంద్రా మ్యూచువల్ ఫండ్లు
3-4 నెలల్లో మార్కెట్లోకి.. ముంబై: మహీంద్రా గ్రూప్కు చెందిన మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ 3-4 నెలల్లో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నది. మ్యూచువల్ ఫండ్ వ్యాపార నిర్వహణ కోసం సెబీ ఆమోదం పొందిన మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నది. మహీంద్రా ఫైనాన్స్ ఈ మార్కెట్లలో పటిష్టంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. గ్రామీణ, చిన్న పట్టణాల మార్కెట్లోకి ప్రవేశిస్తున్న తొలి మ్యూచువల్ ఫండ్ కంపెనీ తమదే కానున్నదని మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈఓ అశుతోష్ బిష్ణోయ్ చెప్పారు. ఈక్విటీ, బ్యాలెన్స్డ్, ఫిక్స్డ్ ఇన్కమ్, లిక్విడ్ కేటగిరిల్లో మ్యూచువల్ ఫండ్స్ను ఆఫర్ చేస్తామన్నారు. -
ఆధార్తో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆధార్ నంబర్తో మ్యూచువల్ ఫండ్ యూనిట్ల క్రయ, విక్రయాలను జరిపే సౌల భ్యాన్ని ఫండ్ సంస్థలు కల్పించాయి. ఏ ఇన్వెస్టరైనా కేవైసీ(నో యువర్ క్లయింట్) వివరాలు లేకుండానే పాన్ కార్డ్, ఆధార్ నంబర్తో ఆన్లైన్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఈ విధానంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించకుండా మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తారు. ఈ కొత్త విధానంలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ క్రయ, విక్రయాలను సులభంగా, వేగంగా నిర్వహించవచ్చని ఇప్పటికే ఆధార్తో మ్యూచువల్ ఫండ్స్తో ఇన్వెస్ట్ చేసే సదుపాయాన్ని కల్పించిన క్వాంటమ్ ఎంఎఫ్ పేర్కొంది. -
విదేశీ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు
మనం ఉండేది ఇండియాలో. ఇక్కడి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడదామంటే అదేపనిగా తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు. ఈ మధ్య తీవ్రమైన హెచ్చుతగ్గులు కూడా చాలా సహజమైపోయాయి. మరోవంక అమెరికా మార్కెట్లు అదేపనిగా పెరుగుతున్నాయి. చైనా కూడా ఆ మధ్య బాగా పడి... ఇప్పుడు పెరగటం మొదలు పెట్టింది. సరే! మనం విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలంటే మార్గమేంటి? నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చా? అక్కడ పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్లేమైనా ఉన్నాయా? అవన్నీ వివరించేదే ఈ కథనం... అవకాశం కల్పిస్తున్న గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ * రాబడిపై మాత్రం కరెన్సీ; రాజకీయ ప్రభావాలు పోర్టు ఫోలియో వైవిధ్యంగా ఉండాలంటే ఇదో మార్గం * ఇన్వెస్ట్మెంట్ల రాబడిపై మాత్రం పన్ను చెల్లించాల్సిందే దేశీ ఇన్వెస్టర్లు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పించే వేదికే గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. దేశీ మ్యూచువల్ ఫండ్ హౌస్ (ఏఎంసీ)లు కొన్ని ప్రత్యేకంగా ఈ పథకాలను అందిస్తున్నాయి. ఆయా దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి తగిన స్కీముల్ని ఈ ఫండ్ హౌసెస్ అమలుచేస్తున్నాయి. అయితే ఈ ఫండ్లు నేరుగా విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవు. ఎందుకంటే అక్కడి స్థితిగతులు లోకల్ మ్యూచువల్ ఫండ్లకే బాగా తెలుస్తాయి. అందుక ని ఈ ఫండ్లు... వివిధ దేశాల్లోని మ్యూచ్వల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటిని గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్గా పిలుస్తారు. టెక్నాలజీ వల్ల ప్రపంచం మొత్తం ఒకే మార్కెట్లా మారుతున్న నేపథ్యంలో దేశీ ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాల వల్ల ప్రయోజనం పొందటానికి ఈ గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపకరిస్తాయి. నిజానికి ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేక రంగ వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు లాటిన్ అమెరికా కమోడిటీస్కు, ఆసియా ప్రాంతం సర్వీసెస్కు అనుకూలం. అదే అమెరికా తీసుకుంటే... అది అత్యంత భిన్నమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు కీలకమైన మార్కెట్. బ్రిక్స్ మార్కెట్లయితే బాగా ఆశాజనక వృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థల సమూహం, ఇలా వివిధ ప్రాంతాలు వివిధ రంగాలకు అనుకూలం కావటంతో అక్కడ ఆయా రంగాల్లో ఇన్వెస్ట్ చేయటానికి ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపయోగపడతాయి. ఫండ్స్తో డైవర్సిఫికేషన్.. మీ పోర్ట్ఫోలియో విభిన్నంగా ఉండటానికి గ్లోబల్ ఫండ్స్ బాగా పనికొస్తాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయటం వల్ల మార్కెట్ విస్తృతి పెరుగుతుంది. అంతేకాక గ్లోబల్ మార్కెట్లన్నీ కూడా ఒకే దిశలో పయనించవు. అంటే కొన్ని పెరగొచ్చు, కొన్ని తగ్గొచ్చు. అందుకే గ్లోబల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ల అస్థిరతల నుంచి మన పోర్ట్ఫోలియోను రక్షించుకోవచ్చు. పన్ను విధానం.. గ్లోబల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మనం పెట్టుబడి పెడుతున్నట్లు లెక్క. గ్లోబల్ ఫండ్స్ను డెట్ ఫండ్గా పరిగణిస్తారు. డెట్ ఫండ్లపై చెల్లించినట్లే దీనిపైనా పన్నులుంటాయి. దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ల రాబడిపై 10 శాతం (ఇండెక్సేషన్ కాకుండా) పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్తో కలిపి అయితే 20 శాతం పన్ను కట్టాలి. స్వల్పకాల పెట్టుబడుల రాబడిపై చెల్లించే పన్ను మాత్రం ఆయా వ్యక్తుల ఆదాయ శాఖ పన్ను శ్లాబ్పై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలను మరవొద్దు గ్లోబల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీనికోసం ఎక్కువ సమయం కేటాయించి, ఫండ్స్ గురించి అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ మార్కెట్ల గురించి స్టడీ చేయాలి. వాటిని ఫాలో అవుతూ ఉండాలి. ఇలా పరిశీలించాక ఆ ఫండ్ మనకు సరిపోతుందా? లేదా? అని ఒక నిర్ణయానికి రావాలి. అలాగే ఫండ్ ఎంటర్, ఎగ్జిట్ లోడ్ తదితర చార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం తప్పనిసరి. గ్లోబల్ ఫండ్స్-ప్రయోజనాలు.. * మనకు అనువైన ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. * దేశీ, అంతర్జాతీయ పరిణామాల వల్ల ఒక్కో దేశపు మార్కెట్లు ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటాయి. దీంతో రిస్క్ ప్రభావం తక్కువగా ఉంటుంది. * ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ వల్ల రిస్క్ను తగ్గించుకోవచ్చు. * అవసరమైతే నిపుణులైన అంతర్జాతీయ ఫండ్ మేనేజర్ల సలహాలను తీసుకోవచ్చు. గ్లోబల్ ఫండ్స్-ప్రతికూలతలు.. కరెన్సీ ప్రభావం: ఫండ్ పనితీరుతో నిమిత్తం లేకుండా గ్లోబల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ను ఆయా దేశాల దేశీ కరెన్సీ బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మీరు బ్రెజిల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్పై రాబడి రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్ల పనితీరు. రెండు బ్రెజిల్ కరెన్సీ (రియాల్) - మన కరెన్సీ (రూపాయి) మారకం విలువ. మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్లు 10 శాతం పెరిగినా... బ్రెజిల్ కరెన్సీ 10 శాతం క్షీణించినట్లయితే మీ రిటర్న్ జీరోగా భావించాల్సి ఉంటుంది. ప్రాంతీయ రాజకీయాలు: గ్లోబల్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటేనే వివిధ దేశాల మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం. అందుకే మనం ఇన్వెస్ట్ చేసే ప్రాంతాల్లో ఏవైనా రాజకీయ సమస్యలు ఉత్పన్నమైతే వాటి ప్రభావం మన రాబడిపై ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఆయా దేశాల్లో వరదలు, భూకంపాలు వంటి ఇతర ప్రమాదాలు సంభవిస్తే వాటి ప్రభావం ఫండ్ రాబడిపై ఉంటుంది. అందుకే భౌగోళిక వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. -
ఎన్పీఎస్.. పన్ను ప్రయోజనాలు
నేను ఈ ఏడాది మొదట్లో ఒక ఫండ్లో రూ.10,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.13,000కు చేరింది. అయితే ఈ ఫండ్ పనితీరుతో నేను సంతృప్తిచెందలేకపోతున్నాను. దీంతో ఇదే మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన మరో ఫండ్కు ఈ ఇన్వెస్ట్మెంట్ను బదిలీ చేద్దామనుకుంటున్నాను. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్కు మారడం కొత్త ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తారు కదా ! ఈ ఇన్వెస్ట్మెంట్పై నేను ఈ ఏడాది పొందిన రూ.3,000పై మూలధన లాభాల పన్ను చెల్లించాలా? - ప్రసాద్, విశాఖపట్టణం పన్ను విధింపు దృష్ట్యా, ఇన్వెస్ట్మెంట్స్ను ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్కు మార్చడాన్ని ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి యూనిట్లు విక్రయించి, మరో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేసినట్లుగా పరిగణిస్తారు. మీ విషయంలో ఏడాది గడవక ముందే మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటున్నారు కాబట్టి మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్లో మీరు ఈ విషయం వెల్లడించాల్సి ఉంటుంది. ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్పై పొందిన రాబడులపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చార్జీలను పరిగణనలోకి తీసుకుంటే ఏ బీమాపాలసీలు ఉత్తమం. టర్మ్ పాలసీలు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్), మనీ బ్యాక్, ఎండోమెంట్ .. వీటిల్లో వేటిని ఎంచుకోవాలి? - క్రాంతి, నెల్లూరు జీవిత బీమా కవర్ కావాలనుకుంటే టర్మ్ ప్లాన్లు తీసుకోవం ఉత్తమం. టర్మ్ పాలసీలు పూర్తిగా బీమా పాలసీలు. వీటిల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. అందుకనే ఇవి చౌకగా లభిస్తాయి. ఇక యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యూలిప్)వివిధ రకాల చార్జీలు వసూలు చేస్తాయి. వీటికి సంబంధించిన పాలసీ బ్రోచర్లో చార్జీలు అనే శీర్షిక కింద అన్ని చార్జీలను ఆ యులిప్ను ఆఫర్ చేసే సంస్థ వెల్లడిస్తుంది. సంప్రదాయబద్ధ పాలసీలైన మనీ బ్యాక్, ఎండోమెంట్ పాలసీలు..తాము విధించే చార్జీల వివరాలను వెల్లడించవు. నేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైనా పన్ను సంబంధిత ప్రయోజనాలున్నాయా? - తన్మయి, హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ అవసరాల కోసం క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కల్పిస్తోంది. ఇది మార్కెట్తో అనుసంధానమై ఉన్న స్కీమ్. మీ ఇన్వెస్ట్మెంట్స్లో 50 శాతం వరకూ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే ఈపీఎఫ్ వంటి స్థిరాదాయ ఆప్షన్స్ కన్నా ఇలా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ మంచి రాబడులను ఇస్తుంది. ఇది చాలా సరళమైన స్కీమ్. నెలకు తక్కువలో తక్కువ కనీసం రూ.500 ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సెక్షన్ 80 సీసీడీ(1) కింద ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి (వేతనంలో(బేసిక్ ప్లస్ డీఏ) 10 శాతానికి మించకుండా) పన్ను రాయితీలు లభిస్తాయి. సెక్షన్ 80సీసీఈ కింద లభించే మొత్తం రాయితీ రూ.1.5 లక్షల్లోనే ఇది కూడా కలిసి ఉంటుంది. అయితే కొత్త బడ్జెట్ ప్రకారం, ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 లక్షల రాయితీకి అదనంగా రూ.50,000 వరకూ పొందే అవకాశం ఉంది. ఇక ఎన్పీఎస్ విత్డ్రాయల్స్పై పన్ను చెల్లించాల్సి ఉంటంది. ఎన్పీఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మెచ్యూర్ అయిన తర్వాత దాంట్లో 40 శాతం సొమ్ముతో యాన్యూటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ యాన్యూటిపై వచ్చే వడ్డీపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎన్పీఎస్లో టైర్ వన్, టైర్ టూ అని రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. టైర్ వన్ అకౌంట్లో ఏడాదికి కనీసం రూ.6.000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట మొత్తం ఏమీ లేదు. ఎన్పీఎస్ ప్రారంభించేటప్పుడు టైర్ టూ అకౌంట్లో కనీసం రూ.1,000 జమ చేయాలి. ఏడాదిలో కనీసం ఒకసారి జమ చేయాలి. ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీస మొత్తం బ్యాలెన్స్ రూ.2,000కు తగ్గకుండా ఉండాలి. టైర్ టూ అకౌంట్ అనేది స్వచ్ఛందమైన సేవింగ్స్ అకౌంట్. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎంత కావాలనుకుంటే అంత ఈ అకౌంట్ నుంచి మీ సొమ్ములను విత్డ్రా చేసుకోవచ్చు. ఫిక్స్డ్ మెచ్యురిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం ఏది ? - భాస్కర్, వరంగల్ ఫిక్స్డ్ మెచ్యురిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లో ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడూ సరైన సమయమే. అంచనా వేసిన రాబడులను నిర్దేశిత కాలానికి పొందవచ్చు. అయితే వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులున్నప్పుడు ఎఫ్ఎంపీల నుంచి మీరు ప్రయోజనం పొందలేరు. నెలకు రూ.20,000 చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ డబ్బులు నాకు ఆరు నెలల నుంచి ఏడాది కాలానికి అవసరం. రికరింగ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడులనిచ్చే ఫండ్స్ను సూచించండి. - సతీష్, నెల్లూరు రికరింగ్ డిపాజిట్ల కంటే కొంచెం ఎక్కువ రాబడులు కావాలనుకుంటే ఆల్ట్రా షార్ట్ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫ్రాంక్లిన్ ఇండియా ఆల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, డీడబ్ల్యూస్ ఆల్ట్రా షార్ట్టెర్మ్ ఫండ్, టారస్ ఆల్ట్రా షార్ట్టెర్మ్ బాండ్ఫండ్, బరోడా పయనీర్ ట్రెజరీ అడ్వాంటేజ్ ఫండ్.. మీ ఇన్వెస్ట్మెంట్స్కు ఈ ఫండ్స్ను పరిశీలించవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మిడ్క్యాప్ కన్నా లార్జ్క్యాప్ షేర్లే చౌక
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నిమేష్ షా వచ్చే ఏడాది నుంచి కార్పొరేట్ లాభాలు పెరుగుతాయి ♦ మూడేళ్ల కాలపరిమితితో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు ♦ వచ్చే రెండేళ్లలో వడ్డీరేట్లు 1.5% వరకు తగ్గొచ్చు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఏడాదిన్నర కిందటికీ ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో చాలా తేడా వచ్చిందని, ఇపుడు రిస్క్ పెరిగిందని చెబుతోంది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ సంస్థ. అందుకే ఇపుడు ఇన్వెస్ట్ చేసేవారు కనీసం మూడేళ్ల దృష్టితో పెట్టుబడి పెట్టాలని, గడిచిన రెండేళ్లుగా వస్తున్న లాభాలు ఈ ఏడాది కూడా వస్తాయని ఆశించటం అత్యాశేనని చెప్పారు సంస్థ ఎండీ, సీఈవో నిమేష్ షా. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన ఈక్విటీ, డెట్ మార్కెట్ల పనితీరుతో సహా పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివ రాలివీ... చౌక కాదు... ఖరీదూ కాదు! విలువ పరంగా చూస్తే దేశీయ మార్కెట్లు బాగా చౌకగా ఉన్నాయని చెప్పలేం. అలా అని మరీ ఖరీదని కూడా చెప్పలేం. ఏడాదిన్నర కిందటితో పోలిస్తే మార్కెట్లో కొద్దిగా రిస్క్ పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా లార్జ్ క్యాప్ షేర్లతో పోలిస్తే మిడ్క్యాప్ షేర్లు విలువ పరంగా అధిక ధరలో ట్రేడ్ అవుతున్నాయి. ఏడాదిన్నర క్రితం 3-4 పీఈ వద్ద ఉన్న మిడ్క్యాప్ షేర్లలో చాలా షేర్లు 30-40 పీఈ కంటే అధికంగా ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఇదే సమయంలో ప్రతి 100 లార్జ్క్యాప్ షేర్లలో 20 మాత్రమే అధిక పీఈ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రిస్క్ రివార్డ్ నిష్పత్తి ప్రకారం చూస్తే మిడ్ క్యాప్ కంటే లార్జ్ క్యాప్ షేర్లే ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మూడు నుంచి నాలుగేళ్ల దృష్టితో లార్జ్క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తున్నాం. కనిష్ట స్థాయికి ఆర్వోఈ : కార్పొరేట్ల లాభాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాటి లాభాల ఆర్జన(ఆర్వోఈ) కనిష్ట స్థాయికి చేరింది. కంపెనీల వాటి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. ఈ ఏడాది కూడా కంపెనీలు ఆదాయాలు అంతగా వృద్ధి కాకపోవచ్చు. అక్టోబర్ నుంచి ప్రభుత్వం రైల్వేలు, రహదారులపై పెద్ద ఎత్తున వ్యయం చేయనుండటంతో వచ్చే ఏడాది నుంచి కంపెనీల లాభాలు పెరిగే అవకాశం ఉంది. కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం 20 శాతం పెంచుకుంటే లాభాలు 40 నుంచి 50 శాతం పెరుగుతాయి. ఇది జరిగితే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పెరుగుతుంది. వచ్చే మూడేళ్లలో కంపెనీల లాభాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నాం. బుల్ రంగాలు..: కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇన్ఫ్రా రంగానికి నిధులు పెద్ద ఎత్తున కేటాయించింది. వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుంచి ఈ నిధుల కేటాయింపులు మొదలవుతాయని అంచనా వేస్తున్నాం. అందుకే ఈ రంగంతో నేరుగా సంబంధం ఉండే ఆటోమొబైల్, ఆటో మొబైల్ కాంపొనెంట్స్, రోడ్లు, రైల్వేలు, ప్రైవేటు బ్యాంకులు, ఇంజనీరింగ్ రంగాలతో పాటు ఎగుమతులపై ఆధారపడ్డ ఐటీ రంగాలపై బుల్లిష్గా ఉన్నాం. ఇదే సమయంలో రంగాలతో సంబంధం లేకుండా అధిక పీఈ వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లకు దూరంగా ఉంటున్నాం. వడ్డీరేట్లు ఎందుకు తగ్గుతాయంటే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వడ్డీరేట్లు పెరుగుతుంటే ఒక్క ఇండియాలో మాత్రమే తగ్గనున్నాయి. సాధారణంగా వడ్డీరేట్లు రిటైల్ ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉంటాయి. గతంలో రిటైల్ ద్రవ్యోల్బణం 11 శాతం ఉంటే వడ్డీరేట్లు 10 శాతంలోపు ఉండేవి. కానీ ఇప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంటే అంత కంటే అధిక స్థాయిలో వడ్డీరేట్లున్నాయి. అంతర్జాతీయంగా చమురు, లోహాల ధరలు తగ్గుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి వడ్డీ రేట్లు దిగి రాక తప్పదు. వచ్చే రెండేళ్ళలో వడ్డీరేట్లు 100 నుంచి 150 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. వడ్డీరేట్లు తగ్గేసమయంలో డెట్ పథకాలు కూడా మంచి రాబడులను అందిస్తాయి. భారీగా నిధులు దేశీ ఈక్విటీ మార్కెట్లపై రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత రెండేళ్లలో కొత్తగా 20 లక్షల మ్యూచువల్ ఫండ్ ఖాతాలు ప్రారంభం కావడమే దీనికి నిదర్శనం. 2007లో అన్ని బ్యాంకుల డిపాజిట్ల విలువ రూ.30 లక్షల కోట్లుగా ఉంటే ఇప్పుడిది రూ.90 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడి విలువ రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లకు చేరింది. మున్ముందు వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండటంతో డిపాజిట్ల నుంచి ఇతర అసెట్స్లోకి నగదు బదిలీ అవుతుంది. ప్రస్తుత తరుణంలో బంగారం, రియల్ ఎస్టేట్ ఆకర్షణీయంగాలేవు కనక అధిక మొత్తం ఈక్విటీల్లోకి వచ్చే చాన్స్ ఉంది. అమెరికా వడ్డీరేట్లు పెం చినా ఆ ప్రభావం మన మార్కెట్లపై అంతగా ఉండదు. ఈ సమయంలో మార్కెట్లు పడితే వాటిని కొనుగోళ్లకు వినియోగించుకోండి. -
ధరలు పెరుగుతూనే ఉంటాయి.. ఏం చేద్దాం?
ఐదేళ్ల కిందట ఇంజనీరింగ్ చదవటానికి రెండు లక్షలైతే... ఇపుడు ఆరు లక్షలవుతోంది. మరి మరో పదేళ్ల తరవాతో..? చదువే కాదు. పెళ్లి, ఇల్లు, కారు... దేన్ని తీసుకున్నాళ్లు గడిచేకొద్దీ ఖర్చు పెరిగిపోతూనే ఉంటుంది. కారణమేంటంటే... రూపాయి బలహీనపడటం, ధరలు పెరగటం. మరో మాటలో చెప్పాలంటే ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలంటే... పొదుపు చేసేటపుడైనా, పెట్టుబడులు పెట్టేటపుడైనా ఇలా ఏది చేసినా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని కూడా లెక్కగట్టాలి. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న మేరకు ద్రవ్యోల్బణం వచ్చే పదేళ్లలో 5 నుంచి 10 శాతం వరకూ ఉంటుందని భావించవచ్చు. దీన్ని లెక్కగడుతూ భవిష్యత్ అవసరాలను అంచనా వేయటమెలాగో... అందుకు తగ్గ సాధనాలేమిటో చూద్దాం. ఈక్విటీ-డెట్ ఇన్వెస్ట్మెంట్స్: దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ పొందడానికి ఈక్విటీ పెట్టుబడులు మంచివే. ఇందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం (సిప్) ఉత్తమం. దీనికి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులే బెటర్. అయితే మొత్తం సొమ్ము ఈక్విటీల్లోనే పెట్టడం సరికాదు. ఎందుకంటే ఈక్విటీల్లో కొన్ని సందర్భాల్లో రాబడి మాట దేవుడెరుగు... అసలు దక్కని పరిస్థితి ఉంటుంది. రిస్క్-రాబడిని సమతౌల్యంలో ఉంచుకోడానికి డెట్ ఇన్స్ట్రుమెంట్లలో కూడా పెట్టుబడులు పెట్టడం సముచిత నిర్ణయం. ఎప్పటికప్పుడు పరిశీలన: ఏదో ఒక సాధనంలో పెట్టుబడులు పెట్టేసి, ఇక పర్వాలేదనుకుంటూ ఇక దాని గురించి పట్టించుకోకపోవడం ఎంతమాత్రం మంచిది కాదు. ద్రవ్యోల్బణం కదలికలు, ఒకవేళ మీరు ఊహించినదానికన్నా ఈ ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంటే... లక్ష్యానికి అనుగుణంగా డబ్బు సమకూరడానికి ఇతర పెట్టుబడుల మార్గాలను అన్వేషిస్తుండాలి. ద్రవ్యోల్బణానికి తగినట్లుగా ప్రభుత్వాలు, సంస్థలు ప్రకటించే పథకాలపై దృష్టి పెట్టాలి. అంటే మీ పెట్టుబడులు-ద్రవ్యోల్బణం- లక్ష్యాలను ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటుండాలన్నమాట. బీమాతో ధీమా: జీవితంలో బీమా ధీమా అవసరం. ఇది ఒక కుటుంబ ఆర్థిక ప్రణాళికలు గాడితప్పకుండా కాపాడుతుంది. మీ కుటుంబ లక్ష్యాలకు అనుగుణంగా- తగిన ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు ఎంతో మంచివి. ద్రవ్యోల్బణం బారినుంచి రక్షించుకోడానికి తగిన ఆయుధంగా బీమా కవర్ ఉండాలి. దురదృష్ట వశాత్తూ మీరు లేకపోయినా మీ కుటుంబం అనుకున్న లక్ష్యాన్ని సాధించే స్థాయిలో బీమా కవరేజీ ఉండాలి. రిటైర్మెంట్ ప్లాన్: కుటుంబ బాధ్యతలకు సంబంధించి ప్రణాళికలు సరే. పదవీ విరమణ తరువాత సైతం ఖర్చులకు సాధ్యమైనంత తొందరగానే పొదుపు, పెట్టుబడి ప్రణాళికలు రూపొందించుకుని నిధులు సమకూర్చుకోవడం మంచిది. ముందుగానే తగిన ప్రణాళిక ద్వారా ఇక్కడా ధరల సమస్యనుంచి తప్పించుకోవచ్చు. ఉద్యోగం వచ్చిన నాటి నుంచే రిటైర్మెంట్ లక్ష్యంగా కొంత డబ్బు పెట్టుబడుల్లోకి మళ్లించాలి. -
లాభాలు... స్వల్పంగా
సెన్సెక్స్.. 28,463 నిఫ్టీ.. 8,610 ముంబై : ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ స్వల్పలాభాలతో గట్టెక్కింది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి ప్రధాన సంఘటనలు లేని కారణంగా ట్రేడింగ్ మందకొడిగా సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 28,463 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,610 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా 3వరోజూ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. టెక్నాలజీ, ఫార్మా, లోహ, కొన్ని వాహన షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. సాధారణం కంటే 6 శాతం తక్కువగానే వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించడం కొంత ప్రతికూల ప్రభావం చూపింది. వారంలో చూస్తే... ఈ వారంలో సెన్సెక్స్ 802(2.89 శాతం) పాయింట్లు, నిఫ్టీ 249 (2.98 శాతం)పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. నెల రోజుల్లో ఇంత ఎక్కువగా లాభపడిన వారం ఇదే. నిలకడగా కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ఫార్మా, వాహన షేర్ల పెరుగుదల... దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. ఎఫ్డీఐ నిబంధనల సరళీకరణ, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండడం వంటి కారణాల వల్ల సెన్సెక్స్ 28,576 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 28,417 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 8,643-8,593 పాయింట్ల గరిష్ట. కనిష్ట స్థాయిల మధ్య కదలాడి, చివరకు స్వల్పంగా 2 పాయింట్ల లాభంతో ముగిసింది. ప్రైవేట్ బ్యాంక్ షేర్లకు నష్టాలు.. అన్ని ఎఫ్డీఐలకు ఒకే పరిమితి అన్న విధానం నుంచి ప్రైవేట్ బ్యాంక్లను మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రైవేట్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో, 11 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,423 షేర్లు లాభాల్లో, 1,407 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,777 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.14,983 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,86,123 కోట్లుగా నమోదైంది. హెచ్డీఎఫ్సీ: నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్సీడీ), వారంట్లతో సహా వివిధ మార్గాల్లో రూ.90,000 కోట్లు సమీకరించనున్నది. వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది. బ్యాంక్ షేర్లలో తగ్గిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు బ్యాంక్ షేర్లలో మ్యూచువల్ ఫండ్ సంస్థల పెట్టుబడులు తగ్గాయి. ఈ ఏడాది మేలో రూ. 79,215 కోట్లుగా ఉన్న ఎంఎఫ్ పెట్టుబడులు గత నెలలో రూ.78,582 కోట్లకు తగ్గాయని సెబీ వెల్లడించింది. లాభాల స్వీకరణ కారణంగా ఫండ్ మేనేజర్లు బ్యాంక్ షేర్లపై పెట్టుబడులు తగ్గించుకున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. -
జాయింట్గా ఇన్వెస్ట్ చేస్తే పన్ను బాధ్యత ఎవరికి?
హెచ్డీఎఫ్సీ టాప్ 200 మ్యూచువల్ ఫండ్ పనితీరు గత రెండు నెలలుగా క్షీణిస్తూ వస్తోంది. ఇది ఆందోళన కలిగించే విషయమేనా ? ఈ ఫండ్ నుంచి వైదొలగి వేరే ఫండ్లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక కొనసాగమంటారా? - రూపాలి, హైదరాబాద్ హెచ్డీఎఫ్సీ 200 మ్యూచువల్ ఫండ్ పనితీరు గత 5-6 నెలల నుంచి క్షీణిస్తూ ఉన్న మాట వాస్తవమే. అయితే ఈ ఫండ్ ట్రాక్ రికార్డ్ని బట్టి చూస్తే దీర్ఘకాలానికి ఈ ఫండ్ మంచి రాబడులనే ఇచ్చిందని చెప్పవచ్చు. గత 10-15 ఏళ్లలో మంంచి పనితీరు కనబరిచిన మ్యూచువల్ ఫండ్స్లో ఇది కూడా ఒకటి. అయితే ఇటీవల కాలంలో ఈ ఫండ్ పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందడం సహజం. అయితే ఈ ఫండ్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మేం భావిస్తున్నాం. ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్ షేర్లు ఉన్నాయి. ఏడాది, అంతకుమించిన కాలానికి ఫండ్ పనితీరు బాగా లేకపోతే అప్పుడు ఈ ఫండ్ నుంచి వైదొలగే విషయాన్ని ఆలోచించవచ్చు. ఫండ్ పనితీరును ఎప్పటికప్పుడు గమనించడం మరచిపోకండి. నాకు నెలకు రూ.50,000 జీతం వస్తోంది. అన్ని ఖర్చులు పోను రూ.35,000 వరకూ ఆదా చేయగలుగుతున్నాను. పన్ను ఆదా కోసం ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. ప్రతీ ఏడాది రూ.50,000 ప్రీమియంగా చెల్లిస్తున్నాను. ఈ పాలసీ మరో 20 ఏళ్లు ఉంటుంది. ఇది కాక మరేవిధమైన ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఐదేళ్ల తర్వాత రూ.35 లక్షలతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. మిగిలే రూ.35,000కు మంచి రాబడులు వచ్చే ఇన్వెస్ట్మెంట్ మార్గాలను సూచించండి ? - రాజు, విశాఖపట్టణం ముందుగా మీరు చేయవలసింది మీ కోసం ఒక టర్మ్ పాలసీని తీసుకోవాలి. ఆ తర్వాత జీవన్ ఆనంద్ పాలసీని ఆపేయండి. దీని వల్ల పన్ను ఆదా పెద్దగా ఉండదు. పైగా చెప్పుకోదగ్గ రాబడులు కూడా రావు. ఏదైనా ట్యాక్స్ సేవింగ్ ఫండ్ను ఎంచుకోండి. దాంట్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో నెలవారీ సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా రూ.12,500 చొప్పున ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మిగిలిన మొత్తాన్ని ఏదైనా మంచి పనితీరు కనబరుస్తున్న గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. నెలకు రూ.35,000 చొప్పున ఐదేళ్ల పాటు ఏడాదికి 18 శాతం రాబడి వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే మీరు కోరుకున్న మొత్తాన్ని పొందగలరు. నేను మ్యూచువల్ ఫండ్స్లో కొంత మొత్తాన్ని నా భార్యతో కలసి ఇన్వెస్ట్ చేశాను. ఇలా భార్య లేదా తండ్రి లేదా తల్లి లేదా ఎవరైనా బంధువుతో కలసి జాయింట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను నిబంధనలు ఎలా ఉంటాయి. ఇలా జాయింట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్లందరూ పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - సుదర్శన్, నెల్లూర్ మ్యూచువల్ ఫండ్స్లో జాయింట్గా ఇన్వెస్ట్ చేస్తే, ప్రైమరీ హోల్డర్కే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే పన్ను బాధ్యత కూడా ఆ ప్రైమరీ హోల్డర్కే ఉంటుంది. రిటైర్మెంట్ అవసరాల నిమిత్తం ఒక నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. రానున్న 5-8 ఏళ్ల వరకూ రిస్క్ తీసుకోగలను. 2010 నుంచి సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్, రిలయన్స్ గ్రోత్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. అయితే ఈ ఫండ్స్కు 4-5 స్టార్ రేటింగ్ లేదు. ఈ ఫండ్స్ నుంచి వైదొలగమంటారా? - గంగాధర్, కరీంనగర్ సుందరం సెలెక్ట్ మిడ్ క్యాప్, రిలయన్స్ గ్రోత్ ఫండ్స్...ఈ రెండు ఫండ్స్ ఇప్పటికీ మంచి పనితీరునే కనబరుస్తున్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్లో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెడితేనే మంచి రాబడులు వస్తాయి. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసేవాళ్లు మార్కెట్లలో స్వల్పకాలిక ఒడిదుడుకులను పెద్దగా పట్టించుకోకూడదు. ఏ ఫండ్ రేటింగ్ అయినా 3 స్టార్స్ కంటే దిగువగా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్పై పునరాలోచన చేయాలి. ప్రస్తుతమున్న ఫండ్స్ నుంచి వేరే ఫండ్స్కు మారాలనుకుంటే, పన్ను సంబంధిత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదిలోపు ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటే, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
ఈఎల్ఎస్ఎస్లపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుందా?
మూడేళ్ల నుంచి కొన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటిల్లోనే ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? ఈ ఈఎల్ఎస్ఎస్ల నుంచి వైదొలగి వేరే స్కీమ్ల్లో ఇన్వెస్ట్ చేయమంటారా? తగిన సూచనలివ్వండి. - కృష్ణ తేజ, గుంటూరు మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లు మంచి రాబడులు ఇస్తున్న పక్షంలో వీటి నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అదనపు సొమ్ములుంటే వాటిని కూడా ఈఎల్ఎస్ఎస్ల్లో నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ఆదా ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఇన్వెస్ట్ చేశాను. ఏడాది కాలంలో ఒక ఈక్విటీ ఫండ్ నుంచి మరో ఈక్విటీ ఫండ్కు యూనిట్లను బదిలీ చేశాను. మరికొన్ని సార్లు ఈక్విటీ ఫండ్ నుంచి లిక్విడ్ ఫండ్కు బదిలీ చేశాను. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను బదిలీ మాత్రమే చేశాను. కానీ, వాటిని విక్రయించలేదు. అందుకని నాకు ఎలాంటి సొమ్ములు రాలేదు. యూనిట్లను బదిలీ చేసినందుకు నేను ఏమైనా పన్ను చెల్లించాల్సి ఉంటుందా? -ఖాలీ మస్తాన్ వలీ, తిరుపతి ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్కు ఇన్వెస్ట్మెంట్స్ను బదిలీ చేస్తే, పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ బదిలీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా జరిగినా, లేదా మరో విధంగా జరిగినా సరే. ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి యూనిట్లను ఉపసంహరించుకొని, మరో కొత్త మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడంగా యూనిట్ల బదిలీని పరిగణిస్తారు. మీరు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్కు యూనిట్లను ఏడాది కాలంలో బదిలీ చేస్తే, మీరు పొందే లాభాలపై 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ యూనిట్ల బదిలీ ఏడాది తర్వాత జరిగితే మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఒక లిక్విడ్ ఫండ్ యూనిట్లను మూడేళ్లలోపు వేరే మ్యూచువల్ ఫండ్కు బదిలీ చేస్తే మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు పొందే లాభాలను మీ మొత్తం ఆదాయానికి జత చేసి మీ ట్యాక్స్ స్లాబ్ననుసరించి పన్ను లెక్కిస్తారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్పై వచ్చే రాబడులు ఎక్స్పెన్స్ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకునే వెల్లడిస్తారా? ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)పై వచ్చే వడ్డీ పన్ను రహితమేనా? లేకుంటే ఏమైనా పన్నులు చెల్లించాలా? -సింధూరి, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్ వార్షిక వ్యయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే వాటి రాబడులను వెల్లడిస్తారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి రెండు రకాలైన చార్జీలను వసూలు చేస్తాయి. మొదటిది ఎక్స్పెన్స్ రేషియా. అంటే ఫండ్ నిర్వహణ, యాజమాన్య వ్యయాలు. ఒక మ్యూచువల్ ఫండ్ రాబడుల నుంచి ఈ వ్యయాలను తీసివేసిన తర్వాత ఎన్ఏవీని నిర్ణయిస్తారు. ఈక్విటీ ఫండ్స్కు ఈ ఎక్స్పెన్స్ రేషియో సాధారణంగా 2.5 శాతం నుంచి 3 శాతంగా ఉంటుంది. దీనిని వార్షిక ప్రాతిపదికన ప్రతీ ఏడాది వసూలు చేస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్ సంస్థలు వసూలు చేసే రెండో వ్యయం ఎగ్జిట్ లోడ్...ఇది ఒక్కసారి చెల్లించే చార్జీ. మ్యూచువల్ ఫండ్ నుంచి ఇన్వెస్టర్ వైదొలిగితే, (ఒక నిర్దేశిత కాలంలో) ఈ ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్కు వర్తించదు. ఒకవేళ ఈ చార్జీ వసూలు చేస్తే, ఈ మేరకు మీకు మీ రాబడుల్లో కోత పడుతుంది. ఇక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్పై మీకు ఎలాంటి వడ్డీ రాదు. వాటిని ఈక్విటీ ఫండ్స్గా పరిగణిస్తారు. మీరు ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు డివిడెండ్స్ వస్తాయి. మార్కెట్ పరిస్థితులను, ఆ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్లను బట్టి, ఆ స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్ సంస్థ స్వీకరించిన లాభాలను బట్టి ఈ డివిడెండ్లు వస్తాయి. ఈఎల్ఎస్ఎస్ల నుంచి వచ్చే డివిడెండ్లపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మూడేళ్ల నుంచి ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్లో సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మంచి రాబడులే పొందాను. అయితే ఇటీవల ఈ ఫండ్ పనితీరు బాగా లేదు. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? -సురేందర్, వరంగల్ ఏడాది కాలంలో ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ 57 శాతం రాబడిని అందించింది. ఇలాంటి తరుణంలో ఈ ఫండ్ నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు. ఈ ఫండ్ ఐదేళ్ల ట్రాక్ రికార్డ్ను పరిగణనలోకి తీసుకున్నా మంచి పనితీరునే కనబరిచింది. మా రేటింగ్స్ ప్రకారం ఇది ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్. ఇటీవలి పనితీరు ఆధారంగా ఈ ఫండ్ నుంచి వైదొలగాలనుకోవడం సమంజసం కాదు. మిడ్, స్మాల్-క్యాప్ కేటగిరీకి చెందిన ఫండ్స్లో ఇది ముఖ్యమైన ఫండ్ అని చెప్పవచ్చు. -
ఏడేళ్ల గరిష్ట స్థాయికి ఫండ్స్ ఈక్విటీ పెట్టుబడులు
సానుకూల సెంటిమెంట్ కారణం... న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఈ ఏడాది ఏప్రిల్లో రూ.7,600 కోట్లు ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. ఏడేళ్ల కాలంలో ఇదే గరిష్ట నికర పెట్టుబడికావడం విశేషం. ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మెరుగుపడుతుండడం, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతుండడం.. వీటన్నింటి ఫలితంగా సానుకూలంగా మారుతున్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్లు దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ, సెబీ వెల్లడించిన గణాంకాల ప్రకారం... గత నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థల నికర పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో రూ.7,618 కోట్లుగా ఉన్నాయి. 2008, జనవరి తర్వాత ఇదే అత్యధిక మొత్తం. ఆ నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థల నికర పెట్టుబడులు రూ.7,703 కోట్లుగా ఉన్నాయి. కాగా గత ఏడాది ఏప్రిల్లో స్టాక్ మార్కెట్ నుంచి మ్యూచువల్ ఫండ్ సంస్థలు రూ.2,698 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నాయి. ఇదే జోరూ ఈ ఆర్థిక సంవత్సరం కూడా... ఇక గత నెలలో డెట్మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ సంస్థల నికర పెట్టుబడులు రూ.28,650 కోట్లకు చేరాయి. గత ఏడాది కాలంగా ఈక్విటీ మార్కెట్పై మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఆసక్తి పెంచుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆరేళ్లలో ఇదే తొలి నికర పెట్టుబడులు పెట్టిన ఏడాది కావడం విశేషం. ఈక్విటీ మార్కెట్లో ఈ భారీ పెట్టుబడుల కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఈక్విటీ, డెట్ మార్కెట్లలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇదే విధంగా జోరుగానే ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. -
మ్యూచువల్ ఫండ్లకూ ‘సింగిల్ విండో’
మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. ఒక ఫారం నింపటంతో పాటు... ఇవ్వాల్సిన మొత్తానికి చెక్ రాసివ్వాలి. అదే సంస్థ ఆఫర్ చేస్తున్న వేరొక ఫండ్లో పెట్టుబడి పెడదామనుకుంటే... మరో ఫారం నింపి, మరో చెక్ ఇవ్వాలి. ఇతర సంస్థలు ఆఫర్ చేస్తున్న ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే... మళ్లీ కథ మొదటికే. అన్నిటికీ ప్రత్యేక ఫారాలు... ప్రత్యేక చెక్లు. వీటిన్నిటికీ విరుగుడుగా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ). ఒక సింగిల్ విండో లావాదేవీల ప్లాట్ఫారాన్ని ‘మ్యూచువల్ ఫండ్ యుటిలిటీ’ ’(ఎంఎఫ్యూ) పేరిట ఆరంభిస్తోంది. దీనిద్వారా ఎన్ని సంస్థలకు చెందిన ఎన్ని ఫండ్లలో పెట్టుబడి పెట్టినా... ప్రత్యేక ఫారాలు, ప్రత్యేక చెక్కులు అవ సరం లేదు. అదీ కథ. ఎంఎఫ్యూ ద్వారా జరిగే లావాదేవీలన్నీ ప్రాసెసింగ్ కోసం అసెట్ మేనేజిమెంట్ కంపెనీలు, లేక రిజిష్ట్రార్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు వెళ తాయి. ఈ ప్లాట్ఫారాన్ని యాక్సెస్ చేసుకోవటానికి మీకు ‘కామన్ అకౌంట్ నంబర్’ (క్యాన్) ఉండాలి. దీన్ని రిజిస్ట్రేషన్ ఫారం నింపి ఇవ్వటం ద్వారా ఏ ఎంఎఫ్ ఏజెన్సీ, లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గరైనా పొందవచ్చు. ఈ ప్లాట్ ఫారం వల్ల వ్యక్తులు 24 గంటల్లో ఎప్పుడైనా తమ మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్లను ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. పోర్టు ఫోలియో సమాచారమే కాక, ఇతర స్కీమ్ సంబంధ సమాచారాన్ని కూడా అప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఇంకా తమ ఇన్వెస్ట్మెంట్లను సమర్థంగా నిర్వహించుకోవటానికి వీలుగా అలెర్ట్లు, ట్రిగ్గర్లు, రిమైండర్ల వంటి విలువ ఆధారిత సేవలూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 25 ఏఎంసీ కంపెనీలు ఈ ఎంఎఫ్యూను వినియోగించుకోవటానికి అంగీకరించాయి. ఈ నెల 4వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. -
పీఎఫ్లోనా ? మ్యూచువల్ ఫండ్లోనా...?
నేనొక ప్రభుత్వ ఉద్యోగిని, ఇప్పటివరకూ నా పీఎఫ్లో కనీస మొత్తం మాత్రమే జమ అయ్యేలా చూసుకుంటున్నాను. ఇక ఇప్పటి నుంచి నెలకు రూ.5,000 పీఎఫ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. పదేళ్ల వరకూ ఈ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే ఆలోచనేదీ లేదు. ఇంత మొత్తం పీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా ? లేక ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమంటారా? ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడమే కరెక్టయితే, ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమంటారు? -రాజేశ్ బాబు, కడప నేనైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయమని చెబుతాను. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు రావాలంటే పీఎఫ్లో కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. పీఎఫ్లో సొమ్ములు భద్రంగా ఉంటాయి. కానీ, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులు మాత్రం రావు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్తో కూడుకున్నది అయినప్పటికీ, పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మంచి రాబడులే వస్తాయి. ప్రతినెలా రూ.5,000 చొప్పున ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే ద్రవ్యోల్బణాన్ని దీటుగా తట్టుకునే రాబడులు పొందవచ్చు. ఇక మీ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, ఏవైనా రెండు లార్జ్ అండ్ మిడ్క్యాప్ కేటగిరి ఫండ్స్లో కానీ, లేదంటే ఒక లార్జ్క్యాప్ ఫండ్, మరో మిడ్క్యాప్ ఫండ్లో వేర్వేరుగా ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్స్కు పరిశీలించదగ్గ కొన్ని ఫండ్స్-హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ బిల్డర్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సిక్యాప్, క్వాంటమ్ లాంగ్టెర్మ్ ఈక్విటీ, బిర్లా సన్లైఫ్ ఫ్రంట్లైన్ ఈక్విటీ ఫండ్. హెచ్డీఎఫ్సీ మిడ్-క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటిని ఎప్పటికప్పుడు కనీసం ఆరు నెలలకొకసారైనా సమీక్షించడం తప్పనిసరి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కు సెక్షన్ 80 సీ కింద రూ.లక్ష వరకూ పన్ను మినహాయింపులు ఉన్నాయి. 2014 బడ్జెట్లో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.లక్షన్నర వరకూ పెంచారు. ఈ బడ్జెట్లో ఈఎల్ఎస్ఎస్ల పన్ను మినహాయింపులకు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా? 2014-15కు పన్ను రాయితీలు పొందేందుకు ఒక్క ఈఎల్ఎస్ఎస్లో రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చా? అలా కాని పక్షంలో ఈఎల్ఎస్ఎస్ల నుంచి ఎంత ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు పొందవచ్చు? -కామేశ్, అనంతపురం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితి రూ. లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెరిగింది. అయితే పన్ను ఆదా చేసే స్కీమ్ల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. ఈఎల్ఎస్ఎస్కు గతంలో ఉన్న రాయితీలు ఇప్పుడు కూడా కొనసాగుతాయి. సెక్షన్ 80సీ కింద రూ. లక్షన్నర పన్ను మినహాయింపు పొందడానికి ఇంత మొత్తంలో ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఇది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి, రిస్క్ ఉంటుందనే విషయం మరచిపోవద్దు. మార్కెట్లు ఒడిదుడుకులుగా ఉంటాయి కాబట్టి ఈఎల్ఎస్ఎస్ల్లో నష్టాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సురక్షితమైన, ఇతర స్థిరాదాయ రాబడులున్నప్పుడు మాత్రమే మీరు ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఒకే మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ల్లో కాకుండా విభిన్నరకాలైన మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. క్వాంటమ్ ట్యాక్స్ సేవింగ్స్, రిలయన్స్ ఈక్విటీ ట్యాక్స్ సేవర్, ఐసీఐసీఐ ప్రు ట్యాక్స్ ప్లాన్, యాక్సిస్ లాంగ్ టెర్మ్ ఈక్విటీలు... ఇన్వెస్ట్మెంట్స్కు పరిశీలించదగ్గ కొన్ని ఈఎల్ఎస్ఎస్లు. ఎలాంటి బ్రోకరేజ్ చెల్లింపులు లేకుండా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాముందా? ప్రస్తుతం నేను డీమ్యాట్ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీమ్ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఒక్కో లావాదేవీకి రూ.25 ఖర్చవుతోంది. అయితే ఎలాంటి బ్రోకరేజ్ లేదా కనీస మొత్తం చెల్లింపులతో మ్యూచువల్ ఫండ్స్ను కొనుగోలు చేసే వీలుందా? -ప్రగతి, విజయవాడ ఎలాంటి బ్రోకరేజ్ చెల్లింపులు లేకుండా మ్యూచువల్ ఫండ్ డెరైక్ట్ ప్లాన్లలో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్ ఆఫీస్కు వెళ్లి సంబంధిత పత్రాలను నింపి ఈ ప్లాన్ల్లో ఎలాంటి బ్రోకరేజ్ చెల్లింపులు లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదంటే సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్సైట్ ద్వారా నేరుగా డెరైక్ట్ ప్లాన్ల్లో ఎలాంటి బ్రోకరేజ్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ యూనిట్లు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. ఆన్లైన్ స్టేట్మెంట్లు పొందవచ్చు. డీమ్యాట్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కొన్నట్లయితే, మీ డీమ్యాట్ అకౌంట్ను నిర్వహించే డిస్ట్రిబ్యూటర్ బ్రోకరేజ్ ఫీజును గానీ, కమిషన్ను గానీ వసూలు చేస్తారు. -
పోర్ట్ఫోలియో ఒకటే.. రేటింగ్లు వేరు?
నేను గత ఏడాది సెప్టెంబర్లో మోర్గాన్ స్టాన్లీ మ్యూచువల్ ఫండ్లో గ్రోత్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఏడాది జూన్ 27న ఇది హెచ్డీఎఫ్సీ లిక్విడ్ ఫండ్లో విలీనమైంది. విలీనమయ్యే రోజున గ్రోత్ ప్లాన్లో రూ.25,000, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో రూ.4,500 చొప్పున లాభాల్లో ఉన్నాను. నేను ఈ ఫండ్స్లోనే కొనసాగుతున్నాను. ఈ ఫండ్స్ విలీనం కారణంగా నేనేమైనా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) చెల్లించాలా? నా ఇన్వెస్ట్మెంట్ డేట్ను విలీనమైన తేదీనుంచి పరిగణిస్తారని అనుకుంటున్నాను. నేను ఆర్జించిన ఈ రూ. 25,000, రూ. 4,500పై నా పన్ను బాధ్యత ఎలా ఉంటుంది? - పావని, వైజాగ్ ఫండ్ల విలీనమంటే ఒక ఫండ్లోని ఇన్వెస్ట్మెంట్స్ను మరొక ఫండ్లోకి బదిలీ చేయడం. దీనిని ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకొని, మరొక ఫండ్లో కొత్తగా ఇన్వెస్ట్చేయడంగా భావిస్తారు. అంటే ఒక ఫండ్ యూనిట్స్ను అమ్మేసి, మరొక ఫండ్ యూనిట్స్ను కొనుగోలు చేయడంగా చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోళ్లు, అమ్మకాలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) చెల్లించాల్సి ఉంటుంది. ఫండ్స్ విలీనమైతే ఈ విషయాన్ని ఫండ్ హౌజ్లే చూసుకుంటాయి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్పై దీర్ఘకాల, స్వల్పకాల మూలధన లాభాల పన్నులు మాత్రం ఇన్వెస్టరే చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ను మూడేళ్లను మించి మీరు కొనసాగిస్తే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 20%(ఇండెక్సేషన్ తర్వాత) చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మూడేళ్ల కంటే తక్కువ కాలమే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. డెట్ఫండ్స్లో మీరు స్వల్పకాల మూల ధన లాభాలు గడిస్తే ఆ మొత్తాన్ని మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను లెక్కిస్తారు. ఇక మీ విషయానికొస్తే, ఇన్వెస్ట్మెంట్స్ కాలం ఏడాది కంటే తక్కువే ఉన్నందున మీరు గ్రోత్ ప్లాన్లో ఆర్జిం చిన రూ.25,000పై, డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్పై ఆర్జించిన రూ.4,500లపై స్వల్పకాల మూలధనలాభాల పన్ను చెల్లించాలి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) చెల్లించాల్సిన పనిలేదు. నేను ఈ ఏడాది జూన్లో హెచ్డీఎఫ్సీ మిడ్-క్యాప్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్లో సిప్ విధానంలో 12 నెలల పాటు ఇన్వెస్ట్ చేశాను. వచ్చే ఏడాది జూన్లో వీటిని నేను ఎన్క్యాష్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాను. అలా చేసుకోవచ్చా? అలాచేస్తే నాకు జూన్, 2015 నాటి ఎన్ఏవీ వర్తిస్తుందా? డిసెంబర్, 2015 నాటి ఎన్ఏవీ వర్తిస్తుందా? - శ్రీనివాస్, సూర్యాపేట మీరు ఏ రోజున మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటారో, ఏ రోజున ఉన్న ఎన్ఏవీనే మీ ఇన్వెస్ట్మెంట్స్ తుది విలువగా పరిగణిస్తారు. మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ను 2015 జూన్ 1న ఉపసంహరించుకుంటే, ఆ రోజు ఎన్ఏవీ, 2015 డిసెంబర్ 1న ఉపసంహరించుకుంటే ఆ రోజు ఎన్ఏవీ వర్తిస్తుంది. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ను స్వల్పకాలం కాకుండా దీర్ఘకాలం కొనసాగిస్తే మంచిది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ను దీర్ఘకాలం కొనసాగిస్తేనే మీకు మంచి రాబడులు వస్తాయి. అందుకని మీకు సొమ్ము అత్యంత అవసరం అయితేనే ఈ ఇన్వెస్ట్మెంట్స్ను వెనక్కితీసుకోండి. లేదంటే మరికొంత కాలం కనీసం మూడు సంవత్సరాల పాటు మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తే, మరిన్ని ప్రయోజనాలు పొందగలరు. ఒకే రకం మ్యూచువల్ ఫండ్ల రేటింగ్లు రెగ్యులర్ ప్లాన్కు ఒక రకంగా, డెరైక్ట్ ప్లాన్కు మరొకరకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఎస్బీఐ మ్యాగ్నమ్ గిల్ట్-లాంగ్టర్మ్, యూటీఐ గిల్ట్ అడ్వాండేజ్-లాంగ్టర్మ్ ఈ ఫండ్స్ రెగ్యులర్ ప్లాన్ల రేటింగ్లు, డెరైక్ట్ ప్లాన్ల రేటింగ్లు విభిన్నంగా ఉన్నాయి. ఈ రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్ల పోర్ట్ఫోలియోలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ, రేటింగ్లు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? - పర్వేజ్, హైదరాబాద్ ఒకే మ్యూచువల్ ఫండ్ల రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్ల రేటింగ్లు భిన్నంగా ఉండడం సహజమే. వాటి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ, వాటి రేటింగ్ల్లో తేడాలు ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్స్తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్స్ వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఫండ్ల పనితీరుపై వ్యయాలు కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపుతాయి. అందుకని రెగ్యులర్ ప్లాన్ల రేటింగ్స్తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్ల రేటింగ్స్ వాటితో సమానంగా కానీ, ఒక్కోక్కప్పుడు వాటి కంటే ఉత్తమంగా గానీ ఉంటాయి. -
న్యూ ఫండ్ ఆఫర్లో పెట్టుబడి సరికాదు...
నేను రూ. 2 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 2005లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.10 లక్షలు. నేను 20 శాతం ట్యాక్స్ స్లాబ్లో ఉన్నాను. నేను ఈ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటే ఎంత పన్ను చెల్లించాలి ? నా ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ను ఎలా చూపాలి? ఈ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని, నా మొత్తం ఆదాయానికి కలపాలా? అలా కలిపితే నేను 30 శాతం ట్యాక్స్ స్లాబ్కు చేరతాను. దయచేసి నా సందేహాలను నివృత్తి చేయండి? -పవన్, గుంటూరు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చనడానికి మీ ఇన్వెస్ట్మెంట్స్పై మీరు పొందిన లాభాలే నిదర్శనం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను కొన్న ఏడాది తర్వాత వాటిని విక్రయిస్తే పొందే లాభాలపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఏ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నా సరే ఇది వర్తిస్తుంది. ఒక వేళ ఏడాదిలోపే విక్రయిస్తే 15 శాతం షార్ట్టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాలి. ఇక మీ విషయానికొస్తే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి తొమ్మిదేళ్లయింది. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై మీరు ఆర్జించిన రూ.8 లక్షల లాభాలపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. మీ ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాభాలను మూలధన లాభాల ఆదాయం అనే హెడ్ కింద చూపించాలి. నేను ఇప్పుడు ఎన్ఎఫ్ఓ(న్యూ ఫండ్ ఆఫర్)లో గానీ, ప్రస్తుతమున్న ఏదేని ఫండ్లో గానీ ఒకేసారి రూ.50,000 ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్మెంట్పై మూడేళ్ల తర్వాత రూ.72,000 ఆశిస్తున్నాను. అప్పుడు నా సోదరి వివాహానికి ఈ సొమ్ములు అవసరం. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. -రంజని, హైదరాబాద్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసే ఆలోచన పూర్తిగా మానుకోండి. ఇది సరైనది కాదు. గత కొన్నేళ్ల పనితీరును మదింపు చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోవాలి. ఎన్ఎఫ్ఓలో అలాంటి అవకాశం ఉండదు కాబట్టి. ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్నే ఎంచుకోండి. ఒకేసారి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా కొంత కొంత మొత్తాల్లో క్రమం తప్పకుండా(సిప్-సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. ఇక మీ విషయానికొస్తే, మీ రూ.50,000 మొత్తాన్ని ఏదైనా ఒక బ్యాలెన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ తమ నిధుల్లో 65 శాతం మొత్తాన్ని ఈక్విటీలో, మిగిలిన మొత్తాన్ని డెట్ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిధుల కేటాయింపు సమతూకంగా ఉండేలా, మంచి రాబడులు వచ్చేలా, అదే సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా ఉండేలా బ్యాలెన్స్డ్ ఫండ్స్ పనితీరు ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని ఫండ్స్ను సూచిస్తున్నాం... హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాండేజ్, టాటా బ్యాలెన్స్డ్. ఈ మూడు ఫండ్స్ గత కొన్నేళ్లుగా మంచి పనితీరును కనబరుస్తున్నాయి. నా వయస్సు 29 ఏళ్లు. ఇటీవలే నా పెళ్లైంది. నా భార్య కూడా ఉద్యోగే. ఇద్దరం కలసి నెలకు రూ.70,000 వరకూ ఆర్జిస్తాం. మేం ఇంత వరకూ ఎలాంటి బీమా పాలసీలు తీసుకోలేదు. మా మీద ఆధారపడినవాళ్లు కూడా ఎవరూ లేరు. మాకు బీమా పాలసీలు అవసరమా? -అర్జున్, కర్నూల్ మీపై ఆధారపడిన వాళ్లు ఎవరూ లేనప్పటికీ, మీరు బీమా పాలసీలు తీసుకోవలసిందే. మీకు పెళ్లి అయిందంటే, మీకొక కుటుంబం ఉందన్నమాట. ఆ కుటుంబానికి బీమారక్షణ తప్పనిసరి. మీ వయస్సు చిన్నదే. ఈ వయస్సులో బీమా పాలసీ తీసుకుంటే మీరు తక్కువ ప్రీమియమే చెల్లిస్తే సరిపోతుంది. వీలైనంత త్వరగా ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీ తీసుకోండి. ఆలస్యమైన కొద్దీ, ప్రీమియం వ్యయాలు పెరుగుతుంటాయి. -
ఫండ్స్లో పెట్టుబడులు డీఎల్ఎఫ్ విక్రయించుకోవచ్చు
ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) నుంచి ఉపశమనం లభించింది. వచ్చే నెలలోగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన రూ. 1,806 కోట్లను వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తూ శాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ నెలలో రూ. 767 కోట్లు, డిసెంబర్లో మరో రూ. 1,039 కోట్ల విలువైన ఫండ్ యూనిట్లను విక్రయించుకునేందుకు డీఎల్ఎఫ్కు వీలు చిక్కింది. గత నెలలో డీఎల్ఎఫ్తోపాటు, ఆరుగురు కంపెనీ ఉన్నతాధికారులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి మూడేళ్లపాటు నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఫండ్స్లో పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ సూచనలమేరకు ఫండ్స్లో పెట్టుబడులను తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్కు సోమవారం అఫిడవిట్ను దాఖలు చేసింది. కాగా, సెబీ నిషేధ ఉత్తర్వులపై తుది విచారణను డిసెంబర్ 10న శాట్ చేపట్టనుంది. 2007 ఐపీవో దరఖాస్తుకు సంబంధించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని దాచిపెట్టిందన్న ఆరోపణలతో గత నెలలో డీఎల్ఎఫ్తోపాటు, చైర్మన్ కేపీ సింగ్ తదితర 6గురు ఎగ్జిక్యూటివ్లను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది. డీఎల్ఎఫ్పై సెబీ నిషేధం క్యాపిటల్ మార్కెట్లకే పరిమితమని కంపెనీ కార్యకలాపాలకు వర్తించదని ముగ్గురు సభ్యుల శాట్ బెంచ్ వ్యాఖ్యానించింది. సెబీ సైతం ఇందుకు అభ్యంతర ం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, రుణాలపై వడ్డీ చెల్లింపులు వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవచ్చునని శాట్ ప్రిసైడింగ్ అధికారి జేపీ దేవధర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు అవసరమైనప్పుడు తనఖాలో ఉంచిన డీఎల్ఎఫ్ అనుబంధ కంపెనీల షేర్లను విడిపించుకోవడం, వినియోగించుకోవడం వంటివి నిర్వహించుకోవచ్చునని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
డీఎల్ఎఫ్పై నిషేధంతో ఫండ్స్లో అయోమయం
ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్పై సెబీ నిషేధం... మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సంస్థలను అయోమయానికి గురిచేస్తున్నాయి. 2007లో ఐపీఓ సందర్భంగా కంపెనీకి సంబంధించిన కొంత సమాచారాన్ని వెల్లడించకుండా దాచిపెట్టిందన్న కారణంగా డీఎల్ఎఫ్, దాని వ్యవస్థాప చైర్మన్ కేపీ సింగ్తోపాటు మరో అయిదుగురు ఎగ్జిక్యూటివ్లపై సెబీ మూడేళ్లపాటు నిషేధం విధించడం తెలిసిందే. దీనివల్ల డీఎల్ఎఫ్ సుమారు రూ.2,500 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. ఎంఎఫ్లకూ సెబీ నియంత్రణ సంస్థే. అయితే, స్టాక్ మార్కెట్లకు సంబంధించి నిర్ణయాలన్నింటినీ ఫండ్స్పైనా రుద్దకూడదని ఒక ఎంఎఫ్ సంస్థకు చెందిన సీఈఓ అభిప్రాయపడ్డారు. కాగా, సెబీ నిషేధ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్(శాట్)లో సవాలు చేసిన డీఎల్ఎఫ్... ఫండ్స్ యూనిట్ల విక్రయంతోపాటు దేశీయంగా రూ.5,000 కోట్ల నిధుల సమీకరణకు వీలుగా మధ్యంతర ఉపశమనం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసింది. డీఎల్ఎఫ్ పిటిషన్ను ఈ నెల 30న శాట్ విచారించనుంది. -
పెట్టుబడులకు సరైన సమయం ఏది?
రెండేళ్లుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కో ఫండ్లో నెలకు రూ.4,000 చొప్పున నాలుగు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. దీంతో సిప్ విధానంలో కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో(రూ. 1 లక్ష) ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? - కార్తీక్, రాజమండ్రి మీ నిర్ణయం సరైనది కాదు. ఇన్వెస్ట్మెంట్స్కు సిప్ విధానమే సరైనది. సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల యావరేజింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. మీ విషయమే తీసుకుంటే, రూ. లక్ష మొత్తాన్ని నాలుగు ఫండ్స్ల్లో రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు. ఇలా ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం వల్ల పొందే ప్రయోజనాల కంటే కూడా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లభించే లాభాలే అధికం. నాకు ఇటీవలనే పెళ్లి అయింది. మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కానీ నాకు ఇదంతా కొత్త. ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయమేనా? - అక్షిత, కరీంనగర్ మార్కెట్లు ఉంటే బుల్ రన్లో లేదా బేర్ ఫేజ్లో గానీ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేయడానికి మార్కెట్లు ఎలా ఉన్నాయనేది ప్రధానాంశం కాకూడదు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, దీర్ఘకాల రాబడుల(కనీసం ఐదేళ్లు) దృష్ట్యానే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదని మరచిపోకండి. ఇన్వెస్ట్మెంట్స్కు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) అన్ని విధాలా ఉత్తమం. మీరు మ్యూచువల్ ఫండ్స్కు కొత్త కాబట్టి. మొదటిగా బ్యాలెన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. బ్యాలెన్స్డ్ ఫండ్స్ అయితే నిలకడైన వృద్ధిని సాధిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్పై మీకు తగినంత అవగాహన వచ్చిన తర్వాత మీ ఆర్థిక అవసరాలు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వివిధ రకాలైన మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నేను 2007 నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ నా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెం ట్స్కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పోయాయి. నా పర్మనెంట్ అకౌంట్ నంబర్(పాన్) లేదా నా పేరు ద్వారా ఇప్పటిదాకా చేసిన ఇన్వెస్ట్మెంట్ల వివరాలను పొందవచ్చా? - రాజేష్, గుంటూరు డాక్యుమెంట్లు పోయినప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్ల్లో మీ ఇన్వెస్ట్మెంట్ల వివరాలను పొందే వీలు ఉంది. మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో ఆ ఫండ్ పేరు గుర్తుంటే, ఆ వివరాలు పొందవచ్చు. చాలా ఫండ్ కంపెనీలకు రిజస్ట్రార్లుగా, ట్రాన్స్ఫర్ ఏజెం ట్లుగా కార్వీ, క్యామ్స్ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు అకౌంటింగ్ స్టేట్మెంట్లు తయారు చేస్తాయి. మీరు సదరు సంస్థ వెబ్సైట్లలోకి వెళ్లి, ఇన్వెస్టర్ సర్వీసెస్పై క్లిక్ చేసి, పాన్ నంబర్ను ఎంటర్ చేసి, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలని అడగండి. మీ ఇన్వెస్ట్మెంట్ వివరాలు మీకు లభించే అవకాశాలున్నాయి. లేదంటే ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇచ్చిన మీ ఫండ్ అడ్వైజర్ ద్వారానైనా ఆ వివరాలను పొందవచ్చు. నా రిటైర్మెంట్కు ఇంకా పదిహేనేళ్ల సమయం ఉంది. నా రిటైర్మెంట్ అవసరాల కోసం ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేయాలి? - సుజాత, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, రాశి కంటే కూడా వాసి ముఖ్యమనే విషయం గుర్తుం చుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మంచి రాబడులు పొందాలంటే డైవర్సిఫికేషన్ కీలకం. డైవర్సిఫికేషన్ ప్రయోజనాల కోసం 4 లేదా 5 ఫండ్స్ను ఎంచుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఫండ్స్ను ఎంచుకుంటే వాటి పనితీరును, తరచూ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మీ సమయం వృథా అవుతుంది. విభిన్న ఫండ్ మేనేజర్లు నిర్వహించే విభిన్నమైన ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ల సంఖ్య కూడా మరీ ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ. 10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ 7.2 శాతం ఎగిసింది. రూ. 10.6 లక్షల కోట్లకు చేరింది. భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం అంతక్రితం త్రైమాసికంలో ఇది రూ. 9.87 లక్షల కోట్లుగా నమోదైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ మే నెలలో తొలిసారిగా ఏయూఎంల విలువ తొలిసారిగా రూ. 10 లక్షల కోట్ల మార్కును దాటింది. ప్రస్తుతం 45 ఫండ్ హౌస్లు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ రూ. 1.41 లక్షల కోట్ల ఏయూఎంతో అగ్రస్థానంలోను, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ రూ. 1.27 లక్షల కోట్లతో రెండో స్థానంలో, రిలయన్స్ ఎంఎఫ్ రూ. 1.22 లక్షల కోట్ల ఏయూఎంతో మూడో స్థానంలో ఉన్నాయి. -
ఎగ్జిట్ లోడ్ సొమ్ము ఏం చేస్తారు.. ?
మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విక్రయాలపై విధించే ఎగ్జిట్ లోడ్ ద్వారా వచ్చిన సొమ్ములను ఫండ్ హౌస్ ఏంచేస్తుంది? ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏమిటి? సదరు ఫండ్ మొత్తం వ్యయాలను ఇది సూచిస్తుందా? ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వసూలు చేసే ఇతర చార్జీలేమైనా ఉన్నాయా? -ప్రణీత, గుంటూరు ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి తమ ఇన్వెస్ట్మెంట్స్ను ముందే ఉపసంహరించుకోవడాన్ని నిరోధించడానికి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ ఎగ్జిట్ లోడ్ను విధిస్తాయి. గతంలో ఫండ్ మేనేజర్ల వ్యయాలకు గాను ఎగ్జిట్ లోడ్ను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వసూలు చేసేవి. ఇప్పుడు ఈ ఎగ్జిట్ లోడ్ను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తిరిగి ఆ ఫండ్ స్కీమ్లోనే రీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు వచ్చే రిటర్న్లు పెరుగుతాయి. ఇక ఎక్స్పెన్స్ రేషియో విషయానికొస్తే కంపెనీ నిర్వహణ, వ్యవస్థాపన సంబంధిత వ్యయాలన్నింటినీ ఎక్స్పెన్స్ రేషియో ప్రతిబింబిస్తుంది. ఇంకా ఎక్స్పెన్స్ రేషియోలో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ ఫీజు, ట్రస్టీ ఫీజు, ఆడిట్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్(ఏజెంట్ కమిషన్తో కలిపి), ఇన్వెస్టర్ కమ్యూనికేషన్స్కు సంబంధించి వ్యయాలు, ఫండ్ ట్రాన్స్ఫర్ వ్యయాలు, అకౌంట్ స్టేట్మెంట్ వ్యయాలు, డివిడెండ్ రిడంప్షన్ చెక్లు, వారంట్ల వ్యయాలు, ప్రకటనల వ్యయాలు, ఇన్వెస్టర్ల అవగాహన వ్యయాలు, బ్రోకరేజ్ వ్యయాలు, సర్వీస్ ట్యాక్స్లు, లిస్టింగ్ వ్యయాలు, వంటి ఇతర వ్యయాలు ఉంటాయి. ఫండ్ వ్యయాలన్నీ కవర్ అయ్యేలా నిర్దేశిత పరిమితికి లోబడి ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేసుకోవచ్చని సెబీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు అనుమతిచ్చింది. టాప్ 15 నగరాలు కాకుండా ఇతర నగరాల ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్పై అదనంగా 0.30% అదనపు చార్జీ విధించవచ్చని సెబీ ఇటీవలనే మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు అనుమతిచ్చింది. మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? యూలిప్లలో మంచిదా? నేను బిర్లా సన్లైఫ్ ఫ్రంట్లైన్ ఈక్విటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది సరైనా నిర్ణయమేనా? ఐటీ చట్టం, సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను ప్రయోజనాలు ఆశించడంలేదు. కేవలం ఇన్వెస్ట్మెంట్స్పైనే నా దృష్టి. సరైన సూచనలివ్వండి. - సంతోష్ కుమార్, హైదరాబాద్ యూలిప్ల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడమే మంచిది. ఇన్వెస్ట్మెంట్కే కాదు బీమాకు కూడా పెట్టుబడులకు యూలిప్లను పరిగణించకూడదు. యూలిప్లకు వ్యయాలు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. యూలిప్ పాలసీ తీసుకున్న పక్షంలో మీరు 4,5 ఏళ్ల పాటు అధిక వ్యయాలు చెల్లించాల్సి ఉంటుంది. యూలిప్లతో పోల్చితే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు చార్జీలు తక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు గరిష్టంగా ఈక్విటీ ఫండ్స్పై 2.5%, డెట్ఫండ్స్ 2.25 శాతం చొప్పున ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తాయి. యూలిప్లు తొలి ఏడాదిలోనే విధించే చార్జీ కనీసం 5-6 %. మ్యూచువల్ ఫండ్స్ తమ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాన్ని, పోర్ట్ఫోలియోలను పారదర్శకంగా ఉంచుతాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫండ్స్ నుంచి వైదొలగవచ్చు. అదే యూలిప్ల విషయంలో అయితే లాకిన్ పీరియడ్ ఐదేళ్ల వరకూ ఉంటుంది. ఇక ఈక్విటీ ఫండ్ ఎంపిక విషయానికొస్తే, మీ అవసరాలు, భరించగలిగే రిస్క్ వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈక్విటీ ఫండ్ను ఎంచుకోవాలి. బిర్లా సన్లైఫ్ ఫ్రంట్లైన్ ఈక్విటీ ఫండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్. దీనికి మా వేల్యూ రీసెర్చ్ ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. నిరభ్యంతరంగా దీనిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. నేనొక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఫండ్ పోర్ట్ఫోలియోలోని షేర్లు డివిడెండ్లు ఇస్తే, వాటిని మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుంది? ఇలాంటి డివిడెండ్ను ఏ ఫండ్ ఎంత ఆర్జించిందో ఎలా తెలుసుకోవచ్చు? - బిస్మిల్లా, నిజామాబాద్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తాను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ నుంచి పొందిన డివిడెండ్ వివరాలను వెల్లడించే నిబంధనలేవీ లేవు. డివిడెండ్స్ చెల్లించే షేర్లలోనే డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ తమ స్కీమ్ల పోర్ట్ఫోలియోల వివరాలను నెలవారీ పద్ధతిన వెల్లడిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) మదింపు, పోర్ట్ఫోలియో వేల్యూయేషన్, స్వీకరించిన డివిడెండ్ల తాలూకు అకౌంటింగ్...ఇవన్నీ కఠినమైన నియమ నిబంధనలతో గణించాల్సి ఉంటుంది. అందుకని ఈక్విటీ ఫండ్స్ పొందే డివిడెండ్స్ విషయమై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ ఈక్విటీ ఫండ్ అయినా డివిడెండ్లు పొందితే, మీ రాబడులు, ఎన్ఏవీ కూడా పెరుగుతాయి. -
ఉద్యోగం లేకున్నా రిటర్నులు దాఖలు చేయాలా?
ఏడాది క్రితం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే కొంత మొత్తాన్ని ఈ ఫండ్ నుంచి ఉపసంహరించుకున్నాను. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏడాది కాలానికి మించి ఇన్వెస్ట్ చేస్తే, వాటిపై వచ్చే రాబడులపై ఎలాంటి పన్ను ఉండదని మిత్రులు చెపుతున్నారు. అయితే బ్యాలెన్స్డ్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడులపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుందా? - శేఖర్, అనంతపురం బ్యాలెన్స్డ్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ కేటగిరీ కిందకు వస్తాయి. వీటిల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకూ ఈక్విటీల్లో పెట్టుబడులు పెడతారు. ఈక్విటీ ఫండ్స్కు ఎలాంటి పన్ను నియమాలు వర్తిస్తాయో బ్యాలెన్స్డ్ ఫండ్స్కు కూడా అలాంటి పన్ను నియమాలే వర్తిస్తాయి. మీ విషయానికొస్తే, ఒక ఏడాది తర్వాత మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏడాది కాలం కంటే ముందే మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే మాత్రం 15 శాతం చొప్పున స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.., ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)కు సెక్షన్ 80 సీ ప్రకారం, పన్ను మినహాయింపు ఉంది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ కాలానికి రూ.లక్ష వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులను రూ.లక్షన్నరకు పెంచారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈఎల్ఎస్ఎస్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తం పన్ను మినహాయింపు పొందవచ్చా? అలా కుదరని పక్షంలో పన్ను మినహాయింపు పొందడానికి ఈఎల్ఎస్ఎస్లో ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు. - సుజాత, హైదరాబాద్ పన్ను ఆదా చేసే మార్గాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సి కింద ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపులను రూ. లక్ష నుంచి రూ.లక్షన్నరకు ప్రభుత్వం పెంచింది. ఈ సెక్షన్ కింద పూర్తిగా రూ. లక్షన్నర పన్ను మినహాయింపు పొందాలంటే, రూ. లక్షన్నర మొత్తం ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నాకు, నా భార్యకు ఎన్పీఎస్ టైర్-వన్ అకౌంట్లు ఉన్నాయి. ప్రతీఏటా ఈ అకౌంట్లలో కొంత మొత్తం జమ చేస్తూ ఉన్నాము. అయితే మేం పనిచేసే కంపెనీ ఈ అకౌంట్లలో ఎలాంటి మొత్తాన్ని జమ చేయడం లేదు. ఆదాయపు పన్ను చట్టం కింద మేం ఈ అకౌంట్ ద్వారా ఏమైనా పన్ను మినహాయింపులు, తగ్గింపులు గానీ పొందొచ్చా? - పరమేశ్, జగిత్యాల మీరు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నవారై, మీ కంపెనీ తరపు నుంచి మీ అకౌంట్లలో ఏ మాత్రం సొమ్ములు జమ కాని పక్షంలో, సెక్షన్ 80 సీసీడీ(1) కింద మీరు పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. మీ వేతనం(బేసిక్, డీఏలతో కలుపుకొని)లో 10 శాతం వరకూ పన్ను తగ్గింపు పొందవచ్చు. దీనికి పరిమితి రూ. 1లక్ష వరకూ ఉంది. నా భార్యకు కొడుకు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసింది. అంతకు ముందు ఆమె తాను సంపాదించిన ఆదాయంతో సొంతంగా పొదుపు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేది. ఆదాయపు పన్ను రిటర్న్లు కూడా దాఖలు చేసేది.ఇప్పుడు ఉద్యోగం లేనందున ఎలాంటి వేతనం ఆమె పొందడం లేదు. అయితే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆమె కొంత మొత్తం (చాలా తక్కువగా రూ.5,000 లోపు) ఆదాయం పొందుతోంది. ఆమె ఆదాయపు పన్ను రిట ర్న్లు దాఖలు చేయాలనుకుంటున్నాను. అయితే ఐటీఆర్-2 ద్వారా ఐటీ రిటర్న్లు దాఖలు చేయాలా? లేకుంటే ఆమె ఆదాయాన్ని నా ఆదాయంతో కలిపి నా ఐటీ రిటర్న్లో చూపిస్తే సరిపోతుందా? - సయ్యద్ రిజ్వి, హైదరాబాద్ తప్పనిసరి కాకపోయినప్పటికీ, మీ భార్య ట్యాక్స్ రిటర్న్లు దాఖలు చేయవచ్చు. ఐటీఆర్-2 ద్వారా ఆమె ఐటీ రిటర్న్లు దాఖలు చేయవచ్చు. ఆమె తన సొంత సంపాదన ద్వారా ఆర్జించిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, క్యాపిటల్ గెయిన్స్ పొందుతున్న పక్షంలో సొంతంగా ట్యాక్స్ రిటర్న్లు దాఖలు చేయడమే ఉత్తమం. ఒకవేళ పన్ను భారాన్ని తగ్గించుకునే నిమిత్తం మీరు ఆమె పేరు మీద ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఈ విషయం ఆదాయపు పన్ను అధికారుల దృష్టికి వస్తే, మీకు సమస్యలు తప్పవు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. -
ప్లాన్తోనే ఫండింగ్ చేద్దాం..!
చాలా సందర్భాల్లో ఆర్థిక లక్ష్యాల కంటే విహార యాత్రలకు చక్కటి ప్లానింగ్ చేసుకుంటాం. బహుశా దీనికి ప్రధాన కారణం విహార యాత్రలకు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా సులభమై ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? ఎంత దూరం, డబ్బు ఎంత అవసరం అవుతుంది... అని ఎలా ముందుకు లెక్కలు వేసుకుంటామో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా అదే విధంగా సిద్ధం కావాలి. మనలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ ఫండ్సే అనుకుంటారు. వివిధ అవసరాలకు అనుగుణంగా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయన్న సంగతి తెలియదు. ఉదాహరణకు ఈక్విటీ పథకాల విషయానికి వస్తే.. అందులోనే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, డైవర్సిఫైడ్, థీమాటిక్ వంటి భిన్నమైన పథకాలున్నాయి. ఇవి కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ (లిక్విడ్, షార్ట్టర్మ్, డైనమిక్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఎఫ్ఎంపీ), హైబ్రీడ్ ఫండ్స్ ( బ్యాలెన్స్డ్, ఎంఐపీ) వంటి అనేక పథకాలున్నాయి. మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకాలు దోహదం చేస్తాయి. లక్ష్యానికి అనుగుణంగా సరైన పథకాన్ని ఎంచుకుంటే విజయలక్ష్మి మిమ్మల్ని వరించడం ఖాయం. మ్యూచువల్ ఫండ్స్తో పోర్ట్ఫోలియో తయారు చేసుకునేటప్పుడు అందులో ఏ విధమైన పథకాలుండాలి, పరిశీలించాల్సిన అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం... ఎక్కడున్నారు? ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకునే ముందు ఇన్వెస్ట్మెంట్పరంగా మీరు ఎక్కడున్నారు? ఆర్థిక లక్ష్యం ఏమిటి? అన్న వాటిపై ముందుగా స్పష్టత ఏర్పర్చుకోవాలి. దీనికి అనుగుణంగా మీ పోర్ట్ఫోలియోలో ఈక్విటీ, ఫిక్స్డ్, బంగారం వంటి వాటికి ఎంతెంత కేటాయించాలో నిర్థారించుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు మీ ఆర్థిక లక్ష్యాలు, దానికి ఎంత మొత్తం అవసరమవుతుంది అన్నది కాగితంపై రాసుకోండి. సొంతింటి నిర్మాణం, కొత్త కారు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇలా ఏదైనా సరే లక్ష్యాన్ని నిర్ణయించుకొని, దానికి ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కించండి. ఎప్పటిలోగా... లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత వీటిని చేరుకోవడానికి ఎంత కాలపరిమితి ఉందనేది కీలకమైనది. కాలపరిమితి ఆధారంగా ఇన్వెస్ట్ చేసే పథకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. లక్ష్యం దీర్ఘకాలమై, 10 కంటే ఎక్కువ ఏళ్లు ఉంటే అప్పుడు ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకోవచ్చు. అదే మధ్య కాలిక లక్ష్యాల (4-8 ఏళ్లు)కైతే కొద్దిగా రిస్క్ తక్కువగా ఉండే హైబ్రీడ్ ఫండ్స్, అదే 2-3 ఏళ్ల స్వల్పకాలిక లక్ష్యాలకు ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాలు అనువుగా ఉంటాయి. పెరిగే ధరలు.. ధరలు ఏటా పెరుగుతుంటాయి. అందుకే ఇప్పటి ధరల ఆధారంగా కావాల్సిన మొత్తాన్ని నిర్దేశించుకుంటే.. చివర్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతారు. అందుకే లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు మీరు కొందామనుకున్న కారు ధర రూ. 5 లక్షలు ఉందనుకుందాం. కానీ కారు కొనేది మూడేళ్ల తర్వాత. ఏటా సగటు ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉందనుకుంటే మూడేళ్లలో ఇదే లక్ష్యాన్ని చేరుకోవడానికి రూ. 5.79 లక్షలు అవసరమవుతాయి. దీని ప్రకారం మీ లక్ష్యాలకు కావల్సిన మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. ఎంత దాచగలరు? చాలామంది పొదుపు అనగానే ఒకేసారి పెద్ద మొత్తాన్ని బ్యాంకు డిపాజిట్లు, బీమా పథకాల రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రతీ నెలా కొంత మొత్తం చొప్పున క్రమానుగతంగా (సిప్) ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది. దీని వల్ల జేబుకు అంత భారం ఉండదు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో సిప్ విధానమే బెస్ట్. ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తాన్ని బట్టి కాలపరిమితి తీరిన తర్వాత ఎంత మొత్తం వస్తుందన్న విషయంపై కూడా ఒక అవగాహనకు రావచ్చు. ఉదాహరణకు లార్జ్క్యాప్ ఫండ్స్ గడిచిన పదేళ్లలో సిప్ విధానంలో 14-15 శాతం రాబడిని అందిస్తే, బ్యాలెన్స్డ్ ఫండ్స్ 12.5 శాతం, ఇన్కమ్ ఫండ్స్ 8 శాతం రాబడిని ఇచ్చాయి. ఈ ప్రకారం చూస్తే మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతే ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేసే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. నష్ట భయాల మాటేంటి?.. పోర్ట్ఫోలియో పథకాల ఎంపికలో రిస్క్ సామర్థ్యం అనేది అత్యంత కీలకమైన అంశం. నష్టభయాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంటే రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీ పథకాలకు ఎక్కువ కేటాయించుకోవచ్చు. మీ వయస్సు, ఇప్పటి వరకు పొదుపు చేసిన మొత్తం, లక్ష్య కాలపరిమితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చు. నిర్వహణ ముఖ్యమే... మ్యూచువల్ ఫండ్ పథకాలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమాటిక్ ట్రాన్సఫర్ ప్లాన్ (ఎస్టీపీ), సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూ) వంటి అనేక నిర్వహణ అవకాశాలను కల్పిస్తోంది. వీటి ద్వారా మీ పోర్ట్ఫోలియోను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. లక్ష్యాన్ని చేరుకుంటే... రిస్క్ తక్కువగా ఉండే పథకాల్లోకి ఎస్టీపీ ద్వారా మార్చుకోవచ్చు. అలాగే రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం ఎస్డబ్ల్యూను వినియోగించుకోవచ్చు. -
మార్కెట్లోకి పీఎస్యూల నగదు నిల్వలు!
బడ్జెట్లో ప్రకటించే అవకాశం... న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలకోసం ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)ల వద్దనున్న మిగలు నగదు నిల్వలను మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)లలో ఇన్వెస్ట్ చేసేలా అనుమతించాలని ప్రభుత్వానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచించింది. దీంతోపాటు పెన్షన్ ఫండ్స్ అన్నింటికీ ఒకేవిధమైన పన్నువిధానాన్ని వర్తింపజేయాలని కూడా కోరింది. ప్రధానంగా భారతీయ మార్కెట్లు విదేశీ పెట్టుబడులపై మరీ అధికంగా ఆధారపడకుండా చేయడం, దీర్ఘకాలిక పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు వీలుగా పీఎస్యూల మిగులు నిల్వలను ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని... వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత సీనియర్ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టే ఎంఎఫ్లకు పన్ను ప్రయోజనాలు, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) వద్దనున్న రూ.5 లక్షల కోట్లకు పైగా మూల నిధిలో కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని కూడా సెబీ కోరుతోంది. మరోపక్క, కార్పొరేట్లు కూడా తమ సొంత పెన్షన్ ఫండ్లను ప్రారంభించాలని, వీటిలోని కొన్ని నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా వెచ్చించాలనేది సెబీ సూచన. దేశంలో స్టాక్ మార్కెట్లకు విదేశీ నిధులే ప్రధాన ఇంధనంగా పనిచేస్తున్నాయి. ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాప్(ప్రమోటర్లవద్దనున్న షేర్లు కాకుండా ఇన్వెస్టర్ల వద్దనున్న స్టాక్స్ విలువ)లో సగానికి సగం విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)వద్దే ఉండటం దీనికి నిదర్శనం. అంతేకాదు భారత్ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేసే నిధుల్లో దాదాపు సగభాగం వివిధ దేశాల్లోని పెన్షన్ ఫండ్స్ నుంచి తరలివస్తున్నాయి. భారత్లో మాత్రం పెన్షన్ నిధులను స్టాక్స్లో పెట్టుబడిగా వెచ్చించేందుకు అనుమతులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం నవరత్న, మినీరత్న కేంద్ర పీఎస్యూలకు మాత్రమే ప్రభుత్వ రంగ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. అలాకాకుంగా మొత్తం పీఎస్యూలన్నింటినీ తమ మిగులు నగదు నిల్వలను ఫండ్స్లో పెట్టుబడులకు అనుమతించాలనేది సెబీ వాదన. దేశంలో మొత్తం 250కిపైగా కేంద్ర పీఎస్యూలు ఉన్నాయి. వీటివద్దనున్న నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం సుమారు రూ.3 లక్షల కోట్లుగా అంచనా. -
ఎంత రిస్క్ అయినా ఓకే!
ఇటీవలనే ఎస్బీఐ ఎఫ్ఎంసీజీ ఫండ్లో రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఇది సరైన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయమేనా? - ప్రకాశ్, వరంగల్ ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. అదీ ఎస్బీఐ ఎఫ్ఎంసీజీ వంటి ఒకే రంగానికి చెందిన ఫండ్లో ఇలా ఇన్వెస్ట్ చేయడం అస్సలు సరైనది కాదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేది సాధారణంగా డైవర్సిఫికేషన్ ప్రయోజనాల కోసం. ఇక మీ విషయానికొస్తే ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ, గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ రంగం మంచి పనితీరునే కనబరుస్తోంది. అయితే మార్కెట్లలో నెలకొన్న ప్రస్తుత ఆశావహ పరిస్థితులను బట్టి చూస్తే, ప్రస్తుత బుల్ రన్లో ఇతర రంగాలు దూసుకుపోయినట్లుగా ఎఫ్ఎంసీజీ రంగం దూసుకుపోకపోవచ్చు. అందుకని మీ ఇన్వెస్ట్మెంట్లను డైవర్సిఫై చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. నేను 2010లో సుందరం ట్యాక్స్ సేవర్లో రూ.80,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.87,000. నా ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించాలా? ఉపసంహరించుకోమంటారా? - కృష్ణ, విజయవాడ గత ఐదేళ్లు చాలా ఈక్విటీ ఫండ్స్కు కలసిరాలేదు. సుందరం ట్యాక్స్ సేవర్ దీనికి మినహాయింపు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు టర్న్ అరౌండ్ అయ్యే సూచనలున్నాయి. ప్రస్తుత బుల్న్ల్రో ఈ ఫండ్ మంచి పనితీరు కనబరిచే అవకాశాలున్నాయి. దీంతో మీ ఇన్వెస్ట్మెంట్స్పై రాబడి మరింతగా మెరుగుపడవచ్చు. మార్కెట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫండ్ మంచి రాబడులనే ఇవ్వవచ్చు. అందుకని తొందరపడి మీ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకోకుండా, కొనసాగించండి. నేను గత 5-6 ఏళ్లుగా ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సిక్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఫండ్స్ల్లో రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలా 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నా ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకోమంటారా ? - ఆదిత్య రెడ్డి, కడప సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రయోజనాలను మీరు పొందుతున్నారని చెప్పవచ్చు. గత ఐదేళ్లుగా మార్కెట్లు బాగా లేవు. అయినా, మీ ఇన్వెస్ట్మెంట్స్ మంచి రాబడులనే సాధించాయని చె ప్పొచ్చు. దీనికి కారణం మీరు ఒక పద్ధతి ప్రకారం మంచి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడమే. మీరు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి, నిస్సందేహంగా ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించండి. ఇప్పడే పెట్టబడులను ఉపసంహరించుకోకండి. నేను నెలకు రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఎంతటి రిస్క్నైనా భరిస్తాను. నా ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి మూడేళ్లు. కొన్ని మంచి ఫండ్స్ సూచించండి? - మాళవిక, హైదరాబాద్ దూకుడుగా ఉండే ఇన్వెస్టర్లు మంచి రాబడుల కోసం ఎంతటి రిస్క్నైనా భరిస్తారు. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్తో ఒక చక్కటి పోర్ట్ఫోలియోను నిర్మించుకుంటారు. మూడేళ్ల కాలవ్యవధి దృష్ట్యా ఇది అత్యంత రిస్క్తో కూడుకున్న వ్యూహమని చెప్పవచ్చు. కొంచెం అటూ, ఇటూ అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ సగానికి సగం తగ్గిపోవచ్చు. ఈ విషయాన్ని తట్టుకోగలిగితే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్స్కు పరిశీలించదగ్గ ఫండ్స్- యాక్సిస్ మిడ్క్యాప్, బీఎన్పీ పారిబస్ మిడ్క్యాప్, మిరా అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్. మీ ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధికి ఇవి ఉత్తమమైన ఫండ్స్ అని చెప్పవచ్చు. అయితే మార్కెట్లు బాగా లేకపోతే భారీ నష్టాలు రావచ్చని మరువకండి. నేను ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇటీవల ఈ ఫండ్ ర్యాంకింగ్ బాగా పడిపోయింది. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ఆపేసి, ఇంతవరకూ ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఉపసంహరించుకోమంటారా? అలా చేసినట్లయితే ఇలా ఉపసంహరించుకున్న సొమ్ములను దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారు? - మహ్మద్ ఇంతియాజ్, తిరుపతి ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ అనేది మంచి లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఒకటి. గత 20-25 ఏళ్లుగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్. ఇటీవల ఈ ఫండ్ ర్యాంకింగ్ తగ్గినప్పటికీ, ఫండ్పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకని ఈ ఫండ్ పట్ల నిరాశ పడాల్సిన పనిలేదని చెప్పవచ్చు. ఈ ఫండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ల్లోనే ఇన్వెస్ట్ చేస్తోంది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈ దృష్ట్యా, మీరు ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించి ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ లేదా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ లేదా క్వాంటమ్ లాంగ్టర్మ్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్స్ ట్రాక్ రికార్డ్లు బావున్నాయి. -
భవిష్యత్తులో పసిడికి డిమాండ్
హిందువుల పర్వదినాల్లో అక్షయ తృతీయది ప్రత్యేక స్థానం. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే సిరిసంపదలకు లోటు ఉండదని భావిస్తారు. ఈ రోజు అన్నపూర్ణ దేవి, పరుశురాముడు జన్మించడం, ఇదే రోజు కుబేరుడికి సంపద రావడం, వినాయకుడు మహాబారత రచనను ప్రారంభించడం వంటి అనేక సంఘటనలు జరగడంతో దీన్ని హిందువులు చాలా పవిత్రమైన దినంగా కొలుస్తారు. ఈ రోజు బంగారం కొంటే అది అక్షయము అవుతుందన్న నమ్మకం. ఈ నమ్మకాల మాట అటుంచితే.. గత కొంతకాలంగా లాభాలు అందించని బంగారం రానున్న కాలంలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. ధర మళ్లీ పైకే: అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, డాలరు రూపాయి మారకం వంటి అనేక అంశాల వల్ల ఏడాది కాలంగా బంగారం స్థిరంగా కదులుతోంది. కాని ఇదే సమయంలో చైనాలో బంగారం వినియోగం బాగా పెరుగుతోంది. రానున్న కాలంలో చైనాలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇండియాకి సంబంధించి పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో ఇక్కడ కూడా పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం సుంకాలు విధించి, దిగుమతులపై ఆంక్షలు పెట్టడంతో బంగారం లభ్యత తగ్గి ధరలు పెరిగే విధంగా చేస్తోంది. బాసెల్-3 నిబంధనలు అందుకోవడానికి ప్రపంచంలోని పలు బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకునే పనిలో ఉన్నాయి. కాని ఇదే సమయంలో అంతర్జాతీయంగా కొన్ని రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మధ్య ప్రాచ్య, నల్ల సముద్ర ప్రాంతాల్లో ఉన్న రాజకీయ ఒత్తిళ్లు బంగారం ధరలను పెంచేవిధంగా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రానున్న కాలంలో బంగారం ధరలు మళ్లీ పై దిశగా వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈటీఎఫ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఈక్విటీ, డెట్ పథకాలతో పాటు బంగారానికి కూడా చోటు కల్పించాలి. ఈక్విటీ, డెట్లు నష్టాలు అందిస్తుంటే... వాటిని పూడ్చే శక్తి బంగారానికే ఉంది. నేరుగా బంగారాన్ని కొని భద్రపర్చడం కష్టమైన పని. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇప్పుడు గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేయడం అంటే స్వచ్ఛమైన బంగారాన్ని కొన్నట్లే. అంతేకాదు వీటిద్వారా బంగారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొని అమ్ముకోవచ్చు. ఈ మధ్యనే ఇండియాలో గోల్డ్ ఈటీఎఫ్లపై అవగాహన పెరుగుతుండటంతో పుత్తడికి డిమాండ్ పుంజుకుంటోంది. - లక్ష్మీ అయ్యర్, సీఐవో(డెట్), కోటక్ మ్యూచువల్ ఫండ్ -
ఏ ప్రభుత్వం వచ్చినా ర్యాలీ ఆగదు
మార్కెట్లు నూతన శిఖరాలను దాటుకొని దూసుకుపోతున్నాయి. మార్కెట్లు ఇంకా పెరుగుతాయా లేక ఎన్నికల తర్వాత పడిపోతాయా అన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతుండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ర్యాలీకి దూరంగానే ఉన్నారు. అసలు ఇది ఎన్నికల ర్యాలీనా, ఫలితాల తర్వాత నిలబడే అవకాశం ఉందా లేదా అనే విషయాలపై ఇద్దరు మ్యూచువల్ ఫండ్ సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’ తో పంచుకున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఎల్ఐసీ నోమూరా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుతోష్ బోస్, హెచ్ఎస్బీసీ గ్లోబల్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ తుషార్ ప్రధాన్ ఏమంటున్నారో వారి మాటల్లోనే... ప్రస్తుత ర్యాలీకి ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. మోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాకపోయినా, లేక అనిశ్చితి వాతావరణం ఏర్పడినా ఇవన్నీ స్వల్పకాలికమే. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటం, నాలుగైదేళ్ల నుంచి మార్కెట్ దూరంగా ఉన్న వాళ్లు కూడా ఆసక్తి చూపించడం వంటి అంశాలు మార్కెట్లను మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంపై... ఆర్థిక వ్యవస్థ పతనం ఆగడమే కాకుండా కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫండ్స్ పథకాల్లోకి పెరుగుతున్న నిధుల ప్రవాహమే దీనికి ఉదాహరణ. ప్రస్తుత మార్కెట్కి బయటి భయాలు లేవు కాని దేశీయంగా ఇంకా కొన్ని భయాలు ఉన్నాయి. పారిశ్రామిక వృద్ధితో పాటు, పెట్టుబడులకు దూరంగా ఉన్న వారిలో నమ్మకం పెంచటం తీసుకురావడం ప్రధానమైన ఛాలెంజ్. సూచీలు ఎక్కడివరకూ... ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థగా స్టాక్ సూచీల లక్ష్యాలను పేర్కొనకూడదు. కాని ఈ ఏడాది కూడా 12 శాతం పైనే రాబడిని అందిస్తాయని అంచనా వేస్తున్నాం. దీనికంటే రెండు మూడు శాతం అదనంగా మా ఈక్విటీ ఫండ్స్ లాభాలను అందించాలన్నది లక్ష్యం. గతేడాది మా ఈక్విటీ పథకాలు సగటున 20% రాబడిని అందించాయి. ఏయే రంగాలు మక్కువ.. వేటికి దూరం... ఫార్మా రంగం షేర్లు చాలా అధిక ధరలో ట్రేడ్ అవుతున్నాయి. కాని సన్, ర్యాన్బాక్సీ డీల్ ఈ రంగంలో ఇంకా వృద్ధికి అవకాశాలున్నాయన్న సంకేతాలను ఇచ్చింది. అందుకే రంగాల వారిగా కాకుండా షేర్లను బట్టి ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను. ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు అధిక ధరలో ఉన్నప్పటికీ వాటిలో కూడా కొన్ని షేర్లను ఇప్పటికీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడితే ఇన్ఫ్రా, ప్రభుత్వరంగ, క్యాపిటల్ గూడ్స్ వంటి రంగాలు మెరుగపడతాయి. వడ్డీరేట్ల కదలికలపై.... ఈ ఏడాది వడ్డీరేట్ల కదలికలు భారీ మార్పులుంటాయనుకోవడం లేదు. ఒకవేళ ద్రవ్యోల్బణం ఏమైనా బాగా దిగొస్తే వడ్డీరేట్లు గరిష్టంగా పావు శాతానికి మించి తగ్గే అవకాశాలు లేవు. రూపాయి కదలికలపై... డాలరుతో రూపాయి మారకం విలువ రూ.57 వద్ద స్థిర పడుతుందని అనుకుంటున్నా. ఒకవేళ పరిస్థితులు క్షీణిస్తే రూ.61.50 మించి తగ్గకపోవచ్చు. ఈ ఏడాది కూడా ఎఫ్ఐఐల నిధుల ప్రవాహం కొనసాగుతుంది. దేశీయ స్టాక్ సూచీలు చౌకగా ఉండటమే ప్రస్తుత ర్యాలీకి కారణం. దీనికి ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. 1993లో సెన్సెక్స్ 4,200 వద్ద ఉన్నప్పుడు సెన్సెక్స్ పీఈ రేషియో 42 శాతంగా ఉండేది. ఇప్పుడు సెన్సెక్స్ 22,000 దాటినా పీఈ మాత్రం 14.2 వద్ద ఆకర్షణీయంగా ఉంది. ఈ స్థాయికి వచ్చినప్పుడు ఎన్నికలు, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మార్కెట్లు పెరుగుతాయి. మోడీ ప్రభుత్వం రాకున్నా లేక సుస్థిరమైన ప్రభుత్వం అధికారం రాకపోయినా మార్కెట్లు పట్టించుకోవు. ఆర్థిక వ్యవస్థ మందగమనంపై స్టాక్ మార్కెట్లు ఎప్పుడూ భవిష్యత్తును ముందుగానే గ్రహిస్తాయి. ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్న సమాచారం ఏమీ లేదు. కాని మార్కెట్ కదలికలను బట్టి పరిస్థితులు మెరుగుపడుతున్నాయనిపిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది వృద్ధిరేటు అధికంగా 5.5 శాతం ఉంటుందని భావిస్తున్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరగాల్సిన అవసరం ఉంది. సూచీలు ఎక్కడివరకూ.. సెన్సెక్స్ ఎంత వరకు పెరుగుతుందని చెప్పను. మార్కెట్లు అందించే లాభాలు పూర్తిగా ఆర్థిక మూలాలుపైనే ఆధారపడి ఉంటుంది. కంపెనీల ఆదాయం 15 % వృద్ధి ఉండి, పీఈ రేషియో 14.2% ఉంటే సూచీలు సుమారు 15% రాబడిని ఇస్తాయి. ఒకవేళ పీఈ రేషియో పెరిగితే రాబడులు ఇంకా పెరుగుతాయి. ఆదాయం పెరిగినా పీఈ తగ్గితే సూచీలు అందించే లాభాలూ తగ్గుతాయి. ప్రస్తుత అంచనాలను బట్టి ఈ ఏడాది 15% లాభాలను ఆశించొచ్చు. ఏయే రంగాలపై మక్కువ... వేటికి దూరం... ఇలా రంగాలపై మేము దృష్టిసారించాం. ఒక రంగం పరిస్థితులు బాగుండకపోవచ్చు. కాని ఆ రంగంలో ఒక కంపెనీ ఆకర్షణీయంగా ఉం డొచ్చు. గతంలో ఎటువంటి రిస్క్లున్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వడ్డీరేట్ల కదలికలపై.... వడ్డీరేట్లు పెరగడానికే కాని తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఏడాదంతా ప్రస్తుత రేట్ల వద్దే స్థిరంగా ఉంటాయి. ద్రవ్యోల్బణం భయం ఈ ఏడాది అధికమయ్యే అవకాశాలుండటంతో వడ్డీరేట్లు పావు శాతం పెరగొచ్చు. అంతేకాని తగ్గే అవకాశాలైతే కనిపించడం లేదు. రూపాయి కదలికలపై... ఆర్బీఐ డాలరు విలువ రూ.55 మించి తగ్గడానికి ఇష్టపడటం లేదు. రూ.58 మించి రూపాయి బలపడకపోవచ్చు. రూపాయి క్షీణతను తట్టుకునే శక్తి ఇప్పుడు ఆర్బీఐకి వచ్చింది. ఏడాది మొత్తం మీద రూ. 58-62 విస్తృత శ్రేణిలో కదలొచ్చు. -
గిల్ట్ఫండ్స్కు క్రెడిట్ రిస్క్ ఉండదు
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించి రెగ్యులర్ ఆప్షన్నా లేదా డెరైక్ట్ ఆప్షన్నా దేనిని ఎంచుకోవాలి? దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించి ఏరకమైన ఫండ్స్ను ఎంచుకోవాలో సూచించండి? - సుకుమార్, హైదరాబాద్ ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్కు సంబంధించి రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్లలో డెరైక్ట్ ప్లాన్కే వ్యయం తక్కువ. ఫలితంగా రిటర్న్లు అధికంగా వస్తాయని చెప్పవచ్చు. ఈ డెరైక్ట్ ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రత్యక్షంగా విక్రయిస్తున్నందున రెగ్యులర్ ప్లాన్తో పోల్చితే ఇది చౌకగా లభ్యమవుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గ ఫండ్ ఏదో మీరు ఎంచుకోగలిగితే డెరైక్ట్ ప్లాన్లోనే పెట్టుబడులు పెట్టడం సముచితం. ఇక దీర్ఘకాలిక పెట్టుబడుల విషయానికొస్తే మీరు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(ఎస్ఐపి) విధానాన్ని అనుసరించడం ఉత్తమం. సెక్టోరియల్ లేదా థీమాటిక్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయకండి. విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేసే డైవర్సిఫైడ్ ఫండ్స్ను ఎంచుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కింది ఫండ్స్ను పరిశీలించవచ్చు. .. క్వాంటమ్ లాంగ్టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, యూటీఐ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్లు. ప్రస్తుతం రెండేళ్ల వయస్సున్న నా కూతురు చదువు, వివాహం కోసం రూ. కోటి నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దీని కోసం నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా పెట్టుబడులు ఎలా ఉండాలి? ప్రస్తుతం ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. అలాగే పీపీఎఫ్కు కొంత మొత్తం చెల్లిస్తున్నాను. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తగిన సూచనలివ్వండి. - శరణ్య, ఈ మెయిల్ ద్వారా పీపీఎఫ్, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న యూలిప్.. ఇవి ఈ రెండు తక్కువ రాబడులనిచ్చే స్థిరాదాయ మార్గాలు. మీ ఆర్థిక లక్ష్యాలకు ఇవి సరిపోవు. మీరు మొదటగా చేయాల్సింది ఏమిటంటే మీ జీవన్ ఆనంద్ పాలసీ డాక్యుమెంట్ను పరిశీలించి ఈ పాలసీ నుంచి వైదొలిగే మార్గాలను చూడండి. అలాగే పీపీఎఫ్లో కనీస మొత్తమే ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన మొత్తాన్ని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ.10,000కు జత చేయండి. ఈ మొత్తాన్నంతటిని మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, మొదటగా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్ను ఎంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పనితీరు తదితర అంశాలపై మీకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఈక్విటీ ఫండ్స్ల్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికైతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, కెనరా రొబెకొ బ్యాలెన్స్డ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. నేనొక సీనియర్ సిటిజన్ను. 12-18 నెలల కాలానికి ఏదైనా ఒక గిల్ట్ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ విషయమై తగిన సలహా ఇవ్వండి. - రామకృష్ణయ్య, ఏలూరు ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే గిల్ట్ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదు. భద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవి ఒడిదుడుకులకు గురవుతుంటాయి. వడ్డీరేట్లు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఒడిదుడుకులు మరీ తీవ్రంగా ఉంటాయి. గత సంవత్సరంన్నర కాలంలో డెట్ ఫండ్ కేటగిరిలో అత్యంత అధ్వాన పనితీరు కనబరిచింది ఈ గిల్ట్ఫండ్సే. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే, వడ్డీ రేట్లను తగ్గించబోమని ఆర్బీఐ గవర్నర్ ఇటీవలనే పేర్కొన్న సంగతి తెలిసిందే. గిల్ట్ఫండ్స్ల్లో పెట్టుబడులు పెట్టేముందు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. గిల్ట్ఫండ్స్కు బదులుగా డైనమిక్ బాండ్ ఫండ్లో గానీ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లో గానీ ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించండి. నేను ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్లో నెలకు రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాను. మూడేళ్ల కాలానికి మరి కొంత ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్లను షార్ట్లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి. - రామ్మూర్తి, అనంతపురం మూడేళ్ల ఇన్వెస్ట్మెంట్కు ఈక్విటీ ఫండ్స్ను పరిశీలించడం సమంజసం కాదు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్స్ మీరు నిర్దేశించుకున్న మూడేళ్ల కాలానికి సరైన రాబడులనివ్వలేవు. స్వల్పకాలంలో వీటి నుంచి మీరు ఆశించే రాబడులు రావు. అందుకని బ్యాలెన్స్డ్ ఫండ్స్ను ఎంచుకోవడం ఉత్తమం. మూడేళ్ల కాలానికి వీటిల్లో రిస్క్ తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ను మరింతగా పెంచవచ్చు. లేదంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ను పరిశీలించవచ్చు. -
ఫండ్స్కు కొత్త నిబంధనల అమలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ రంగానికి సంబంధించి మంగళవారం(ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఇకపై నెలకోసారి తమ నిర్వహణలోని ఆస్తుల వివరాలు ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓటింగ్ హక్కులను వినియోగించుకుంటే అందుకు తగిన కారణాలను వెల్లడించాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ రంగంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన తాజా నిబంధనలను ఫండ్ హౌస్లు ఇకపై తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వివిధ విభాగాలకు చెందిన పథకాల ద్వారా ఫండ్స్ నిర్వహిస్తున్న ఆస్తులు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. తమ వెబ్సైట్ల ద్వారా ప్రతీ నెల కు సంబంధించిన వివరాలను 7 రోజుల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. దీంతోపాటు దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వెబ్సైట్లలో కూడా వివరాలను ప్రకటించాలి. ఈ బాటలో ప్రతీ క్వార్టర్ ముగిశాక 10 రోజుల్లోగా ఓటింగ్కు సంబంధించిన వివరాలను వెల్లడించాలి. వార్షిక నివేదికలోనూ ఈ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఓటింగ్ హక్కుల వినియోగంపై ఆడిటర్ల నుంచి సర్టిఫికేషన్ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 45 ఫండ్ హౌస్లు కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 9 లక్షల కోట్లకుపైనే. -
ప్రతి నెలా వివరాలు వెల్లడించాలి
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇకపై తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) గురించి ప్రతి నెలా మరిన్ని వివరాలు వెల్లడించాల్సి రానుంది. అలాగే, తాము ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో వోటింగ్ హక్కులను వినియోగించుకున్న తీరు వెనుక హేతుబద్ధతను కూడా ఇన్వెస్టర్లకు వివరించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇన్వెస్టర్లకు మరింత చేరువయ్యే దిశగా ఆన్లైన్, మొబైల్ మాధ్యమాలతో పాటు ఇతర మార్గాల్లోనూ ఫండ్స్ విక్రయాలను పెంచుకోవాల్సి ఉంటుంది. దాదాపు రూ. 9 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు సంబంధించి మొట్టమొదటిసారి రూపొందించిన దీర్ఘకాలిక నిబంధనలపై స్టాక్మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ విధానాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం వివిధ స్కీములు, రిటైల్..కార్పొరేట్ వంటి ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రాష్ట్రాల వారీ పెట్టుబడులు తదితర వివరాలన్నీ ఫండ్ సంస్థలు ప్రతి నెలా వెల్లడించాలి. వీటన్నింటినీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వారం పనిదినాల్లోగా ఉంచాలి. మరోవైపు, వివిధ సంస్థల్లో వోటింగ్ హక్కులను ఏ విధంగా (అనుకూలంగా, వ్యతిరేకంగా మొదలైనవి) వినియోగించుకున్నదీ, దాని వెనుక హేతుబద్ధత ఏమిటి అన్నది కూడా ఫండ్ సంస్థలు వార్షిక నివేదికల్లో, వెబ్సైట్లలో వెల్లడించాలి. ఇక, అదనపు పంపిణీ మార్గాలను పెంచుకునే దిశగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల మద్దతు తీసుకోవాలని ఫండ్ సంస్థలకు సెబీ సూచించింది. అలాగే ఇంటర్నెట్, మొబైల్ యూజర్ల కోసం ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ విధానాలను మెరుగుపర్చాలని పేర్కొంది. ప్రాంతీయ భాషల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. -
అన్ని పెట్టుబడులకు ఒకే రికార్డు
న్యూఢిల్లీ: డీమ్యాట్ అకౌంట్ల తరహాలోనే వ్యక్తిగత పెట్టుబడులకు సంబంధించిన వివరాలన్నింటికీ ఒకే రికార్డు ఉండేలా ప్రత్యేక విధానాన్ని ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రతిపాదించారు. ఖాతాల నిర్వహణ సులభంగా ఉండటంతో పాటు పన్నులు సక్రమంగా వసూలయ్యేలా చూసేందుకు ఇది తోడ్పడగలదని ఆయన తెలిపారు. దీని ప్రకారం ఆయా ఇన్వెస్టర్లు తీసుకున్న షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బ్యాంక్ డిపాజిట్లు మొదలైన వాటి వివరాలన్నీఆన్లైన్లో ఒకే అకౌంట్లో లభ్యమవుతాయి. దీని గురించి షేర్ల కోసం ప్రస్తుతం ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ వంటి డిపాజిటరీలు ఉన్నట్లే ప్రత్యేకంగా డిపాజిటరీని ప్రారంభించొచ్చు. ఇందుకు నియంత్రణ సంస్థలు అంగీకరించినట్లు చిదంబరం తెలిపారు. -
పీఎస్యూ ఫండ్స్కు దూరంగా ఉండండి
మూడు నెలల కాలానికి కొంత మొత్తన్ని ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను 30 శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. లిక్విడ్ ఫండ్, షార్ట్ టెర్మ్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్- ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలో తెలియని డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నాను. నా అంచనాల ప్రకారం.., 1.లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడులు పెడితే షార్ట్టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్(ఎస్టీసీజీ) ట్యాక్స్ 30 శాతం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) 27 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 2. షార్ట్టెర్మ్ ఇన్కమ్ ఫండ్లో పెట్టుబడులు పెడితే ఎస్టీసీజీ 30 శాతం, డీటీటీ 13 శాతం చెల్లించాలి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికొస్తే షార్ట్టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 30 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ మూడింటిపై ఒకే విధమైన రాబడి (8-9 శాతం)వచ్చే అవకాశాలున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమే ఉత్తమం అంటారా? -చైతన్య ప్రసాద్, విజయవాడ పన్నులకు సంబంధించి మీ అంచనాలు కరెక్టే. మ్యూచువల్ ఫండ్స్కు సంబంధించి, షార్ట్టెర్మ్ గెయిన్స్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయంలో మీరున్నారు. ఇది సరికాదు. మీరు కనుక గ్రోత్ ఆప్షన్ను ఎంచుకుంటే క్యాపిటల్ గెయిన్స్ పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డీడీటీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ డివిడెండ్ ఆప్షన్ను ఎంచుకుంటే డీడీటీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీసీజీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే షార్ట్టెర్మ్ ఇన్కం ఫండ్లో డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు. ఇలా చేస్తే మీరు 13 శాతం డీడీటీ మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఎస్బీఐ పీఎస్యూ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి భారీగా నష్టపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? తగిన మార్గం సూచించండి? - అరవింద్, హైదరాబాద్ ప్రభుత్వ రంగంలో ఇన్వెస్ట్ చేయడమనేది సరైన ఆలోచన కాదని చెప్పవచ్చు. అనుభవమున్న ఇన్వెస్టరైతే పరిస్థితులను బట్టి తగిన మదుపువ్యూహంతో లాభాలు గడించే అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగ కంపెనీలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించినా లాభాలు రావడం అరుదైన విషయమే. ప్రభుత్వం పూర్తి స్థాయి వ్యాపార కంపెనీగా వ్యవహరించలేకపోవడమే దీనికి ప్రధాన కారణం.. డివిడెండ్లు, సబ్సిడీల రూపంలో పీఎస్యూల నుంచి వీలైనంత నిధులను పిండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక ప్రత్యేకమైన పీఎస్యూ ఫండ్ ఉత్తమమైనదా? అధమమైనదా? అని ఇన్వెస్టర్లు ఆలోచించడం అనవసరం. మొత్తం మీద పీఎస్యూ స్టాక్స్ దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్కు అనుకూలమైనవి కావని చెప్పవచ్చు. అందుకని పీఎస్యూ ఫండ్స్కు దూరంగా ఉండడమే మేలు.. నిలకడైన రాబడులతో భారీ నిధిని ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా డెట్ ఫండ్లో సిప్ విధానంలో 5 నుంచి 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? అలా అయితే ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమంటారు? - ప్రీతి, విశాఖపట్టణం, నిలకడైన రాబడుల కోసం సిప్ విధానంలో డెట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం మంచి నిర్ణయమే. అయితే పదేళ్ల కాలానికి సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి డెట్ ఫండ్స్ కంటే ఈక్విటీ ఫండ్స్ ఉత్తమం. ఉదాహరణకు మీరొక డెట్ఫండ్లో పదేళ్ల పాటు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే, మీకు 8.86 శాతం వార్షిక రాబడులు వస్తాయి. ఇదే లార్జ్క్యాప్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 15.25 శాతం వార్షిక రాబడులు వచ్చే అవకాశాలున్నాయి. మీరు రిస్క్ను ఏమాత్రం భరించలేని వారైతే, మంచి రేటింగ్ ఉన్న డైనమిక్ బాండ్ ఫండ్లో పెట్టుబడులు పెట్టండి. వడ్డీరేట్లను బట్టి వివిధ మెచ్యూరిటీ కాల వ్యవధులున్న డెట్ ఇన్స్ట్రుమెంట్స్ల్లో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే, హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్తో పోల్చితే వీటిల్లో కొంచెం రిస్క్ తక్కువ. మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఏడేళ్ల కాలానికి 11.3 శాతం వార్షిక రాబడిని ఇస్తాయి. -
వచ్చే ఏడాది ‘ఫండ్’నున్న పరిశ్రమ
ముంబై: వచ్చే ఏడాది మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) దేబాశిష్ మల్లిక్ చెప్పారు. అమెరికా, యూరప్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక రికవరీ వృద్ధి బాట పట్టడం, ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావం దీనికి కారణమని వివరించారు. అమెరికా, యూరప్, జపాన్ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్న సూచనలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయని, ఫలితంగా ఈ దేశాల కంపెనీలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే డెట్ పథకాల్లో నిధుల ప్రవాహం పెరుగుతుందని వివరించారు. ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు)లలో పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా మన దేశ వృద్ధి అవకాశాలు జోరుగా ఉంటాయని వివరించారు. మార్కెట్లు బాగుంటాయ్... ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అంచనాలు బాగా ఉన్నాయని, దీంతో మార్కెట్లు బావుంటాయని, మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు జోరందుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.7.01 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి రూ.8.9 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు దూరమయ్యారని పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోళ్లను 1,000 కోట్ల డాలర్లు తగ్గించాలన్న నిర్ణయం ప్రభావం స్వల్పమేనని ఆయన తేల్చారు. జూలైతో పోల్చితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కరంట్ అకౌంట్లోటు కూడా మెరుగైన పరిస్థితిలోనే ఉందని, అందుకే ఫెడ్ నిర్ణయం ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని దేబాశిష్ వివరించారు. -
మ్యూచువల్ ఫండ్స్ బ్రహ్మపదార్థం కాదు!
‘నాకు అంత ఐడియా లేదండి... మా ఆయనే చూసుకుంటారు డబ్బు విషయాలన్నీ’ అని మహిళలు అనే రోజులు కావివి. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన సెన్సెక్స్, బ్యాంకులు, పెద్ద పెద్ద సంస్థలు వంటివే నేడు మహిళల నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలోనూ నాకర్థం కావు అనుకోవడం మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేసుకోవడమే. మహిళ పొదుపులో స్ట్రాంగ్, పెట్టుబడుల్లో వీక్... కానీ ఈ సిద్ధాంతం పాతబడే రోజులు వచ్చేశాయి. ఈ వారం ఆధునిక మదుపు పద్ధతుల్లో ప్రాథమిక మార్గమైన మ్యూచువల్ఫండ్స్పె అవగాహన పెంచుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శక్తిమంతమైన మదుపు విధానాల్లో మ్యూచువల్ ఫండ్ ఒకటి. వీటిపై వచ్చే ప్రాథమిక ప్రశ్నలు-సమాధానాలు. 1. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఇది ఒక ఉమ్మడి నిధి. సంప్రదాయ పొదుపు పద్ధతుల కంటే కాస్త ఎక్కువ ఆదాయాన్నిచ్చేది. ఆధునిక పొదుపు పద్ధతుల్లో కాస్త తక్కువ రిస్క్తో కూడినది. నిరంతరం మార్పులక గురయ్యే షేర్లలో పెట్టుబడి పెట్టడం తెలియనపుడు ఏదైనా ఒక కంపెనీ ఒక ఉమ్మడి నిధిని ఏర్పాటుచేసి దానికో ‘కర్త’ను నియమించి షేర్లలో, బాండ్లలో మదుపు చేస్తుంది. వీలైనంత లాభదాయకంగా అతను ఈ ఉమ్మడి నిధిని షేర్లలో మదుపు చేస్తారు. ఈ ఉమ్మడి నిధిలో ప్రతి పౌరుడు తనకు నచ్చినంత మొత్తాన్ని మదుపు చేసుకోవచ్చు. వచ్చిన లాభాలను మనం మదుపు చేసిన శాతాన్ని బట్టి మనకు పంచుతారు. ఉదా: రెండు ఎకరాలున్న 50 మంది రైతులు తమ చిన్న పొలాలను అన్నీ కలిపి ఒకే వ్యక్తికి ఇచ్చారనుకుందాం. అతను పంట వేస్తాడు. లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని అందరూ సమానంగా పంచుకుంటారు. ఫలితం ఏదైనా కౌలుదారుకు కొంత ఫీజు ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాగే పనిచేస్తాయి. 2. మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా పెట్టొచ్చా? ఎవరైనా పెట్టొచ్చు. యాభై వేలకు పైన పెట్టుబడి పెట్టాలంటే పాన్కార్డ్ ఉండాలి. అంతకంటే తక్కువ అయితే అవసరం లేదు. 3. స్త్రీలకు మ్యూచువల్ ఫండ్స్లో మినహాయింపులేమైనా ఉంటాయా? ఇదో ఉమ్మడి మదుపు నిధి కాబట్టి ప్రత్యేకించి మహిళలకు మినహాయింపులు ఏమీ ఉండవు. 4. మ్యూచువల్ ఫండ్స్లో దాచడం శ్రేయస్కరమేనా? అసలుకు కూడా హామీ ఉండదు. కానీ, షేర్ల కంటే శ్రేయస్కరమే. మార్కెట్ను బట్టే లాభష్టాలుంటాయి. 5. అంత శ్రేయస్కరం కానపుడు ఎందుకు పెట్టాలి? మనదేశంలో ధరలుపెరుగుదల-డబ్బు విలువ పడిపోవడం (ద్రవ్యోల్బణం) పెద్ద సమస్య. దీన్ని అధిగమించాలంటే మన పొదుపు రాబడి పెరగాలి. సాధారణ పద్ధతుల్లో ఆశించినంత రాదు. అందుకే కొంత నష్టభయం ఉన్నా కూడా వీటిలో పెట్టడం వల్ల ఎక్కువ ఆదాయానికి ఆస్కారం ఉంటుంది. 6. ‘అసలు’కు ఎసరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న డబ్బంతా ఒకేసారి కాకుండా... ఒక ఫండ్ ఎంచుకుని అందులోనే ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం (ఉదా: రూ.500) పెట్టుకుంటూ పోవడం శ్రేయస్కరం. ఇలా రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం అలా పెడితే... నష్టం దాదాపు ఉండదు. - వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు