ETF
-
పసిడిపై పైచేయి.. సిల్వర్ ఈటీఎఫ్లకు డిమాండ్
కోల్కతా: ఇటీవల కొంతకాలంగా వెండి ఈటీఎఫ్లు పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఏడాది కాలంలో సిల్వర్ ఈటీఎఫ్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) విలువ నాలుగు రెట్లు ఎగసింది. వెరసి గత నెల(అక్టోబర్)కల్లా వెండి ఈటీఎఫ్ల ఏయూఎం రూ. 12,331 కోట్లను తాకింది.2023 అక్టోబర్లో ఈ విలువ కేవలం రూ. 2,845 కోట్లుగా నమోదైంది. ఇన్వెస్టర్లు సిల్వర్ను దేశీయంగా ధరల పెరుగుదలతోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులకు హెడ్జింగ్గా భావించడం ఇందుకు జతకలిసినట్లు రేటింగ్ సంస్థ ఇక్రా అనలిటిక్స్ పేర్కొంది. ఈ వివరాల ప్రకారం..2022లో షురూ సిల్వర్ ఈటీఎఫ్లకు 2022లో తెరతీశారు. వీటి అందుబాటు, పారదర్శకతల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వీటికి డిమాండ్ పెరగుతోంది. దీంతో సిల్వర్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య 215 శాతం జంప్చేసి 4.47 లక్షలకు చేరింది. 2023 అక్టోబర్లో ఇది 1.42 లక్షలు మాత్రమే. ఈ కాలంలో నికర పెట్టుబడులు 24 శాతం ఎగశాయి. రూ. 643 కోట్లను తాకాయి.మరోపక్క మార్కెట్లో 2023 ఏప్రిల్లో 8 వెండి ఈటీఎఫ్లు నమోదుకాగా.. 2024 ఆగస్ట్కల్లా 12కు పెరిగినట్లు ఇక్రా అనలిటిక్స్ మార్కెట్ డేటా హెడ్, సీనియర్ వీపీ అశ్వినీ కుమార్ వెల్లడించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో సిల్వర్ ఈటీఎఫ్లకు డిమాండ్ కొనసాగనున్నట్లు కుమార్ అంచనా వేశారు. సులభ నిర్వహణ సులభంగా స్టోర్ చేయగలగడం, తగినంత లిక్విడిటీ, చౌక వ్యయాలు వంటి అంశాలు సిల్వర్ ఈటీఎఫ్లకు ఆకర్షణను పెంచుతున్నాయి. ఫిజికల్ కొనుగోళ్లకు జీఎస్టీ వర్తించే సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్కావడంతో పెట్టుబడులకు లిక్విడిటీ సైతం ఉంటుంది. యూనిట్ల రూపంలో సులభంగా లావాదేవీలు చేపట్టవచ్చునని కుమార్ తెలియజేశారు.అంతేకాకుండా వీటిలో పెట్టుబడులు ఉత్తమ రిటర్నులను సైతం అందిస్తున్నాయి. నెల రోజుల్లో 7.6 శాతం, 3 నెలల్లో 16 శాతం, 6 నెలలు పరిగణిస్తే 20.25 శాతం సగటున రాబడినిచ్చాయి. ఏడాది కాలాన్ని తీసుకుంటే 32.5 శాతం రిటర్నులు అందించాయి. ఇదే కాలంలో గోల్డ్ ఈటీఎఫ్ల రాబడులతో పోలిస్తే ఇవి అధికంకావడం గమనార్హం! -
గోల్డ్ ఈటీఎఫ్లు కళకళ
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు) అక్టోబర్లోనూ మెరిశాయి. ఏకంగా రూ.1961 కోట్లను ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతో గత రెండేళ్లుగా బంగారం ర్యాలీ అవుతుండడం చూస్తున్నాం. దీంతో బంగారం మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.1,233 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే అక్టోబర్లో 59 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రూ.841 కోట్ల కంటే రెట్టింపునకు పైగా అధికమయ్యాయి.గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.39,823 కోట్ల నుంచి అక్టోబర్ చివరికి రూ.44,545 కోట్లకు దూసుకుపోయాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) అక్టోబర్లో నికరంగా 2 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం ఫోలియోలు 59.13 లక్షలకు చేరాయి. ఈ ఏడాది ఆగస్ట్లో రూ.1,611 కోట్లు, జులైలో రూ.1,337 కోట్లు, జూన్లో రూ.726 కోట్లు, మే నెలలో రూ.396 కోట్ల చొప్పున పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు జీసీసీ రంగం!కరోనా విపత్తు, అనంతరం ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్తో ఇజ్రాయెల్ పోరు ఇవన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అనిశ్చితులకు దారితీయడం గమనార్హం. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ ఏర్పడి ర్యాలీకి దారితీసింది. దీంతో 2020 జనవరి నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.24,153 కోట్లు నికరంగా వచ్చాయి. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది 0.75 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగింది. ఇది అంతర్జాతీయంగా బంగారం ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీన్నుంచి ప్రయోజనం పొందాలన్న ఇన్వెస్టర్ల ఆకాంక్ష ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పెరగడానికి దారితీసి ఉండొచ్చు’అని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!
డబ్బు ఖర్చు పెట్టడం సులువు. అదే సంపాదించాలంటే కొంత కష్టపడక తప్పదు. కష్టపడి పోగు చేసుకున్న డబ్బుతో విలాసవంత వస్తువులు కొనుగోలు చేయడంకంటే ఆ డబ్బును పొదుపు చేసి మరింత డబ్బు సంపాదించాలని చాలామంది సూచిస్తున్నారు. ఈమేరకు పొదుపునకు సంబంధించి సౌరవ్దత్తా అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ను పంచుకున్నారు. కేవలం రూ.20 వేలతో రూ.17 లక్షలు పోగుచేసే మార్గాన్ని సూచించారు. రవి అనే వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ఆ డబ్బు ఎలా సమకూరుతుందో వివరించారు.‘రవి అనే వ్యక్తి రూ.10 లక్షలు ఖర్చు చేసి కారు కొనాలనుకున్నాడు. అందుకు ఐదేళ్లపాటు నెలవారీ రూ.20 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కారు వాడుతున్న కొద్దీ దాని విలువ తగ్గిపోతుంది. కాబట్టి 2030 నాటికి దాని విలువ రూ.నాలుగు లక్షలు అవుతుంది. అంటే ఐదేళ్లలో అది రూ.ఆరు లక్షలు తగ్గిపోతుంది. అదే తన వద్ద ఉన్న రూ.20 వేలను రవి నిఫ్టీ ఈటీఎఫ్లో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. 2030 నాటికి తన వద్ద ఏకంగా రూ.17 లక్షలు జమవుతాయి. మన జీవితం ఎలా ఉండాలో మన చేతిలోనే ఉంటుంది’ అని సౌరవ్ పోస్ట్ చేశారు.₹20000/mo is the 5 year EMI of a 10L car for Ravi.Instead, Ravi puts ₹20000/mo for 5 years in Nifty ETF SIP.First decision gives him a car worth ₹4L in 2030.Second decision gives him ₹17L of bank balance in 2030.Life is about the choices we make.— Sourav Dutta (@Dutta_Souravd) October 15, 2024ఇదీ చదవండి: టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులుడిప్రిషియేషన్ అసెట్(కాలంతోపాటు విలువ తగ్గిపోయే వస్తువులు) కోసం డబ్బులు అధికంగా ఖర్చు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. తప్పనిసరి అయితే తప్పా..దానివల్ల మనం వెచ్చించే డబ్బు కంటే అధిక లాభం ఉంటే తప్పా కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, ఈక్వీడీ మార్కెట్, ఎఫ్డీ..వంటి విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చని చెబుతున్నారు. -
మెరుగైన రాబడులకు.. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్..
గడిచిన దశాబ్దకాలంగా దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటిగా మారింది. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ విస్తృతి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు (సిప్) ఆదరణ పెరుగుతుండటం మొదలైన సానుకూలాంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గత పదేళ్లుగా ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2014లో మొత్తం ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) వీటి పరిమాణం 2 శాతమే ఉండగా 2024 జూన్ నాటికి ఏకంగా 17 శాతానికి (మొత్తం ఏయూఎం రూ. 10,00,000 కోట్లకు పైగా ఉంటుంది) ఎగిసింది. ఇంత వేగంగా పరిశ్రమ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన ఉత్పత్తులు, కొత్త వ్యూహాలను ప్రవేశపెట్టడంపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహం తెరపైకి వచ్చింది. అధిక రాబడులనిస్తూ, రిస్కులను తగ్గిస్తూ, మెరుగైన డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను అందించే విధంగా ఇది ఉంటుంది.సెక్యూరిటీస్లో అంతర్గతంగా మెరుగైన రాబడులు అందించే నిర్దిష్ట లక్షణాలను లక్ష్యంగా చేసుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. ఫ్యాక్టర్ ఫండ్స్ అనేవి భారత్లో ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ఫార్మాట్లో తక్కువ వ్యయాలతో అందుబాటులో ఉంటున్నాయి. నాణ్యత (క్వాలిటీ), విలువ (వేల్యూ), పరిమాణం (సైజ్), గతి (మూమెంటమ్), తక్కువ ఒడిదుడుకులు వంటి నిర్దిష్ట గుణాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్ఫోలియోలను తీర్చిదిద్దుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, వేల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో ఒక భాగం. ఇది తక్కువ వేల్యుయేషన్లతో ఉన్న సెక్యూరిటీలను టార్గెట్ చేయడం ద్వారా ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే, మూమెంటమ్ ఇ న్వెస్టింగ్ అనే విధానం, ధర పెరుగుతున్న ట్రెండ్ ఆధారితమైనదిగా ఉంటుంది.సంపద సృష్టి: చారిత్రకంగా మార్కెట్ను మించి రాబడులు పొందడానికి తోడ్పడే నిర్దిష్ట గుణాలను లక్ష్యంగా పెట్టుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. వివిధ మార్కెట్లు, అసెట్ క్లాస్లు, కాలవ్యవధులవ్యాప్తంగా ఇది పనిచేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ ఫ్యాక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను ఎలాంటి ఆరి్థక పరిస్థితుల్లోనైనా, మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిలదొక్కుకోగలిగేలా మరింత పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. పరిశోధనల ప్రకారం చారిత్రకంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మార్కెట్ బెంచ్మార్క్లను మించిన పనితీరు కనపర్చింది. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపద సృష్టించి ఇవ్వగలదు.రిస్క్ మేనేజ్మెంట్: వివిధ మార్కెట్ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే ఫ్యాక్టర్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా రిసు్కలను సమర్ధవంతంగా అదుపులో ఉంచుకునేందుకు ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ సహాయపడుతుంది. ఉదాహరణకు మార్కెట్లు పతనమవుతున్న తరుణంలో, తక్కువ హెచ్చుతగ్గులకు లోనయ్యే స్టాక్స్ మెరుగ్గా ఉంటాయి. నష్టభారాన్ని తగ్గిస్తాయి. తీవ్ర ఒడిదుడుకులు ఉన్న పరిస్థితుల్లో పోర్ట్ఫోలియోను స్థిరపర్చుకునేందుకు ఈ విధానం సహాయపడుతుంది.పారదర్శకత: మిగతా పాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్) తరహాలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు కూడా సాధారణంగా రూల్స్ ఆధారితమైనవిగా ఉంటాయి. అంటే, పెట్టుబడులను పెట్టేందుకు నిర్దిష్ట నిబంధనలను పాటిస్తాయి. పెట్టుబడి నిర్ణయాల వెనుక గల హేతుబద్ధతను అర్థం చేసుకునేందుకు, తమ పోర్ట్ఫోలియోలను సులభతరంగా పర్యవేక్షించుకునేందుకు, నిర్వహించుకునేందుకు ఇన్వెస్టర్లకి ఈ పారదర్శకత ఉపయోగకరంగా ఉంటుంది.డైవర్సిఫికేషన్: ఒకదానితో మరొక దానికి మరీ అధిక స్థాయిలో పరస్పర సంబంధం ఉండని వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది వైవిధ్యానికి సంబంధించిన ప్రయోజనాలను కల్పిస్తుంది. ఏదైనా ఒక ఫ్యాక్టర్ పనితీరు బాగా లేకపోతే పోర్ట్ఫోలియోలో దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రిస్కులకు తగ్గ మెరుగైన రాబడులను అందుకోవడానికి వివిధ ఫ్యాక్టర్లను కలిపి వాడే వ్యూహాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు ఉపయోగిస్తుంటారు.సౌలభ్యం: టెక్నాలజీ, డేటా వంటి అంశాల్లో పురోగతి కారణంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మరింతగా అందుబాటులోకి వచ్చింది. ఫ్యాక్టర్ ఆధారిత వ్యూహాలను సులభతరంగా అమలు చేయడానికి సాధనాలు, ప్లాట్ఫాంలు వీలు కల్పిస్తున్నాయి. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మెరుగైన రాబడులు అందించేలా, రిస్కులను నియంత్రించుకునేలా, తక్కువ వ్యయాలతో కూడుకున్న పెట్టుబడి సాధనాలను వినియోగించుకునేలా పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. ఫ్యాక్టర్స్ కొన్నాళ్ల పాటు అండర్పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు వేల్యూ స్టాక్స్ అనేవి నిర్దిష్ట మార్కెట్ పరిస్థితుల్లో గ్రోత్ స్టాక్స్తో పోలిస్తే వెనుకబడొచ్చు. ఒకే ఫ్యాక్టర్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకవేళ ఆ ఫ్యాక్టర్ పనితీరు సరిగ్గా లేకపోతే గణనీయంగా నష్టాలు రావచ్చు. తప్పిదాల వల్ల పనితీరు దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫ్యాక్టర్ ప్రీమియంలను కచ్చితంగా గుర్తించి, అందిపుచ్చుకోవాలంటే అధునాతన మోడల్స్, విస్తృతమైన డేటా విశ్లేషణ అవసరమవుతుంది. మార్కెట్ పరిస్థితులు గానీ ఇన్వెస్టర్ ధోరణి గానీ మారితే ఫ్యాక్టర్ వ్యూహాల సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఒకవేళ పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు అదే ఫ్యాక్టర్ వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారంటే, ఫ్యాక్టర్ ప్రయోజనం తగ్గిపోవచ్చు. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు అమలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈ రిస్కులను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రిసు్కలను తగ్గించుకునేందుకు వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా డైవర్సిఫికేషన్ పాటించాలి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటే సహాయకరంగా ఉంటుంది. చదవండి: మిడ్క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!రిస్కు సామర్థ్యాలను బట్టి.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దిష్ట ఫ్యాక్టర్స్ను టార్గెట్గా పెట్టుకుని తమ పోర్ట్ఫోలియోను తీర్చిదిద్దుకోవచ్చు. ఉదాహరణకు అధిక రిస్కు సామర్థ్యాలున్న ఇన్వెస్టర్లు, మూమెంటమ్ లేదా సైజ్ వంటి ఫ్యాక్టర్లకు మరింత ఎక్కువగా కేటాయించవచ్చు. ఇవి మరింత ఎక్కువ ఒడిదుడుకులకు లోనైనా అధిక రాబడులనిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు నాణ్యమైన, తక్కువ ఒడిదుడుకులుండే ఫ్యాక్టర్లను ఎంచుకోవచ్చు. ఇక, గ్రోత్ కోరుకునే ఇన్వెస్టర్లు, వేల్యూ అలాగే మూమెంటమ్కి ప్రాధాన్యతనివ్వొచ్చు. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు కూడా దాదాపు ఇలాంటి ఫ్యాక్టర్ మేళవింపులనే ఎంచుకుంటూ ఉంటారు. చివరగా చెప్పాలంటే, ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది అధిక రాబడులను అందించే నిర్దిష్ట చోదకాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే ఒక విధానం. రిసు్కలను తగ్గించుకుని, అధిక రాబడులను అందుకునే అవకాశాలను ఇది కల్పిస్తుంది. అదే సమయంలో దీనిలో కూడా ఉండే కొన్ని రిస్కులను దృష్టిలో ఉంచుకుని, తమ వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ను బట్టి ఇన్వెస్టర్లు వ్యూహాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టర్లను అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఎంచుకోగలిగితే ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలను మరింత సమర్ధమంతంగా సాధించుకోగలుగుతారు. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్
ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్ను ప్రారంభించినట్టు ప్రకటించింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మాదిరే ఈ పథకం రాబడులు అందిస్తుందని తెలిపింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లో 15 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం రంగంలో సేవలు అందిస్తున్నవి. సూచీలో ఈ కంపెనీలకు వెయిటేజీకి అనుగుణంగానే ఈ పథకం కూడా పెట్టుబడులు పెడుతుంది. తక్కువ వ్యాల్యూషన్ల వద్ద ఉండడం, ఆయిల్, గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతుండడం పెట్టుబడులకు గొప్ప అవకాశాలను అందిస్తున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ నెల 8న ప్రారంభమైన ఈటీఎఫ్ 18వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
బజాజ్ ఫిన్సర్వ్ రెండు ఈటీఎఫ్లు
ముంబై: బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా రెండు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ను ఆవిష్కరించింది. వీటిలో నిఫ్టీ 50 ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్లు ఉన్నాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి, నిఫ్టీ 50 సూచీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలో, మార్కెట్ లీడర్లుగా ఎదిగే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్లో జనవరి 18 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జనవరి 29 నుంచి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో క్రయవిక్రయాలకు ఈ ఈటీఎఫ్లు అందుబాటులో ఉంటాయి. -
మదుపర్లను ఆకర్షించని గోల్డ్ ఈటీఎఫ్లు
ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్న సమయంలో మదుపర్లు బంగారంపై మొగ్గుచూపుతుంటారు. దాంతో గోల్డ్ ఈటీఎఫ్ల్లో మదుపు చేస్తుంటారు. ఆగస్టు నెలలో ఈ ఈటీఎఫ్ల్లో గరిష్ఠంగా పెట్టుబడులు పెట్టారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధర పెరుగుతుంది. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గత నెలలో పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోకి నికరంగా రూ.175 కోట్ల మేరకే పెట్టుబడులు వచ్చాయని భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (ఏంఎఆఫ్ఐ) వెల్లడించింది. ఆగస్టులో ఈ పెట్టుబడులు 17 నెలల గరిష్ఠమైన రూ.1028 కోట్లకు చేరాయి. జులైలో ఈ మొత్తం రూ.456 కోట్లుగా ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే వీలుండటం, ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగడం, వృద్ధి రేటు మందగించడంలాంటి కారణాల వల్ల ఇప్పటికీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగానే మదుపరులు భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య సగటున నెలకు రూ.298 కోట్ల మేరకు పెట్టుబడులు పసిడి ఈటీఎఫ్లలోకి వచ్చాయి. గత ఏడాది ఆగస్టులోనూ వీటిల్లోకి రూ.1,100 కోట్ల మేరకు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి గోల్డ్ ఈటీఎఫ్లలో మదుపు చేస్తున్న పోర్ట్ఫోలియోల సంఖ్య 48.06 లక్షలుగా ఉంది. -
ఈపీఎఫ్వో ఖాతాదారులకు శుభవార్త!
ఈపీఎఫ్వో (epfo) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (etf)లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం ఆర్ధిక శాఖ అనుమతి కోరుతుంది. కేంద్రం అనుమతితో ఈటీఎఫ్లో మదుపు చేయనుంది. తద్వారా ఈపీఎఫ్వో ఖాతాదారులకు లబ్ధి చేకూరనుంది. పలు నివేదికల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలో ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టాలన్న ఈపీఎఫ్వో నిర్ణయాన్ని అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ, సెంట్రల్ బోర్డ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదం తెలిపింది. ఈటీఎఫ్లో పెట్టుబడిలో పెట్టుబడి పెట్టి.. ఆ పెట్టుబడితో వచ్చిన లాభాల్ని తిరిగి చెల్లించేలా రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో ఈపీఎఫ్వో తన మొత్తం నిర్వహణ ఆస్తుల్లో 5శాతం నుంచి 15 శాతం వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. పరిస్థితులకు అనుగుణంగా రోజువారీ ఈటీఎఫ్ పెట్టుబడులను వెనక్కి తీసుకునే ప్రతిపాదన కూడా ఉంది. అయితే,ఈపీఎఫ్వో తన పెట్టుబడిపై రాబడిని పెంచడానికి మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
మిరే అసెట్ నుంచి నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్
హైదరాబాద్: మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాలి. ఏక్తా గాలా దీనికి ఫండ్ మేనేజరుగా ఉంటారు. 12 టాప్ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇది ట్రాక్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి చెందనున్న బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు, మెరుగైన రాబడులు పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ హెడ్ (ఈటీఎఫ్ ప్రోడక్ట్) సిద్ధార్థ్ శ్రీవాస్తవ తెలిపారు. మొండి బాకీల సమస్యను వదుల్చుకున్న బ్యాంకింగ్ రంగం గత కొన్నాళ్లుగా మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిన్టెక్ విప్లవంతో ఈ రంగం మరింత వృద్ధి చెందగలదని చెప్పారు. -
గోల్డ్ ఈటీఎఫ్లకు డిమాండ్.. వందల కోట్లలో పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు గత నెల పసిడి ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో (ఈటీఎఫ్) గణనీయంగా ఇన్వెస్ట్ చేశారు. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల ప్రకారం రూ. 124 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అంతకు మందు నెల మార్చ్లో రూ. 266 కోట్లు ఉపసంహరించుకున్నారు. సంపన్న ఎకానమీల్లో ఇంకా రిస్కులు కొనసాగుతున్నందున గోల్డ్ ఈటీఎఫ్లవైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని మార్నింగ్స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. డేటా ప్రకారం పసిడి ఆధారిత 14 ఈటీఎఫ్ల్లోకి గత నెల రూ. 124.54 కోట్లు వచ్చాయి. దీంతో పసిడి ఈటీఎఫ్ల నిర్వహణనలోని ఆస్తుల పరిమాణం రూ. 22,950 కోట్లకు చేరింది. మార్చి నెలాఖరులో ఇది రూ. 22,737 కోట్లు. ఇక గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోల సంఖ్య 12,600 పెరిగి 47.13 లక్షలకు చేరింది. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ. 653 కోట్ల పెట్టుబడులు వచ్చాయ. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2021–22లో నమోదైన రూ. 2,541 కోట్లతో పోలిస్తే 74 శాతం క్షీణించాయి. ప్రధానంగా లాభాల స్వీకరణ, ఇన్వెస్టర్లు .. ఈక్విటీలవైపు మొగ్గు చూపడం ఇందుకు కారణం. -
యాక్సిస్ కొత్త ఈటీఎఫ్ ఫండ్... రూ. 50 కోట్లు సమీకరణకు టార్గెట్
ముంబై: దేశీయంగా ఏడో పెద్ద ఫండ్ హౌస్ యాక్సిస్ ఎంఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్వో)కు తెరతీస్తోంది. ఈ నెల 22న ఫండ్ ప్రారంభమైన ఫండ్, ఏప్రిల్ 5న ముగియనుంది. ఈ ఎన్ఎఫ్వో(ఓపెన్ ఎండెడ్ ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్) ద్వారా కనీసం రూ. 50 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్లైన్ ముగియకముందే మేల్కొండి! ఈ నిధులను ఎస్అండ్పీ 500 ఇండెక్స్ను ప్రతిబింబించే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు)లో ఇన్వెస్ట్ చేయనుంది. ఫండ్ను వినాయక్ జయంత్ నిర్వహించనున్నారు. అలాట్మెంట్ తేదీ నుంచి 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే 0.25 శాతం ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... అలాట్మెంట్ అయ్యాక 30 రోజుల్లోగా రిడీమ్ లేదా స్విచ్డ్ ఔట్ అయితే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అమలుకాదని ఫండ్ హౌస్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాఘవ్ అయ్యంగర్ పేర్కొన్నారు. వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడులు చేపట్టే ఇతర రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మాదిరికాకుండా ఈ ఫండ్ సొంత పథకాలు లేదా ఇతర ఫండ్ హౌస్ పథకాలలో ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫ్షోర్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదీ చదవండి: పీఎఫ్ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? -
దీర్ఘకాలిక పెట్టుబడులకు చాన్స్!
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు వీలు కల్పిస్తున్న భారత్ మొట్టమొదటి కార్పొరేట్ బాండ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్– భారత్ బాండ్ ఈటీఎఫ్ నాల్గవ విడతను ప్రభుత్వం శుక్రవారం నుండి ప్రారంభించనుంది. ఈటీఎఫ్ కొత్త ఫండ్ ఆఫర్ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని, డిసెంబర్ 8న సబ్స్క్రిప్షన్కు గడువు ముగుస్తుందని ఫండ్ను నిర్వహించే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సేకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) మూలధన వ్యయాల కోసం వినియోగిస్తారు. రూ.4,000 కోట్ల వరకూ సమీకణ.. ఈ కొత్త భారత్ బాండ్ ఈటీఎఫ్ ఏప్రిల్ 2033లో మెచ్యూర్ అవుతుంది. నాల్గవ విడతలో ఈ కొత్త సిరీస్ ద్వారా, రూ. 4,000 కోట్ల గ్రీన్ షూ ఎంపికతో (ఓవర్ అలాట్ మెంట్ ఆఫర్) రూ. 1,000 కోట్ల ప్రారంభ మొత్తాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం మూడో విడతను రూ. 1,000 కోట్ల బేస్ ఇష్యూ పరిమాణంతో ప్రారంభించింది. 6,200 కోట్ల విలువైన బిడ్లు రావడంతో ఇది 6.2 రెట్లు అధికంగా సబ్స్క్రైబ్ అయింది. భారత్ బాండ్ ఈటీఎఫ్ 2019లో ప్రారంభమైంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రూ. 12,400 కోట్లను సమీకరించడంలో సహాయపడింది. రెండు, మూడో విడతల్లో వరుసగా రూ.11,000 కోట్లు, రూ.6,200 కోట్ల సమీకరణలు జరిగాయి. ఈటీఎఫ్ తన మూడు ఆఫర్లలో ఇప్పటివరకు రూ.29,600 కోట్లు సమీకరించింది. మరిన్ని విశేషాలు ఇవీ.. ► భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రభుత్వ రంగ కంపెనీల ‘ఎఎఎ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. ► 2019లో ప్రారంభించినప్పటి నుండి, ఈటీఎఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) విలువ రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. ► ఇప్పటివరకు, భారత్ బాండ్ ఈటీఎఫ్ ఐదు మెచ్యూరిటీలతో ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరాలు వరుసగా 2023, 2025, 2030, 2031, 2032గా ఉన్నాయి. డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇష్యూకు మెచ్యూరిటీ సమయం 2033 ఏప్రిల్. భారీ స్పందన.. భారత్ బాండ్ ఈటీఎఫ్ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుండి మంచి ప్రతిస్పందనను సంపాదించింది. భారత్ బాండ్ ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి, భారతదేశ వృద్ధి బాటకు పటిష్టత ఇవ్వడానికి పెట్టుబడిదారులందరికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని సృష్టించింది – తుహిన్ కాంత పాండే, దీపం కార్యదర్శి లక్ష్యాల ప్రకారం.. మెచ్యూరిటీ ఎంపిక ఎడెల్వీస్ మూచువల్ ఫండ్ భారత్ బాండ్ ఈటీఎఫ్ను ప్రారంభించిన తర్వాత టార్గెట్ (లక్ష్యాలకు అనుగుణంగా) మెచ్యూరిటీ ఫండ్లో పెట్టుబడులు పెట్టే వర్గం ఉత్సాహభరిత రీతిలో వేగంతో పెరుగుతోంది. దీర్ఘకాలిక రుణంలో పెట్టుబడులకు ఈ ఫండ్ సౌలభ్యంగా ఉంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఇప్పుడు ఆరు మెచ్యూరిటీలను కలిగి ఉంది. 2023 నుండి 2033 వరకు పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యాల ప్రకారం సరైన మెచ్యూరిటీని ఎంచుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. – రాధికా గుప్తా, ఎడెల్వీస్ ఫండ్ ఎండీ, సీఈఓ -
డిసెంబర్లో నాలుగో విడత భారత్ బాండ్ ఈటీఎఫ్
నాలుగో విడత భారత్ బాండ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను డిసెంబర్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. దీని ద్వారా సమీకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) పెట్టుబడి అవసరాల కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం సీపీఎస్ఈల నిధుల అవసరాలపై వాటితో చర్చలను జరుపుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. తాజా భారత్ బాండ్ ఈటీఎఫ్ పరిమాణం దాదాపు గతేడాది స్థాయిలోనే ఉండవచ్చని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్లో రూ.1,000 కోట్ల కోసం మూడో విడత జారీ చేయగా 6.2 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యి రూ. 6,200 కోట్లు వచ్చాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్ దేశీయంగా తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్. 2019లో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టగా అప్పట్లో రూ. 12,400 కోట్లు వచ్చాయి. ఇక రెండో విడతలో రూ. 11,000 కోట్లు వచ్చాయి. ఇప్పటివరకు 3 విడతల్లో రూ. 29,600 కోట్లు సమీకరించారు. -
బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇక సంక్రాంతి, దసరా.. ముఖ్యంగా దంతెరాస్, దీపావళి వంటి పండగల సమయాల్లో ఫిజికల్ గోల్డ్, గోల్డ్ కాయిన్స్, జ్వువెలరీ కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతుంటాయి. దీనికి తోడు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 282 జిల్లాల్లో బంగారంపై హాల్మార్క్ తప్పని సరిచేయడంతో కొనుగోళ్లు సాఫీగా జరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ధంతేరాస్, దీపావళికి ఫిజికల్ గోల్డును ఎలా కొనుగోలు చేయాలి? పండగల సమయాల్లో ఎంత బంగారం కొనుగోలు చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం పాప్లీ గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పాప్లీ, బంగారంపై తప్పనిసరి హాల్మార్కింగ్ను అమలు చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సలహా కమిటీలో ఉన్న ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పెథే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పూనమ్ రుంగ్తా జాతీయ మీడియాకు ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి. కోవిడ్- 19 లాక్డౌన్ ఎత్తివేత, తగ్గిపోతున్న మహమ్మారి కారణంగా భారత్లో బంగారంపై డిమాండ్ పెరుగుతుందా? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. రాజీవ్ పాప్లీ : అవును, బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే? రక్షా బంధన్ నుంచి బంగారం విక్రయాలు ఊపందుకున్నాయి. కోవిడ్ ఎఫెక్ట్తో అనిశ్చిత కాలంలో గోల్డ్లో పెట్టుబడులు సురక్షితమని పెట్టుబడి దారులు భావిస్తున్నారు. ఆశిష్ పేథే : గత రెండేళ్లుగా నేను చూస్తున్న మరో ట్రెండ్ ఏమిటంటే పెట్టుబడి దారులు ముఖ్యంగా యువకులు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రెట్టింపు ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా బంగారం కొనుగోళ్ల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం ప్రారంభించాయి. హాల్మార్క్ లేని ఆభరణాలను తప్పుగా అమ్మడం సాధ్యమేనా? పెథే : హాల్మార్కింగ్ తప్పనిసరి అయిన 282 జిల్లాల్లో మీరు బంగారం కొనుగోలు చేస్తే, హాల్మార్క్ లేని ఒక్క ఆభరణాన్ని కూడా విక్రయించలేరు. 2 గ్రాముల చిన్న ముక్క లేదా చిన్న చెవిపోగు కూడా హాల్మార్క్ చేయబడాలి. వాస్తవానికి, ప్రతి స్వర్ణకారుడు కనీసం 10x మాగ్నిఫికేషన్ ఉన్న భూతద్దం కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తుంది. తద్వారా వినియోగదారు హాల్మార్కింగ్ను తనిఖీ చేయవచ్చు. 18-క్యారెట్ బంగారు ముక్క మొదలైన వాటి కోసం మార్కింగ్ను వివరించే చార్ట్ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి పూనమ్ రుంగ్తా : మనం భారతీయులం. బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ మన పెట్టుబడుల్ని మాత్రం ఆభరణాల్లో కలపకూడదు. ఎందుకంటే? కొన్న బంగారాన్ని కుటుంబ సభ్యులకు విభజించాలంటే.. వాటిని అమ్మాల్సి ఉంటుంది. అందువల్ల, గోల్డ్ బార్గా లేదా ఇ-గోల్డ్ లేదా పేపర్ గోల్డ్ కొనుగోలు చేయడం వంటి మార్గాలు బంగారంపై ఉత్తమమైన పెట్టుబడిగా భావించాలి. బంగారాన్ని ఈక్విటీ (షేర్లు), డెబిట్ వంటి ఏదైనా ఇతర ఆస్తిలాగా పరిగణించండి. భౌతిక రూపంలో (స్వచ్ఛమైన బంగారం) లేదా గోల్డ్ ఇటిఎఫ్లలో మీ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 10-15 శాతం బంగారం రూపంలో ఉంచండి. ధంతేరస్, దీపావళి సమయాల్లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? రుంగ్తా : ప్రజలు ధంతేరస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బంగారం ధర కూడా డిమాండ్, సప్లై నిర్విరామంగా కొనసాగుతుంది. అలాంటి సమయాల్లో కొనుగోలు దారులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే? పండగల సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఆ సమయంలో కొద్ది బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణ సమయాల్లో మీకు కావాల్సినంత బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. ధంతేరాస్, దీపావళి సమయంలో మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బంగారు నాణేలు కొనుగోలు చేయడం ఉత్తమమేనా? రుంగ్తా : తక్కువ మేకింగ్ ఛార్జీల సంగతి అటుంచితే. బంగారు నాణేలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. మనకు తెలిసినట్లుగా, బంగారు కడ్డీలు, నాణేలు 24-క్యారెట్ల స్వచ్ఛమైన నాణ్యతతో వస్తాయి. అంతేకాకుండా, బంగారు నాణేలు వినియోగం కంటే పెట్టుబడి పెడితే ఎక్కువ రుణాలు ఇస్తాయి. -
భారత్ బాండ్ ఈటీఎఫ్ హవా: రెండేళ్లలో అనూహ్య వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ బాండ్ ఈటీఎఫ్ల పరిధిలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రెండున్నరేళ్లలోనే రికార్డు స్థాయికి చేరాయి. రూ.50,000 కోట్ల మార్క్ను అధిగమించాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఈ వివరాలను ప్రకటించింది. 2019 డిసెంబర్లో భారత్ బాండ్ ఈటీఎఫ్ మొదటి విడత ఇష్యూ రావడం గమనార్హం. అప్పటి నుంచి ఐదు ఇష్యూలు పూర్తయ్యాయి. వీటి మెచ్యూరిటీ 2023, 2025, 2030, 2031, 2031లో తీరనుంది. ‘‘ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక బలం, ఇన్వెస్టర్లలో వాటి పట్ల ఉన్న విశ్వాసానికి భారత్ బాండ్ ఈటీఎఫ్ల విజయం నిదర్శనం. మన తొలి డెట్ ఈటీఎఫ్ అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది’’అని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే దీపమ్ కార్యదర్శి తుహిన్కాంత పాండే తెలిపారు. ఏఏఏ రెటెడ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన నిఫ్టీ భారత్ బాండ్ సూచీల్లో భారత్ బాండ్ ఈటీఎఫ్లు ఇన్వెస్ట్ చేస్తాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్ల ఘన విజయంతో ఇతర అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు 2019 తర్వాత సుమారు 30 వరకు టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను తీసుకు రావడం గమనార్హం. ప్యాసివ్ డెట్ విభాగంలో రూ.60వేల కోట్ల ఏయూఎంతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ అగ్రగామిగా చేరుకోవడానికి భారత్ బాండ్ ఈటీఎఫ్లు దోహదపడ్డాయి. -
సిల్వర్ ఈటీఎఫ్లకు ఏఎంసీలు సుముఖం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) వరుసబెట్టి సిల్వర్ ఈటీఎఫ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి రూ.1,400 కోట్లను సమీకరించాయి. సిల్వర్ ఈటీఎఫ్ల ఆవిష్కరణకు సెబీ గతేడాది నవంబర్లో అనుమతించింది. దీంతో అప్పటి నుంచి ఏఎంసీలు సిల్వర్ ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్ల ప్రారంభానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. కోటక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయితే, సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసుకుంది. ఈ ఫండ్స్తో వెండిపై డిజిటల్గా పెట్టుబడులకు వీలు కలుగుతుంది. ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా సంస్థలు సిల్వర్ ఈటీఎఫ్లను ప్రారంభించాయి. ఈ సంస్థలన్నీ కూడా సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లను కూడా నిర్వహిస్తున్నాయి. ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా సమీకరించిన నిధులను తీసుకెళ్లి తమ నిర్వహణలోని సిల్వర్ ఈటీఎఫ్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ సిల్వర్ ఈటీఎఫ్ల ఎన్ఎఫ్వో(నూతన పథకం)లు ఇటీవలే ముగిశాయి. ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్వోఎఫ్లు ప్రస్తుతం నిధుల సమీకరణలో ఉన్నాయి. హెడ్జ్ సాధనంగా.. ‘‘ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా చాలా మంది ఇన్వెస్టర్లు వెండిలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. వీరికి సిల్వర్ ఈటీఎఫ్లు మంచి అవకాశంగా ఉన్నాయి. భౌతికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్గా కలిగి ఉండొచ్చు’’అని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. పైగా ఇటీవలి కాలంలో వెండి ధరలు తగ్గి ఉండడం కూడా ఏఎంసీలు ఈటీఎఫ్లు, ఎఫ్వోఎఫ్ల ఆఫర్లను ప్రారంభించడానికి కారణంగా ఆమె పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల తరుణంగా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు తోడు, పారిశ్రామిక, తయారీ రంగాల్లోనూ దీని వినియోగం పెరిగినట్టు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్, 5జీ రంగాల నుంచి డిమాండ్ నెలకొన్నట్టు పేర్కొన్నారు. -
గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.457 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ జూలైలో నికరంగా రూ.457 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. పోర్టుఫోలియో రీబ్యాలెన్సింగ్ ప్రణాళికలో భాగంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వంటి రక్షణాత్మక విభాగాల్లోకి మళ్లించడం కలిసొచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపారు. ఈ జూన్లో రూ.135 కోట్లు మాత్రమే వచ్చినట్లు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి)గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది(2022) జూలై నాటికి గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.982 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘యాంఫీ గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.., బంగారాన్ని పెట్టుబడుల వైవిధ్య సాధనంగా చూసే ధోరణి పెరిగింది. ఇన్వెస్టర్లు మార్కెట్ అస్థిరతలకు హెడ్జ్ సాధనంగా పరిగణిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం అంశాలు గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులపై ప్రభావాన్ని చూపుతున్నాయి’’ అని ఎల్ఎక్స్ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతి రాతి గుప్తా తెలిపారు. -
ఎఫ్వోఎఫ్ లాంచ్ చేసిన ఐసీఐసీఐ ప్రుడెన్నియల్..!
ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ప్యాసివ్ మల్టీ-అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్(ఎఫ్వోఎఫ్) ఆవిష్కరించింది. ఈ ఫండ్ జనవరి 10తో ముగుస్తుంది. కనీసం రూ. 1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని కింద 25-65 శాతం నిధులను దేశీయంగా ఈక్విటీల్లోను, 25-85 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోనూ, 0-15 శాతం నిధులను బంగారం, 10-80 శాతం మొత్తాన్ని అంతర్జాతీయ సంస్థల షేర్లలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈటీఎఫ్ మార్గంలో పెట్టుబడులు పెడుతుంది. సాధారణంగా ఏ ఆర్ధిక సాధనానికి ఎంత 'మేర ఇన్వెస్ట్ చేయాలన్న విషయంలో ఇన్వె స్టర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఇన్వెస్టర్లు. ప్యాసివ్ విధానంలో వివిధ అసెట్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది సరళతరమైన సాధనంగా ఉపయోగపడుతుందని సంస్థ హెడ్ (ప్రోడక్ట్ డెవలప్మెంట్, స్ట్రాటజీ) చింతన్ హరియాతెలిపారు. దేశీ ఈక్వటీలతో పాటు అంతర్జాతీయ కంపెనీల్లోనూ పెట్టుబడుల వల్ల డైవేర్సిఫికేషన్ మరింత మెరుగ్గా ఉండగలదని పేర్కొన్నారు. ఇతర ఫండ్, పౌస్ల ఈటీఎఫ్లలో కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్కి ఉంటుందని తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్నియల్ సిల్వర్ ఈటీఎఫ్ ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఫండ్ దేశంలోనే మొదటే సిల్వర్ ఈటీఎఫ్ను, ఈ నెల 6న ప్రారంభించనుంది. ఇది 19వ తేదీన ముగుస్తుంది. సిల్వర్, సిల్వర్ ఆధారిత సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్ రుణ పత్రాల్లోనూ ఎక్స్పోజర్ తీసుకుంటుంది. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్(ఏడాది కాలం వరకు), సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సిల్వర్. ఈటీఎఫ్ల నిర్వహణ మార్గదర్శకాలను సెబీ గత నవంబర్లో ప్రకటించిన తర్వాత ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఎన్ఫ్వోకు దరఖాస్తు చేసుకుంది. వెండిలో ఇన్వెస్ట్ చేసుకునే వారికి భౌతిక వెండితో పోలిస్తే ఇది మెరుగైన సాధనం అవుతుంది. -
మిరే అసెట్ హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్
మిరే అసెట్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్ను ప్రకటించింది. ఒకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ కాగా మరొకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్). మొదటిదానిలో పెట్టుబడులకు నవంబర్ 29, రెండో దానికి డిసెంబర్ 1 ఆఖరు తేదీ. ఈటీఎఫ్కు సిద్ధార్థ శ్రీవాస్తవ, ఎఫ్వోఎఫ్కు ఏక్తా గాలా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. హాంకాంగ్ స్టాక్ ఎక్సే్చంజీలో లిస్టయిన 30 చైనా టాప్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి. -
భారత్ బాండ్ ఈటీఎఫ్తో రూ.10,000 కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్రం డిసెంబర్లోగా భారత్ బాండ్ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ద్వారా రూ.10,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశం ఉందని ఆర్థిక శాఖలో ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పురోగతి ప్రణాళికలకు ఈ నిధులను వినియోగిస్తారు. ఇదే జరిగితే భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ ఇది మూడవ విడత అవుతుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల సులభతర రుణాలకు సంబంధించి ఒక పెట్టుబడి సాధనం. ఈటీఎఫ్ ప్రస్తుతం ప్రభుత్వ రంగ కంపెనీల ’ఏఏఏ’ రేటెడ్ బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. 2020 జూలైలో రెండవ విడత భారత్ బాండ్ ఈటీఎఫ్ జారీ జరిగింది. మూడురెట్లకుపైగా ఇది ఓవర్సబ్స్రై్కబ్ అయ్యింది. రూ.11,000 కోట్ల సమీకరణలు జరిగాయి. ఇక 2019 డిసెంబర్లో వచ్చిన తొలి ఆఫర్ ద్వారా రూ.12,400 కోట్ల సమీరణలు జరిగాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్కు మొదటి విడతలో మూడు, పది సంవత్సరాల మెచ్యూరిటీ ఆప్షన్లు ఉండగా, రెండవ విడతకు ఐదు, 12 సంవత్సరాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎడెల్వైస్ అసెట్ మేనేజ్మెంట్ ఈ పథకం ఫండ్ మేనేజర్. -
బిట్కాయిన్ @ 66,901 డాలర్లు
న్యూయార్క్: కొన్నాళ్ల క్రితమే 30,000 డాలర్ల కిందికి పడిపోయిన బిట్కాయిన్ విలువ మళ్లీ దూసుకుపోతోంది. తాజాగా బుధవారం ఆల్ టైమ్ రికార్డు స్థాయి 66,901 డాలర్లకు (దాదాపు రూ. 50,17,575) ఎగసింది. గతంలో ఆల్టైమ్ గరిష్ట స్థాయి 64,889 డాలర్లు. ఈ ఏడాది వేసవిలో బిట్కాయిన్ విలువ 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రోషేర్స్ బిట్కాయిన్ స్ట్రాటెజీ వంటి బిట్కాయిన్ ఆధారిత ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తుండటం కాయిన్ ర్యాలీకి దోహదపడుతోంది. లిస్టింగ్ రోజునే ప్రోషేర్స్ బిట్కాయిన్ ఈటీఎఫ్కి సంబంధించి 2.41 కోట్ల షేర్లు చేతులు మారటం బిట్కాయిన్ డిమాండ్కి నిదర్శనం. ఈ ఈటిఎఫ్లు నేరుగా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయకుండా, దానికి సంబంధించిన ఫ్యూచర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఈటీఎఫ్ల వల్ల.. హాట్, కోల్డ్ వాలెట్లు వంటి సాంకేతిక అంశాల బాదరబందీ లేకపోవడంతో సామాన్య ఇన్వెస్టర్లు కూడా బిట్కాయిన్ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణ బ్రోకరేజి అకౌంటుతో కూడా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతోందని పేర్కొన్నాయి. -
ఆదిత్య బిర్లాసన్లైఫ్ నుంచి నిఫ్టీ హెల్త్కేర్ ఈటీఎఫ్
ముంబై: ఆదిత్య బిర్లా సన్లైఫ్ మ్యూచువల్ ఫండ్.. నూతనంగా ‘ఆదిత్య బిర్లా సన్లైఫ్ నిఫ్టీ హెల్త్కేర్ ఈటీఎఫ్’ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. నిఫ్టీ హెల్త్కేర్ టీఆర్ఐ ఇండెక్స్ను అనుసరించి పెట్టుబడులు పెడుతుంది. ఈ నెల 8న మొదలైన ఈ పథకంలో 20వ తేదీ వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ (హెల్త్కేర్) రంగంలో ఉన్న అవకాశాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేసే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. నిఫ్టీ హెల్త్కేర్ ఇండెక్స్లో 20 వరకు కంపెనీలున్నాయి. వీటిల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఏఎంసీ ఎండీ, సీఈవో ఏ.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘‘ఆదాయం, ఎగుమతులు, ఉపాధి కల్పన పరంగా హెల్త్కేర్ కూడా దేశంలో ఒకానొక ముఖ్య మైన రంగంగా అవతరించింది. ఈ వృద్ధి లిస్టెడ్ కంపెనీల్లోనూ ప్రతిఫలించాల్సి ఉంది. ఇది ప్యాసివ్ పథకం. కనుక వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఈ రంగం వృద్ధిలో పాల్గొనేందుకు ఈ పథకం ఒక చక్కని మార్గం అవుతుంది’’ అని చెప్పారు. -
బిట్ కాయిన్కు కెనడా గ్రీన్ సిగ్నల్
డిజిటల్ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ పై అనేక ప్రపంచ దేశాలు, సెంట్రల్ బ్యాంకుల ఆంక్షల విధించిన కరోనా మహమ్మారి కాలంలో కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. రూ.35 లక్షలు దాటిన బిట్ కాయిన్ ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం అన్ని దేశాల ఆమోదం నిదానంగా పొందుతోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సేవల సంస్థలైన జేపీ మోర్గాన్, వీసా, పేపాల్, మాస్టర్ కార్డ్ మద్దతునూ కూడా పొందింది. తాజాగా బంగారం మాదిరే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్కు కెనడాకు చెందిన ప్రధాన సెక్యూరిటీ రెగ్యులేటర్ ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కెనడాలో బంగారం మాదిరే బిట్ కాయిన్ కొనుగోలు చేయవచ్చు. ఈటీఎఫ్ ప్రపంచంలోనే బౌతికంగా బిట్ కాయిన్తో పెట్టుబడి పెట్టడానికి, ఇన్వెస్టర్లు తేలిగ్గా పొందడానికి ఒంటారియో సెక్యూరిటీస్ కమిషన్ వెసులుబాటు కల్పిస్తున్నది. బిట్కాయిన్ శుక్రవారం రికార్డు స్థాయిలో $ 48,975కు చేరుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 63శాతం పెరిగింది. 2020 మార్చి నుండి సుమారు 1,130 శాతం పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా డిజిటల్ కరెన్సీ బిట్కాయిన్లో 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిపెట్టినట్లు ఎలోన్ మస్క్ పేర్కొన్నారు. -
పెట్టుబడులకు ఇండెక్స్ ఫండ్స్
ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇండెక్స్ ఫండ్స్ కూడా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వ్యయాలపరంగా కాస్త చౌకగా ఉండటంతో పాటు అర్థం చేసుకోవడానికి సులభతరంగా ఉండటం కూడా వీటికి సానుకూలాంశం. దీర్ఘకాలికంగా సంపద సృష్టికి అనువైనవిగా నిరూపించుకున్నాయి. అమెరికా తదితర సంపన్న దేశాల్లో వందల కొద్దీ ఇండెక్స్ ఫండ్స్, ఎక్సే్చంజీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఉన్నప్పటికీ.. భారత్లో ఇవి ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం పలు అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు .. పెద్ద సంఖ్యలోనే ఇండెక్స్ ఫండ్స్ను ప్రవేశపెడుతున్నాయి. వందలకొద్దీ మ్యూచువల్ ఫండ్స్తో పాటు ఈ ఇండెక్స్ ఫండ్స్ సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల ముందు ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇలాంటప్పుడు దేన్ని ఎంచుకోవాలి? ఈటీఎఫ్ల సంగతేంటి? ఎక్కడ మొదలెట్టాలి.. లాంటి సందేహాలెన్నో వస్తాయి. ఇందుకోసం బేరీజు వేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యామ్నాయం.. ఈటీఎఫ్లు ఇక ఇండెక్స్ ఫండ్స్కు ప్రత్యామ్నాయంగా ఈటీఎఫ్లు కూడా ఉన్నాయి. ఈటీఎఫ్లు మిగతా షేర్లలాగానే ఎక్సే్చంజీల్లో ట్రేడవుతుంటాయి. ఇండెక్స్ ఫండ్స్ను మ్యూచువల్ ఫండ్ సంస్థలు.. నిర్వహిస్తుంటాయి. సాధారణంగా ఈటీఎఫ్లలో యూనిట్లు కొంటే ఓ రేటు, అమ్మితే ఇంకో రేటులాగా ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. తక్కువ వ్యయాలతో దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కేటాయింపుల కోసం ఇండెక్స్ ఫండ్స్ చాలా మెరుగైన సాధనాలనే చెప్పవచ్చు. ఫండ్స్ మేళవింపే 90 శాతం పైగా రాబడులకు కీలకంగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాం.. దేన్ని.. ఎప్పుడు అమ్మేశాం.. అన్నది కాకుండా పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉన్నాయన్నది ముఖ్యం. వివిధ రకాల అసెట్స్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇండెక్స్ ఫండ్స్ను నిస్సందేహంగా పరిశీలించవచ్చు. రిస్క్ సామర్థ్యం ముందుగా మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. ఎంతవరకూ రిస్కు తీసుకోగలరో అర్థం చేసుకుని, దానికి కట్టుబడి ఉండాలి. రిస్క్ సామర్థ్యంపై అవగాహన లేకపోతే.. బుల్ మార్కెట్లలో మరీ దూకుడుగా ఉండటమో, బేర్ మార్కెట్లలో మరీ వెనక్కి తగ్గిపోవడమో చేయడంవల్ల మొత్తం సంపదనంతా పోగొట్టుకునే అవకాశం ఉంది. అనువైన సాధనం మార్కెట్లో బోలెడన్ని ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు.. పెద్దగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టరు.. మరీ ఎక్కువగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకపోవడం శ్రేయస్కరం. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్కు కొంత మొత్తంలో కేటాయించవచ్చు. ఇక అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోగలిగే ఇన్వెస్టర్లు.. షేర్లలోనూ, మిడ్.. స్మాల్ క్యాప్ ఫండ్స్లోనూ కాస్త పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ ప్రధానంగా ఆరు రకాలుగా ఉంటాయి. అవేంటంటే.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టోరల్, ఇంటర్నేషనల్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఇండెక్స్లో భారత్లోని టాప్ 100 స్టాక్స్ ఉంటాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్లో తదుపరి 150 స్టాక్స్ (101–250), స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్లో మిగతా స్టాక్స్ (250 ప్లస్) ఉంటాయి. గత రాబడులు చూస్తే.. సెక్టోరల్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆకర్షణీయంగానే కనిపించవచ్చు. అయినప్పటికీ ఇవి చాలా రిస్కుతో కూడుకున్నవే కాకుండా తీవ్ర హెచ్చుతగ్గులకు కూడా లోనవుతుంటాయన్నది గుర్తుంచుకోవాలి. సురక్షితమైన సాధనం కావాలనుకునే వారు లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ (నిఫ్టీ 50, నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవి కాకుండా, ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. రూపాయి మారకం విలువ క్షీణించినప్పుడు హెడ్జింగ్కు, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్కు.. ఇంటర్నేషనల్ ఫండ్స్ తోడ్పడతాయి. యాపిల్, గూగుల్, అమెజాన్ వంటి నాణ్యమైన షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. సరైన ఫండ్ ఎంపిక అనేక రకాల ఫండ్స్ సంస్థలు దాదాపు ఒకే రకమైన ఫండ్స్ను ఆఫర్ చేస్తున్నప్పుడు దేన్ని ఎంచుకోవాలన్న విషయంలో గందరగోళం తలెత్తడం సహజం. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ను ప్రస్తుతం చాలా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ దాదాపు ఒకే రకంగానే కనిపించినా.. ఇన్వెస్టర్లు ప్రధానంగా వ్యయాలపైన (టోటల్ ఎక్స్పెన్స్ నిష్పత్తి), ట్రాకింగ్ ఎర్రర్ని (టీఈ) పరిశీలించాలి. ప్రామాణిక సూచీ ఇచ్చే రాబడితో పోలిస్తే ఫండ్ ఎంత రాబడి ఇస్తోందన్నది టీఈ ద్వారా తెలుస్తుంది. అయితే, ప్రామాణిక సూచీ పనితీరునే కచ్చితంగా ప్రతిబింబించడం ఏ ఫండ్కైనా అసాధ్యమే. ట్రేడింగ్ వ్యయాలు, పన్నులు, వ్యయాల నిష్పత్తి మొదలైన వాటి కారణంగా ప్రతీ ఏటా.. ఎంతో కొంత టీఈకి దారి తీస్తుంది. చాలా సందర్భాల్లో వ్యయాల నిష్పత్తులు ఎంత ఎక్కువగా ఉంటే టీఈ అంత ఎక్కువగా ఉంటుంది. కనుక.. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. -
భారత్ బాండ్.. ఇన్వెస్ట్ చేస్తున్నారా?
భారత్ బాండ్ ఈటీఎఫ్.. నూతన మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 12న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రిస్క్ లేకుండా బ్యాంకు డిపాజిట్ల స్థాయిలో రాబడులు కోరుకునే వారు ఇష్యూను పరిశీలించొచ్చు. ఈ ఇష్యూ ద్వారా కనీసం రూ.7,000 కోట్ల వరకు సమీకరించాలన్నది ప్రణాళిక. దేశంలో తొలి కార్పొరేట్ బాండ్ ఫండ్ ఇదే అవుతుంది. ఈ ఇష్యూకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే, అప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా? అన్నది ఇన్వెస్టర్లు సులభంగా నిర్ణయించుకోగలరు. ఆ వివరాలు అందించే ‘ప్రాఫిట్’ కథనమే ఇది. ∙ భారత్ బాండ్ ఈటీఎఫ్ను కేంద్రం తీసుకురావడం వెనుక లక్ష్యాలను పరిశీలిస్తే.. దేశీయ డెట్ మార్కెట్లో లిక్విడిటీని మరింత పెంచడం ఒకటి. రిటైల్ ఇన్వెస్టర్లు సులభంగా పాలు పంచుకునేలా చేయడం రెండోది. తక్కువ ఖర్చుకే బాండ్ ఈటీఎఫ్ను అందించడం.. ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యకలాపాల కోసం అవసరమైన నిధులను కొంచెం తక్కువ రేటుకే పొందే మార్గం కల్పించడం మరొకటి. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లు ప్యాసివ్ (క్రియాశీలకం కాని) పనితీరుతో కూడినవి. అవి ఒక ఇండెక్స్ను అనుసరిస్తుంటాయి. రాబడులు కూడా ఆ ఇండెక్స్కు అనుగుణంగానే ఉంటాయి. భారత్ బాండ్ ఈటీఎఫ్కు సంబంధించి భారత్ బాండ్ ఇండెక్స్– ఏప్రిల్ 2023, భారత్ బాండ్ ఇండెక్స్ – ఏప్రిల్ 2030 సూచీలను ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఈటీఎఫ్లకు భారత్ బాండ్ ఈటీఎఫ్కు మధ్య వ్యత్యాసం.. భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లతో కూడి ఉండడమే. మిగతాదంతా ఇతర ఈటీఎఫ్ల్లో మాదిరే ఉంటుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ మూడేళ్లు (ఏప్రిల్ 2023), పదేళ్లు (ఏప్రిల్ 2030) కాల వ్యవధితో రెండు రకాలుగా ఉంటుంది. కాల వ్యవధి తీరిన తర్వాత అసలు పెట్టుబడి, ఆ మొత్తంపై వడ్డీ రాబడి చెల్లిస్తారు. ఇందులో కేవలం గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది. రాబడులను ఎప్పటికప్పుడు చెల్లించే డివిడెండ్ ఆప్షన్ లేదు. ఎడెల్వీజ్ ఏఎంసీ ఈ ఈటీఎఫ్ నిర్వహణను చూస్తోంది. ఇది ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ కనుక ఇష్యూ ఈ నెల 20న ముగిసినప్పటికీ.. తర్వాత స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో ట్రేడవుతుంటాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ చేయనున్నారు. లిస్ట్ అయిన తర్వాత యూనిట్ల రూపంలో కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. కనుక ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు లావాదేవీలకు అర్హులు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక యూనిట్ (రూ.1,000) నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.2 లక్షల వరకే పెట్టుబడికి అవకాశం ఉంటుంది. ‘భారత్బాండ్ డాట్ ఇన్’ పోర్టల్కు వెళ్లి ఎన్ఎఫ్వో ఆఫర్ పత్రాన్ని పొందొచ్చు. దీనిని సమీపంలోని ఎడెల్వీజ్ కార్యాలయంలో సమర్పించడం ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇష్యూ సైజు మూడేళ్ల ఈటీఎఫ్ రూపంలో కనీసం రూ.3,000 కోట్లు, స్పందనను బట్టి అదనంగా మరో రూ.2,000 కోట్లు సమీకరించాలన్నది ప్రణాళిక. అలాగే, పదేళ్ల ఈటీఎఫ్ ద్వారా కనీసం రూ.4,000 కోట్లు, స్పందన అధికంగా ఉంటే మరో రూ.2,000 కోట్ల వరకు సమీకరించనున్నారు. భద్రత ఎక్కువే... భారత్ బాండ్ ఈటీఎఫ్ కచ్చితంగా ఏఏఏ రేటింగ్ కలిగిన ప్రభుత్వరంగ కంపెనీల డెట్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనుక భద్రతకు ఢోకా ఉండదు. ఏఏఏ రేటింగ్ తిరిగి చెల్లింపుల విషయంలో అధిక భద్రతను సూచిస్తుంది. అంటే క్రెడిట్ రిస్క్ చాలా చాలా తక్కువ. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. కనుక పెట్టుబడులకు ఎటువంటి రిస్క్ ఉండదు. పన్ను ఎంతో తక్కువ మూడేళ్లకు పైగా పెట్టుబడులను కొనసాగిస్తే, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే పన్ను ఎంతో తక్కువ. ఇన్వెస్టర్ల రిస్క్ ప్రొఫైల్కు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. కన్జర్వేటివ్ (రిస్క్ తీసుకోని) ఇన్వెస్టర్లు 20–22 శాతం పెట్టుబడులను భారత్ బాండ్ ఈటీఎఫ్కు కేటాయించుకోవచ్చు. ఏఏఏ రేటింగ్ రాబడులు, రిస్క్ లేని సాధనం. – పవన్ అగర్వాల్, ప్రైవేటు వెల్త్ (ఇండియా నివేష్) ఎండీ అన్ని విధాలా అనుకూలం అత్యంత చౌక బాండ్ ఫండ్ ఇది. çఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే బయటకు వచ్చేందుకు మూడేళ్లు ఆగాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫండ్ విషయంలో ఎక్సే్ఛంజ్ల్లో రోజువారీగా లిక్విడిటీ ఉంటుంది. రాబడులు, పన్ను, లిక్విడిటీ ఇలా అన్ని అంశాల్లోనూ సంప్రదాయ మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే దీనికి ఎక్కువ మార్క్లు పడతాయి. – నితిన్ జైన్, ఎడెల్వీజ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో రాబడులు/చార్జీలు ఈటీఎఫ్లకు నిర్దేశిత కాల వ్యవధి మూడేళ్లు, పదేళ్లుగా నిర్ణయించారు. కనుక వీటిల్లో రాబడులను సుమారుగా ఊహించొచ్చు. భారత్ బాండ్ ఈటీఎఫ్ ఎన్ఎఫ్వో డాక్యుమెంట్ ప్రకారం.. ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసి కాల వ్యవధి పూర్తయ్యే వరకు ఈటీఎఫ్లో కొనసాగితే అప్పుడు.. 2023 ఈటీఎఫ్లో వార్షిక రాబడులు 6.59 శాతం, 2030 ఈటీఎఫ్లో వార్షిక రాబడులు 7.52 శాతం వరకు ఉంటాయి. ఈ రాబడులు గ్యారంటీ కావు. కేవలం సూచనీయమైనవి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో రాబడులకు ఎప్పుడూ హామీ ఉండదు. సూచిత రాబడులను రోజువారీగా ఎడెల్వీజ్ ఏఎంసీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో (పెట్టుబడులపై వసూలు చేసే నిర్వహణ చార్జీ) కేవలం 0.0005 శాతమే. దేశంలో అత్యంత చౌక మ్యూచువల్ ఫండ్ ఇది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత చౌక చార్జీలతో కూడిన డెట్ ఫండ్ కూడా అవుతుంది. డెట్ ఫండ్స్లో రాబడులు తక్కువగా ఉంటాయి కనుక ఎక్స్పెన్స్ రేషియో చాలా కీలక పాత్రే పోషిస్తుంది. భారత్ బాండ్ ఈటీఎఫ్ చార్జీల పరంగా ఎంతో చౌక కనుక నికర రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఈటీఎఫ్లపై రాబడులు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇవే కాల పరిమితుల డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న రేట్ల స్థాయిలోనే ఉంటాయని భావించొచ్చు. ఇక ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 30 రోజుల్లోపు వైదొలిగితే అప్పుడు 0.10 శాతం ఎగ్జిట్లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడిటీ... ఒక సాధనంలో పెట్టుబడి, రాబడులతోపాటు అవసరమైన సందర్భాల్లో వేగంగా వాటిని నగదుగా మార్చుకునే సౌలభ్యం (లిక్విడిటీ) ఉండాలి. అప్పుడే అది ఇన్వెస్టర్లకు సౌకర్యంగా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఎఫ్డీల్లో ఇన్వెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణాల్లో లిక్విడిటీ కూడా ఒకటి. మన దేశంలో చాలా వరకు డెట్ ఈటీఎఫ్ల్లో ట్రేడింగ్ స్వల్పంగానే ఉంటోంది. అయితే, పెద్ద సైజు ఈటీఎఫ్ల్లో ట్రేడింగ్ యాక్టివిటీ చురుగ్గానే ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు భారత్ బాండ్ ఈటీఎఫ్ రూ.7,000 కోట్లకుపైనే సమీకరించనున్న దృష్ట్యా లిక్విడిటీ తగినంత ఉంటుందని ఆశించొ చ్చు. పైగా భారత్ బాండ్ ఈటీఎఫ్లలో తగినంత లిక్విడిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎడెల్వీజ్ ఏఎంసీ చెబుతోంది. ఇందు కోసం పలువురు మార్కెట్ మేకర్లను నియమించనున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. వీరు తగినంత లిక్విడిటీతోపాటు ధర సహేతుకంగా ఉండేలా చూస్తారు. మార్కెట్ మేకర్ల కోసం రూ.20 కోట్లను వెచ్చించేందుకు ఏఎంసీలకు అనుమతి ఉంది. పైగా ఇందులో రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చిన్న మొత్తం కావడంతో లిక్విడిటీ మెరుగ్గానే ఉంటుందని అంచనా. వాస్తవంగా లిక్విడిటీ ఏ మేరకు అన్నది ఈటీఎఫ్ లిస్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఎడెల్వీజ్ ఏఎంసీ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) రకాన్ని కూడా తీసుకురానుంది. ఇది భారత్ బాండ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వారికి లిక్విడిటీ పరంగా ఇబ్బందేమీ ఉండదు. ఇతర డెట్ ఫండ్ పథకాల మాదిరే అవసరమైనప్పుడు విక్రయించి పెట్టుబడులు వెనక్కి తీసేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ లేని వారు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అనుకూలమేనా..? డెట్ ఫండ్ విభాగంలో సంక్షోభాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో అధిక క్వాలిటీ పోర్ట్ఫోలియోతో, ఊహించతగ్గ రాబడులతో, తక్కువ ఖర్చుతో కూడిన భారత్ బాండ్ ఈటీఎఫ్ అనుకూలమే. నిర్ణీత కాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించొచ్చు. మూడేళ్లతో పోలిస్తే పదేళ్ల ఈటీఎఫ్లో తొలినాళ్లలో రేట్ల పరంగా అస్థిరత కొంత ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పదేళ్ల కాలంలో వడ్డీ రేట్ల పరంగా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అయితే, పదేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ కొనసాగించే వారు ఆందోళన చెందక్కర్లేదు. తక్కువ క్రెడిట్ రిస్క్, అతి తక్కువ నిర్వహణ చార్జీలతో కూడిన కార్పొరేట్ డెట్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది. కొనుగోలు చేసి పూర్తి కాలం పాటు కొనసాగితే వడ్డీ రేట్ల రిస్క్ కూడా ఉండదు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్లు, పదవీ విరమణ చేసిన వారు, భారత్ బాండ్ ఈటీఎఫ్ల కాల వ్యవధి వరకు కొనసాగేవారు పెట్టుబడులను పరిశీలించొచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల్లో వైవిధ్యానికి ఇది ఉపకరిస్తుంది. పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఒకే విభాగంలో (ఈక్విటీ లేదా రియల్టీ) ఇన్వెస్ట్ చేయడం రిస్క్ కోణంలో సూచనీయం కాదు. డెట్లోనూ కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకో వాలన్నది నిపుణుల మాట. అందుకోసం భారత్ బాండ్ ఈటీఎఫ్ను పరిశీలించొచ్చు. తమ పెట్టుబడుల్లో 10–20 శాతం మేర భారత్ బాండ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను ప్రయోజనాలు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మూడేళ్ల పాటు కొనసాగితే, ద్రవ్యోల్బణ ప్రభావ మినహాయింపు (ఇండెక్సేషన్)ను పొందే అవకాశం ఉంటుంది. మూడేళ్లపైన మూలధన రాబడులపై 20 శాతం పన్ను అమలవుతుంది. అంటే మూలధన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించిన తర్వాతే 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి వ్యక్తిగత ఆదాయంలో కలసి, నిర్ణీత శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రాబడి ఎఫ్డీల స్థాయిలో ఉన్నా కానీ, పన్ను ఆదా పరంగా బాండ్ ఈటీఎఫ్ అదనపు ప్రయోజనం. ప్రారంభంలో ఇన్వెస్ట్ చేసిన వారికి మూడేళ్ల ఈటీఎఫ్పై నాలుగేళ్ల ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. దీంతో పన్ను అనంతర రాబడులు అధికంగా ఉంటాయని ఆశించొచ్చు. మూడేళ్ల బాండ్ ఈటీఎఫ్లో పన్ను అనంతరం రాబడులు 6.3%, పదేళ్ల ఈటీఎఫ్లో పన్ను అనంతర రాబడులు 7 శాతంగా ఉంటాయని అంచనా. పారదర్శకత రోజువారీగా పోర్ట్ఫోలియో, ఇండికేటివ్ రిటర్నులు (సూచిత రాబడులు) ఎంత మేర అన్న వివరాలను ఎడెల్వీజ్ ఏఎంసీ తన వెబ్సైట్లో ప్రదర్శించనుంది. అదే సంప్రదాయ డెట్ ఫండ్స్ నెలకోసారి మాత్రమే పోర్ట్ఫోలియో వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటితో పోలిస్తే భారత్ బాండ్ ఈటీఎఫ్లో పారదర్శకత ఎక్కువే. -
ఇక చిన్న మదుపరికీ బాండ్లు!
న్యూఢిల్లీ: ఈక్విటీల మాదిరే కార్పొరేట్ బాండ్ మార్కెట్లోనూ రిటైల్ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్ బాండ్ ఈటీఎఫ్ (భారత్ బాండ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) ప్రారంభానికి బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. బడ్జెట్లో పేర్కొన్నట్టుగా బాండ్ మార్కెట్ను ఇది మరింత విస్తృతం చేస్తుందని కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ‘‘భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్ ఈటీఎఫ్ అందిస్తుంది’’ అని మంత్రి వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. బాండ్లకు డిమాండ్ పెరిగితే, అప్పుడు తక్కువ ఖర్చుకే నిధులను సమీకరించుకునే అవకాశం ప్రభుత్వరంగ సంస్థలకుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల రుణ అవసరాలకు అనుగుణంగా ఏటా బాండ్ కేలండర్ను రూపొందిస్తామన్నారు. కాగా, ఈ నెల్లోనే భారత్ బాండ్ ఈటీఎఫ్ను ప్రారంభించే అవకాశాలున్నాయని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ సందర్భంగా తెలియజేశారు. బాండ్ ఈటీఎఫ్ విశేషాలు.. ► భారత్– 22 ఈటీఎఫ్ మాదిరే ‘భారత్ బాండ్ ఈటీఎఫ్’నూ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ చేస్తారు. అవసరమైతే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ► ఒక్కో యూనిట్ విలువ రూ.1,000. ఈ లెక్కన ఇన్వెస్టర్లు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ► క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్లా... మూడేళ్లు, పదేళ్ల స్థిర కాల వ్యవధితో భారత్ బాండ్ ఈటీఎఫ్ను జారీ చేస్తారు. వాటి కాలవ్యవధి వరసగా 2023లో, 2030లో ముగుస్తుంది. ► గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. డివిడెండ్ ఆప్షన్ ఉండదు. ► రాబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగ్గా, స్థిరంగా ఉంటాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్తో (ప్రస్తుతం 6.47 శాతం) పోలిస్తే 0.50–1.40% అధికంగా ఉండొచ్చని అంచనా. ► బాండ్ ఈటీఎఫ్లో పెట్టుబడులపై వచ్చిన మూలధన లాభాల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్ లాభం) మినహాయిస్తారు. ఆ తరవాతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది కనక పన్ను చాలావరకూ తగ్గుతుంది. ► ప్రతి ఆరు నెలలకోసారి ఈటీఎఫ్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఉంటుంది. ఇందుకోసం ఎన్ఎస్ఈ ఒక ఇండెక్స్ను రూపొందిస్తుంది. ► ఈటీఎఫ్ అన్నది పలు బాండ్ల సమూహం. ఏదైనా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ తన నిధుల కోసం భారత్ బాండ్ ఈటీఎఫ్ కింద బాండ్లను జారీ చేయవచ్చు. ► ఈ భారత్ బాండ్ ఈటీఎఫ్ నిర్వహణ బాధ్యతలను ఎడెల్వీజ్ ఏఎంసీ చూస్తుంది. రిస్క్ చాలా తక్కువ... ఐఎల్అండ్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్, ఎస్సెల్ గ్రూపులు.. రుణపత్రాలపై తీసుకున్న బకాయిల్ని చెల్లించటంలో విఫలమవ్వడాన్ని ఇటీవల చూశాం. వీటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఇన్వెస్ట్ చేసినా, లేక మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసినా డిఫాల్ట్ రిస్క్ ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న భారత్ బాండ్ ఈటీఎఫ్లో ఇలాంటి పరిస్థితి ఉం డదు. ఎందుకంటే ఈ ఈటీఎఫ్ కింద బాండ్ల రూపంలో నిధులు సమీకరించేవన్నీ ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలే. ప్రభుత్వ సంస్థలు రుణ చెల్లింపుల్లో విఫలం కావడం ఇప్పటివరకు అరుదే. ఎందుకంటే వీటి వెనుక ప్రభుత్వం ఉంటుంది. లిక్విడిటీతో కూడిన, నాణ్యమైన ప్రభుత్వరంగ బాండ్లలో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరింత మంది ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యానికి ఇది వీలు కల్పిస్తుంది. – ఎన్ఎస్ వెంకటేశ్, సీఈవో, యాంఫి ప్రభుత్వరంగ సంస్థలకు నిధుల సమీకరణకు ఇదొక కొత్త మార్గంగా సాయపడుతుంది. ప్రారంభంలో 3 ఏళ్లు, 10 ఏళ్ల మెచ్యూరిటీతో భారత్ బాండ్ ఈటీఎఫ్ ఉంటుంది. – రాధికా గుప్తా, సీఈవో, ఎడెల్వీజ్ ఏఎంసీ బాండ్ ఈటీఎఫ్లో కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండటం రిటైల్ ఇన్వెస్టర్లకు చాలా మంచిది. వారు తక్కువ రిస్క్తో కూడిన కార్పొరేట్ బాండ్లలో పాల్గొనేందుకు ఇదో మంచి అవకాశం. – అనిల్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్, ఇక్రా -
పీఎస్యూ బ్యాంకు షేర్లతో ఈటీఎఫ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థల షేర్లతో కూడిన ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, తగు సూచనలిచ్చేందుకు త్వరలో సలహాదారు నియామకం కూడా జరపనుందని అధికార వర్గాలు తెలిపాయి. సీపీఎస్ఈ ఈటీఎఫ్, భారత్–22 ఈటీఎఫ్లు విజయవంతం కావడంతో కేంద్ర ఆర్థిక శాఖ ఈ సాధనం పరిధిని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో రెండు బీమా సంస్థలు (జనరల్ ఇన్సూరెన్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స), 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐఎఫ్సీఐ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. కేంద్రం భారత్–22 ఈటీఎఫ్ ద్వారా రూ. 32,900 కోట్లు, అయిదు విడతల సీపీఎస్ఈ ఈటీఎఫ్ల ద్వారా రూ. 38,000 కోట్లు దేశీ మార్కెట్ నుంచి సమీకరించగలిగింది. సీపీఎస్ఈ షేర్ల ఆధారిత ఈటీఎఫ్లను అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రవేశపెట్టడంపై ఆర్థిక శాఖ విదేశీ ఇన్వెస్టర్లతో కూడా చర్చలు జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ) ఈటీఎఫ్లో ప్రస్తుతం 11 సంస్థలు ఉన్నాయి. ఓఎన్ జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, పవర్ ఫైనాన్స, ఆర్ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, ఎన్ టీపీసీ, ఎన్ బీసీసీ, ఎన్ఎల్సీ, ఎస్జేవీఎన్ ఇందులో ఉన్నా యి. సీపీఎస్ఈల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 90,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. -
త్వరలో బ్యాంక్ ఈటీఎఫ్
న్యూఢిల్లీ: బ్యాంక్ ఈటీఎఫ్(ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్)ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లతో కూడిన బ్యాంక్ ఈటీఎఫ్ను ప్రారంభించాలనుకుంటున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ బ్యాంక్ ఈటీఎఫ్లో చేర్చాల్సిన బ్యాంక్ షేర్లు, వాటి వెయిటేజీపై కసరత్తు చేస్తున్నామని ఆ అధికారి వివరించారు. బ్యాంక్ షేర్లపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ఈ బ్యాంక్ ఈటీఎఫ్ మరింతగా పెంచగలదని పేర్కొన్నారు. ఒక్కో బ్యాంక్షేర్ పట్ల ఇన్వెస్టర్లు అంతగా ఆసక్తి చూపకపోయినా, బ్యాంక్ షేర్లతో కూడిన ఈటీఎఫ్కు మంచి డిమాండ్ ఉండగలదని ఆయన అంచనా వేస్తున్నారు. 20 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం వాటాలు 63–83 శాతం రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే రెండు ఈటీఎఫ్లు... కేంద్రం ఇప్పటికే రెండు ఈటీఎఫ్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న రెండు ఈటీఎఫ్లు–సీపీఎస్ఈ ఈటీఎఫ్, భారత్–22 ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందనే లభించింది. ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం 2017 నుంచి రూ.32,900 కోట్లు, సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా 2014 నుంచి రూ.28,500 కోట్ల మేర పెట్టుబడులను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటివరకూ రూ.53,558 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. -
భారత్–22 ఈటీఎఫ్... కేంద్రానికి రూ.10వేల కోట్లు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్ జారీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లను సమీకరించింది. రూ.3,500 కోట్ల కనీస సమీకరణతో గురువారం ఈ ఇష్యూను అందుబాటులో ఉంచగా, సాయంత్రం 7 గంటల వరకు పది రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రిటైల్ విభాగం సహా అన్ని కేటగిరీల్లో అధిక స్పందన వచ్చిందని, దీంతో రూ.10,000 కోట్ల మేర నిధులను అట్టే పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే భారత్–22 ఈటీఎఫ్ తాజా ఇష్యూ నిర్వహించడం జరిగింది. ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.22,900 కోట్లను రాబట్టుకుంది. 2017 నవంబర్లో రూ.14,500 కోట్లు, 2018 జూన్లో రూ.8,400 కోట్ల సమీకరణ చేసింది. -
గోల్డ్ ఈటీఎఫ్లకు ఈక్విటీల సెగ
అధిక రాబడుల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు చూస్తుండటంతో గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కళ తప్పుతున్నాయి. వరుసగా ఆరో ఏడాది కూడా గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. 2018లో వీటి నుంచి రూ. 571 కోట్ల మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) 2017తో పోలిస్తే 2018లో 6 శాతం క్షీణించి రూ. 4,571 కోట్లకు తగ్గింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లోకి రూ. 1.27 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్ స్కీముల్లోకి రూ. 1.54 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. యాంఫీ గణాంకాల ప్రకారం 2017లో 14 పసిడి ఆధారిత ఈటీఎఫ్ల నుంచి రూ. 730 కోట్ల ఉపసంహరణ జరిగింది. 2016లో రూ. 942 కోట్లు, 2015లో రూ. 891 కోట్లు, 2014లో రూ. 1,651 కోట్లు, 2013లో రూ. 1,815 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ను మదుపుదారులు వెనక్కి తీసుకున్నారు. పసిడికి కొంతైనా కేటాయించాలి.. ‘అంతర్జాతీయంగా 2011–13 మధ్య కాలంలో 1,900 డాలర్లకు ఎగిసిన ఔన్సు (31.1 గ్రాములు) బంగారం రేటు ఆ తర్వాత నుంచి 1,050–1,350 మధ్యలోనే తిరుగుతోంది. రూపాయి బలహీనపడటంతో ఇటీవల దేశీయంగా పసిడి రేటు కాస్త పెరిగినా.. మొత్తం మీద చూస్తే గత ఐదేళ్లుగా పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపడం లేదు. ఇదే సమయంలో ఈక్విటీ మార్కెట్లు భారీ రాబడులు ఇస్తుండటంతో.. గోల్డ్ ఫండ్స్, ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. అయితే, పోర్ట్ఫోలియోకి హెడ్జింగ్గా కొంతైనా పసిడికి కేటాయించడం శ్రేయస్కరం‘ అని మార్నింగ్స్టార్ సంస్థ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపూర్కర్ చెప్పారు. రియల్ ఎస్టేట్, బంగారం, పొదుపు సాధనాలపై రాబడులు ఆకర్షణీయంగా లేకపోవడం కూడా ఈక్విటీల వైపు ఇన్వెస్టర్లు మళ్లడానికి కారణంగా మారిందని నిపుణులు పేర్కొన్నారు. అయితే అనిశ్చితి పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పసిడిపై పెట్టుబడులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో విరాల్ బేరావాలా చెప్పారు. -
సీపీఎస్ఈ ఈటీఎఫ్కు రూ.27,300 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: సీపీఎస్ఈ ఈటీఎఫ్ (ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా కేంద్రం రూ.17,000 కోట్లకు పైగా సమీకరించనుంది. దేశీయంగా ఒక ఈటీఎఫ్ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నెల 27న ఆరంభమైన ఈ ఆఫర్ శుక్రవారం ముగిసింది. దీనికి మొత్తం 1.25 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.27,300 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటా యించిన వాటా 5.5 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ కేటగిరీ ఇన్వెస్ట్రర్ల నుంచి రూ.13,300 కోట్లకు బిడ్లు వచ్చాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ.17,000 కోట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,200 కోట్ల మేర బిడ్లు వచ్చాయి. ప్రావిడెండ్ ఫండ్ సంస్థ, ఈపీఎఫ్ఓ రూ.1,500 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. సీపీఎస్ఈ ఈటీఎఫ్లో 11 కంపెనీల షేర్లున్నాయి. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఆయిల్ ఇండియా, పీఎఫ్సీ, ఆర్ఈసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, ఎస్జేవీఎన్, ఎన్ఎల్సీ, ఎన్బీసీసీల షేర్లు ఈ ఈటీఎఫ్లో ఉన్నాయి. -
విదేశాల్లో భారత్–22 ఈటీఎఫ్ లిస్టింగ్: కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్(ఎక్సే్చంజ్ ట్రేడేడ్ ఫండ్)ను ఏదైనా విదేశీ స్టాక్ ఎక్సే్చంజ్లో లిస్టింగ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేయడం ద్వారా ఈ ఫండ్కు మరింత విలువ చేకూరుతుందని, విదేశీ నిధులను సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్–22 ఈటీఎఫ్ ద్వారా రెండు అంచెల్లో రూ.22,900 కోట్లు సమీకరించింది. విదేశీ మార్కెట్లో భారత్ –22 లిస్టింగ్ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు వెల్లడించారు. విదేశీ మార్కెట్లో లిస్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంటే, ఇన్వెస్టర్ల డిమాండ్, స్పందన తదితర అంశాలపై ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు మదింపు చేస్తాయని వివరించారు. ఆ తర్వాత ఏ దేశంలో భారత్–22 ఈటీఎఫ్ను లిస్ట్ చేయాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మంచి స్పందనే వస్తుంది ...! గత ఆర్థిక సంవత్సరంలో ఆరంభమైన భారత్–22 ఈటీఎఫ్లో 16 కేంద్ర ప్రభుత్వ సంస్థల, మూడు పీఎస్యూ బ్యాంక్ల, మూడు ప్రైవేట్ రంగ కంపెనీల షేర్లు ఉన్నాయి. ఈ ఈటీఎఫ్ పూర్తి వైవిధ్య భరితమైనదని, విదేశీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. భారత్–22 ఈటీఎఫ్లో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, ఎస్జేవీఎన్ఎల్, గెయిల్, పీజీసీఐఎల్, ఎన్ఎల్సీ ఇండియా, ఐటీసీ, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్ల షేర్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి ఈటీఎఫ్లు ఇన్వెస్టర్లను రక్షణనిస్తాయని నిపుణులంటున్నారు. -
మెరుపు తగ్గిన గోల్డ్ ఈటీఎఫ్లు!
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో (ఈటీఎఫ్) అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– జూన్ త్రైమాసికంలో రూ.146 కోట్ల మేర బంగారం ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో బంగారం ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ 12 శాతం క్షీణించి రూ.4,567 కోట్లకు తగ్గింది. ఇది అంతకు ముందు ఏడాది జూన్ నాటికి రూ.5,174 కోట్లుగా ఉంది. ఏప్రిల్లో రూ.54 కోట్లు, మేలో రూ.38 కోట్లు, జూన్లో రూ.54 కోట్ల మేర ఉపసంహరణలు ఉన్నాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బంగారం ఈటీఎఫ్ విభాగంలో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే రావటం గమనార్హం. -
నిధులు పనిచేస్తేనే ఆర్జన
సురేశ్కు స్టాక్ మార్కెట్పై పూర్తి అవగాహన ఉంది. రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తుంటాడు. కాకపోతే మార్కెట్లు అనుకూలంగా లేవని భావిస్తే... కొద్దిరోజులు ఎలాంటి ట్రేడింగ్ చెయ్యకుండా మిన్నకుండిపోతాడు. డబ్బులు పోగొట్టుకోకుండా చూసుకోవటం కూడా ఒకరమైన స్ట్రాటజీయేనన్నది సురేశ్ ఉద్దేశం. కాకపోతే అలా ట్రేడింగ్ మానేసినపుడు... మార్కెట్లు కాస్త అనుకూలంగా మారి మళ్లీ ఎప్పుడు చేస్తాడో తనకే తెలియదు కనక ఆ డబ్బుల్ని అలా ట్రేడింగ్ ఖాతాలోనే ఉంచేస్తుంటాడు. బ్యాంకు ఖాతాలోకి వెనక్కి తీసుకోకుండా అలానే ట్రేడింగ్కు అందుబాటులో ఉంటాయి కదా అని ఉంచేస్తుంటాడు. ఒకోసారి రెండుమూడు వారాల పాటు ఇలానే ఉండిపోతాయి కూడా. మరి ఈ సమయంలో అవి బ్యాంకు ఖాతాలో ఉంటే కనీసం సేవింగ్స్ వడ్డీ అయినా వస్తుంది. అలాకాకుండా ఈ సమయంలో ఇంకా మెరుగైన రాబడులు రావాలంటే ఏం చేయాలి? లిక్విడ్ ఈటీఎఫ్లను ఎంచుకోవాలి. మీ ట్రేడింగ్ ఖాతా నుంచి బ్యాలన్స్ను విత్ డ్రా చేసుకోకుండానే... లిక్విడ్ ఫండ్స్ను కొనుగోలు చేసుకుని, మళ్లీ ట్రేడింగ్కు డబ్బులు అవసరమైన వెంటనే వీటిని విక్రయించేసుకోవచ్చు. దాంతో మీ బ్యాలన్స్పై కొంతైనా రాబడులు అందుకోవచ్చు. ఈ విధానం ఎలా పనిచేస్తుందో తెలియజేసే కథనమే ఇది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం అందుబాటులో రెండు ఫండ్లు... లిక్విడ్ ఈటీఎఫ్లనేవి ‘ప్యాసివ్లీ మేనేజ్డ్ డెట్ ఫండ్స్’. పాసివ్లీ అంటే ఫండ్ మేనేజర్ల ప్రమేయం లేకుండానే డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం.. అంతకుముందు రోజు రాత్రి బెంచ్మార్క్ (సూచీ) రేటును ట్రాక్ చేయటం వంటివి జరిగిపోతుంటాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్ల మాదిరే లిక్విడ్ ఈటీఎఫ్లు ట్రేడవుతుంటాయి. మార్కెట్ వేళల్లో అన్ని పనిదినాల్లో ఎప్పుడైనా వీటిని కొనటం, విక్రయించటం చేయొచ్చు. ప్రస్తుతం రెండు లిక్విడ్ ఈటీఎఫ్లు పనిచేస్తున్నాయి. రిలయన్స్ లిక్విడ్ బీస్, డీఎస్పీ బ్లాక్రాక్ లిక్విడ్ ఈటీఎఫ్. వీటిలో రిలయన్స్ లిక్విడ్ బీస్ అన్నది చాలా యాక్టివ్గా ట్రేడయ్యే ఈటీఎఫ్. 2003 జులై నుంచి మంచి బలమైన ట్రాక్ రికార్డు ఉంది. డీఎస్పీ బ్లాక్రాక్ లిక్విడ్ ఈటీఎఫ్ ఏడాది నుంచే పనిచేస్తోంది. చార్జీలు లేవు..! రిలయన్స్ లిక్విడ్ బీస్, డీఎస్పీ బ్లాక్రాక్ లిక్విడ్ ఈటీఎఫ్... రెండూ డైలీ డివిడెండ్ ప్లాన్నే ఆఫర్ చేస్తున్నాయి. అంటే రోజువారీ రాబడులను డివిడెండ్గా మార్చేసి తిరిగి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక డివిడెండ్పై 29.12 శాతం డివిడెండ్ పన్ను అమలవుతుంది. అయినప్పటికీ ఫండ్ ఎన్ఏవీని రోజువారీగా కనీసం రూ.1,000 స్థాయిలో ఉంచేందుకు ఇవి ప్రయత్నిస్తుంటాయి. ఒక్క బ్రోకరేజీ సంస్థ మినహా (ఈ బ్రోకరేజీ మాతృ సంస్థ బ్యాంకింగ్ కంపెనీ) మిగిలిన బ్రోకరేజీలు లిక్విడ్ ఈటీఎఫ్లలో లావాదేవీలపై బ్రోకరేజీ వసూలు చేయడం లేదు. ఎందుకంటే లిక్విడ్ ఈటీఎఫ్ల రూపంలో ఇన్వెస్టర్ల నిధులు బయటకు వెళ్లిపోకుండా ఉంటాయి. దీంతో వాటిని తిరిగి ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తే బ్రోకరేజీలకు ఎంతో కొంత లాభమే వస్తుంది కాబట్టి. కస్టోడియన్, ట్రాన్సాక్షన్ చార్జీలు కూడా లేవు. దీంతో కొనుగోలు, అమ్మకాలపై పెద్దగా వ్యయాలుండవు. ఎక్సే్చంజ్ల్లో కనీస లావాదేవీ ఒక యూనిట్గా ఉంటుంది. లిక్విడిటీ సమస్య తక్కువే... రిలయన్స్ లిక్విడ్ బీస్ అన్నది చాలా యాక్టివ్గా ట్రేడయ్యే ఈటీఎఫ్. అవసరమైన సందర్భంలో ఈటీఎఫ్ యూనిట్లను అమ్ముకోవడం ఎంతో సులభం. ఎన్ఎస్ఈలో రిలయన్స్ లిక్విడ్ బీస్ కౌంటర్లో రోజువారీగా రూ.92 కోట్ల మేర ట్రేడింగ్ గత రెండేళ్లుగా నమోదవుతోంది. గత రెండేళ్లుగా రోజువారీగా ఈ కౌంటర్లో 3,150 ట్రేడ్లు నమోదవుతున్నాయి. ఈ రెండు లిక్విడ్ ఈటీఎఫ్లు కూడా నిఫ్టీ 1డి రేటు ఇండెక్స్ను తమ బెంచ్ మార్క్గా పాటిస్తున్నాయి. అంటే ఇన్వెస్టర్లు లెండింగ్ మనీతో ఆర్జించే రాబడులను ఈ సూచీ ప్రతిఫలిస్తుంది. ఈ సూచీ రాబడుల రేటు ప్రస్తుతం 6.11 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో 4.3– 6.3 శాతం మధ్య ఉంది. దీంతో ఈ లిక్విడ్ ఈటీఎఫ్ల రాబడులు నిఫ్టీ 1డి రేటు సూచీల రేటుకు సమీపంలో ఉంటాయి. అంటే స్పష్టంగా చెప్పాలంటే డివిడెండ్ పన్ను పోను ఈ లిక్విడ్ ఈటీఎఫ్ల్లో రాబడులు ప్రతి రోజూ రూ.లక్షకు రూ.11–13 మధ్య ఉంటున్నాయి. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో వచ్చే రాబడుల కంటే ఇవి ఎక్కువ. ఉపయోగపడని నిధులకు మార్గం లిక్విడ్ ఈటీఎఫ్లు ప్రత్యేకంగా క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు ఉపయోగం. ఉపయోగించకుండా ఉన్న నిధులతో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. అవసరమైన సందర్భంలో వెంటనే నగదుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇన్వెస్టర్లు ఈక్విటీ షేర్లను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఖాతాలో యాడ్ అవుతుంది. కానీ రెండు రోజుల తర్వాతే బ్యాలన్స్ నిధులను రిడెంప్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం క్యాష్ మార్కెట్లో సెటిల్మెంట్కు సంబంధించి టీప్లస్2 అమలవుతోంది. అంటే ట్రేడ్ జరిగిన తరవాత రెండు రోజులకు సెటిల్మెంట్ అవుతుందన్న మాట. సెటిల్మెంట్ రోజున లిక్విడ్ ఈటీఎఫ్లు డీమ్యాట్ ఖాతాలో జమవుతాయి. కొత్త లావాదేవీకి డబ్బులు అవసరమయ్యేంత వరకు లిక్విడ్ ఈటీఎఫ్ల రూపంలో నిధులు హోల్డ్ అయి ఉంటాయి. ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాల్లో బ్యాలన్స్ ఉంచుకుని, అవకాశం కోసం వేచి చూసే వారు కూడా ఆ అవకాశం వచ్చే వరకు లిక్విడ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదే. ట్రేడ్కు మార్జిన్ అవసరమైన వెంటనే ఒక క్లిక్తో లిక్విడ్ ఈటీఎఫ్లను అమ్మేసుకుంటే సరిపోతుంది. లిక్విడ్ ఈటీఎఫ్లను డెరివేటివ్ ట్రేడ్లకు మార్జిన్గా కూడా ఉపయోగించుకోవచ్చు. హేర్కట్ 10 శాతం అమలవుతుంది. ప్రతికూలతలూ ఉన్నాయ్! రిలయన్స్ లిక్విడ్ బీస్, డీఎస్పీ బ్లాక్రాక్ లిక్విడ్ ఈటీఎఫ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంది. 60 బేసిస్ పాయింట్ల (0.60శాతం) మేర ఉంది. రెగ్యులర్ లిక్విడ్ ఫండ్స్తో పోలిస్తే ఇది ఎక్కువే. రెండోది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అన్నది రాబడులను తినేస్తుంటుంది. మరో అంశం మాతృ సంస్థ బ్యాంకుగా ఉన్న బ్రోకరేజీ కంపెనీ లిక్విడ్ ఈటీఎఫ్ల ట్రేడింగ్పై షేర్ల మాదిరే బ్రోకరేజీ ఛార్జీలను బాదేస్తోంది. దీంతో లిక్విడ్ ఈటీఎఫ్ల రాబడులు తగ్గిపోతాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఇక, లిక్విడ్ ఈటీఎఫ్లను లిక్విడిటీ లేని ఈటీఎఫ్ల పనితీరుతో, బ్యాంకు ఎఫ్డీలతో పోల్చడం సరైనది కాదు. ఎందుకంటే ఇవి సాధారణ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తగిన అవకాశం కోసం వేచి చూస్తూ ట్రేడింగ్ ఖాతాల్లో నిధులను అలాగే ఉంచేసేవారు, తాత్కాలికంగా ఆ నిధుల్ని లిక్విడ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనువైనవి. అది కూడా ఒక నెల కాల వ్యవధి వరకు సమంజసం. -
భారత్–22 ఈటీఎఫ్ కోసం రూ.15,436 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన విపరీతంగా వచ్చింది. రూ.15,436 కోట్ల విలువ మేర బిడ్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం సేకరించాల్సిన దానికి రెట్టింపు ఇది. 22 కంపెనీల్లో ప్రభుత్వం తనకున్న వాటాల్లో కొంత మేర భారత్–22 ఈటీఎఫ్ రూపంలో వేరు చేసి ఇన్వెస్టర్లకు విక్రయిస్తోంది. పెట్టుబడుల ఉససంహరణ ద్వారా నిధుల సమీకరణ కార్యక్రమంలో ఇదీ ఒక భాగమే. ప్రభుత్వం రూ.6,000 కోట్లను ఈటీఎఫ్ల జారీ ద్వారా, గ్రీన్షూ ఆప్షన్ ద్వారా (అవసరాన్నిబట్టి అదనపు కేటాయింపులు) రూ.2,400 కోట్లను సమీకరించాలనుకుంది. అంటే మొత్తం మీద రూ.8,400 కోట్ల వరకు ప్రభుత్వం సమీకరించే అవకాశం ఉంది. బేస్ ఇష్యూ లక్ష్యమైన రూ.6,000 కోట్ల ప్రకారం చూస్తే 2.57 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయింది. ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ చూస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన ఆఫర్ 22న ముగిసింది. అన్ని విభాగాల్లోనూ భారత్–22 ఈటీఎఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కు మంచి స్పందన వచ్చిందని, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందన అనూహ్యమనిఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో, ఎండీ నిమేష్ షా అన్నారు. భారత అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ఈ ఈటీఎఫ్ ఓ మార్గమని తాము నమ్ముతున్నట్టు చెప్పారు. అధిక డివిడెండ్ ఈల్డ్తో తక్కువ విలువకు లభిస్తోందన్నారు. -
భారత్–22 ఈటీఎఫ్కు రూ.12,500 కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్( ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఆఫర్ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బిడ్లు ఎక్కువగా వస్తే, అదనంగా రూ.2,400 కోట్ల మేర నిధులను అట్టేపెట్టుకోవాలని (గ్రీన్ షూ ఆప్షన్) కూడా భావించింది. ఈ నెల 19న ప్రారంభమైన ఈ ఈటీఎఫ్ ఎఫ్పీఓ శుక్రవారం ముగిసింది. ఈ ఎఫ్పీఓ రెండు రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. రూ.6,000 కోట్లకు గాను రూ.12,500 కోట్లకు బిడ్లు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 3.44 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది. ఈ ఎఫ్పీఓను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిర్వహించింది. భారత్–22 ఈటీఎఫ్లో మొత్తం 22 కంపెనీలున్నాయి. ఓఎన్జీసీ, ఐఓసీ, ఎస్బీఐ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, గెయిల్, ఎన్ఎల్సీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ తదితర షేర్లు ఈ ఈటీఎఫ్లో ఉన్నాయి. 67 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన రీట్స్ ఐపీఓ న్యూఢిల్లీ: రైల్వే కన్సల్టెన్సీ సంస్థ ‘రీట్స్’ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. శుక్రవారం ముగిసిన ఈ ఐపీఓ 67 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ 2.52 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. 167 కోట్ల షేర్లకు గాను బిడ్లు వచ్చాయి. రూ.180–185 ప్రైస్బ్యాండ్తో ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 466కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చిన తొలి ప్రభుత్వ రంగ కంపెనీ ఇది. వచ్చే నెల 2న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. -
19న రెండో దశ భారత్ –22 ఈటీఎఫ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నెల 19న రెండో దశ భారత్– 22 ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్ను (ఈటీఎఫ్) ప్రారంభిస్తోంది. ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.8,400 కోట్లు సమీకరించనుంది. ఈ నెల19న యాంకర్ ఇన్వెస్టర్లు, ఈ నెల 20న సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్లు సబ్స్క్రైబ్ చేయవచ్చని, ఈ నెల 22 వరకూ ఈ ఈటీఎఫ్ ఫాలో ఆన్ ఆఫర్ కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో 2.5 శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొంది. ఈ ఈటీఎఫ్ ద్వారా రూ.6,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా వచ్చే నిధుల్లో రూ.2,400 కోట్ల వరకూ అట్టిపెట్టుకునే (గ్రీన్ షూ ఆప్షన్) వెసులుబాటును కూడా వినియోగించుకోవాలని భావిస్తోంది. మొత్తం మీద ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.8,400 కోట్ల నిధులను సమీకరించే అవకాశం ఉంది. గత నవంబర్లో తొలిసారి... గత ఏడాది నవంబర్లో ప్రభుత్వం భారత్ –22 ఈటీఎఫ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఈటీఎఫ్లో ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీతో పాటు ప్రభుత్వ బ్యాంక్లు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి మొత్తంగా 22 సంస్థల షేర్లున్నాయి. ఓఎన్జీసీ, ఐఓసీ, ఎస్బీఐ, బీపీసీఎల్, కోల్ ఇండియా, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీర్స్ ఇండియా, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ, గెయిల్, బీఓబీ, ఇండియన్ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఈటీఎఫ్కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. రూ.32,000 కోట్ల వరకూ బిడ్లు వచ్చినా, ప్రభుత్వం రూ.14,500 కోట్ల బిడ్లనే స్వీకరించింది. -
ఈక్విటీలే ముద్దు.. గోల్డ్ ఈటీఎఫ్లు వద్దు
న్యూఢిల్లీ: ఈక్విటీలవైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు .. క్రమంగా పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి వైదొలుగుతున్నారు. ఏప్రిల్లో 14 గోల్డ్ లింక్డ్ ఈటీఎఫ్ల నుంచి మరో రూ. 54 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని అసెట్స్ విలువ రూ. 4,802 కోట్లకు తగ్గింది. మరోవైపు, ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో రూ. 12,400 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. అటు లిక్విడ్ ఫండ్స్లోకి రూ.1.16 లక్షల కోట్లు చేరాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫీ) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు రూ. 62 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద ఏప్రిల్లో మ్యూచువల్ ఫండ్ స్కీముల్లోకి రూ. 1.4 లక్షల కోట్లు వచ్చి చేరాయి. దీంతో గత నెలాఖరు నాటికి ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 21.36 లక్షల కోట్ల నుంచి రూ. 23.25 లక్షల కోట్లకు చేరింది. గడిచిన అయిదేళ్లుగా గోల్డ్ ఈటీఎఫ్లలో ట్రేడింగ్ ఒక మోస్తరుగానే ఉంటోంది. 2012–13లో రూ. 1,414 కోట్ల మేర పెట్టుబడులు చూసిన గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఆ తర్వాత నుంచి ఉపసంహరణలే ఎక్కువగా ఉంటున్నాయి. 2005 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చి, 2011–12లో రికార్డు స్థాయిలకు చేరిన పసిడి .. 2012లో క్షీణించింది. అప్పట్నుంచి ఔన్సుకి (31.1 గ్రాములు) 1,100–1,400 డాలర్ల శ్రేణిలో తిరుగాడుతోందని మార్నింగ్స్టార్ మేనేజర్ రీసెర్చ్ డైరెక్టర్ కౌస్తుభ్ బేలాపుర్కర్ తెలిపారు. ఒకవైపు పసిడి ఇలా ఒకే శ్రేణిలో తిరుగాడుతుండటం, మరోవైపు ఈక్విటీలు మెరుగ్గా రాణిస్తుండటం తదితర అంశాల కారణంగా దేశీ ఇన్వెస్టర్లు .. గోల్డ్ ఈటీఎఫ్లకు దూరంగా ఉంటున్నారని ఆయన వివరించారు. -
తగ్గిన గోల్డ్ ఫండ్స్ మెరుపు!
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి నిధులు వెనక్కుమళ్లడం కొనసాగుతోంది. 2017లో గోల్డ్ ఫండ్స్ నుంచి రూ.730 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. ఇలాంటి ధోరణి వరుసగా ఇది ఐదవ సంవత్సరం. భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ♦ 2016తో పోలిస్తే 2017లో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని (ఏయూఎం–అసెట్ అండర్ మేనేజ్మెంట్) నిధులు 12 శాతం క్షీణించి రూ.4,855కు తగ్గాయి. ♦ మంచి రాబడులు వస్తున్న నేపథ్యంలో గడచిన ఐదేళ్లలో రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అధికంగా ఈక్విటీల్లో పెడుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు తగ్గాయి. ♦ ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లోకి గత ఏడాది రూ.1.5 లక్షల కోట్ల మొత్తంరాగా, మ్యూచువల్ ఫండ్స్కీమ్ల్లోకి మొత్తంగా రూ.2.4 లక్షల కోట్లు వచ్చాయి. ♦ 2016లో ఈటీఎఫ్ల నుంచి బయటకు వెళ్లిన మొత్తం రూ.942 కోట్లు. 2017లో ఇలా బయటకు వెళ్లిపోయిన మొత్తం రూ.730 కోట్లు. 2015 (రూ.891 కోట్లు), 2014 (రూ.1,651 కోట్లు), 2013 (రూ.1,815 కోట్లు)లలో కూడా నిధులు ఈటీఎఫ్ల నుంచి బయటకు వెళ్లాయి. అయితే ఇలా బయటకు వెళుతున్న నిధుల పరిమాణం తగ్గుకుంటూ రావడం ఇక్కడ గమనార్హం. ♦ 2012లో ఈటీఎఫ్ల్లోకి రూ.1,826 కోట్లు వచ్చాయి. అటు తర్వాత నుంచి నికరంగా బయటకు నిధుల ప్రవాహం కొనసాగింది. ఈక్విటీల ఆకర్షణ... రియల్టీ, బంగారం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. సాంప్రదాయక పొదుపు పథకాల్లో కూడా వడ్డీరేట్లు తగ్గాయి. దీనితో ఇన్వెస్టర్లు ఈక్విటీలవైపునకు మొగ్గుచూపుతున్నారు. – రాహుల్ పరేఖ్, సీఈఓ, బజాజ్ క్యాపిటల్ -
భారత్–22 ఈటీఎఫ్.. భేష్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 22 కంపెనీల్లో తనకున్న వాటాలను భారత్ 22 ఈటీఎఫ్ ద్వారా కేంద్రం విక్రయానికి ఉంచగా... కొనుగోలుదార్ల నుంచి భారీ స్పందన వచ్చింది. రూ.8,000 కోట్ల మేర నిధుల సమీకరణకు ఈ ఇష్యూని తీసుకురాగా, ఏకంగా సుమారు రూ.32,000 కోట్లకు సరిపడా బిడ్లు వచ్చాయి. ఇందులో మూడోవంతు విదేశీ ఇన్వెస్టర్ల రూపంలో వచ్చిందే. దీంతో కేంద్రం అనుకున్నదానికంటే అధికంగా రూ.14,500 కోట్లను సమీకరించింది. ఆశించినదానికంటే అధికంగా బిడ్లు వస్తే అదనపు నిధులు సమీకరించాలని కేంద్రం ముందే నిర్ణయించుకుంది. దీంతో రూ.14,500 కోట్లను అట్టిపెట్టుకోవాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) సెక్రటరీ నీరజ్గుప్తా తెలియజేశారు. దేశ మ్యూచువల్ ఫండ్స్ చరిత్రలో ఓ కొత్త ఫండ్ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇప్పటిదాకా జరగలేదని తెలిపారు. ఇష్యూ నాలుగు రెట్లు అధికంగా సబ్ స్క్రయిబ్ అయిందన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.45 రెట్లు, రిటైర్మెంట్ ఫండ్స్ నుంచి 1.5 రెట్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐబీ) నుంచి ఏడు రెట్లు అధికంగా స్పందన వచ్చింది. భారత్ 22 ఈటీఎఫ్ ద్వారా సమకూరిన రూ.14,500 కోట్లను కూడా కలిపి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సమీకరించిన మొత్తం రూ.52,500 కోట్లకు చేరింది. 2017–18లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ.72,500 కోట్ల నిధుల్ని సమకూర్చుకోవాలని కేంద్రం లకి‡్ష్యంచింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ భారత్– 22 ఈటీఎఫ్ను నిర్వహిస్తోంది. ప్రారంభ ఇష్యూ సైజుగా రూ.8,000 కోట్లను నిర్ణయించగా, ఇందులో 25 శాతం కోటా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. రూ.2,000 కోట్లకు గాను రూ.12,000 కోట్ల మేర సబ్స్క్రిప్షన్ రావడం గమనార్హం. తగిన సమయంలో దీన్ని లిస్ట్ చేస్తామని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎండీ నిమేష్ షా తెలిపారు. -
వన్నె తగ్గుతున్న గోల్డ్ ఈటీఎఫ్లు
న్యూఢిల్లీ: పెట్టుబడి సాధనంగా ఓ వెలుగు వెలిగిన గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్) ప్రాభవం తగ్గుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – అక్టోబర్ మధ్య కాలంలో ఈ తరహా సాధనాల నుంచి ఇన్వెస్టర్లు సుమారు రూ. 420 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవటమే దీనికి నిదర్శనం. మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 14 పసిడి ఆధారిత ఈటీఎఫ్ల నుంచి నికరంగా రూ.422 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. గతేడాది ఇదే వ్యవధిలో ఈ మొత్తం రూ.519 కోట్లు. దీంతో ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రూ. 5,480 కోట్లుగా ఉన్న గోల్డ్ ఫండ్స్ నిర్వహణలోని అసెట్స్ (ఏయూఎం) విలువ అక్టోబర్ ఆఖరు నాటికి రూ. 5,017 కోట్లకు తగ్గింది. నాలుగేళ్లుగా ఇదే తీరు.. గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా గోల్డ్ ఈటీఎఫ్లలో ట్రేడింగ్ ఒక మోస్తరుగానే ఉంటోంది. 2016–16లో రూ. 775 కోట్లు, 2015–16లో రూ. 903 కోట్లు, 2014–15లో రూ. 1,475 కోట్లు, 2013–14లో రూ. 2,293 కోట్ల మేర పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. మరోవైపు, ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సేవింగ్ స్కీములలో (ఈఎల్ఎస్ఎస్) మాత్రం గణనీయ స్థాయిలో ఏకంగా రూ. 96,000 కోట్ల మేర పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒక్క గత నెలలోనే ఏకంగా రూ. 17,000 కోట్లు వచ్చాయి. స్టాక్మార్కెట్లు కొంగొత్త గరిష్ట స్థాయులను తాకుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం, ఇతర సాధనాల కన్నా కూడా ఈక్విటీలవైపే మొగ్గు చూపుతున్నారని కోటక్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో మేనేజర్ అన్షుల్ సైగల్ తెలిపారు. -
ఈటీఎఫ్... దీర్ఘకాలానికి బెటర్!
♦ పాసివ్ ఫండ్స్కు ఇంకా పెరగని ఆదరణ ♦ ప్రస్తుతం యాక్టివ్ ఫండ్స్కే ఎక్కువ నిధులు ♦ సూచీ ఆధారిత ఈటీఎఫ్లకూ ఆదరణ అంతంతే ♦ చాలా ఈటీఎఫ్ పథకాల్లో లిక్విడిటీ సమస్య ♦ ఎంచుకునే ముందు చూడాల్సిన అంశాలు చాలా... ఈటీఎఫ్ అని ముద్దుగా పిలిచే ఇన్వెస్ట్మెంట్ సాధనాల పూర్తిపేరు ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇటీవలి కాలంలో బాగా ప్రచారంలోకి వస్తున్నాయివి. అంటే... ఏదో ఒక స్టాక్లో పెట్టుబడి పెట్టకుండా... కొన్ని రకాల స్టాక్స్ కలసి ఎక్సే్ఛంజీ తయారు చేసే ఒకరకమైన ఇండెక్స్ లాంటి సాధనంలో ఇవి పెట్టుబడి పెడతాయన్న మాట. కేంద్ర ప్రభుత్వం ‘‘భారత్ 22’’ పేరుతో ఇటీవలే ఓ ఈటీఎఫ్ను ఆవిష్కరించటంతో ఈటీఎఫ్లు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంతో పోలిస్తే వీటిని ఎంచుకునే వారి సంఖ్యలో ఇటీవల పెరుగుదల కనిపిస్తున్నా... ఇప్పటికీ చాలామందికి ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటో... ఈటీఎఫ్లంటే ఏంటో... ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటో పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. అంతేకాక.... ఈటీఎఫ్లలో ఎన్ని రకాలుంటాయి? వీటిలో ఎలా పెట్టుబడి పెట్టాలి? వేటిలో పెట్టుబడి పెడితే బెటర్? ఇలాంటి ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ సమాధానమే... ఈ ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం. అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి? ఒకరకంగా చెప్పాలంటే ఈటీఎఫ్లు కూడా ఇండెక్స్ ఫండ్ల లాంటివే. రెండింటి పెట్టుబడి విధానం దాదాపు ఒకటే అయినా... ట్రేడింగ్, లిక్విడిటీ పరంగా ఉన్న తేడాలు ఈ రెండింటినీ వేరు చేస్తుంటాయి. ఈటీఎఫ్లు కూడా ఇండెక్స్లలోనే పెట్టుబడి పెడతాయి. ఉదాహరణకు ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్నే తీసుకుందాం!!. దీన్లో 30 షేర్లుంటాయి. ఈ ఈటీఎఫ్ ఏం చేస్తుందంటే... తన దగ్గరున్న నిధులను ఇండెక్స్లోని షేర్ల వెయిటేజీ ఆధారంగా పెట్టుబడి పెడుతుంది. ఉదాహరణకు సెన్సెక్స్లో రిలయన్స్ వెయిటేజీ గనుక 10 శాతం ఉంటే... తన నిధుల్లో 10 శాతాన్ని ఇది రిలయన్స్కు కేటాయిస్తుంది. సెన్సెక్స్లోని అన్ని షేర్లకూ ఇలా చేయటం వల్ల కొన్ని షేర్లు తగ్గినా... కొన్ని షేర్లు పెరుగుతాయి కనుక... మొత్తమ్మీద ఇండెక్స్ పెరిగితే ఈ ఫండ్ల విలువ కూడా పెరుగుతుంది. ఇండెక్స్ తగ్గితే వీటి విలువ కూడా తగ్గుతుంది. కాకపోతే ఈటీఎఫ్లు చాలావరకు దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి చక్కని పెరుగుదల సాధ్యమని చెప్పవచ్చు. ఇండెక్స్ ఫండ్ – ఈటీఎఫ్ ఈటీఎఫ్లు ఇండెక్స్ ఫండ్స్ కంటే కొన్ని అంశాల్లో ఆశాజనకంగా ఉన్నాయి. ఈటీఎఫ్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్టయి ఉంటాయి. స్టాక్స్ మాదిరిగా వీటిలో కూడా కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. పైగా ఇండెక్స్ ఫండ్స్తో పోలిస్తే ఈటీఎఫ్ల ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ. చాలా వరకు ఇండెక్స్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో 1–1.5 శాతంగా ఉంది. ఈటీఎఫ్లలో మాత్రం ఎక్స్పెన్స్ రేషియో ఇటీవలి కాలంలో బాగా తగ్గింది. జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్), ఈపీఎఫ్ల నుంచి పోటీ పెరగటం దీనికి కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈటీఎఫ్లలో కొన్ని ఎక్స్పెన్స్ రేషియో కింద 0.1 శాతాన్ని మించి వసూలు చేయడం లేదు. అయితే, ప్రత్యేక థీమ్ ఆధారిత ఈటీఎఫ్లు మాత్రం ఇప్పటికీ అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇండెక్స్ ఫండ్లను మాత్రం మార్కెట్ సమయాల్లో ఈటీఎఫ్ల మాదిరిగా ట్రేడ్ చేయలేం. వీటి విలువ మార్కెట్ ముగిశాక వెల్లడవుతుంది. ఆ ధరకు ఫండ్ సంస్థకు సరెండర్ చేసి వైదొలగవచ్చు. యాక్టివ్ – పాసివ్ ఫండ్స్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సుదీర్ఘకాలంపాటు తమ పెట్టుబడుల్ని కొనసాగించే ఈటీఎఫ్లను పాసివ్ ఫండ్స్గా పిలుస్తారు. ఎప్పటికప్పుడు ఫండ్ మేనేజర్ నిర్ణయాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియోను మార్చేవి యాక్టివ్ ఫండ్స్. కాకపోతే ఈ తరహా పాసివ్ ఫండ్స్కు మన దేశంలో ఇంకా చెప్పుకోతగ్గంత ఆదరణ మొదలు కాలేదు. యాక్టివ్ ఫండ్స్ బెంచ్ మార్క్ సూచీలకు మించి రాబడులను అందిస్తుండటమే దీనికి కారణమని చెప్పాలి. ‘‘గత చరిత్ర చూస్తే యాక్టివ్ ఫండ్స్లో భాగమైన లార్జ్క్యాప్ ఫండ్స్ బెంచ్మార్క్ సూచీలకు మించి రాబడులను అందించాయి. భవిష్యత్తులోనూ ఇవి ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లను మించి రాబడులను ఇవ్వగలవు’’ అని సానా సెక్యూరిటీ సీఈవో రజత్ శర్మ చెప్పారు. అయితే, దీర్ఘకాలంలో ఇది ఇలానే కొనసాగదని, పరిస్థితుల్లో మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘సామర్థ్యం విషయంలో మన మార్కెట్ పరిస్థితి మెరుగుపడింది. ఈ సమర్థత అన్నది వచ్చే 5–10 ఏళ్లలో మరింత పెరుగుతుంది. దీంతో యాక్టివ్ ఫండ్స్ ప్రభావం తగ్గుతుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈటీఎఫ్లలో ఎన్నో రకాలు... ఈటీఎఫ్ల్లోనూ భిన్న రకాలున్నాయి. పాసివ్ ఇన్వెస్టర్ అయి ఉండి దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్మెంట్ను కొనసాగించేవారు బెంచ్మార్స్ సూచీల ఆధారిత ఈటీఎఫ్లను పరిశీలించొచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్పై అవగాహన ఉంటే లార్జ్క్యాప్ ఆధారిత సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఈటీఎఫ్లను ఎంచుకోవచ్చు. లేదందే మిడ్క్యాప్ సూచీలైన బీఎస్ఈ మిడ్క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 లను కూడా పరిశీలించొచ్చు. సూచీల ఆధారిత ఈటీఎఫ్లలో ఉన్న సౌలభ్యమేంటంటే ఫండ్స్ పనితీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉండదు. కేవలం బెంచ్ మార్క్ సూచీలను పరిశీలిస్తే చాలు. అంటే సూచీల్లోని స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు గనుక వాటి పనితీరు, రాబడులు సూచీలకు సమాన స్థాయిలో ఉంటాయి. రంగాల వారీ ఈటీఎఫ్లు మరో రకం. ప్రత్యేకంగా ఓ రంగం పనితీరుపై ఆశాజనకంగా ఉన్నప్పటికీ... ఆ రంగంలోని మంచి స్టాక్స్ను ఎంచుకోవడం, వాటి పనితీరును పర్యవేక్షించే తీరిక, సమయం లేని వారికి ఇవి అనువైనవని చెప్పాలి. థీమ్ ఆధారంగా పనిచేసే ఈటీఎఫ్లు కూడా ఉన్నాయి. అంటే వినియోగం, డివిడెండ్ విరివిగా ఇచ్చే స్టాక్స్... ఇలా ప్రత్యేక అవకాశాలను అందిపుచ్చుకునే విధానంతో పనిచేస్తుంటాయి. స్టాక్ ఎక్సేంజ్లు ఈ మధ్య తక్కువ వోలటాలిటీ (ఆటుపోట్లు) ఇండెక్స్, క్వాలిటీ ఇండెక్స్ పేరుతో కొత్త సూచీలను మొదలు పెట్టాయి. వీటికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈటీఎఫ్లను ప్రారంభించాయి. అయితే, ఇవి కొత్తవి, వీటి నిర్వహణలో ఆస్తులు తక్కువగా ఉన్నందున కొంత కాలం పాటు వేచి చూడడం మంచిదన్నది నిపుణుల సూచన. ఈక్విటీ కాకుండా డెట్ ఆధారిత ఈటీఎఫ్లు సైతం ఉన్నాయి. వడ్డీ రేట్ల కదలికల ఆధారంగా పనిచేసేవి. మన దేశంలో బంగారం ఆధారిత ఈటీఎఫ్లు కూడా ఉన్నాయి. అయితే, గోల్డ్ బాండ్ల రాకతో వీటి ఆకర్షణ తగ్గింది. ఇక్కడ పేర్కొన్న ఈటీఎఫ్లు అన్నింటిలోనూ సూచీల ఆధారితంగా పనిచేసే ఈటీఎఫ్లు మినహా మిగిలినవి కొంచెం క్లిష్టమైనవి. కనుక ఆయా ఈటీఎఫ్లు వేటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయన్న వ్యూహాలు తెలిసి, ఆయా రంగాల పనితీరుపై అవగాహన ఉంటేనే ఎంచుకోవడం సరైనది. లిక్విడిటీ... ఒక సమస్యే ఈటీఎఫ్లో వ్యయాలు తక్కువగా ఉండడం ఆకర్షణీయమైన అంశం. అదే సమయంలో లిక్విడిటీ తక్కువగా ఉండడం ప్రతికూలం. తరచుగా ట్రేడ్ కాని ఈటీఎఫ్లు కూడా ఉన్నాయి. దీంతో అమ్మడం, కొనడం చేయాలనుకుంటే అనుకున్న ధర రాకపోవచ్చు. దీంతో ధరల ప్రభావం పడుతుంది. అదే ఇండెక్స్ ఫండ్స్లో ఈ సమస్య లేదు. ఇవి యాక్టివ్గా పనిచేసే ఫండ్స్. ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న యూనిట్లను ఫండ్ హౌస్కు సరెండ్ చేసేస్తే సరిపోతుంది. కనుక ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసేవారు లిక్విడిటీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నది సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ దీపేష్ రాఘవ్ సూచన. ఈటీఎఫ్లలో అస్సెట్ బేస్ (పథకం కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ) అధికంగా ఉన్న వాటిని ఎంచుకుంటే ఈ సమస్య ఉండదని ఆయన చెప్పారు. ఇక ఈటీఎఫ్లలో పెట్టుబడుల విషయంలో అధిక ఎక్స్పోజర్ తీసుకోకుండా ఉండడం కూడా ముఖ్యమైనదే. విభిన్న ఈటీఎఫ్... భారత్ 22కు దూరమే బెటర్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన కొత్త ఈటీఎఫ్ పథకం భారత్ 22!!. దీనికి దూరంగా ఉండడమే సరైనదని కొందరు నిపుణుల అభిప్రాయంగా ఉంది. ఈటీఎఫ్ అంటే సూచీల ఆధారంగా పనిచేసేవి. కానీ, ప్రభుత్వం ప్రకటించిన పథకం సూచీలకు భిన్నంగా 22 స్టాక్స్తో ఉండడం మొదటి అంశం. ఈ 22 స్టాక్స్ ఏవన్నది ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. సూచీల ఆధారంగా పనిచేసే ఈటీఎఫ్లలో మార్పులు జరుగుతుంటాయి. అంటే సూచీలోని స్టాక్స్లో మార్పులు చేర్పులు చేసినప్పుడు ఈటీఎఫ్లు కూడా తమ పోర్ట్ఫోలియోలో అందుకు అనుగుణంగా మార్పులు చేస్తాయి. కానీ, భారత్ 22 పథకం మాత్రం ఆ విధమైన మార్పులు లేకుండా అవే 22 స్టాక్స్తో ఉంటుంది. ఈ స్టాక్స్ కూడా ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నవి. అంటే ప్రభుత్వం అమ్మితే ఆ మేరకు వాటాలను ఇన్వెస్టర్లు కొనుగోలు చేసుకోవచ్చు. సీపీఎస్ఈ ఈటీఎఫ్ అన్నది ప్రభుత్వరంగ కంపెనీలతో కూడిన ఈటీఎఫ్ కాగా, భారత్ 22 కేవలం 22 కంపెనీలకే పరిమితం.పైగా పనితీరు సరిగా లేని బ్లూచిప్ కంపెనీలను, ఇతర బ్లూచిప్ కంపెనీలతో కలిపి ఈ సూచీని రూపొందించినట్టు కనిపిస్తోందని రజత్ శర్మ అభిప్రాయపడ్డారు. ఓ రంగానికి చెందినది కాకపోవడం, అదే సమయంలో ఓ థీమ్ ఆధారంగా పనిచేసేది కూడా కాకుండా భిన్నంగా ఉండడంతో భారత్ 22లో పెట్టుబడులకు వేచి చూడడం మంచిదన్నది నిపుణుల సూచనగా ఉంది. దీనికి బదులు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్లను ఎంచుకోవడం నయమన్నది వారి అభిప్రాయం. -
ఈటీఎఫ్లతో రిస్క్ తక్కువ
♦ పాసివ్ ఇన్వెస్ట్మెంట్లతో మంచి రాబడి ♦ ఫండ్ ఖర్చులు తక్కువ కనక దీర్ఘకాలానికి బెటర్... ♦ ఇండెక్స్ల రూపకల్పనలోకఠిన నియమాలు ♦ తాజాగా స్మార్ట్బీటా పేరిటవోలటాలిటీ ఇండెక్స్ కూడా... ♦ ఏసియా ఇండెక్స్ సంస్థ బిజినెస్ హెడ్ కోయల్ ఘోష్ వ్యాఖ్యలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లలో సహజమైన ఊగిసలాటల నుంచి ఇన్వెస్టర్లను రక్షించడానికి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) ఉపకరిస్తాయని ఏసియా ఇండెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, దక్షిణాసియా బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ కోయల్ ఘోష్ చెప్పారు. స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) డౌజోన్స్, బోంబే స్టాక్ ఎక్సే్ఛంజీ సమాన భాగస్వాములుగా నాలుగేళ్ల కిందట ఈ ఏసియా ఇండెక్స్ సంస్థ ఏర్పాటయింది. ‘‘ఈక్విటీలు, ఫిక్స్డ్ ఇన్కమ్, కమాడిటీస్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రకాల ఆస్తులు, థీమ్ల ఆధారంగా ఇండెక్స్లు రూపొందిస్తున్నాం. వీటి రూపకల్పనలో ఖచ్చితమైన అంతర్గత నియమావళిని, వ్యవస్థాగత ప్రామాణిక ప్రక్రియల్ని పాటిస్తున్నాం. ఒకరకంగా చెప్పాలంటే ఇవి యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్లకన్నా పరోక్ష (పాసివ్) ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలమైనవి’’ అని ఈ సందర్భంగా కోయల్ తెలియజేశారు. ఇండెక్స్లకు సంబంధించి ఇండియాలో 2005లో కేవలం 6 ఉత్పత్తులే అందుబాటులో ఉండేవని, ఇపుడు వాటి సంఖ్య ఏకంగా 65కు చేరిందని, వీటి విలువ 5 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని తెలియజేశారు. అంటే ఎస్ అండ్ పీ బీఎస్ఈ 100, ఎస్ అండ్ పీ– బీఎస్ఈ 500 తదితర ఇండెక్స్లన్న మాట. వీటిలో సెక్టార్ల వారీ ఫండ్లు కూడా ఉన్నాయి. ఈ ఇండెక్స్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పెన్షన్ ఫండ్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కోయల్ చెప్పారు. ఇండియాలోనూ ఈ ట్రెండ్ పెరుగుతోందన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ కోసంప్రారంభించిన భారత్–22 ఈటీఎఫ్ను ఆమె ఉదహరించారు. దీన్ని త్వరలో ఐసీఐసీఐ ఆరంభించనుందని చెబుతూ... ‘‘గతంలో కేంద్రం ఆవిష్కరించిన సీపీఎస్ఈ ఈటీఎఫ్కన్నా తాజా భారత్– 22 మెరుగైనదని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్లో బ్యాంకులు, ప్రభుత్వ రంగ నవరత్న, మినీరత్న సంస్థలున్నాయి’’ అని చెప్పారు. దీన్ని త్వరలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆవిష్కరించనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పాసివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే... ప్రత్యక్ష, పరోక్ష ఇన్వెస్ట్మెంట్ విధానాల మధ్య తేడాల్ని కోయల్ ఘోష్ వివరిస్తూ... ‘‘యాక్టివ్ ఇన్వెస్టింగ్ విధానంలో ఇన్వెస్టరు లేదా ఫండ్ మేనేజరు తానే షేర్లను ఎంచుకుంటారు. తన సమర్థతనే నమ్ముకుంటారు. అనలిస్టుల అంచనాలు, స్టోరీలు, వార్తలు, వదంతుల ఆధారంగా తన ఇన్వెస్ట్మెంట్లను మారుస్తుంటారు. పాసివ్ విధానంలో అలా కాదు. ఇన్వెస్టర్లు మార్కెట్నో, మార్కెట్ను ప్రతిబింబించే ఒక ఇండెక్స్నో ఎంచుకుంటారు. అందులో ఇన్వెస్ట్ చేయటం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములవుతారు’’ అని వివరించారు. తరచు కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండా... ఆ ఖర్చు కూడా మిగిలేలా సుదీర్ఘకాలంపాటు ఇండెక్స్లలో ఇన్వెస్ట్ చేయటాన్నే పాసివ్ ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తున్నట్లు కోయల్ తెలియజేశారు. పాసివ్ ఇన్వెస్టింగ్ విధానంలో ఇండెక్స్ల పనితీరును పోలుస్తూ... ఈ ఏడాది పాసివ్ విధానం ద్వారా వచ్చిన రాబడులు దాదాపు 66 శాతం యాక్టివ్ ఫండ్లకన్నా మెరుగ్గా ఉన్నాయని కోయల్ చెప్పారు. ఖర్చులు కూడా మ్యూచ్వల్ ఫండ్లలో 1.25 నుంచి 2.25 శాతం వరకూ ఉంటే... ఈటీఎఫ్లలో 0.3 శాతమే ఉంటాయని తెలిపారు. ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా ఆయా ఇండెక్స్లలోని షేర్లను కూడా మారుస్తున్నామని, ఇలా మార్చటానికి కఠినమైన నియమాలతో పాటు పారదర్శక కమిటీ కూడా ఉందని తెలియజేశారు. ‘‘తాజాగా హెచ్చుతగ్గుల ఇండెక్స్ను రూపొందించాం. స్మార్ట్బీటాగా వ్యవహరించే ఈ హెచ్చుతగ్గుల ఇండెక్స్లో భారీగా ఒడిదుడుకులకు గురికాని షేర్లుంటాయి. అంటే మార్కెట్ బాగా పెరిగిన సందర్భాల్లో కూడా ఇవి తక్కువే పెరుగుతాయి. అలాగే మార్కెట్ బాగా పడినపుడు ఇవి తక్కువే పడతాయి. వీటిలో రిస్క్ తక్కువ ఉంటుంది. దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలనిస్తాయి’’ అని వివరించారు. ఈటీఎఫ్లలో పెట్టుబడులపై ఇండియాలో ఇపుడిపుడే ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి ఎప్పటి నుంచో ఉందని చెబుతూ... ఎప్పటికప్పుడు ఇండెక్స్లలోని షేర్లు మారుతుంటాయి కనక చక్కని రాబడుల కోసం ఈటీఎఫ్లు మంచివేనని కోయల్ చెప్పారు. -
కరిగిపోతున్న పసిడి ‘పెట్టుబడులు’
ఏప్రిల్ – జూలై మధ్య గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.256 కోట్లు బయటకు... న్యూఢిల్లీ: పెట్టుబడుల రూపంలో పసిడి ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య వెలవెలబోయింది. ఈ కాలంలో 14 గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ. 256 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అంటే ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి 14 ఈటీఎఫ్ హౌస్ వద్ద నిర్వహణలో ఉన్న మొత్తం పసిడి పెట్టుబడుల విలువ మార్చిలో దాదాపు 5,354 కోట్ల వద్ద ఉంటే, ఈ మొత్తం జూలై ముగిసే నాటికి రూ.5,098 కోట్లకు పడిపోయింది. దీనికన్నా ఈక్విటీలే మంచిదని ఈ కాలంలో ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని ముఖ్యాంశాలు... నెలవారీగా విత్డ్రాయెల్స్ చూస్తే... ఏప్రిల్లో రూ.66 కోట్లు, మేలో రూ.71 కోట్లు, జూన్లో రూ.81 కోట్లు, జూలైలో 38 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది చిట్టచివరిసారి రూ.20 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చాయి. అటు తర్వాత నుంచీ నికరంగా విత్డ్రాయెల్స్ కొనసాగుతున్నాయి. ఇక ఈక్విటీ, ఈక్విటీ సంబంధ పొదుపు పథకాల్లో (ఈఎల్ఎస్ఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో (ఏప్రిల్–జూలై) రూ.41,000 కోట్లకుపైగా వచ్చి చేరాయి. ఈ కాలంలో స్టాక్ మార్కెట్ మంచి ఊపుమీద ఉండడం గమనార్హం. అమెరికా వడ్డీరేట్ల పెంపు, 2018 నాటికి యూరోప్లో కూడా ఉద్దీపనలు వెనక్కు తీసుకునే అవకాశాలు పసిడిపై పెట్టుబడులకు సంబంధించి కొంత ప్రతికూల ప్రభావం చూపే అంశాలని ఫండ్స్ ఇండియా. కామ్లో పనిచేస్తున్న ఎంఎఫ్ రీసెర్స్ హెడ్ విద్యా బాల పేర్కొన్నారు. బాల అభిప్రాయం ప్రకారం– యల్లో మెటల్ దిగుమతులు పెరుగుతున్నప్పటికీ, డీమోనిటైజేషన్, డాలర్ మారకంలో రూపాయి బలోపేతం వంటి అంశాలు పసిడి ధరను పెరక్కుండా అడ్డుకుంటున్నాయి. ఈ ఏడాది జూన్ వరకూ పసిడి దిగుమతుల పరిమాణాన్ని చూస్తే, ఇది 2016లో మొత్తం దిగుమతుల పరిమాణాన్ని అధిగమించింది. ఆశలూ ఉన్నాయ్..! భారత మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) నుంచి అందుతున్న సమాచారం ప్రకారం– వార్షికంగా చూస్తే... గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడుల విషయంలో కొంత ఆశాజనకంగా ఉంది. ఇక్కడ నుంచి బయటకు వెళుతున్న డబ్బు క్రమంగా తగ్గుతూ వస్తుండడమే దీనికి కారణం. 2013–14లో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి భారీగా రూ.2,293 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. 2014–15లో ఈ మొత్తం రూ.1,475 కోట్లకు తగ్గగా, అటు తరువాత సంవత్సరాల్లో ఈ మొత్తాలు తగ్గుతూ రూ.903 కోట్లు (2015–16), రూ.775 (2016–17)కోట్లకు దిగివచ్చాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య ఈటీఎఫ్ నుంచి రూ. 256 కోట్లు బయటకు వెళ్లిపోతే, గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం ఏకంగా భారీ మొత్తంలో రూ.411 కోట్లుగా ఉంది. -
‘భారత్ -22’ కొత్త ఈటీఎఫ్
న్యూఢిల్లీ: భారత్ -22 పేరుతో కొత్త ఇటిఎఫ్ (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్) ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్ , ఎనర్జీ, ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, తదితర 22 కంపెనీలు ఇందులో ఉన్నాయి. మొత్తం డివెస్ట్మెంట్ టార్గెట్ రూ.72,500 కోట్ల గా ఉండనుందని జైట్లీ ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన బారత్-22 ఇండెక్స్లో మొత్తం 22 కంపనీలు ఉండనున్నాయని ఆర్థికమంత్రి మీడియాకు వివరించారు. అలాగే ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయం రూ.9,300 కోట్ల రూపాయల మేరకు గుర్తించామని చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ నుంచి రూ. 72,500 కోట్లను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మరోసారి స్పష్టం చేశారు. భారత్-22 ఈటీఎఫ్లో సెక్టార్ల వారీగా బ్యాంకులు అత్యధికంగా 20.3శాతం. 17.5 శాతం వాటాతో ఎనర్జీ సెక్టార్ రెండవ స్థానంలో ఉంది. వీటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. నాల్కో, ఒఎన్జిసి, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, బిపిసిఎల్, కోల్ ఇండియా ఎనర్జీ , దీని తరువాత ఎఫ్ఎంసీజీ, కంపెనీలు, ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్బీసిసిలది 22.6 శాతం వాటా. అలాగే పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్టీపిసి లిమిటెడ్, గెయిల్ ఇండియా, ఎన్హెచ్పీసి, ఎన్ఎల్సీ ఇండియా, ఎస్వీజేఎన్ఎన్ ఆరు యుటిలిటీ కంపెనీలు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జైట్లీ ఈ ప్రకటన వెంటనే శుక్రవారం నాటి మార్కెట్ ముగింపులో పీఎస్యూ బ్యాంకింగ్, ఆయిల్ అండ్గ్యాస్ సెక్టార్ భారీగా లాభపడింది. -
ప్రపంచ డిమాండ్ తగ్గినా... భారత్లో బంగారం మెరుపు!
♦ జనవరి–మార్చిలో కనకం కాంతి ♦ డబ్ల్యూజీసీ నివేదిక ముంబై: బంగారానికి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (2017 జనవరి–మార్చి) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గినా... భారత్లో మాత్రం డిమాండ్ బాగుంది. ప్రపంచ పసిడి వేదిక (డబ్ల్యూజీసీ) గణాంకాలు ఈ విషయాన్ని వెల్ల డించాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... 2017 మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 18 శాతం తగ్గి 1,034 టన్నులకు పడిపోయింది. 2016 ఇదే త్రైమాసికంలో డిమాండ్ 1,262 టన్నులు. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి తక్కువ నిధులు రావడం, సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. భారత్ ధోరణి: ఇక భారత్లో మాత్రం మొదటి త్రైమాసికంలో డిమాండ్ 15 శాతం పెరిగి 107.3 టన్నుల నుంచి 123.5 టన్నులకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఎక్సైజ్ సుంకం ప్రవేశపెట్టడంపై ఆభరణ వర్తకుల సమ్మె ప్రభావం ఇండస్ట్రీపై ప్రధానంగా పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విలువ రూపంలో చూస్తే. డిమాండ్ 18 శాతం పెరిగి రూ. 27,540 కోట్ల నుంచి రూ.32,420 కోట్లకు చేరింది. దేశంలో ఈ కాలంలో డిమాండ్ పెరగడానికి డీమోనిటైజేషన్ కూడా ఒక కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది. -
గోల్డ్ ఈటీఎఫ్లపై ఆనాసక్తి
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లపై ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2016–17) ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఇన్వెస్టర్లు రూ.775 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా సోమవారం నాడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరగడం వరుసగా ఇది నాల్గవ ఏడాది. వరుసగా నాలుగు సంవత్సరాల్లో ఉపసంహరణల మొత్తం తగ్గుతుండటం గమనార్హం. అసెట్ క్లాస్గా ఈక్విటీల్లోకి ఇన్వెస్ట్మెంట్లు మళ్లించడమే ఈటీఎఫ్ల నుంచి ఉపసంహరణలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక్క గడచిన ఏడాదిని పరిగణనలోకి తీసుకుంటే, ఒక్క అక్టోబర్ మినహా ప్రతి నెలలోనూ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్ట్మెంట్లు వెనక్కు మళ్లాయి. పండుగల సీజన్ వల్ల అక్టోబర్లో ఇన్ఫ్లోస్ జరిగినట్లు మ్యూచువల్ ఫండ్ రిసెర్చ్ సంస్థ– ఫండ్స్ ఇండియా. కామ్ హెడ్ విద్యా బాల అంచనావేశారు. గోల్డ్ ధరల ఆధారంగా రాబడులను అందించే ఇన్స్ట్రు మెంట్లే గోల్డ్ ఈటీఎఫ్లు. ప్రత్యక్షంగా పసిడి ధరతో ముడివడి ఉన్నందున, ఈ ప్రొడక్ట్లో పూర్తి పారదర్శకత ఉంటుంది. భారత్ మ్యూచువల్ ఫండ్ రంగంలో 2006–07 నుంచీ 14 గోల్డ్–ఆధారిత స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. -
గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్ల్లో ఏవి బెటర్?
నేను బీఎస్ఎల్ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్లో 2010 నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఇప్పటివరకూ రూ.3,95,000 ఇన్వెస్ట్ చేశాను. ఈ ఇన్వెస్ట్మెంట్ విలువ ప్రస్తుతం రూ.4,10,000గా ఉంది. ఈ ప్లాన్లో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా? –రవికాంత్, విశాఖపట్టణం బీఎస్ఎల్ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్ అనేది ఒక యూనిట్ లింక్డ్లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్). బీమా, మదుపు కలగలపిన ప్లాన్ ఇది. కానీ ఈ తరహా ప్లాన్లు తగిన బీమా కవర్ను, కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. ఈ తరహా ప్లాన్ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. పైగా వీటిల్లో చార్జీల వ్యయాలు అధికంగా ఉంటాయి. మీరు చెల్లించే ప్రీమియమ్ నుంచి ఈ చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఎలా చూసినా ఇవి ఇన్వెస్ట్మెంట్కు తగినవి కావు. బీమా కోసం టర్మ్ బీమా ప్లాన్లను ఎంచుకోవాలి. వీటిల్లో ప్రీమియమ్లు చాలా తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీ విషయానికొస్తే, మీ ఇన్వెస్ట్మెంట్స్పై సగటున ఏడాదికి 1 శాతం కంటే తక్కువగానే రాబడులు వచ్చాయి. మీరు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసినా ఇంతకుమించి రాబడులు వచ్చేవి.మీరు ఈ ప్లాన్ తీసుకొని ఐదేళ్లు పూర్తయినందున మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు పొందే సరెండర్ వేల్యూపై కూడా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకని ఈ ప్లాన్ను సరెండర్ చేయండి. ఈ ప్లాన్ కోసం చెల్లించే ప్రీమియమ్ నుంచే కొంత మొత్తాన్ని టర్మ్ బీమా పాలసీ కోసం, మిగిలిన దానిని ఒకటి లేదా రెండు మంచి ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. నేను ఇటీవలే గోల్డ్ బాండ్ల్లో ఇన్వెస్ట్ చేశాను. అయితే వీటి కంటే కూడా గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు వస్తాయని మిత్రులంటున్నారు. గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదా ? –బాబూరావు, వరంగల్ సావరిన్ గోల్ట్ బాండ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమే. గోల్డ్ ఇటీఎఫ్ల్లో కన్నా గోల్డ్బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మూడు విధాలుగా ప్రయోజనకరం. మొదటిది.. గోల్ట్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్పై మీకు 2.75 శాతం చొప్పున వార్షిక వడ్డీ లభిస్తుంది. ఆరు నెలలకొకసారి చెల్లిస్తారు. రెండవది.. గోల్ట్ ఈటీఎఫ్లు 1 శాతం చొప్పున మేనేజ్మెంట్ చార్జీలు విధిస్తాయి. గోల్డ్ బాండ్స్ ఎలాంటి చార్జీలు విధించవు. మూడవది గోల్డ్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఇక ఈటీఎఫ్ల ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసహరించుకుంటే మీరు స్వల్ప కాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక గోల్ట్ బాండ్స్ విషయానికొస్తే, వీటి కాలపరిమితి 8 సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత ఈ బాండ్ల నుంచి కావాలనుకుంటే వైదొలిగే అవకాశముంది. వీటిని డి–మ్యాట్లోకి మార్చుకోవచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అవుతాయి. ఫలితంగా మెచ్యురిటీకి ముందే ఈ బాండ్ల నుంచి వైదొలగవచ్చు. ఈ బాండ్ల ఆధారంగా రుణాలు కూడా తీసుకోవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే గోల్ట్ ఈటీఎఫ్ల కన్నా, సావరిన్ గోల్డ్బాండ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు. నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మిత్రుల దగ్గర తక్కువ వడ్డీకి రుణం తీసుకొని, ఈ మొత్తంతో 3–15 ఏళ్ల కాలానికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. లాక్–ఇన్ పీరియడ్, పన్ను తదితర అంశాలు పరిగణనలోకి తీసుకొని నాకు కొన్ని మంచి ఫండ్స్ను సూచించండి? –సూరజ్, హైదరాబాద్ అప్పు చేసి పప్పు కూడా వద్దని పెద్దలు ఆనాటి నుంచి చెపుతూనే ఉన్నారు. ఇది మ్యూచువల్ ఫండ్స్తో సహా అన్ని ఇన్వెస్ట్మెంట్స్కు వర్తిస్తుంది. తక్కువ వడ్డీకైనా సరే, మిత్రుల దగ్గర రుణం తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. దీనివల్ల ఆర్థిక ఊబిలో కూరుకుపోవడమే కానీ ఎలాంటి ప్రయోజనాలు మీరు పొందలేరు. చాలా ఫండ్స్ రాబడులు ఊరిస్తూ ఉంటాయి. దీంతో చేతిలో డబ్బుల్లేకపోయినా, అప్పు చేసైనా సరే వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలని మనం టెంప్ట్ అవుతూ ఉంటాము. కానీ ఇది సరైన విధానం కాదు. స్టాక్మార్కెట్లో ఒక్కోసారి సుదీర్ఘ బేర్ దశలు నడుస్తూ ఉంటాయి. ఒకసారి ఆ దశ వస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హరించుకుపోతాయి, రాబడులు రాకపోగా, వడ్డీ భారం అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని అప్పు చేసి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పండి. మీ సొంత డబ్బులనే ఇన్వెస్ట్ చేయండి. ఏవైనా రెండు, మూడు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను ఎంచుకోండి. వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. సంపద సృష్టికి ఇదొక చక్కని మార్గం. ఈ ఫండ్స్కు ఎలాంటి లాక్–ఇన్ పీరియడ్ ఉండదు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ ఫండ్స్ యూనిట్లను విక్రయించుకోవచ్చు. ఈ ఫండ్స్లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్మెంట్స్ను కొనసాగిస్తే, మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని కూడా ఉండదు. -
ఈటీఎఫ్ అంటే..
ఫైనాన్షియల్ బేసిక్స్.. ఈటీఎఫ్ అంటే ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ప్రతి విషయంలోనూ మ్యూచువల్ ఫండ్లానే ఉంటుంది. అయితే మ్యూచ్వల్ ఫండ్ల మాదిరి కాకుండా ఇన్వెస్టర్లు స్టాక్మార్కెట్లో షేర్లను ఎలాగైతే కొనుగోలు చేస్తారో అలాగే బ్రోకరేజ్ అకౌంట్ ద్వారా డైరెక్ట్గా ఈటీఎఫ్లలో షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజ్లలో ట్రేడ్ అవుతాయి. ఉదయం కొని సాయంత్రం విక్రయించొచ్చు కూడా. తక్కువ వ్యయాలు, పన్ను రాయితీలు, డైవర్సిఫికేషన్, స్టాక్స్కు ఉండే సౌకర్యాలను కలిగి ఉండటం వంటి పలు ప్రయోజనాల నేపథ్యంలో ఈటీఎఫ్లు ఇన్వెస్ట్మెంట్లకు అనువుగా ఉంటాయి. ఇవి 1993 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈటీఎఫ్లు స్టాక్స్, బాండ్లు, కమోడిటీలు, కరెన్సీ, ఆప్షన్స్ వంటి పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులు చేస్తాయి. ప్రధానంగా మాత్రం స్టాక్ సూచీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. -
స్టాక్స్లో ఈపీఎఫ్వో పెట్టుబడులు రూ.9,723 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో రూ.9,723 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. వీటిపై రాబడి 9.17 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం లోక్సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో ఆ ప్రభావం నుంచి తట్టుకునేందుకు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్లలో ఈ మేరకు పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈపీఎఫ్వో వద్ద ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రూ.7.49 లక్షల కోట్ల నిధులు ఉన్నట్టు వెల్లడించారు. ఈటీఎఫ్లలో రాబడులు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల కంటే ఎక్కువగా ఉన్నాయని, ఇది చందాదారులకు లాభదాయకమన్నారు. ఈపీఎఫ్వో గతేడాది ఆగస్ట్ నుంచి ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. -
ప్రభుత్వం నుంచి రెండో ఈటీఎఫ్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)ను ప్రారంభించాలని యోచిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా విక్రయానికి అదనపు మార్గంగా ఈ కొత్త ఈటీఎఫ్ను తేవాలనేది ఆర్థిక శాఖ ఆలోచన. 2014, మార్చిలో ప్రభుత్వం తొలి ఈటీఎఫ్ను ప్రారంభించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్(సీపీఎస్ఈ) ఈటీఎఫ్ పేరుతో అందించిన ఈ ఈటీఎఫ్లో 10 ప్రభుత్వ రంగ షేర్లున్నాయి. ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.3,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతమున్న ఈ సీపీఎస్ఈ ఈటీఎఫ్కు అదనంగా మరో కొత్త ఈటీఎఫ్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపమ్) సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదిత ఈటీఎఫ్ ఏర్పాటు నిమిత్తం సలహాదారుల నుంచి బిడ్స్ కోరింది. వచ్చే నెల 11లోపు బిడ్స్ సమర్పించాలని పేర్కొంది. -
గోల్డ్ ఫండ్స్.. ఇప్పుడొద్దు!
శ్రీధర్కు ఈ మధ్యే పెళ్లి కుదిరింది. అవసరం కాబట్టి కొంత బంగారాన్ని కొనాలనుకున్నాడు. బంగారం ధరలు కూడా కొంచెం తగ్గాయి కదా!! కొనుగోలుకు ఇదే మంచి సమయమనుకున్నాడు. కాకపోతే అదే సమయంలో పేపర్లో ఓ వార్త చదివాడు. బంగారం ధరలు మరింత తగ్గుతాయన్నది ఆ వార్త సారాంశం. దీంతో శ్రీధర్ సందిగ్ధంలో పడ్డాడు. బంగారంపై ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామా? వద్దా? అనే విషయమై ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. చివరికి ఈ వ్యవహారాల్లో అనుభవం ఉన్న స్నేహితుడితో విషయం చెప్పగా... ‘‘బంగారాన్ని భౌతికంగా కొనటమే కాదు! గోల్డ్ ఈటీఎఫ్లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, బంగారం బాండ్లు వంటి సాధనాల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు’’ అని చెప్పాడాయన. కాకపోతే పేపర్ గోల్డ్ పథకాలుగా కూడా పిలిచే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్లు) కొన్నాళ్ల కిందటివరకూ బాగా ప్రాచుర్యం పొందాయని, ఇపుడు మాత్రం చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పాడు. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం... ఏడాది కాలంలో2-8% మేర తగ్గిన రాబడి ⇒ బంగారం ధరలు పడితే పరిస్థితి మరింత దారుణం! ⇒ 2013 నుంచి సగానికి క్షీణించిన ఈటీఎఫ్ నిర్వహణ విలువ ⇒ రెండేళ్లలో ఈటీఎఫ్ల నుంచి రూ.3,900 కోట్ల ఉపసంహరణ ⇒ కొన్నాళ్లపాటు బంగారానికి దూరంగా ఉండమంటున్న నిపుణులు తగ్గిన గోల్డ్ ఈటీఎఫ్ల రాబడి గోల్డ్ ఈటీఎఫ్లు బాగా ప్రాచుర్యం పొందటానికి కారణం బంగారం ధరలే. ఈ ధరలు ఎగిసే కొద్దీ గోల్డ్ ఈటీఎఫ్ల డిమాండ్ పెరుగుతుంది. కానీ కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ ఈటీఎఫ్ల రాబడి దాదాపు 2-8 శాతం మేర తగ్గింది. దీంతో అందులో ఇన్వెస్ట్ చేసిన చాలా మందికి చక్కని రాబడి రాలేదు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు వారి డబ్బులను గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు. మ్యూచ్వల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల ప్రకారం.. ఇన్వెస్టర్లు గడిచిన రెండేళ్లలో మొత్తంగా రూ.3,900 కోట్లను విత్డ్రా చేసుకున్నారు. దీనిపై సీఎల్ఎస్ఏ చీఫ్ స్ట్రాటజిస్ట్, మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్ వుడ్ మాట్లాడుతూ... ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో ఔన్స్ బంగారం ధర 1,000 డాలర్ల దిగువకు వస్తుందన్నారు. ఒకవేళ బంగారం ధర తగ్గితే గోల్డ్ ఈటీఎఫ్ రాబడి కూడా తగ్గుతుంది. ఈటీఎఫ్లలో ఆగని ఉపసంహరణ ... గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి తరలివెళ్లే పెట్టుబడుల ఉపసంహరణకు అడ్డుకట్ట పడటం లేదు. పెట్టుబడుల ఉపసంహరణ వరుసగా 28 నెలలుగా కొనసాగుతోంది. గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా 2013-14లో రూ.2,293 కోట్లను, 2014-15లో రూ.1,475 కోట్లను, ఈ ఏడాది జవనరి-నవంబర్ వరకూ రూ.845 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల మొత్తం నిర్వహణ విలువ మే నెలలో రూ.6,688 కోట్లకు, ఆగస్ట్లో రూ.6,226 కోట్లకు, నవంబర్లో రూ.5,830 కోట్లకు పడిపోయింది. 2007 మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ విలువ (ఏయూఎం) రూ.96 కోట్లుగా ఉంది. అలా అలా పెరుగుతూ... 2013 మార్చిలో గరిష్టంగా రూ.11,648 కోట్లకు చేరింది. అప్పటి నుంచి ఉపసంహరణల దెబ్బకు తగ్గటం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే సగం మేర తగ్గిపోయింది. ఆకర్షణ తగ్గిందెందుకు? గోల్డ్ ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్లు దూరమవుతుండటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఈక్విటీ మార్కెట్ మంచి రాబడిని అందిస్తుండటం. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో బీఎస్ఈ ఇండెక్స్ 5 శాతంమేర బలపడింది. రెండవదేమో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులుండటం. పెపైచ్చు ఈ ఏడాది కూడా బంగారం ధరలు అంత ఆశాజనకంగా ఉండవనేది మార్కెట్ నిపుణుల మాట. ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయని ఇన్వెస్టర్లు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ... ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే 10 గ్రాముల బంగారం ధర దేశీయంగా రూ.20,000-రూ.24,000కు తగ్గే అవకాశముందని అంచనా వేసింది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు... యూకేలో యూరో రెఫరెండమ్, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి పలు అంశాల వల్ల కూడా బంగారం, వెండి ధరలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటాయనేది నిపుణుల అంచనా. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 8 గోల్డ్ ఈటీఎఫ్ల పెట్టుబడులు కూడా మే నెలలో ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరటం గమనార్హం. దూరంగా ఉండటమే బెటర్! ఇన్వెస్ట్మెంట్లు, రాబడి పరంగా చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ల పనితీరు బాగులేదు. ఈ ఏడాది భవిష్యత్తు కూడా ఆశాజనకంగా లేదు కనక బంగారం సంబంధిత ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. ఇటీవల ప్రారంభించిన గోల్డ్ బాండ్ల పథకం కూడా గోల్డ్ ఈటీఎఫ్కు పోటీ అయింది. గోల్డ్ బాండ్స్కు ప్రభుత్వం 2.75% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ సౌకర్యం ఈటీఎఫ్ల లో లేదు. మార్కెట్లను బట్టి ఈటీఎఫ్ ధర నిర్ణయం జరుగుతుంది. గోల్డ్ బాండ్స్ కొన్నాక బంగారం ధర పెరిగితే గోల్డ్ బాండ్ల ధర కూడా పెరుగుతుంది. డీ మ్యాట్ రూపంలో గోల్డ్ బాండ్లను కొనొచ్చు. బాండ్లపై రుణమూ తెచ్చుకోవచ్చు. ఒడిదుడుకుల్లో బంగారం ధర బంగారం ధరల పతనం 2013 నుంచి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో రూ.28,000 మైలురాయిని తాకిన బంగారం ధర... జనవరి మధ్యలో రూ.28,215 స్థాయిక్కూడా చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, వినియోగపు భయాల నేపథ్యంలో జులైలో రూ.24,590 వద్దకు పతనమైంది. ఇది 2011 తరవాత కనిష్ఠ స్థాయి. 2013 ఆగస్ట్ 28 నాటి ఆల్టైం గరిష్ట స్థాయి ధర రూ.33,790తో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 25 శాతం దిగువన ఉంది. ప్రస్తుతం రూ.25,000 శ్రేణిలో కదలాడుతోంది. -
ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?
బంగారంతో మనది విడ దీయరాని బంధం. అందుకేనేమో! వినియోగంలో చైనానూ మించిపోయారు మనవాళ్లు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుండటంతో భారీ విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. పెపైచ్చు దేశాభివృద్ధికి ఈ బంగారం పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించింది. ఒకటి బంగారం బాండ్లు. రెండు నాణేలు. మూడు బంగారం డిపాజిట్. ఈ మూడింటి లక్ష్యం ఒక్కటే. బంగారం కొనుగోలు చేయాలన్న భారతీయుల సెంటిమెంట్ను గౌరవిస్తూనే... అందుకోసం వెచ్చించే డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం... విపరీతంగా పెరిగిపోతున్న బంగారం దిగుమతులను సాధ్యమైనంత తగ్గించటం... ఇళ్లలో ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకురావటం. ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరతాయనేది పక్కనబెడితే... అసలు ఈ పథకాలు ఎవరికి పనికొస్తాయి? లాభమెంత? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఫైనాన్షియల్ ప్లానర్ ‘అనిల్ రెగో’ చేస్తున్న ఈ విశ్లేషణ. * అందుబాటులోకి కొత్త బంగారు పథకాలు * పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డ్ బాండ్లు * ఇంట్లో భారీ బంగారం ఉన్నవారికి డిపాజిట్ స్కీమ్ * చిన్న మదుపరులకు ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లే బెటర్ * కావాలనుకుంటే కొనుక్కోవటానికి నాణేలు కూడా కొత్త కొత్తగా గోల్డ్ బాండ్లు... గోల్డ్ బాండ్లను జారీ చేయటం భారతదేశంలో ఇదే తొలిసారి. ఇది పరిమిత కాల పథకం. అంటే ఈ నెల 5న ఆరంభమైంది. 20వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు 20వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు జారీ చేస్తున్న ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఉంటుంది. బాండ్లకు, ఈ వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. గ్రాము విలువను ప్రభుత్వం రూ.2,684గా నిర్ణయించింది. అంటే బాండ్లు ఎవరు కొన్నా ఈ ధరకే కొనాల్సి ఉంటుంది. కనీసం రెండు గ్రాముల్ని, గరిష్ఠంగా 500 గ్రాముల్ని కొనుగోలు చేయొచ్చు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఎనిమిదేళ్ల తరవాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఐదేళ్ల తరవాత ఎప్పుడైనా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. సరెండర్ చేసేటపుడు అప్పటి బంగారం విలువను బట్టి మీకు నగదు చెల్లిస్తారు. వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్లోని ధరకు విక్రయించి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అదనపు ఆకర్షణేమిటంటే వడ్డీ. ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీని ఆర్బీఐ ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాల ఆదాయం కనక ఈ వడ్డీకి క్యాపిటల్ గెయిన్స్ కూడా వర్తించవు. అవసరమైనపుడు ఈ బాండ్లను తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు. ఎక్కడ కొనుగోలు చేయాలి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఏజెంట్లకు కూడా దరఖాస్తులు తీసుకుని బ్యాంకుల్లో అందజేయటానికి అనుమతి ఉంది. ఎవరికి లాభం? వడ్డీ కూడా వస్తుంది కనక... బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు నేరుగా బం గారం కొనకుండా ఈ బాండ్లు కొనవచ్చు. వీటిని పేపర్ రూపంలోను, డీమ్యాట్ రూపంలోను కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ రకంగా కొనుగోలు చేసినపుడు దీన్ని దాచుకోవటం చాలా ఈజీ. పెపైచ్చు తరుగులాంటి సమస్యలు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించి నగదు చేసుకోవచ్చు. నష్టాలున్నాయా? బాండ్లతో నష్టాలున్నాయని చెప్పలేం. అయితే బంగారం ధరలోని హెచ్చుతగ్గులు మీ ఇన్వెస్ట్మెంట్ను కూడా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత బంగారం ధర తగ్గితే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఈ స్కీమను ప్రకటించినపుడు... అప్పటి ధరను పరిగణనలోకి తీసుకుని గ్రాము ధరను రూ.2,684గా నిర్ణయించింది. కాకపోతే నవంబరు 5న ఈ స్కీమ్ ఆరంభించేనాడు ముంబై బులియన్ మార్కెట్లో గ్రాము ధర రూ.26,025గా ఉంది. అంటే దాదాపు 660 రూపాయలు తగ్గినట్లు. ఇది 2.75 శాతానికన్నా ఎక్కువే. అంటే తొలి ఏడాది ఇస్తామన్న వడ్డీ ఈ రకంగా పోయినట్లన్న మాట. ఇలాంటి రిస్కులుంటాయని గమనించాలి. గోల్డ్ ఈటీఎఫ్లు/ మ్యూచ్వల్ ఫండ్లు ఇవేవీ కొత్తగా ఆరంభించినవి కావు. కాకపోతే బంగారంలో మదుపు చేసే పథకాల గురించి తెలుసుకుంటున్నాం కనక గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్లు), గోల్డ్ మ్యూచ్వల్ ఫండ్ల (ఎంఎఫ్లు) గురించి కూడా తెలుసుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్లంటే బంగారం ధరను బట్టి ఆ ధరకే ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఫండ్లన్న మాట. షేర్ల మాదిరే వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయటం, విక్రయించటం చేయొచ్చు. దీన్లో కనీస పెట్టుబడి రూ.5వేలు. డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. అయితే దీన్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ కుదరదు. ప్రస్తుతం 13 సంస్థల వరకూ ఈటీఎఫ్లను ఆఫర్ చేస్తున్నాయి. అదే గోల్డ్ మ్యూచ్వల్ ఫండ్లకైతే డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. నెలకు రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ పద్ధతిలో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్.. ప్రభుత్వం దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్గా పిలుస్తోంది. అంటే బంగారాన్ని డబ్బు చేసుకునే పథకమన్నమాట. దీనిప్రకారం మన దగ్గరున్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆభరణాల్ని డిపాజిట్ చేస్తే అక్కడ రాళ్లు, ఇతరత్రా తరుగు తీసేసి, దాన్ని కరిగించి నిపుణులు దాని బరువెంతో లెక్కిస్తారు. ఒకవేళ బంగారు నాణేలు, బార్లు డిపాజిట్ చేస్తే వాటి బరువును అక్కడే చెబుతారు. ఆ బరువును పేర్కొంటూ మీకొక సర్టిఫికెట్ ఇస్తారు. మీరు వెనక్కి తీసుకునేటపుడు ఆ సర్టిఫికెట్ను అందజేస్తే దాన్లో పేర్కొన్న బరువు గల బంగారాన్ని మీకిస్తారు. అంతేతప్ప మీ ఆభరణాలను తిరిగివ్వరు. అదనపు ఆకర్షణేంటంటే దీనిపై వడ్డీ కూడా ఇస్తున్నారు. ఈ వడ్డీ 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకూ ఉంటుంది. నిజానికిదేమీ తొలిసారి అందిస్తున్న పథకం కాదు. చాలా కాలం కిందటే ఎస్బీఐ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత బంగారాన్నయినా డిపాజిట్ చేయొచ్చు. దీనికి పరిమితి లేదు. 1999 నాటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో కూడా ఇలాంటి మినహాయింపులు ఉంటాయనే భావిస్తున్నారు. ఎవరికి లాభం? ఆభరణాల రూపంలో కాకుండా బార్ల రూపంలోనో, నాణేల రూపంలోనో ఇంట్లో బంగారం ఉన్నవారికి ఇలాంటి పథకాలు లాభదాయకమే. ఎందుకంటే ఇంట్లో ఉంటే దాన్ని భద్రంగా దాచుకోవటం కూడా సమస్యే. అదే బ్యాంకులో అయితే భద్రత సమస్య ఉండదు. పెపైచ్చు ఇంట్లో ఉంటే ఎలాంటి ఆదాయమూ రాదు. బ్యాంకులో ఉంటే ఏటా వడ్డీ కూడా వస్తుంది. బ్యాంకులో కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. నష్టాలు ఉన్నాయా? బంగారం ఉన్నవారు డిపాజిట్ చేస్తే మంచిది తప్ప బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న వారు దాన్ని కొని డిపాజిట్ చేయటం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తరవాత ధర తగ్గితే ఆ మేరకు నష్టపోవాల్సి ఉంటుందని గమనించాలి. కేంద్రం తాజాగా అశోకచక్ర చిహ్నంతో బంగారు నాణేలను కూడా విడుదల చేసింది. ఎంఎంటీసీ ఔట్లెట్లలో ఇవి లభ్యమవుతాయి. నాణేలు కొనాలనుకున్నవారికి కేంద్రమే అందిస్తోంది కనక ఇవి ఉపయుక్తమని చెప్పాలి. వీటిని ఇన్వెస్ట్మెంట్గా భావించినా ఏకమొత్తంలో మదుపు; ధర తగ్గితే రిస్కు ఉంటాయి. ఎవరికి ఏ పథకం లాభం? గోల్డ్ ఈటీఎఫ్/ గోల్డ్ మ్యూచ్వల్ ఫండ్స్ : ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేవారికి, రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసేవారికి (సిప్) గోల్డ్ బాండు : ప్రభుత్వ మద్దతున్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి; భవిష్యత్తులో బంగారం కొనా లనుకున్నవారికి గోల్డ్ డిపాజిట్ పథకం : నేరుగా బంగారం ఉండి, దాన్ని అదే రూపంలో తమ వద్ద ఉంచుకోకూడదని భావించేవారికి ఉదాహరణకు ఈ మూడు పథకాల్లో రూ.2.5 లక్షలు లేదా అంతకు సమానమైన బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం... ఈ పట్టిక చూస్తే ఈటీఎఫ్లు, గోల్డ్ ఎంఎఫ్లకన్నా గోల్డ్ డిపాజిట్ స్కీమ్, బాండ్లపైనే ఎక్కువ రాబడి వస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం... వడ్డీ. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో గోల్డ్ మ్యూచ్వల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసినపుడు మిగతా వాటికన్నా ఎక్కుకే రాబడి రావచ్చు. ఎందుకంటే ధరలు పెరిగినా, తగ్గినా ఆ ధరలకే యూనిట్లు లభిస్తాయి కనక సగటు ధర తక్కువే ఉంటుంది. లాభమూ బాగానే ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు బాగా పడిపోయినా ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ బాండ్లు, డిపాజిట్ స్కీమ్తో పోలిస్తే సిప్ పద్ధతిలో నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అయితే పై స్కీముల్లో వడ్డీ రేట్లు కాస్త ఆకర్షణీయంగానే ఉన్నాయి. అందుకని బాగా డబ్బులుండి ఎక్కడో ఒకచోట ఇన్వెస్ట్ చేదాద్దమనుకున్న వారికి, ఇంట్లో ఆభరణాలు కాకుండా అదనపు బంగారం ఉన్నవారికి మాత్రం పై రెండు స్కీములూ ఆకర్షణీయమేనని చెప్పొచ్చు. -
ఈటీఎఫ్ల్లోకి ఈపీఎఫ్ఓ నిధులు
⇒ 2015-16లో 5 శాతం ఇన్వెస్ట్మెంట్కు అనుమతి ⇒ మార్కెట్లోకి రూ.5,000 కోట్లు..! ⇒ ప్రణాళికను నోటిఫై చేసిన కార్మిక శాఖ న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిధుల్లో కొంత మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధమయ్యింది. ఈపీఎఫ్ఓ నిధుల్లో 5 శాతాన్ని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడులుగా పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పెట్టుబడుల ప్రణాళిక, విధివిధానాలను రెండు రోజుల క్రితం కార్మిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. కార్మిక శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ ఇక్కడ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2015-16) దాదాపు రూ.5,000 కోట్ల ఈపీఎఫ్ఓ నిధులు మార్కెట్లోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలుత నిధిలో ఒక శాతాన్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని, అటు తర్వాత దీనిని క్రమంగా ఐదు శాతం వరకూ పెంచుకుంటూ వెళ్లడం జరుగుతుందని అగర్వాల్ తెలిపారు. ఈటీఎఫ్ అంటే... ఈటీఎఫ్ ఒక ప్రత్యేక పత్రం లాంటిది. స్టాక్ ఎక్స్ఛేంజ్పై ఒక మామూలు స్టాక్ తరహాలో ఈటీఎఫ్ ట్రేడవుతుంది. 2001లో భారత్లో ఈటీఎఫ్ల ప్రొడక్ట్ ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 33 ఈటీఎఫ్లు ఉన్నాయి. వీటి కింద దాదాపు 6.2 లక్షల ఇన్వెస్టర్లకు చెందిన రూ.11,500 కోట్ల నిధుల నిర్వహణ జరుగుతోంది. భారత్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్ల హవా భారీగా ఉంది. ఈపీఎఫ్ఓ తన నిధుల్లో కొంత భాగాన్ని సీపీఎస్ఈ ఈటీఎఫ్లో (ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెట్టేలా ఇప్పటికే కార్మిక మంత్రిత్వశాఖతో పెట్టుబడుల శాఖ (డిజిన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్- డీఓబీ) చర్చలు జరిపింది. డిజిన్వెస్ట్మెంట్ కార్యదర్శి ఆరాధనా జోహ్రీ ఇటీవల స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. దీనికి కార్మిక మంత్రిత్వశాఖ సానుకూలంగా ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు. 2014లో సీపీఎస్ఈ ఈటీఎఫ్ను ఏర్పాటు చేశారు. 10 ప్రభుత్వ రంగ సంస్థల షేర్లతో ఈ ట్రేడెడ్ ఫండ్ బాస్కెట్ ఉంటుంది. ఈ ఫండ్లో పెట్టుబడుల ద్వారా ఇన్వెస్టర్లు ఓఎన్జీసీ, గెయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, ఇంజినీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్లో సహవాటాదారుల అవకాశాన్ని పొందగలుగుతారు. సీపీఎస్ఈ ఈటీఎఫ్లో ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలన్న అంశాన్ని త్వరలో నిర్ణయిస్తామని అగర్వాల్ పేర్కొన్నారు. నిధి... రూ.6.5 లక్షల కోట్లు... ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులతో దాదాపు రూ.6.5 లక్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది. 2015-16 బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కూడా కనీసం 5 శాతం వరకూ ఈపీఎఫ్ఓ నిధులను ఈక్విటీ, సంబంధిత పథకాల్లో పెట్టుబడులను ప్రతిపాదించారు. గరిష్టంగా 15 శాతం వరకూ ఈ నిధులు ఉండవచ్చని సైతం ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు స్వయంగా కార్మిక శాఖ కార్యదర్శి తెలిపారు. అయితే ఆచితూచి వ్యవహరిస్తూ, ఈ దిశలో ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. తొలుత ఈటీఎఫ్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ఈ ‘జాగరూకతే’ కారణమనీ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనుభవాలను చూస్తే... ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వల్ల అధిక లాభాలు వస్తాయన్న విషయం రుజువవుతోందని కార్మిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 2014-15లో ఈపీఎఫ్ఓ ఇంక్రిమెంటల్ డిపాజిట్లు రూ.80,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇవి దాదాపు రూ. లక్ష కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఈపీఎఫ్ఓ సామాజిక భద్రతా పథకాల కింద కవరేజ్కు నెలవారీ వేతన సీలింగ్ను రూ.6,500 నుంచి రూ.15,000 కు గత ఏడాది సెప్టెంబర్లో పెంచడం దీనికి ఒక కారణం. -
ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
ఈటీఎఫ్లు అంటే ఏమిటి? వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - రాజేశ్, విజయనగరం ఈటీఎఫ్ అంటే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అర్థం. బాగా పాపులర్ అయిన ఫండ్గా నిఫ్టీ ఈటీఎఫ్ని పేర్కొనవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్ని ఆ ఫండ్హౌస్ ద్వారా గానీ, బ్యాంక్ ద్వారా గానీ మరే ఇతర మార్గాల్లో గానీ కొనుగోలు చేయవచ్చు. కానీ ఈటీఎఫ్లను షేర్లలాగా కొనుగోలు చేయాలి. అంటే మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మీరు మ్యూచువల్ ఫండ్ను ఆ ఫండ్ ఎన్ఏవీ(నెట్ అసెట్ వ్యాల్యూ) ఆధారం గా కొనుగోలు చేయాలి. ఇక ఈటీఎఫ్ను మామూలుగా షేర్లను కొనుగోలు చేసినట్లుగానే మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలి. ఈటీఎఫ్లకు ఉన్న మంచి సానుకూలాంశం ఏమిటంటే, అవి చౌకగా లభిస్తాయి. అయితే ఈటీఎఫ్ల కంటే చురుగ్గా నిర్వహించే సాధారణ మ్యూచువల్ ఫండ్ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే అధికంగా రాబడులు వస్తాయి. నేను గత కొన్నేళ్లుగా హెచ్డీఎఫ్సీ ఈక్విటీ, యూటీఐ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ, సుందరం మిడ్క్యాప్, ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను 2-3 ఏళ్ల పాటు ఫ్రాంక్లిన్ స్మాలర్ కంపెనీస్, సుందరం స్మైల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా? - అనంత్, నెల్లూరు గత కొంత కాలంగా స్మాల్-క్యాప్ ఫండ్స్ మంచి పనితీరునే కనబరిచాయి. అయితే భవిష్యత్తులో వాటి పనితీరు ఎలా ఉంటుందో చెప్పలేం. 2-3 ఏళ్ల కాలానికి స్మాల్-క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే, వస్తే భారీ లాభాలు రావచ్చు. లేదంటే అంతే స్థాయిలో నష్టాలూ రావచ్చు. ఇక మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ను చూస్తే, వాటి పోర్ట్ఫోలియోల్లో మిడ్-క్యాప్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఏదైనా స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ రాబడుల్లో పెద్ద గా మార్పులు ఉండకపోవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోండి. ఏడాది కాలం నుంచి హెచ్డీఎఫ్సీ మిడ్-క్యాప్ ఆపర్చునిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఇప్పుడు నేను విక్రయించుకోవచ్చు. అయితే ఇప్పు డు కాకుండా ఈ ఏడాది డిసెంబర్లో విక్రయించాలనుకుంటున్నాను. అలా చేస్తే నాకు ఈ నెలలో ఉన్నటువంటి ఎన్ఏవీనే వస్తుందా? వివరించగలరు. - నూర్జహాన్, హైదరాబాద్ మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్.. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్... ఇలాంటి ఫండ్స్ యూనిట్లను ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. ఏరోజున మీరు ఈ ఫండ్స్ను విక్రయిస్తారో, ఆ రోజున ఉన్నటువంటి ఎన్ఏవీకే మీకు సొమ్ములు వస్తాయి. మీరు ఏప్రిల్లో విక్రయిస్తే, ఏప్రిల్ నాటి ఎన్ఏవీ, డిసెంబర్లో విక్రయిస్తే డిసెంబర్ నాటి ఎన్ఏవీ లభిస్తుంది. వీటిని ఎందుకు విక్రయించాలనుకుంటున్నారో మీరు కారణాలు వెల్లడించలేదు. ఈక్విటీ ఫండ్స్లో కనీసం 3-5 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రాబడులు వస్తాయి. ఇల్లు కొనడం, పిల్లల చదువు, కారు కొనడం వంటి తదితర ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఈ లక్ష్యాలు ఆసన్నమైనప్పుడు మాత్రమే మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటే బావుంటుంది. ఈక్విటీ ఫండ్స్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోకండి. కోటక్ గోల్డ్ ఫండ్ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నాను. నేను ఎలాంటి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది? దీర్ఘకాల లేదా స్వల్పకాల మూలధన లాభాల పన్ను, వీటిల్లో ఏది వర్తిస్తుంది? ఈ ఫండ్లో ఎన్ని సంవత్సరాలు కొనసాగితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది? - సీతారామారావు, వరంగల్ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం చూస్తే కోటక్ గోల్డ్ ఫండ్ అనేది ఈక్విటీ ఫండ్ కాదు. దేశీయ ఈక్విటీల్లో ఇది తన కార్పస్లో 65 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయడం లేదు కాబట్టి దీనిని ఈక్విటీ యేతర ఫండ్గా పరిగణిస్తారు. ఇలాంటి ఫండ్స్లో మూడేళ్లు, అంతకు మించిన కాలం ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తేనే మీకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. మూడేళ్లలోపే మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ను ఉపసంహరించుకుంటే, స్వల్పకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. మీ ఆదాయపు పన్ను స్లాబుననుసరించి పన్ను ఉంటుంది. ఒకవేళ మూడేళ్లకు మించితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
పీఎఫ్ నిధులను స్టాక్స్లో పెట్టుబడి పెట్టం: ఈపీఎఫ్ఓ
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధుల్లో కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనలేవీ తమ పరిశీలనలో లేవని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణలో సుమారు రూ.6 లక్షల కోట్ల మేర మూల నిధి(కార్పస్) ఉన్నట్లు అంచనా. తాజాగా కేంద్ర కార్మిక మంత్రి నేతృత్వంలో జరిగిన ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశంలో ఆర్థిక శాఖ చేసిన పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చ జరిగిందని.. సంస్థ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జైన్ బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బోర్డు మాత్రం స్టాక్స్ లేదా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)లో పెట్టుబడులకు నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల మొత్తాన్ని మరింత పెంచేందుకు బోర్డు నిర్ణయించిందని.. దీనికి సంబంధించి కేటాయింపుల్లో వెసులుబాటు కోసం ఆర్థిక శాఖకు నివేదించినట్లు జైన్ వివరించారు. మరింత మెరుగైన రాబడుల కోసం పీఎఫ్ నిధులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ ఆర్థిక శాఖ చాన్నాళ్లుగా చెబుతూ వస్తోంది. అయితే, ఉద్యోగ సంఘాల నుంచి ఆందోళన కారణంగా ఈపీఎఫ్ఓ ఇందుకు నిరాకరిస్తోంది. 5 కోట్లకు పైగా చందాదారులు ఉన్న ఈపీఎఫ్ఓ.. 2014-15 ఏడాదికిగాను ఇటీవలే వడ్డీరేటును 8.75 శాతంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఖజానా గల గల
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి(2014-15) సవరించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం రూ. 16,027 కోట్లను ప్రభుత్వం అధిగమించింది. ప్రభుత్వ సంస్థల వాటాలతో ఏర్పాటు చేసిన సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా సమీకరించిన రూ. 3,000 కోట్లతో ప్రభుత్వ నిధుల సమీకరణ తాజాగా రూ. 16,119 కోట్లకు చేరింది. దీనికితోడు యాక్సిస్ బ్యాంక్లో వాటా విక్రయం ద్వారా మరో రూ. 5,550 కోట్లను సైతం ప్రభుత్వం శుక్రవారం సమీకరించింది. వెరసి ఆర్థిక మంత్రి చిదంబరం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన 2014 మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని అధిగమించడమేకాకుండా, ద్రవ్యలోటు కట్టడిని సాధించేందుకు వీలు చిక్కింది. మధ్యంతర బడ్జెట్లో చిదంబరం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ. 40,000 కోట్ల నుంచి రూ. 16,027 కోట్లకు తగ్గించడంతోపాటు, ద్రవ్యలోటును 4.8%(తొలి అంచనా) నుంచి 4.6%కు కట్టడి చేయాలని ప్రతిపాదించిన విషయం విదితమే. స్పందన ఓకే మ్యూచువల్ ఫండ్ మార్గంలో ప్రభుత్వం తలపెట్టిన నిధుల సమీకరణ ప్రయత్నం విజయవంతమయ్యింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా పది ప్రభుత్వ దిగ్గజాల వాటాలతో ఏర్పాటు చేసిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(సీపీఎస్ఈ ఈటీఎఫ్) ఆఫర్కు ఇన్వెస్టర్ల నుంచి గరిష్ట స్థాయిలో స్పందన లభించింది. రూ. 3,000 కోట్ల సమీకరణకు ప్రభుత్వం ఈ కొత్త ఫండ్ను ఆఫర్ చేయగా... రూ. 4,000 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఆఫర్ చివరిరోజు(21న) మొత్తం రూ. 1,600 కోట్ల విలువైన బిడ్స్ లభించగా, వీటిలో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) వాటా రూ. 1,000 కోట్లవరకూ ఉండటం గమనార్హం. ఫలితంగా సీపీఎస్ఈ ఈటీఎఫ్కు దరఖాస్తు చేసిన ప్రతీ రిటైల్ ఇన్వెస్టర్కూ కొంత పరిమాణంలో యూనిట్లు లభించే అవకాశముంది. కాగా, అధికంగా లభించిన రూ. 1,000 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వనుంది. ఆఫర్లో భాగంగా తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్లయిన ఎస్బీఐ, ఎల్ఐసీ తదితర బీమా కంపెనీలు రూ. 835 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్కానున్న ఈ ఫండ్ను గోల్డ్మన్ శాక్స్ నిర్వహించనుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, కంటెయినర్ కార్పొరేషన్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇంజనీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్లో వాటాలతో రూపొందించిన ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్లో భాగంగా ఇన్వెస్టర్లకు రూ. 10 ముఖ విలువగల యూనిట్లను కేటాయిస్తారు. ఆదుకున్న ఎల్ఐసీ ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్లో ప్రభుత్వం 9% వాటాను విక్రయించడం ద్వారా రూ. 5,550 కోట్లను సమీకరించింది. యాక్సిస్లో ఎస్యూయూటీఐ ద్వారా ప్రభుత్వం 20.72% వాటాను కలిగి ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో నమోదైన బల్క్ డీల్ సమాచారం ప్రకారం 4.2 కోట్ల యాక్సిస్ బ్యాంక్ షేర్లను రూ. 1,315.13 సగటు ధరలో ప్రభుత్వం విక్రయించింది. ఇది బీఎస్ఈలో గురువారం యాక్సిస్ ముగింపు ధర రూ. 1,357తో పోలిస్తే 3.1% డిస్కౌంట్. కాగా, ఎల్ఐసీ 85 లక్షల షేర్లను కొనుగోలు చేయడం విశేషం. ఇందుకు రూ. 1,116 కోట్లను వెచ్చించింది. యాక్సిస్ షేర్లను కొన్న ఇతర సంస్థలలో సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, గోల్డ్మన్ శాక్స్ సింగపూర్ ఉన్నాయి. వాటా విక్రయం కారణంగా యాక్సిస్లో ఎస్యూయూటీఐ వాటా 11.72%కు పరిమితమైంది. షేరు ఊగిసలాట... ప్రభుత్వ వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్ఈలో యాక్సిస్ షేరు హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం సెషన్లో 3%పైగా పతనమై రూ. 1,313ను చేరగా, ఆపై కోలుకుని గరిష్టంగా రూ. 1,411ను సైతం తాకింది. చివరకు 2.7% లాభంతో రూ. 1,393 వద్ద ముగిసింది. -
ప్రభుత్వ ఈటీఎఫ్లో యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(సీపీఎస్ఈ ఈటీఎఫ్)లో సంస్థాగత(యాంకర్) ఇన్వెస్టర్లు రూ. 850 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగానికి చెందిన పది బ్లూచిప్ కంపెనీల వాటాలతో ఏర్పాటు చేసిన ఈటీఎఫ్ను మంగళవారం ప్రవేశపెట్టగా, తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మాత్రమే అవకాశాన్ని కల్పించారు. ఈటీఎఫ్ ద్వారా మొత్తం రూ. 3,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు, యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 900 కోట్ల యూనిట్లను రిజర్వ్ చేసింది. కాగా, బుధవారం నుంచీ ఈటీఎఫ్ యూనిట్ల కొనుగోలుకి రిటైలర్లు తదితర ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో కనీసం రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా, ఆరు సంస్థలు బిడ్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆఫర్ ఈ నెల 21న ముగియనుంది. ఓఎన్జీసీ, ఐవోసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్, పీఎఫ్సీ, ఆర్ఈసీ తదితర 10 సంస్థల వాటాలతో ఈ ఫండ్ను రూపొందించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ఇన్వెస్టర్లకూ ప్రభుత్వం 5% తొలి(అప్ఫ్రంట్) డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. దీనిలో భాగంగా అర్హతగల రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రతీ 15 యూనిట్లకు ఒక లాయల్టీ యూనిట్(6.66% డిస్కౌంట్) లభించనుంది. కోల్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్? వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో కోల్ ఇండియాలో డిజిన్వెస్ట్మెంట్ను చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ అధికారి ఒకరు చెప్పారు. నిజానికి ఈ ఏడాది మార్చిలోగా కోల్ ఇండియాలో 10% వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో ప్రతిపాదనను వాయిదా వేసింది. అంతేకాకుండా 5% వాటాను మాత్రమే డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు కంపెనీలో 90% వాటా కలిగిన ప్రభుత్వం డివిడెండ్ రూపంలో రూ. 19,000 కోట్లను అందుకోవడం గమనార్హం.