
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు మళ్లీ నేలచూపులు చూశాయి. బుధవారం ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు కాసేపటికే కిందకు దిగజారుతూ వెళ్లాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టంతో 65759 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 19614 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఎల్టీఐ మైండ్ ట్రీ,సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, లార్సెన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎథేర్ మోటార్స్, ఐసిఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)