సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Tue, Apr 9 2024 3:31 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 22,645 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 77 పాయింట్లు దిగజారి 74,665 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, సన్‌ఫార్మా, నెస్లే కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. 

టైటాన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, విప్రో, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, ఐటీసీ, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement