రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ కలకలం.. నైజీరియన్ కిలాడీ లేడీ అరెస్ట్‌ | Huge Drugs Seized In Rajendra Nagar | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ కలకలం.. నైజీరియన్ కిలాడీ లేడీ అరెస్ట్‌

Published Sun, Aug 25 2024 9:16 PM | Last Updated on Sun, Aug 25 2024 9:17 PM

Huge Drugs Seized In Rajendra Nagar

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌ను సీజ్‌ చేశారు. నైజీరియన్‌ కిలాడీ లేడీని అరెస్ట్‌ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసి విక్రయిస్తున్నారు.

భార్య, భర్తతో పాటు మరో‌ ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా  డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియాకు చెందిన తంబా ఫిడెల్మాను జైల్‌కు తరలించారు. సన్ సిటీని అడ్డాగా చేసుకొని  డ్రగ్స్ దందా సాగుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement