Drugs
-
రాజ్యసభ సాక్షిగా మళ్లీ దొరికేసిన చంద్రబాబు
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ సాక్షిగా చంద్రబాబుది దుష్ప్రచారమని తేట తెల్లమైంది. విశాఖపట్నంలో దొరికింది డ్రగ్స్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖపట్నంలో సీబీఐ 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ను సీజ్ చేసిందని పేర్కొంది. అయితే అందులో నార్కోటిక్స్ లాంటి మత్తు పదార్థాలు లేవని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నిర్ధారించిందని తెలిపింది. ఈ విషయాన్ని సంబంధిత కోర్టులో ఫైల్ చేశామని.. ఆ కేసు సెప్టెంబర్ 21, 2024లో క్లోజ్ అయిందని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు.సంధ్యా ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టగా, మార్చి 16న విశాఖ పోర్టుకు ఎస్ఈకేయూ4375380 కంటెయినర్లో వెయ్యి బ్యాగుల సరుకు వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు అందులో తనిఖీ చేశారు. మార్చి 19న గుజరాత్ ల్యాబ్ నుంచి వచ్చిన నిపుణులు 49 నమూనాలు సేకరించి, 27 నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ, జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించింది. ఆ నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకెళ్లారు. 8 నెలల తర్వాత నివేదిక వచ్చింది. -
హద్దు మీరితే ఖబడ్దార్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘సోషల్ మీడియాలో భాష చూడండి. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ప్రజాజీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం. లేదంటే ఒక్కడు కూడా బయట తిరగలేడు. హద్దు దాటితే ఊరుకోబోం. మీడియా మిత్రులు, మీడియా సంఘాలు.. మీరైనా చెప్పండి. జర్నలిస్టులు ఎవరో మీరే జాబితా ఇవ్వండి. జాబితాలో లేనివాడు జర్నలిస్టు కాడు. జర్నలిస్టు కానోడిని క్రిమినల్గానే చూస్తాం. క్రిమినల్స్కు ఎట్లా జవాబు చెప్పాల్నో అట్లానే చెప్తాం. జర్నలిస్టు ముసుగేసుకుని వస్తే.. ముసుగుతీసి ఒక్కొక్కడిని బట్టలూడదీసి కొడతాం, తోడ్కలు తీస్తా..’’ అని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. తాను సీఎం కురీ్చలో ఉన్నానని, అందువల్ల ఊరుకుంటానని అనుకుంటున్నారని.. కానీ ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నేనూ మనిషినే.. చీమూనెత్తురు ఉన్నాయి. నన్ను తిట్టిన తిట్లకు మీపేరు పెట్టుకుని చూడండి. నేను ఓపికతో ఉన్నా.. కేసీఆర్ మీ పిల్లలకు బుద్ధిచెప్పు.. హద్దు దాటితే, మాటజారితే అనుభవిస్తరు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. కోర్టుకు పోతే బెయిల్ వస్తుందని అనుకుంటున్నారు. అవసరమైతే చట్టాన్ని సవరిస్తాం. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతరేస్తం. చట్టపరిధిలో అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి. పరిష్కారం చూపకపోతే సమాజం దెబ్బతింటుంది. దీనిపై చట్టం చేద్దాం. ఇది నా ఒక్కరి వేదన కాదు.. అందరి ఆవేదన. స్వీయ నియంత్రణతోపాటు రాజ్యాంగ నియంత్రణ ఉండాలి. ఒకరోజు దీనిపై చర్చ పెట్టాలి. సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు ఈ అంశంపై దృష్టి పెట్టాలి. ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు ఆడుతారా? రాష్ట్రంలో కులగణనను 1931 తర్వాత ఇప్పుడు మేమే చేశాం. ఈ సర్వేలో 96.9 శాతం మంది పాల్గొన్నారు. మిగతావారి కోసం మరో అవకాశం ఇచ్చాం. కానీ బీఆర్ఎస్ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కుటుంబం మొత్తం అబద్ధాలతోనే బతుకుతున్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకే కులగణనపై అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలపై జీఎస్టీ లేదని ఇష్టమున్నట్టు అబద్ధాలు ఆడుతారా? ప్రధాని మోదీకి చెప్పి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ వేయించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డిని కోరుతున్నాను. నామీద కోపం ఎందుకు ఉంటుంది? మేం తెలంగాణ సంస్కృతిని గౌరవించాం. తెలంగాణ తల్లిని సచివాలయం లోపల ప్రతిష్టించాం. నామీద అన్ని వర్గాలకు కోపం ఉందని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు, రైతులకు, యువతకు 15 నెలల్లోనే ఎన్నో చేశాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే కార్యక్రమం చేపట్టాం. రైతులకు రుణమాఫీ, రూ.500 బోనస్ ఇస్తున్నాం. యువతకు ఉద్యోగాలిస్తున్నాం. గ్రూప్స్ పరీక్షలు నిర్వహించి, పోస్టులు భర్తీ చేస్తున్నాం. నామీద ఎందుకు కోపం ఉంటుంది? 15 ఏళ్లు పైబడ్డ వాహనాలు తిరగొద్దు హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 1,600 కొత్త వాహనాలు వస్తున్నాయి. ఇంటికి నాలుగు వాహనాలు ఉంటున్నాయి. దీనితో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, కొత్త రోడ్లు వేసినా పరిస్థితిలో మార్పు రాదు. ప్రజా రవాణాను పెంచుతున్నాం. కాలుష్యం నుంచి హైదరాబాద్ను కాపాడాలి. మరో ఢిల్లీ కాకుండా చూడాలి. నగరంలోని 3 వేల డీజిల్ ఆర్టీసీ బస్సులను గ్రామాలకు పంపి.. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తం. 15ఏళ్లు పైబడిన వాహనాలను నగరంలోకి అనుమతించం. పరిశ్రమలను ఓఆర్ఆర్ ఆవలికి తరలిస్తాం. పాతబస్తీలో రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సూచన మేరకు లాల్దర్వాజా ఆలయం అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.20కోట్లు కేటాయిస్తున్నా. ఈ మేరకు జారీ చేసే జీవోలో అక్బరుద్దీన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాలి..’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. డ్రగ్స్ విక్రేతల ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ ‘‘రాష్ట్రంలో గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను సరఫరా చేసే పెడ్లర్లు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. డ్రగ్స్ విక్రయించే వారి ఇళ్లకు కరెంటు, నీటి సరఫరా నిలిపివేస్తాం. రూ.250 కోట్లు వెచ్చించి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను పటిష్టం చేశాం. ఇటీవల దుబాయిలో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పోస్టుమార్టం వివరాలన్నీ తెప్పించాం. డ్రగ్స్కు సంబంధించిన గుట్టంతా మా వద్ద ఉంది. స్కూళ్లలో డ్రగ్స్ వినియోగిస్తే ఆ స్కూల్ యాజమాన్యానిదే బాధ్యత. వారిపై కేసులు పెట్టాలని నిర్ణయించాం. లక్షలకొద్దీ ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో ఏం జరుగుతోందో, పిల్లల మానసిక స్థితి ఎలా ఉందో యాజమాన్యమే పర్యవేక్షించాలి. ప్రతి స్కూల్లో సైకాలజీ టీచర్ను తప్పనిసరిగా నియమించుకోవాలి. స్కూళ్లు, కాలేజీల వద్ద ప్రత్యేకంగా నిఘాపెడతాం.’’ -
ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్ వీజీ అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.330 శాతం అధికం 2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఎన్నెన్ని విషాదాలో...! డ్రగ్స్కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..→ కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్గా మా రింది.→ త్రిసూర్లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.→ తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.→ డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.→ డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. డార్క్వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు డ్రగ్స్ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ గ్రూప్ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్ సరఫరా చేసే హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్ డైఆక్సీ మిథాఫెటమైన్ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు.నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.క్యాండీలు, ఐస్క్రీంల రూపంలో... సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.సూపర్బైక్లపై డెలివరీ... స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూప్లోనూ మెసేజ్ చేస్తే పావుగంటలోపే సూపర్ బైక్లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్బైక్లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి– రిటైర్డ్ ఎస్పీ కేజీ సిమాన్ కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు– కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్ బారిన పడుతోంది’’ – ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా–పసిఫిక్ రీజియన్ మాజీ సలహాదారు జి.ప్రమోద్కుమార్– సాక్షి, నేషనల్ డెస్క్ -
డ్రగ్ లార్డ్ క్వింటెరో అమెరికాకు తరలింపు
మెక్సికో సిటీ: డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపా లన్న ట్రంప్ యంత్రాంగం ఒత్తిళ్లు మెక్సికో ప్రభుత్వంపై పనిచేశాయి. యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(డీఈఏ) అధికారి హత్య కేసులో ఆరోపణలున్న కరడుగట్టిన డ్రగ్స్ ముఠా నాయకుడు రఫేల్ కారో క్వింటెరో సహా 29 మంది మాఫియా ముఖ్యులను మెక్సికో ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. మాదక ద్రవ్యాల మాఫియా ముఖ్యులను తమకు అప్పగించకుంటే మంగళవారం నుంచి అన్ని రకాల మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించక తప్పదన్న ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలతో మెక్సికో ప్రభుత్వ యంత్రాంగం మునుపెన్నడూ లేని విధంగా సహకరించేందుకు ముందుకు రావడం గమనార్హం. మెక్సికోలోని వే ర్వేరు జైళ్లలో ఉన్న డ్రగ్ మాఫి యా పెద్దతలలను గురు వారం రాజధాని మెక్సికో సిటీ లో విమానాలకు ఎక్కించారు. మొత్తం 29 మందిని అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది నగరాల్లోని జైళ్లకు తరలించారు. వీరిలో అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన ఆరు గ్రూపులకు గాను ఐదు గ్రూపులకు చెందిన వారున్నారు. కారో క్వింటెరోతోపాటు సినలోలా కార్టెల్లోని రెండు గ్రూపులకు చెందిన ముఖ్యులు, 2022లో నార్త్ కరోలినాలో పోలీసు అధికారి హత్య కేసులో నిందితుడొకరు ఇందులో ఉన్నారని మెక్సికో అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, హత్య తదితర నేరారోపణల కింద వీరిపై విచారణ జరపనున్నామని అమెరికా అటార్నీ జనరల్ పమేలా బోండి చెప్పారు. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపడం, అక్రమ వలసదా రులను నిలువరించడం, ప్రమాదకరమైన డ్రగ్ ఫెంటానిల్ ఉత్పత్తిని నిలిపివేయడం వంటివి మానుకో కుంటే టారిఫ్లు తప్పవని, సానుకూలంగా స్పందించిన పక్షంలో టారిఫ్ల అమలును వాయిదా వేస్తామని గతంలో ట్రంప్ హెచ్చరికలు చేశారు. -
బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఖ్యాతి గాంచిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని.. ప్రపంచ అవసరాల్లో 60 శాతానికి పైగా వ్యాక్సిన్లు, 20% జనరిక్ మందులు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయని తెలిపారు. బయో ఆసియా– 2025 సదస్సు ముగింపు కార్య క్రమంలో కిషన్రెడ్డి ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో భారత ఫార్మా ఎగుమతుల విలువ రెట్టింపు అయింది. 2014లో ఫార్మా ఎగుమతి విలువ 15 బిలియన్ డాలర్లుకాగా.. 2024 నాటికి అది 27.85 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ పరిశోధనలు, ఏఐ–హెల్త్ కేర్, తయారీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతూ.. ‘వసుధైక కుటుంబం’అనే భావనకు ప్రతిబింబంగా నిలుస్తోంది..’’అని తెలిపారు. ఫార్మాలో తెలంగాణ కీలకం.. ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కిషన్రెడ్డి చెప్పారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35శాతం, బల్క్ డ్రగ్స్లో 40శాతం ఆదాయం భాగ్యనగరం నుంచే వస్తోందన్నారు. 800 ఫార్మా, బయోటెక్, మెడ్టెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు వంటివి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని... 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకానమీ సృష్టి దిశగా హైదరాబాద్ అడుగులు వేస్తోందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగానికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్లోబల్ హెల్త్కేర్ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఇన్నోవేటర్లు, శాస్త్రవేత్తలు భారత్తో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా.. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేసిన వారికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర శ్రీధర్బాబు బహుమతులు అందజేశారు. 200కుపైగా దేశాలకు భారత మందులు: పీయూష్ గోయల్ ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా భారతదేశం గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. బయో ఆసియా–2025 సదస్సు ముగింపు సందర్భంగా ఆయన వర్చువల్గా మాట్లాడారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాలకు జనరిక్ మందులు సరఫరా చేస్తున్నాం. ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్, హైవాల్యూ బయో ఫార్మాపై దృష్టి సారించాం..’’అని పీయూష్ గోయల్ తెలిపారు. ఫార్మా రంగంలో సమాచార మార్పిడి, పెట్టుబడులు, ఆవిష్కర్తలకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్, జహీరాబాద్లో ఇండ్రస్టియల్ జోన్, భారత్ మాల కార్యక్రమంలో భాగంగా 2,605 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 4 గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులు, నిజామాబాద్ పసుపుబోర్డులను తెలంగాణకు కేటాయించామని వివరించారు. హైదరాబాద్ను ఫార్మా కేంద్రంగా నిలుపుతాం: మంత్రి శ్రీధర్బాబు 22వ బయో ఆసియా సదస్సుకు 44 దేశాల నుంచి 3 వేల మంది డెలిగేట్స్, 100 మంది వక్తలు హాజరయ్యారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. 200 బిజినెస్ టు బిజినెస్ మీటింగ్లు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని తెలిపారు. బయో ఆసియా సదస్సు ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లైఫ్ సైన్స్ పాలసీని త్వరలో తీసుకొస్తామని.. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీధర్బాబు తెలిపారు. ‘‘అమెరికా, ఆ్రస్టేలియా, తైవాన్ దేశాల సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని బయో ఆసియా సదస్సులో తెలిపాయి. పరిశోధనల ద్వారా కొత్త టెక్నాలజీని ఉపయోగించి మందులు తక్కువ ఖర్చుతో బాధితులకు అందించాలన్నది లక్ష్యం. మాపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి, చెప్పింది చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రపంచంలోనే హైదరాబాద్ను ఫార్మా పరిశ్రమల కేంద్రంగా నిలపడానికి మా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంది..’’ అని వెల్లడించారు. -
ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా కేసులో రూ.7.98 కోట్ల ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా కేసులో రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల మేరకు చేపట్టిన ఈ తాత్కాలిక జప్తులో 22 స్థిర, 8 చరాస్తులున్నాయి. మధ్యప్రదేశ్ ఇండోర్లో నిందితుడు ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న రూ.6.52 కోట్ల విలువైన భూములు, రూ.1.46 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు సీజ్ చేసినట్లు ఈడీ బుధవారం పేర్కొంది. హైదరాబాద్ దోమలగూడలోని జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు 2022లో ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆశిష్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి, రూ.3.72 కోట్ల నగదుతో పాటు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2022, మే 4న ఎన్సీబీ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. జేఆర్ ఇన్ఫినిటీ, ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యులపై దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్లోని ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికా తదితర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా రహస్యంగా కంపెనీ ఆన్లైన్లో ఫార్మా మందులతో పాటు జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో అక్రమ దందా నడుపుతున్నట్లు తెలుసుకుంది. మెయిల్స్, వీఓఐపీ ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్స్ తీసుకుని డ్రగ్స్ సరఫరా చేసేవారని, క్రెడిట్ కార్డు, బిట్ కాయిన్స్ ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయని గ్రహించింది. అ్రల్ఫాజోలం, జోల్పిడెమ్, లోరాజెపామ్, క్లోనాజెపామ్, హైడ్రోకోడోన్, ఆక్సికోడోన్ తదితర సైకోట్రోపిక్ పదార్థాలను ట్యాబ్లెట్ల రూపంలో చట్టవిరుద్ధంగా ఎగుమతి చేస్తున్నారని విచారణలో తేలింది. జేఆర్ ఇన్ఫినిటీ ఏర్పాటుకు ముందే ఆశిష్జైన్, అతని కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో రూ.4.50 కోట్లు విదేశాల నుంచి వచి్చనట్లు తేల్చారు. ఇలా రూ.12.76 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లకు, స్థిరాస్తుల కొనుగోలుకు వె చ్చించినట్లు ఈడీ పేర్కొంది. -
ప్రమాదకరమైన విషం నుంచి ఔషధాలు తయారయ్యాయి ఇలా..!
మానవుడికి అత్యంత హానికరమైన విషాలతోనే ప్రాణాలను కాపాడే శక్తిమంతమైన ఔషాధాలను తయారు చేశారు శాస్త్రవేత్తలు. అత్యంత ప్రమాదకరమైన పాయిజన్ల నుంచే డయాబెటిక్, ఊబకాయం, బ్రెయిన్ ట్యూమర్, లుకేమియా వంటి కేన్సర్లను నివారించే ఔషధాలను తయారు చేశారట పరిశోధకులు. అసలు పాయిజన్లతో ప్రమాదకరమైన వ్యాధులను నివారించే ఔషధాల ఆవిష్కరణ ఎలా జరిగింది..?. ఏ విష జంతువు పాయిజన్తో ఎలాంటి మందులను తయారు చేశారు తదితరాల గురించి చూద్దాం.!గిలా మాన్ స్టర్ అనే బల్లిలో విషపూరితమైన పాయిజన్ ఉంటుంది. వీటిని అమెరికాలో కొందరు పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారు. అయితే దీనిలో ఉండే విషం మానవులు ప్రాణాలను హరిస్తుంది. ఈ విషంతో శాస్త్రవేత్తలు ఓజెంపిక్ అండ్ వెగోవీ వంటి ఆధునిక మందులను తయారు చేశారు. వీటిని డయాబెటిస్, ఊబకాయం చికిత్సలలో ఉపయోగిస్తారు. 20 వ శతాబ్దంలో ఆకలిని అణిచివేసే డ్రగ్ని కనిపెట్టే పనిలోపడ్డారు పరిశోధకులు. అలా గిలా అనే రాక్షస బల్లిలో ఆకలిని నియంత్రించే జీఎల్పీ-1ని పోలి ఉండే ప్రోటీన్ని గుర్తించారు. దాంతో ఆ పాయిజన్తో డయాబెటిక్ని కంట్రోల్ చేసే డ్రగ్ని, ఓబిసెటీకి చెక్పెట్టే మందులను తయారు చేశారు. రక్తపింజరి విషంతో..అలాగే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన మందులలో ఒకటైన లిసినోప్రిల్ డ్రగ్ ఒకటి. ఇది రక్తపోటుని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది దేనితో తయారు చేశారో వింటే షాకవ్వుతారు. రక్తపోటుని తగ్గించగలిగే ఎంజైమ్ ఇన్హిబిటర్. ఇది శరీరంలోని రక్తనాళాలను గట్టిగా కుదించకుండా నిరోధిస్తుంది. దీన్ని బ్రెజిలియన్ వైపర్(ప్రమాదకర రక్తపింజరి) విషం నుంచి తయారు చేశారట పరిశోధకులు. ఇది గుండెపోటు చికిత్సలో కూడా ఉపయోగిస్తారట.కీమో థెరపీ ఔషధాలుగా..అలాగే పురాతన సముద్రస్పాంజ్ల కూడా ఆధునిక చికిత్సలో ఉపయోగిస్తున్నారట పరిశోధకులు. ముఖ్యంగా కరేబియా స్పాంజ్ నుంచి తయారు చేసిన ఔషదాలు లుకేమియా, నాన్హాడ్జికిన్స్ లిఫోమా వంటి కేన్సర్ చికిత్సలలో ఈ డ్రగ్ని కీమోథెరపీ ఔషథంగా ఉపయోగిస్తారట. తేలు విషం కూడా అద్భుతమైన వైద్య పురోగతిని అందించిందట. 2004లో, ఆంకాలజిస్ట్ జిమ్ ఓల్సన్ ఒక టీనేజ్ అమ్మాయి తలలోని బ్రెయిన్ ట్యూమర్ని తొలగించడానికి 14 గంటల పాటు క్రిటికల్ సర్జరీని చేశారు. అయితే బొటనవేలంత పరిమాణంలోని కేన్సర్ కణాలు తొలిగించలేకపోతారు. దీంతో సూక్ష్మాతి కేన్సర్ కణాలను కూడా తొలగించే దిశగా సాగిన ప్రయోగాల్లో తేలు విషం ఉపయోగపడుతుందని గుర్తించారు పరిశోధకులు. అలా ఆ తేలు విషంలో ఉండే..పెప్టైడ్ అనే క్లోరోటాక్సిన్ మెదడు కణితిని కణాలతో బంధిస్తుందని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఆ డ్రగ్ అతి చిన్న కేన్సర్ సముహాలను కూడా సమర్థవంతంగా నిర్మూలించగలదు. ఈ ప్రకృతే ప్రాణాంతకమైన వాటిని ఇస్తూ దాన్నుంచే ప్రాణాలు పోసే ఆవిష్కరణలు చేసేలా పరిష్కారాన్ని అందిస్తోంది. సమస్యలోనే పరిష్కారం ఉంటుందనే అద్భుతమైన విషయ్నాని అందించింది. ఈ భూమిపై అన్ని జాతుల మనుగడే సమర్థవంతమైన పర్యావరణానికి కీలకం. అదే మానువ మనుగడకు మూలధారం కూడా.(చదవండి: Preetisheel Singh Dsouz: పుష్ప 2, ఛావా.. ఈ బ్లాక్బస్టర్ విజయాల్లో 'ఆమె'ది కీలక పాత్ర!) -
స్థూల భారతం.. మందుల మార్గం!
జీవన శైలిలో మార్పులు, శరీరానికి వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ వినియోగం పెరగడంతో.. మన దేశంలో స్థూలకాయుల సంఖ్య ఏటేటా మరింతగా పెరిగిపోతోంది. ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)’2022 ప్రకారం ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 8 కోట్ల మంది ఇప్పటికే స్థూలకాయుల కేటగిరీలోకి చేరగా.. మరో 3 కోట్ల మంది వయోజనులు పొట్ట చుట్టూ అధిక కొవ్వు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అంచనా. ఒబేసిటీ అత్యధికంగా ఉన్న టాప్–10 దేశాల జాబితాలోకి భారత్ కూడా చేరిపోయింది. దీంతో అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. ఇప్పటికే బరువు తగ్గించే పలు రకాల మందులు మార్కెట్లో ఉండగా.. మరికొన్ని ఔషధాలు మన మార్కెట్లోకి రానున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్మూడింతలు పెరిగిన మార్కెట్.. ఒబేసిటీ చికిత్సలో ఉపయోగించే ఔషధాలను జీఎల్పీ–1 (గ్లూకగాన్ తరహా పెప్టైడ్ రిసెప్టర్ ఎగోనిస్ట్స్)గా వ్యవహరిస్తారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను, ఆకలిని నియంత్రించే హార్మోన్లుగా పనిచేస్తాయి. పొట్ట నిండుగా ఉన్నట్లుగా మెదడుకు సంకేతాలు పంపించి, పొట్ట ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపజేసి, బరువు తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. అంతర్జాతీయంగా యాంటీ–ఒబేసిటీ ఔషధాల అమ్మకాలు 2024లో సుమారు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా... 2035 నాటికి 105 బిలియన్ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. మన దేశంలోనూ బరువు తగ్గించే మందులకు డిమాండ్ పెరుగుతోంది.2020 నవంబర్లో వీటి అమ్మకాలు రూ.137 కోట్లుగా ఉంటే.. 2024 నవంబర్ నాటికి రూ.535 కోట్లకు చేరాయి. అంటే సుమారు 290 శాతం పెరిగింది. ఒబేసిటీ సర్జరీ సొసైటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం బరువు తగ్గేందుకు చేయించుకునే సర్జరీలు 2004లో సుమారు 200 మాత్రమేకాగా... 2019 నాటికి ఏకంగా 100 రెట్లు పెరిగి 20,000కు చేరుకున్నాయి. స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో హైపర్టెన్షన్, మధుమేహం, కాలేయ వ్యాధులు వంటి సమస్యలూ వస్తాయి. వీటి చికిత్సల్లో ఉపయోగించే ఔషధాలకూ డిమాండ్ పెరిగిపోతోంది.ఖరీదైన వ్యవహారంగా చికిత్స..యాంటీ–ఒబేసిటీ చికిత్స ఆషామాషీ వ్యవహారం కాదని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా ఈ చికిత్సలకు నెలకు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చవుతుందని అంటున్నారు. ఈ ఔషధాలను దీర్ఘకాలంపాటు తీసుకుంటేనే ఫలితాలు కనిపిస్తాయని, మధ్యలో ఆపేస్తే అప్పటిదాకా చేసినదంతా వృథా అవుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు ఒకే మందు అందరికీ పనిచేయదని... శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకం ఔషధం వాడాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.ఇక యాంటీ ఒబేసిటీ మందులతో కొన్ని దుష్ఫలితాలకూడా వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కొన్నిరకాల ఔషధాలను దీర్ఘకాలం ఉపయోగిస్తే ఇతర దు్రష్పభావాలు తలెత్తవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. అయినా మన దేశంలో యాంటీ ఒబేసిటీ ఔషధాల వినియోగం పెరుగుతోంది. సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, డ్యూలాగ్లూటైడ్, ఒర్లిస్టాట్, టిర్జెప్టైడ్ వంటి ఫార్ములాల ఆధారిత ఔషధాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.అంతర్జాతీయ కంపెనీల కన్ను.. భారత్లో బరువు తగ్గే మందులకు డిమాండ్ నెలకొనడంతో.. అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు మన దేశంపై దృష్టి పెడుతున్నాయి. డెన్మార్క్ కంపెనీ నొవో నోర్డిస్క్కు చెందిన ఓరల్ సెమాగ్లూటైడ్ ట్యాబ్లెట్ రైబెల్సస్ను 2022లో దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టగా.. అది 65 శాతం యాంటీ–ఒబేసిటీ మార్కెట్ను ఆక్రమించింది. దీంతో సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్లను కూడా భారత్లో ప్రవేశపెట్టేందుకు ఆ కంపెనీ కసరత్తు చేస్తోంది. వెగోవీ, ఒజెంపిక్ వంటి ఔషధాల వినియోగం కూడా మనదేశంలో భారీగానే ఉంటోంది. మరింత బాగా పనిచేస్తా యని పేరుండి.. మన దగ్గర విక్రయించని కొన్ని ఔషధాలను అనధికారిక మార్గాల్లో తెప్పించుకునే ధోరణి కూడా పెరుగుతోంది. ఇక అమెరికాకు చెందిన ఎలై లిల్లీ కంపెనీ సైతం టిర్జిప్టైడ్ ఆధారిత మౌంజారో ఔషధాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మన దేశీయ కంపెనీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. గ్లెన్మార్క్ ఇప్పటికే లిరాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్ను ప్రవేశపెట్టగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా తదితర కంపెనీలు పేటెంట్ ముగిసిన జీఎల్పీ–1 ప్రత్యామ్నాయాల మీద పని చేస్తున్నాయి. సన్ ఫార్మా కూడా ఈ విభాగంలో కొత్త మాలిక్యూల్పై పరిశోధన చేస్తోంది. -
ఢిల్లీ లేడీడాన్ అరెస్ట్.. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో లేడి డాన్గా పేరొందిన జోయాఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. జోయాఖాన్ వద్ద నుంచి 270 గ్రాముల నిషేధిత హెరాయిన్ను స్పెషల్ సెల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ హషీమ్బాబా మూడో భార్య అయిన జోయాఖాన్ బాబా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. విలాసవంతమైన జీవితం గడిపే జోయా సెలబ్రిటీల పార్టీలు,ఫంక్షన్లకు తరచు హాజరవుతుంది.గ్యాంగ్ నడిపే విషయమై తన భర్త బాబాను తరచు జైలుకు వెళ్లి కలిసి సలహాలు తీసుకుంటుందని పోలీసులు తెలిపారు.జోయాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె వారి నుంచి తప్పించుకుంటూ వస్తోంది.అయితే నార్త్ఈస్ట్ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి జోయాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.జోయా వద్ద దొరికిన 270 గ్రాముల హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఒక కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా. -
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
AP: అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ.. ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్
సాక్షి, గుంటూరు: గుంటూరులో మత్తుమందు సేవిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 10 గ్రాముల ఎండీఎంఏ మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ను బెంగళూరు నుంచి గుంటూరుకు తీసుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.గుంటూరులో సాయిక్రిష్టనగర్లోని ఒక అపార్ట్మెంట్లో మత్తుమందు సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ క్రమంలో ఎండీఎంఏ మత్తు మందును సేవిస్తూ, విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులతో సహా డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి 10.67 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు నుంచి గుంటూరుకు ఇంజనీరింగ్ విద్యార్థి సాయిక్రిష్ణ డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.దాడుల సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎండీఎం మత్తుమందును ఒక గ్రామును 1400 రూపాయలకు కొనుగోలు చేసి సాయిక్రిష్ట్ర దాన్ని ఐదు వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 11 మంది నిందితులు ఉండగా.. వారిలో ఇద్దరు తప్పించుకున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం
-
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు విదేశీయులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.26 కోట్ల విలువైన కొకైన్ను స్వా«దీనం చేసుకున్నారు. జనవరి 24న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసి... అనంతరం కొకైన్ను స్వా«దీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. జనవరి 24న సావోపాలో నుంచి వచ్చిన బ్రెజిల్ మహిళ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీలను తప్పించుకొనేందుకు గ్రీన్ చానల్ దాటుతుండగా పట్టుకున్నారు. డ్రగ్స్ క్యాప్సూల్స్ తీసుకున్నట్లు విచారణలో అంగీకరించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసి 100 క్యాప్సూల్స్ను బయటకు తీశారు. వాటిలో కొకైన్గా అనుమానిస్తున్న తెల్లటి పొడి ఉన్నట్లు తేలింది. స్వా«దీనం చేసుకున్న డ్రగ్స్ బరువు 802 గ్రాములు కాగా, వీటి విలువ రూ.12.03 కోట్లు ఉంటుందని అంచనా. అదే రోజు అడిస్ అబాబా నుంచి వస్తున్న కెన్యా ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. విచారణలో కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు అంగీకరించాడు. అతడిని కూడా ఆస్పత్రికి తరలించి మొత్తం 70 క్యాప్సూల్స్ను బయటకు తీశారు. క్యాప్సుల్స్లో 996 గ్రాముల హై ప్యూరిటీ కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. రూ.14.94 కోట్ల విలువైన డ్రగ్స్గా గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి.. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మాదకద్రవ్యాల సిండికేట్పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
Satyameva Jayate: డ్రగ్ నెట్ వర్క్ మూలాలు ఏ దేశాల నుండంటే..! కంట్రోల్ చేసే మార్గాలు
-
ఎంటర్టైన్మెంట్ ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్: ప్రభాస్
డ్రగ్స్ నిర్మూలనకు టాలీవుడ్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ తన స్వరం కలిపారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ప్రభాస్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. లైఫ్లో మనకు బోలెడన్నీ ఎంజాయ్ మెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయని ప్రభాస్ అన్నారు. మనల్ని ప్రేమించే వారు, మనకోసం బతికే మనవాళ్లు ఉండగా.. డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? అని ప్రభాస్ ప్రశ్నించారు. సే నో టూ డ్రగ్స్ అంటూ అభిమానులను, సినీ ప్రియులను ప్రభాస్ కోరారు. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 8712671111 నెంబర్కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్తుకు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వీడియోలో ప్రభాస్ మాట్లాడారు. -
డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్.. యువతను పీడిస్తున్న మహమ్మారి
-
సాక్షి మీడియా చేపట్టిన Say No To Drugs క్యాంపెయినకి విశేష స్పందన
-
పబ్లపై డేగ కన్ను
బంజారాహిల్స్: పబ్లు అంటేనే గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్... నగరంలో ఎక్కడా లేనంత హడావుడి, హంగామా జూబ్లీహిల్స్ పబ్లలోనే కనిపిస్తుంది. చుక్కేసినా... చిందేసినా జూబ్లీహిల్స్ పబ్లో ఉంటేనే ఆ కిక్కెక్కుతుంది. అందుకే యువత కళ్లన్నీ జూబ్లీహిల్స్ పబ్లపైనే ఉంటాయి. మామూలు రోజుల్లోనే హంగామా జరిగే ఈ పబ్లలో న్యూ ఇయర్ విషయం చెప్పనక్కర్లేదు...ఈ నెల 31న రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీహిల్స్లోని పబ్లన్నీ సరికొత్త వేదికలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆకర్శన కోసం బాలీవుడ్, టాలీవుడ్ తారలను రప్పిస్తున్నారు. అయితే పబ్ నిర్వాహకులు న్యూ ఇయర్ వేడుకల్లో శ్రుతిమించితే ఊరుకునే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ మాత్రం హద్దు మీరినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఏం చేయాలి.. ఏం చేయకూడదన్న దానిపై పబ్ల నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక పబ్లో మద్యం సేవించి ఆ నిషాలో మరో పబ్కు వెళ్లి తాగుతామంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాలని.. నిషాలో ఉన్న వ్యక్తికి మద్యం సరఫరా చేయకూడదని ఒక వేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పబ్ల నిర్వాహకులకు సమావేశాలు నిర్వహించిన పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు. ప్రతి పబ్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పబ్ ముందు, పార్కింగ్ ప్లేస్లోనూ సీసీ కెమెరాలు ఉండాలని సూచిస్తున్నారు. పబ్లలో డ్రగ్స్ సరఫరా అయ్యే సూచనలు ఉండటంతో గత పది రోజులుగా టాస్క్ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు గతంలో డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగే అన్ని పబ్లపై పోలీసులు డేగ కన్ను వేయనున్నారు. అనుమానితుల కదలికలపై ఇప్పటికే దృష్టి సారించారు. ప్రతి పబ్లోనూ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి సరఫరాదారులపై నిఘా ఉచిన పోలీసులు గతంలో గంజాయి కేసులు నమోదైన వారిపై దృష్టి సారించారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మద్యం సేవించే వారు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. నాలుగు పబ్లకు అనుమతి నో... జూబ్లీహిల్స్లోని హార్ట్కప్, అమ్నేషియా, బ్రాడ్వే, బేబీలాన్ పబ్లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సిద్ధమవుతున్న పబ్లు ఇవే... జూబ్లీహిల్స్లో మొత్తం 36 పబ్లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్ రోగ్, పోష్ నాష్, తబలారసా, జోరా, లార్డ్ ఆఫ్ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్లైవ్, గ్రీజ్ మంకీ, పోర్ ఫాదర్స్, జైథుమ్, స్టోన్ వాటర్, పోయిస్ట్ తదితర పబ్లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్లకు బాలీవుడ్ తారలు కూడా వస్తుండటం గమనార్హం.అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి బంజారాహిల్స్: నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ అన్నారు. ఈ నెల 31న నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అన్ని పబ్లు, బార్లు మైనర్లను అనుమతించరాదన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా తమ ప్రాంగణాలను ఖాళీ చేయించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వెస్ట్జోన్ అడిషనల్ కమిషనర్తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. -
‘మత్తు’రహిత వేడుకలు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర (2025) వేడుకలు మాదకద్రవ్య రహితంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) పటిష్ట చర్యలు ప్రారంభించింది. వేడుకల్లో మత్తుపదార్థాల వినియోగాన్ని కట్టడి చేసేందుకు టీజీఏఎన్బీ బృందాలు నిఘా పెంచాయి. తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు మత్తు పదార్థాలు విక్రయించే, సరఫరా చేసే వారిపై ఫోకస్ పెంచినట్టు అధికారులు తెలిపారు. రంగంలోకి 266 పోలీస్ స్నిఫర్ డాగ్స్ స్థానిక పోలీస్, ఎక్సైజ్, టీజీఏఎన్బీ అధికారుల సోదాలు ముమ్మరం కావడంతో డ్రగ్స్, గంజాయి ముఠాలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. అధికారులకు పట్టుబడకుండా వాహనాల్లోని రహస్య ప్రదేశాల్లో దాచి డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్నాయి. ట్రాక్టర్లు, బస్సుల్లో, సీఎన్జీ వాహనాల్లోని సిలిండర్లలో, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనిపించేలా ఉండే డబ్బాలలో..ఇలా రకరకాల పద్ధతులలో పోలీసుల కన్నుగప్పి రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను పోలీసులు గతంలో స్వా«దీనం చేసుకున్నారు. నిరుద్యోగులైన యువతుల్ని కూడా డ్రగ్స్ రవాణా కోసం మాఫియా వినియోగిస్తోంది. ఇలాంటి ముఠాలపై పటిష్టమైన నిఘా వేయడంతో పాటు ఇన్ఫార్మర్ వ్యవస్థతో మత్తు ముఠాల ఆటకు టీజీఏఎన్బీ కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ యూనిట్లలో కలిపి 266 పోలీసు జాగిలాలకు మాదకద్రవ్యాల గుర్తింపు శిక్షణ ఇచి్చంది. వాటి ద్వారా డ్రగ్స్ రవాణాను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల వరంగల్ రైల్వేస్టేషన్లో స్నిఫర్ డాగ్తో తనిఖీ చేస్తుండగా..అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఒక ఇంటి మొదటి అంతస్తులో గంజాయి మొక్కలను కుండీలలో పెంచుతున్న విషయాన్ని ఈ స్నిఫర్ డాగ్ గుర్తించిందని చెప్పారు. టీజీఏఎన్బీ తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రశంసించినట్టు తెలిపారు. ఇటీవల గుర్తించిన మరికొన్ని కేసులు» గంజాయి చాక్లెట్లతో స్కూలు విద్యార్థులను, దినసరి కూలీలను టార్గెట్ చేస్తున్న ముఠాలను రాజస్తాన్ వరకు వెళ్లి పట్టుకోవడమే కాకుండా తయారు చేస్తున్న ఫ్యాక్టరీని కూడా అక్కడి అధికారుల సహాయంతో టీజీఏఎన్బీ మూయించగలిగింది. » ఇటీవలే 120 కిలోల ఎఫిడ్రెన్ (ఎండీఎంఏ తయారీకి ఉపయోగించే ముడి సరుకు) తయారీ కేంద్రాన్ని గుర్తించడంలో సఫలీకృతమైంది.» ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఈనెల 20 వరకు 641 కిలోల గంజాయి, 15 కిలోల గంజాయి చాక్లెట్స్ , 1600 గ్రాముల హాష్ ఆయిల్, 1383 గ్రాముల ఎండీఎంఏ, కిలో ఓపియం, 115 గ్రాముల చరాస్, 53 కిలోల పాపి స్ట్రా, 44 గ్రాముల హెరాయిన్ను సీజ్ చేశారు. » మొత్తం 148 కేసులను రిజిస్టర్ చేయించడంతో పాటు స్థానిక పోలీసులతో కలిసి 315 మంది నేరస్తులను అరెస్టు చేశారు.» ఈనెల 1 నుంచి 20 వరకు మొత్తం రూ.4.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేశారు. » రూ.200 కోట్ల పైగా విలువ చేసే డ్రగ్స్ను పర్యావరణహిత పద్ధతులలో కాల్చివేశారు. మత్తు కేసుల్లో ఇరుక్కోవద్దు నూతన ఏడాది వేడుకలను మీ కుటుంబ స భ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోండి. అంతే తప్ప మాదకద్రవ్యాల కేసుల్లో ఇరుక్కుని మీరు ఇబ్బందిపడి, మీ కుటుంబ సభ్యులను బాధ పెట్టకండి. మేము ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాకు సంబంధించి ఎటు వంటి సమాచారం ఉన్నా 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా 8712671111 నంబర్లో లేదా http://tganb.tspolice.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. – సందీప్ శాండిల్య, డైరెక్టర్, టీజీఏఎన్బీ -
న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్..
నాగోలు: నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ను అదుపులోకి తీసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు వారి నుంచి రూ.1.15 కోట్ల విలువైన 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్బాబు వివరాలు వెల్లడించారు.. రాజస్థాన్కు చెందిన మంగిలాల్ భీశాయ్, మంగీలాల్ డాక, బీరా రామ్ నగరంలోని మీర్ పేట్, అశోక్ రెడ్డి కాలనీలో ఉంటూ స్టీల్ రేలింగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి మధ్యప్రదేశ్కు చెందిన పింటు అలియాస్ మోహన్ సింగ్తో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించారు. మోహన్సింగ్ తాను మధ్యప్రదేశ్ నుంచి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తానని ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని చెప్పడంతో అందుకు వారు అంగీకరించారు. దీంతో మధ్యప్రదేశ్ వెళ్లిన వారు ముగ్గురు మోహన్సింగ్ వద్ద పాపి్రస్టాను కొనుగోలు చేసి రైల్లో నగరానికి తీసుకువచ్చారు. అశోక్ రెడ్డి నగర్లోని తన ఇంట్లో భద్రపరిచిన వారు దానిని బీఎన్రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న రాజస్థాన్కు చెందిన శంకర్ లాల్, కరీంనగర్లో ఉంటున్న శర్వాన్ ద్వారా నగరంలో అధిక ధరకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట పోలీసులు ఆదివారం రాత్రి అశోక్ రెడ్డి నగర్లోని వారి ఇంటిపై దాడి చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 53.5 కిలోల పాపిస్ట్రా, మూడు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో ఒకరైన మంగీలాల్ 2023లో గంజాయి విక్రయిస్తూ హయత్నగర్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మోహన్ సింగ్, శంకర్ లాల్, శర్వాన్లను త్వరలో అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు. మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా.. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మాదకద్రవ్యాల నియంత్రణకు రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నగర శివార్లలోని రిసార్ట్ల యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీపీ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ . మురళీధర్,అడిషనల్ డీసీపీ షాకీర్ హుస్సేన్, ఇన్స్పెక్టర్లు కీసర నాగరాజు, భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఎరక్కపోయి ఇరుక్కున్నాడు
నిషేధిత డ్రగ్స్ కలిగి ఉన్నాడన్న కారణంతో అతని ఇంటిని సోదాచేయడానికి పోలీసుల బృందం రంగంలోకి దిగగా పారిపోయేందుకు సిద్ధపడ్డ ప్రబుద్ధుడు ఎవరికీ అనుమానం రావొద్దని చిమ్నీలో దాక్కోబోయాడు. అందులో ఇరుక్కుపోయి చివరకు సాయం కోసం బిగ్గరగా అరచి తన జాడ తానే పోలీసులకు చెప్పేశాడు. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని రివర్ ఫాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం 33 ఏళ్ల రాబర్ట్ లాంగ్లేస్ వద్ద నిషేధిత డ్రగ్స్ ఉన్నాయని తెల్సి మంగళవారం పోలీసులు సెర్చ్ వారెంట్తో రాబర్ట్ ఇంటికొచ్చారు. అరెస్ట్ చేద్దామని ఇళ్లంతా వెతికినా రాబర్ట్ దొరకలేదు. అయితే ఇదే సమయంలో ఇంటి వెనుక ఎవరో సాయం కోసం అరుస్తున్న శబ్దం వస్తోందని అటుగా దారిన పోయే వ్యక్తులు చెప్పారు. దీంతో పోలీసులు ఇంటిపైకప్పు మీదకొచ్చి చూస్తే ఎవరూ లేరు. ఒకాయన చిమ్నీ గొట్టం ఎక్కడం చూశా అని అటూగా పోతున్న ఇంకొక వ్యక్తి చెప్పడంతో చిమ్నీ గొట్టంలోకి పోలీసులు తొంగిచూశారు. అందులో ఇరుక్కుని ఎటూపోలేక అవస్థలు పడుతున్న రాబర్ట్ను చూసి పోలీసులకు విపరీతంగా కోపమొచి్చంది. ‘‘నువ్వెంత మూర్ఖుడివిరా బాబు. అందులో దూరి ఎలా దాక్కున్నావనుకున్నాం. దాంట్లోంచి అవతలికి పారిపోదామనుకున్నావా?’అంటూ అతడిని ప్రశ్నించారు. ముందుగా అతడిని బయటపడేసే మార్గం కోసం వెతికారు. చివరకు చిమ్నీ అడుగుభాగాన్ని మాత్రం బద్దలుకొట్టి బయటకు తీద్దామని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అగ్నిమాపక సిబ్బందిని పిలిచించి కొన్ని ఇటుకలు తీయించారు. బయటకు వచ్చేయ్ అని హెచ్చరించారు. భయపడుతూ ఎలాగోలా అందులోంచి బయటపడిన రాబర్ట్ను పోలీసులు పోలీసుల బండిలో పడేశారు. నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ఇరుక్కునప్పుడు అయిన గాయాలకు ప్రథమ చికిత్స చేయించారు. ప్రస్తుతం కేసు విచారణ నడుస్తోంది. – ఫాల్ రివర్ సిటీ -
HYD: మేడ్చల్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి,మేడ్చల్జిల్లా: మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. మేడ్చల్ బస్సుడిపో వద్ద మంగళవారం(డిసెంబర్ 10) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపో వద్ద దిగాడు.డ్రగ్స్తో దిగుతున్నాడని ముందే సమాచారం అందుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అతని వద్ద నుంచి 600 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి -
ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ కథ క్లోజ్.. విశాఖపట్నానికి వచ్చిన నౌకలో డ్రగ్స్ లేవని నిర్ధారించిన సీబీఐ... అప్పట్లో ఓటర్లను మోసగించడానికి టీడీపీ అండ్ కో దుష్ప్రచారం
-
కనికట్టు కుట్ర ‘పచ్చ’ పన్నాగమే!
ఆ రోజు డ్రై ఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ అవశేషాలున్నాయని ఎందుకు ఊరూరా ఊదరగొట్టారు? అందులో డ్రగ్స్ లేవని ఇప్పుడు సీబీఐ స్పష్టం చేసింది. దీనిని బట్టి మీరు చేసింది విష ప్రచారం కాదా? వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విష ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది కూటమి నేతలు కాదా? వీటన్నింటిపై ఇప్పుడు ఏమంటారు?సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం : ‘అడ్డదారిలో అధికారమే చంద్రబాబు జెండా.. అందుకు దుష్ప్రచారమే అజెండా’ అని మరోసారి నిరూపితమైంది. ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకు టీడీపీ కూటమి పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజల్ని వంచించారన్నది ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రేనన్నది నిరూపితమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని టీడీపీ కూటమి చేసిన దు్రష్పచారం.. అందుకు వంత పాడిన ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతం అంతా కుతంత్రమేనని నిగ్గు తేలింది. బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపటా్ననికి వేల టన్నుల డ్రగ్స్ను దిగుమతి చేశారన్న ప్రచారం కేవలం చంద్రబాబు కుతంత్రమేనని నిర్ధారణ అయ్యింది. విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారమేనని స్పష్టమైంది. అదే కాదు.. భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా టీడీపీ కూటమి ఎన్నికల ముందు పెట్టిన గగ్గోలు అంతా దుష్ప్రచారమే తప్ప.. అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నదీ తేటతెల్లమైంది. రీసర్వేను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని చంద్రబాబే వెల్లడించడం అందుకు తార్కాణం. నేరుగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేమని గ్రహించే చంద్రబాబు ఎన్నికల ముందు ఈ దు్రష్పచార కుతంత్రాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారన్నది తాజా పరిణామాలు తేల్చి చెబుతున్నాయి. ఇలా నెలకో అబద్ధానికి రెక్కలు కట్టి విష ప్రచారం చేస్తుండటం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి, ఈనాడు, టీవీ–5.. ఇతర ఎల్లో మీడియాకే చెల్లింది. రాష్ట్ర అప్పులు మొదలు.. శ్రీవారి లడ్డూ, విజయవాడ వరదలు, అదానీ వ్యవహారం, కాకినాడ పోర్టు వరకు.. ఎప్పటికప్పుడు వివాదాలు లేవనెత్తుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. డ్రగ్స్ అడ్డాగా ఏపీ.. ఇదీ పచ్చ ముఠా దుష్ప్రచారం » చంద్రబాబు 2024 ఎన్నికల అక్రమాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ప్రజల్ని మభ్యపెట్టందే, భయభ్రాంతులకు గురి చేయందే ఎన్నికల్లో గెలవలేమని గుర్తించిన ఆయన పక్కా పన్నాగంతో దుష్ప్రచార కుట్రకు తెగించారు. అందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్కు ఆడ్డాగా మారిపోయిందని పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశారు. » చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆ ప్రచారాన్ని ఊరూ వాడా ఊదరగొట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. పోలింగ్కు కచ్చితంగా నెలన్నర ముందు డ్రగ్స్ దందా కుట్రను పతాక స్థాయికి తీసుకువెళ్లాలని చంద్రబాబు భావించారు. అప్పటికే తమతో జట్టుకట్టిన జనసేన, బీజేపీ నేతల సహకారంతో అందుకోసం పక్కా కుట్రకు తెరతీశారు. అందులో భాగంగానే బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ను తీసుకువచ్చిన ‘ఎస్ఈకేయూ 4375380’ అనే నౌకలో డ్రగ్స్ అక్రమంగా తీసుకువస్తున్నారంటూ ఢిల్లీలోని సీఐబీ కార్యాలయానికి ఆకాశరామన్న తరహాలో తప్పుడు సమాచారం అందించారు. » అనంతరం కొందరు అధికారులను ప్రభావితం చేశారు. దాంతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు ఆగమేఘాల మీద విశాఖపట్నం చేరుకుని మార్చి 21న ఆ నౌకలో తనిఖీలు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంధ్యా ఆక్వా అనే సంస్థ దిగుమతి చేసుకున్న 25 వేల టన్నుల డ్రై ఈస్ట్ను జప్తు చేశారు. అందుకోసం ముందుగానే కాచుకుని కూర్చున్న టీడీపీ.. ఆ వెంటనే డ్రై ఈస్ట్ పేరుతో కొకైన్ అనే డ్రగ్స్ అక్రమంగా దిగుమతి చేశారనే దు్రష్పచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది. » వెయ్యి టన్నుల కొకైన్ ధర రూ.వెయ్యి కోట్లని.. ఆ లెక్కల ప్రకారం రూ.25 వేల కోట్లు విలువ చేసే 25 వేల టన్నుల కొకైన్ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి.. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వరుసగా మైకులు పట్టుకుని అదే తప్పుడు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే డ్రగ్స్ను రాష్ట్రంలోకి తీసుకువచ్చారంటూ విష ప్రచారం చేశారు. » ఆ షిప్లో డ్రగ్స్ దిగుమతి అయినట్టు సీబీఐ అధికారికంగా ప్రకటించనే లేదు. ఇంకా తనిఖీలు చేయాల్సి ఉందని, ఆ డ్రై ఈస్ట్ను ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాల్సి ఉందని సీబీఐ చెప్పినా సరే చంద్రబాబు ముఠా ఏమాత్రం పట్టించుకోలేదు. కేవలం ఎన్నికల ముందు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్రం డ్రగ్స్కు అడ్డాగా మారిపోయిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించారు. ఏకంగా నెల రోజులపాటు ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగించడం పక్తు చంద్రబాబు పన్నాగమే. అందులో డ్రగ్స్ లేవు విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అయ్యాయని ఈ ఏడాది మార్చి 19న సీబీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్కు వెయ్యి బ్యాగులొచ్చాయని వెల్లడించింది. ఆ తర్వాత డ్రగ్స్ మూలాలపై దర్యాప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అనంతరం బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన నౌకలో అసలు డ్రగ్స్ లేనే లేవని సీబీఐ తేల్చి చెప్పింది. కంటైనర్ క్లియరెన్స్ వాస్తవమేనని కస్టమ్స్ అధికారులు ««ధృవీకరించారు.. సీజ్ చేసిన కంటైనర్ను సదరు సంస్థకు అప్పగించేందుకు సీబీఐ క్లియరెన్స్ సరి్టఫికెట్ ఇచ్చిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. పూర్తి ఆధారాలతో సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించిన తర్వాత.. కోర్టు అనుమతించిన పత్రాల్ని తమకు ఇచ్చారని ఆయన వెల్లడించారు. భూముల రీసర్వేపై కూడా విషప్రచారం » భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై కూడా చంద్రబాబు, ఆయన ముఠా ఇదే రీతిలోదుష్ప్రచారం చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సామాన్యుల భూములను కబ్జా చేసేందుకు రీసర్వేను నిర్వహిస్తున్నారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతూ అందర్నీ భయాందోళనలకు గురి చేసేందుకు యత్నించాయి. » తాత, తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను బలవంతంగా తమ పేరిట రాయించేసుకుంటారని, ఆ మేరకు రీసర్వే నివేదికల్లో నమోదు చేసేస్తారని బురద జల్లడం ద్వారా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తించాయి. టీడీపీ చేస్తోందంతా దుష్ప్రచారమేనని వైఎస్సార్సీపీ ఎంతగా వివరించేందుకు యత్నించినా సరే టీడీపీ కూటమి మాత్రం తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసింది. » ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో వందేళ్ల క్రితం రాష్ట్రంలో భూముల సర్వే చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయలేదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివరించింది. దాంతో భూ వివాదాలు అంతకంతకూ పెరుగుతుండటంతో సామాన్యులు పడుతున్న అవస్థలకు పరిష్కార మార్గంగానే రీసర్వే చేపట్టినట్టు ఎంతగానో చెప్పుకొచ్చింది. భూముల రీసర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించింది. కానీ టీడీపీ కూటమి ప్రజల్ని మభ్యపెట్టేందుకు పోలింగ్ వరకు తమ దు్రష్పచారాన్ని కొనసాగించింది. » తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూముల రీసర్వేను తాము కొనసాగిస్తామని ప్రకటించడం గమనార్హం. భూ వివాదాల పరిష్కారానికి రీసర్వేనే పరిష్కారమని ఆయన ప్రకటించారు. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సరైన చర్యేనని అధికారికంగా ఆమోదించారు. అంటే కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మోసగించి అక్రమంగా ఓట్లు కొల్లగొట్టేందుకే తాము దుష్ప్రచారం చేశామని చంద్రబాబు అంగీకరించినట్టే కదా! ఇలాంటి కుట్రలు ఎన్నెన్నో.. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని టీడీపీ కూటమి విష ప్రచారం చేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.6.50 లక్షల కోట్లేనని వెల్లడించింది. 2014–19లో చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల శాతం కంటే 2019–24లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల శాతం తక్కువేనని ఆరి్థక శాఖ నివేదిక వెల్లడించింది. అంటే టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువేనని నిరూపితమైంది. » రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది బాలికలు, మహిళలను వలంటీర్ల ద్వారా అపహరించి అక్రమ రవాణా చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తనకు కేంద్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయంటూ ఎన్నికల సభల్లో పదే పదే దు్రష్పచారం చేశారు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆయన ఒక్క మాట మాట్లాడ లేదు. కనిపించకుండా పోయారని చెప్పిన 34 వేల మందిని తీసుకురావాలని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతున్నా ఆయన స్పందించడమే లేదు. ఎందుకంటే అది అవాస్తవం కాబట్టే. అసలు అంత మంది కనిపించలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలోని హోమ్ శాఖ తెలిపింది. అంటే ఇదంతా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు చేసిన దుష్ప్రచారమేనని నిగ్గు తేలింది. -
చిన్న పరిశ్రమలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే అవకాశమున్న చోట సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, నూతన ప్రణాళికలను వివరించారు.ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య కొత్తగా పది పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, అరులో ఐదింటిని ఎంఎస్ఎంఈల కోసం అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే పారిశ్రామిక పార్కుల్లో ఒక దానిని మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించడంతోపాటు కొత్త పార్కుల్లో ఐదు శాతం ప్లాట్లు మహిళలకు కేటాయిస్తామని చెప్పారు. కొన్ని ప్లాట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని, వారికోసం ప్రత్యేక విధానం తీసుకొస్తామని వెల్లడించారు.‘మాదకద్రవ్యాలతో పొంచి ఉన్న ప్రమాదంపై విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలి్పంచడం కోసం రూపొందించిన ‘డ్రగ్ అబ్యూజ్ యాప్’ను వేయి గ్రామీణ స్కూళ్లలో వినియోగిస్తాం. చిన్న, సన్న కారు రైతులకు 48 గంటల్లోపు రూ.లక్ష వరకు రుణం లభించేలా రూపొందించిన యాప్ను సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 8న ప్రారంభిస్తారు’అని వెల్లడించారు. కంపెనీలకు సులభంగా అనుమతులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సత్వరం అనుమతులు లభించేలా సరళీకరణ విధానాలను అమలుచేస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ‘ఏడాది కాలంలో టీజీఐపాస్ ద్వారా రూ.6,347.59 కోట్ల విలువైన 1,539 యూనిట్లకు అనుమతులిచ్చి 35,724 మందికి ఉపాధి కలి్పంచాం. మరో రూ.9,240 కోట్లతో 37,588 ఉపాధి కల్పన కోసం 731 యూనిట్లు అనుమతులు కోరాయి. 8,894 మందికి ఉపాధి కలి్పంచేలా 14,433 కోట్లతో ఏర్పాటయ్యే 16 మెగా ప్రాజెక్టు లకు అనుమతులు ఇచ్చాం. ఫార్మా రంగంలోనూ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులతో 141 ప్రాజెక్టుల ద్వారా 51 వేల మందికి ప్రత్యక్షంగా, 1.50 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులు అనుమతుల దశలో ఉన్నాయి’అని శ్రీధర్బాబు వివరించారు. నిమ్జ్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. ‘9 కాలేజీలతో టీహబ్ ఒప్పందం చేసుకుంది. నిమ్జ్కు కేంద్రం రూ.2,500 కోట్ల నిధులిస్తుంది. అక్కడ రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 2 లక్షల మందికి ఉపాధి కోసం కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. ఏఐ రంగంలో హైదరాబాద్ను అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దేందుకు 200 ఎకరాల్లో ఎక్సలెన్సీ సెంటర్కు వచ్చే ఏడాది ఆరంభంలో శంకుస్థాపన చేస్తాం. వీహబ్ ద్వారా కొత్తగా పది వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతాం. 33 జిల్లా కేంద్రాల్లో మినీ ప్రొటో టైపింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మరో 11 స్కూళ్లు ఏర్పాటు చేస్తాం’అని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. -
కొండాపూర్ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ.. ఢీ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి అరెస్ట్
-
HYD: ‘ఓయో’లో డ్రగ్స్ పార్టీ.. కొరియోగ్రాఫర్ అరెస్టు
సాక్షి,హైదరాబాద్: మాదాపూర్ ఓయో రూమ్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హా మహంతి పట్టుబడ్డారు. కన్హమహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ప్రియాంకరెడ్డి ఇచ్చిన పార్టీలో కన్హా మహంతి పాల్గొన్నట్లు తెలుస్తోంది.ప్రముఖ టీవీ షోలలో కన్హా మహంతి కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ప్రముఖ డ్యాన్స్షోలలో చాలా కాలం పాటు పనిచేసిన కన్హా మహంతి పలుమార్లు విజేతగా నిలిచారు. మహంతి, ప్రియాంక రెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం.పార్టీలో పాల్గొన్న నలుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.పార్టీ జరిగిన ప్రదేశం నుంచి ఎండీఎంఏ డ్రగ్స్తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మేడ్చల్లో డ్రగ్స్ కలకలం.. ముఠా నాయకుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక కిలో మెపిడ్రైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ ముఠా నాయకుడు అల్లు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. మేడ్చలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేడ్చల్ పోలీసులతో నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఒక విలో మెపిడ్రైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారు చేస్తున్న అల్లు సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సత్యనారాయణ యాదగిరిగుట్టలోని ఒక మూతపడిన ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, డ్రగ్స్ ముఠాలో ఉన్న మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఫిషింగ్ బోట్లలో వందల కిలోల డ్రగ్స్.. పట్టుకున్న నేవీ
ముంబయి: అరేబియా సముద్ర జలాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సముద్రంలో రెండు ఫిషింగ్ బోట్లలో ఏకంగా 500 కిలోల డ్రగ్స్ను అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో శుక్రవారం నేవీ ఒక పోస్టు చేసింది.‘శ్రీలంకకు చెందిన రెండు ఫిషింగ్ బోట్లలో అక్రమరవాణా చేస్తున్న 500 కిలోల డ్రగ్స్ను ఇండియన్ నేవీ సీజ్ చేసింది. శ్రీలంక నేవీ,ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఎప్పికప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన ఇండియన్ నేవీ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న బోట్లను అడ్డుకుంది.డ్రగ్స్ ఉన్న బోట్లను గుర్తించడానికి విస్తృత ఏరియల్ సెర్చ్ నిర్వహించాం. డ్రగ్స్ రవాణా చేస్తున్న రెండు బోట్లను, అందులో ఉన్న సిబ్బందిని శ్రీలంకకు అప్పగించాం’అని ఇండియన్ నేవీ ట్వీట్లో తెలిపింది. ఈ ఆపరేషన్ డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో భారత్,శ్రీలంక మధ్య ఉన్న పటిష్ట సంబంధాలను తెలియజేస్తోందని పేర్కొంది. Narcotics Seizure - Combined Operation b/n #IndianNavy & @srilanka_navy.Based on information received from #SrilankaNavy regarding probable narcotics smuggling by Sri Lankan flagged fishing vessels, the @indiannavy swiftly responded through a coordinated operation to localise &… pic.twitter.com/dkpzNQonTF— SpokespersonNavy (@indiannavy) November 29, 2024 -
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
అలాంటి వారికి అండగా నిలుద్దాం: అల్లు అర్జున్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహరించాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ స్పెషల్ వీడియోని షేర్ చేస్తూ.. డ్రగ్స్ బాధితులను ఆదుకోవడానికి, సురక్షితమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.‘‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్: 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్లో రేవంత్ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా రిలీజ్కి కొద్ది రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు. గతంలో కమల్ హాసన్, చిరంజీవి, ఎన్టీఆర్తో పాటు మరికొంతమంది హీరోలు కూడా ఇలాంటి అవగాహన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Let’s unite to support the victims and work towards building a safer, healthier society.Humbled to join this impactful initiative by the Government of Telangana.@revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs pic.twitter.com/tZ5Rkiw5Lg— Allu Arjun (@alluarjun) November 28, 2024 -
పన్నుకు పన్ను ట్రంప్ ప్రతిపాదనలపై మెక్సికో!
మెక్సికో: మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం పన్ను విధిస్తామన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికకు ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే మెక్సికో కూడా సుంకాలతో బదులిస్తుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దుల వెంబడి మాదకద్రవ్యాలు, వలసదారుల ప్రవాహాన్ని ఆపకపోతే మెక్సికో వస్తువులపై 25% దిగుమతి సుంకాలు తప్పవని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను క్లాడియా తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరికా నుంచి అక్రమంగా ప్రవాహంలా వచ్చిపడుతున్న ఆయుధాలతో మెక్సికో బాధపడుతోందన్నారు. ఇక మాదకద్రవ్యాలు అమెరికా సొంత సమస్యేనన్నారు. వలస సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. సమస్యలపై చర్చలకు సిద్ధమన్నారు. వలసదారుల కారవాన్లు ఇకపై సరిహద్దుకు చేరవని స్పష్టం చేశారు. ఆయుధాలపై పెట్టే ఖర్చును వలస సమస్యను పరిష్కారానికి వెచ్చిస్తే మంచిదని అమెరికాకు హితవు పలికారు. యుద్ధానికి ఖర్చు చేసే మొత్తంలో కొంత శాంతి, అభివృద్ధిపై కేటాయిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చన్నారు. అమెరికా, మెక్సికో పలు అంశాల్లో పరస్పరం ఆధారపడతాయి. భారీ పన్నులు ఇరు దేశాల్లో ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి కారణమవుతాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, శాంతి సాధనకు చర్చలే మార్గం’’అన్నారు. అవి త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం రేపాయి. మండలంలోని రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా భువనగిరి మండలం గూడూరు టోల్ గేట్ వద్ద పోలీసులకు డ్రగ్స్ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. గతకొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఎఫిడ్రవిన్ తయారీ చేస్తున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట కేంద్రంగా తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ను హైదరాబాద్, ముంబై తరలిస్తున్నారురూ.24 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం: డీసీపీరూ.24 కోట్ల విలువ చేసే 120 కేజీల నిషేధిత ఎఫిడ్రవిన్ మెఫెడ్రోన్ సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. కొంతకాలంగా మూతపడిన యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పరిశ్రమ అడ్డాగా చేసుకుని ముఠా డ్రగ్స్ను తయారు చేస్తుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.నేతి కృష్ణారెడ్డి, ఫైజాన్ అహ్మద్ (ముంబై), చెపురి సునీల్ (డైవర్)లను అరెస్ట్ చేశామని మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. రెండు కార్లు, నాలుగు మొబైల్స్ సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. -
తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్శిటీలో డ్రగ్స్ కలకలం
సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటీలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఒడిశా విద్యార్థి శతపతి 20 ప్యాకెట్ల గంజాయి తీసుకొచ్చినట్లు రిజిస్ట్రార్ రమశ్రీ వెల్లడించారు. గరుడచల హాస్టల్లోని విద్యార్థి ఆంజనేయులకు 7 ప్యాకెట్ల గంజాయి ఇచ్చాడని.. హాస్టల్ తనిఖీల్లో 109 గదిలోని విద్యార్థులు గంజాయి సేవించినట్లు అభియోగం వచ్చిందన్నారు.యాంటీడ్రగ్స్ కమిటీచే విచారణ చేపట్టాం. నిర్థారణ కాగానే విద్యార్థులను కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తాం. క్యాంపస్లో ఆరు నెలలుగా విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నారన్నది అవాస్తవం అని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. సంస్కృత విశ్వవిద్యాల యంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే పలువురు విద్యార్థులు డ్రగ్స్ బానిసలుగా మారారంటూ సీనియర్ ఏబీవీపీ విద్యార్థి సంఘం నేత గణపతి ఆరోపించారు. -
వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్కు నష్టం?
అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్లో పోస్ట్ చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్లు, టాక్సిన్లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: హైదరాబాద్లో రియల్టీ జోరు!‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
కొత్తగా నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 4 కొత్త డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణతో పాటు కొత్త ల్యాబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మషల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, అదనంగా కనీసం 150 (అదనంగా ఇంకో 80 పోస్టులు) మంది అవసరం అని అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించి అవసరమైన మేర పోస్టులు మంజూరు చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంగళవారం డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) అధికారులు, తెలంగాణ మెడికల్ సరీ్వసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంసీఐడీసీ) అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే సంస్థలపై, వాటిని విక్రయించేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మా కంపెనీలు, ఔషధ తయారీ యూనిట్లు, మందుల దుకాణాల్లో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. డ్రగ్స్కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో ఫిర్యాదుల విభాగాలు (కంప్లైంట్ సెల్స్), వీటి ఆకస్మిక తనిఖీల కోసం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల కొనుగోలు విషయంలో టీజీఎంఎస్ఐడీసీకి అవసరమైన సహకారం అందించాలని డీసీఏ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, డీసీఏ డీజీ వీబీ కమలాసన్రెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ సహదేవరావు, డీసీఏ జాయింట్ డైరెక్టర్ జి.రాందాన్ తదితరులు పాల్గొన్నారు. -
బరువు తగ్గించే ఔషధాలతో కండరాల క్షీణత
బరువు తగ్గేందుకు వినియోగించే ఔషధాల వల్ల కండరాల ద్రవ్యరాశి క్షీణించే ప్రమాదం ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు లాంటి జీవన శైలి వ్యాధులకు దారి తీసే ఊబకాయాన్ని నియంత్రించడంలో ఈ మందులు సమర్థంగా పని చేస్తున్నప్పటికీ బరువు కోల్పోయే ప్రక్రియలో కండరాలు క్షీణతకు గురయ్యే ముప్పు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.బరువు కోల్పోవడం కారణంగా కండరాలు క్షీణతకు గురైనప్పుడు వార్దక్య లక్షణాలు, హృద్రోగ జబ్బుల ముప్పు పెరుగుతాయి. ఈమేరకు పెన్నింగ్టన్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ (అమెరికా), ఆల్బర్టా, మెక్ మాస్టర్ వర్సిటీ (కెనడా)కి చెందిన పరిశోధకులు రూపొందించిన పత్రాలు లాన్సెట్ జనరల్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్కండరాలు ఎందుకు అవసరం?⇒ దేహానికి పటుత్వం చేకూర్చి శరీరాన్ని దృఢంగా ఉంచడంతోపాటు జీవ క్రియలు, వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి.⇒ శరీర కదలికలు, ఆకృతికి కండర కణజాలం అవసరం.ఏం చేయాలి?⇒ బరువు కోల్పోయేందుకు తీసుకునే మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.⇒ ఆహారం తక్కువ తీసుకుంటే విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో అందకపోయే ప్రమాదం ఉంది.⇒ తగినంత ప్రోటీన్లు తీసుకోవడంతోపాటు వ్యాయామాలు లాంటి ఆరోగ్యకరమైన విధానాలను పాటించాలి.బరువు తగ్గించే మందులు ఏం చేస్తాయి?డయాబెటిక్ బాధితులు, బరువు కోల్పోయేందుకు తీసుకునే ఓజెమ్పిక్, వెగావై, మౌన్జరో, జెప్బౌండ్ లాంటి మందుల్లో జీఎల్పీ – 1 రిసెప్టార్ఎగోనిస్ట్లు ఉంటాయి. ఒక రకమైన ప్రోటీన్లు లాంటి ఈ రిసెప్టార్లు రక్తంలో చక్కెర స్థాయిలు, జీవ క్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెంచే గ్లూకగాన్ హార్మోన్ విడుదలను అడ్డుకుంటాయి. ఆహారం తీసుకున్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుంది.ఆకలిని కూడా ఇవే రిసెప్టార్లు నియంత్రిస్తాయి. కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువును నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. ఈ రిసెప్టార్లను అనుకరిస్తూ టైప్ 2 డయాబెటిస్, ఊబకాయాన్ని నియత్రించే ఔషధాలు తయారయ్యాయి. మధుమేహ నియంత్రణలో వాడే మరికొన్ని మందులు మూత్రం ద్వారా గ్లూకోజ్ను బయటకు పంపి శరీర బరువును సమతూకంలో ఉంచేలా దోహదం చేస్తాయి. ప్రధానంగా మెదడులోని కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆకలిని అణచివేసి తక్కువ తీసుకునేలా ప్రోత్సహిస్తాయి. -
ఆ ఫోన్ ఎక్కడ.. విదేశీ మద్యం ఎక్కడ నుంచి తెచ్చారు?
శంకర్పల్లి: విజయ్ మద్దూరిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. కొకైన్ ఎక్కడ తీసుకున్నావ్? ఫోన్ ఎక్కడ దాచావ్? విదేశీ మద్యం ఎక్కడ నుంచి తెచ్చారు? పార్టీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అంటూ ప్రశ్నించనట్టు సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కేసులో డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మోకిల పోలీస్స్టేషన్లో తన న్యాయవాది అవినాష్తో కలిసి విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా నార్సింగి ఏసీపీ రమణగౌడ్ సమక్షంలో మోకిల సీఐ వీరబాబు విచారణ చేపట్టారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత విజయ్ పోలీస్స్టేషన్కు రావడంతో పోలీసులు ఆయన్ను పలుకోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. తాను అక్టోబర్ 10 నుంచి 14 వరకు నెదర్లాండ్స్లో రోజూ కొకైన్ తీసుకున్నానని..రాజ్ పాకాల ఇంట్లో పార్టీలో తీసుకోలేదని సమాధానం ఇచ్చారు. పార్టీ సమయంలో తన ఫోన్లో చార్జింగ్ లేక అక్కడే చార్జింగ్ పెట్టానన్నాడు. ఎవరైనా తీసుకున్నట్టు తెలిస్తే అప్పగిస్తానని పోలీసులకు చెప్పాడు. సుమారు మూడు గంటల పాటు విచారించిన పోలీసులు, మళ్లీ అవసరమైతే పిలుస్తామని పంపించారు. ఇంటికి వెళ్లే సమయంలో విజయ్ మద్దూరితో మీడియా ప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం చేయగా, ఆయన నిరాకరించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో శుక్రవారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇద్దరు భారతీయుల లగేజ్ తనిఖీల్లో ఏదో అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేయగా తినే పదార్థం కేలోక్స్ 13 ప్యాకెట్లలో హైడ్రోపోనిక్ గంజాయి రావాణా చేస్తున్నట్లు తేలింది. వారి నుంచి ఏడు కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ రూ. 7 కోట్లు ఉంటుందని తెలిపారు.ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై 1985 ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా హైడ్రోపోనిక్ గంజాయి అత్యంత ప్రమాదకరమైనది. డ్రగ్స్ కంటే కూడా విలువైన, ఖరీదైన గంజాయిగా పేర్కొంటారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇది తయారవుతుంది. -
చందానగర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేయగా, పక్కా సమాచారంతో చందానగర్ పోలీసులు దాడులు చేశారు. రూ.18 లక్షలు విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను సీజ్ చేశారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.అయితే, ఈ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. డ్రగ్ పెడ్లర్ కృష్ణరామ్ను పోలీసులకు ఓ డాక్టర్ పట్టించారు. కృష్ణరామ్ ఆహ్వానించడంతో పార్టీకి వెళ్లిన వైద్యుడు.. కృష్ణరామ్ బ్యాగ్లో డ్రగ్స్ చూసి పోలీసులకు సమాచారం అందించారు. కృష్ణరామ్ అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.గత రెండు రోజుల క్రితం ఓ మహిళ తన ఇంట్లో డ్రగ్స్ను ఎలాంటి అనుమతులు లేకుండా దాచిపెట్టి నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ విభాగం బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లో ఉన్న జీవీ సలూజా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన నార్కోటిక్స్ డ్రగ్స్తో పాటు మత్తు కలిగించే మందులను గుర్తించారు.ఇటీవల వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డా బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు. పోలీసుల తనిఖీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జాన్ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను గుర్తించారు. డ్రగ్ ఎండీఎఏను గ్రాము రూ. 2500కు కొనుగోలు చేసి రూ.5వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: మయోనైజ్పై నిషేధం -
మహిళ ఇంట్లో డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళ తన ఇంట్లో డ్రగ్స్ను ఎలాంటి అనుమతులు లేకుండా దాచిపెట్టి నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ విభాగం బట్టబయలు చేశాయి. బుధవారం సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్లో ఉన్న జీవీ సలూజా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన నార్కోటిక్స్ డ్రగ్స్తో పాటు మత్తు కలిగించే మందులను గుర్తించారు. ఫెంటనైల్, కిటమైన్ హైడ్రోక్లోరైడ్, పెంటజోసైన్ యాసిడ్, మిడజోలం, సక్సినైల్ క్లోరైడ్ ఇంజెక్షన్లను భారీగా పట్టుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించగా.. మౌలాలిలోని ఎంజే కాలనీకి చెందిన నేహా భగవత్ అనే మహిళ తమకు సరఫరా చేస్తుందని వివరాలు అందించారు. దీంతో వెంటనే నేహా ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడ భారీ స్థాయిలో నిల్వ ఉంచిన నార్కోటిక్ డ్రగ్స్, మందులను గుర్తించారు. మార్ఫిన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఫెంటనైల్ సిట్రేట్ ఇంజెక్షన్లు, ఫెంటనైల్ సిట్రేట్ ప్యాకెట్లు, పెంటజోకైన్ ఇంజెక్షన్లను వేరే రాష్ట్రాల నుంచి అక్రమంగా కొనుగోలు చేసి, నగరంలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నడుపుతున్న మందుల దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే నేహాపై ఎన్డీపీఎస్ చట్టం కింద రెండు కేసులు ఉన్నాయని, గత నెలలోనే బెయిల్ పొంది బయటికి వచ్చినట్టు అధికారులు వివరించారు. అధికారులు డ్రగ్స్ను సీజ్ చేశారు. నేహా భగవత్, పట్టూరి గోపీనాథ్, సురేందర్సింగ్ గుసియాలు పట్టుబడ్డారు. కాగా, నిందితులైన రాజేందర్ సింగ్ సలూజా, అమృత సింగ్ సలూజా, దినేశ్ పరారీలో ఉన్నారు. -
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి
సాక్షి,హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డా బీటెక్ విద్యార్థి జాన్ పట్టుబడ్డాడు. పోలీసుల తనిఖీల్లో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జాన్ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను గుర్తించారు. డ్రగ్ ఎండీఎఏను గ్రాము రూ. 2500కు కొనుగోలు చేసి రూ.5వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. జాన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్ లో సింథటిక్ డ్రగ్స్
-
డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా!
సాక్షి, సిటీబ్యూరో: సోషల్మీడియా ద్వారా సంప్రదింపులు... యూపీఐ యాప్స్ ద్వారా నగదు చెల్లింపులు.. డెడ్ డ్రాప్ విధానంలో సరుకు డెలివరీ... బెంగళూరు కేంద్రంగా ఈ పంథాలో వ్యవస్థీకృతంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు చెక్ చెప్పారు. రెండు ముఠాలకు చెందిన ఐదుగురిని పట్టుకున్నామని, నలుగురిని అరెస్టు చేసి, మరొకరిని అతడి దేశానికి డిపోర్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కొత్వాల్ సీవీ ఆనంద్ తెలిపారు. టాస్్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్రతో కలిసి శుక్రవారం బంజారాహిల్స్లోని టీజీ సీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెంగళూరు నుంచి నగరంలో ‘వ్యాపారం’... నైజీరియాకు చెందిన యాకూబ్ అలియాస్ కుర్బా కొన్నేళ్ల క్రితం స్టడీ వీసాపై నగరానికి వచ్చాడు. సైనిక్పురి, టోలిచౌకీ ప్రాంతాల్లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తూ పోలీసులకు మూడుసార్లు చిక్కాడు. ఇతడిపై కుషాయిగూడ, ఫలక్నుమ, రాజేంద్రనగర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పోలీసు నిఘా తప్పించుకోవడానికి తన మకాం బెంగళూరుకు మార్చాడు. అక్కడి నుంచే డ్రగ్స్ దందా చేస్తున్నాడు. 2016లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి వచి్చన అబ్దుల్ రెహా్మన్ ఉస్మాన్ ఇంగ్లిష్ కోర్సు చేసి తిరిగి వెళ్లాడు. 2018లో నాలుగేళ్ల వీసాపై వచ్చి ఉత్తరప్రదేశ్లో బీసీఏ కోర్సులో చేరి... కరోనా సమయంలో స్వదేశానికి వెళ్లాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ వచి్చన అతను కోర్సు పూర్తి చేసి సిటీకి వచ్చాడు. టోలిచౌకి ఉంటూ జల్సాల కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. ఆ ఐదుగురికీ డెలివరీ బాయ్గా... ఇతడికి బెంగళూరులో స్థిరపడిన యాకూబ్తో పాటు నైజీరియా, టాంజానియా నుంచి వచ్చి అక్కడ ఉంటున్న రోమియో, గడాఫీ, జాన్పాల్, కేరళ వాసి జాకబ్లతో ఆన్లైన్లో పరిచయమైంది. వీరు ఐదుగురూ హైదరాబాద్లో ఉన్న డ్రగ్ వినియోగదారులతో సోషల్మీడియా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారు. బేరం కుదిరిన తర్వాత ఆ మొత్తాన్ని కస్టమర్ యూపీఐ ద్వారా చెల్లిస్తారు. ఇందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు కూడా డమ్మీ వ్యక్తులవే అయి ఉంటున్నాయి. ఆపై వారు ఇక్కడకు రావడం ద్వారా లేదా ఉస్మాన్ను బెంగళూరు పిలిపించడం ద్వారా సరుకు నగరానికి చేరుతుంది. ప్రధానంగా రోడ్డు మార్గంలోనే మాదకద్రవ్యాలను నగరానికి తీసుకు వస్తున్నారు. కస్టమర్, డెలివరీ బాయ్ నగరంలోనే ఉన్నప్పటికీ వీరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. సీఓడీ విధానంలోనూ మరో ముఠా..బెంగళూరు కేంద్రంగానే పని చేస్తున్న మరో ముఠా డెడ్ డ్రాప్తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) విధానంలో డ్రగ్స్ సరఫరా చేస్తోంది. బంజారాహిల్స్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ డ్రగ్స్కు బానిసయ్యాడు. కుటుంబీకులు ఓ రీహాబ్ సెంటర్లో చేర్చినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కారు డ్రైవర్గా పని చేస్తూ డ్రగ్స్ దందాలోకి దిగిన అతను ఈ ఏడాది ఫిబ్రవరిలో నాంపల్లి పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి వచి్చన తర్వాత టోలిచౌకీలో కుటుంబానికి దూరంగా నివసిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన చుక్వా ఒబైయ్ డెడ్ డ్రాప్ ద్వారా కేరళ నుంచి వచ్చి బెంగళూరులో ఉంటున్న నందకుమార్ను డ్రగ్స్ అందిస్తాడు. ఇవి ఇతడి నుంచి చందానగర్కు చెందిన నవీన్కు చేరుతున్నాయి. అతడి నుంచి లేదా ఒక్కోసారి నేరుగా బెంగళూరు వెళ్లడం ద్వారా ఇమ్రాన్ ఈ సరుకు తీసుకువస్తున్నాడు. ఆపై డెడ్ డ్రాప్ లేదా సీఓడీ విధానంలో కస్టమర్లకు అందిస్తున్నాడు. నలుగురి అరెస్టు.. ఈ రెండు గ్యాంగ్లపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, జీఎస్ డానియేల్, ఎస్సై సి.వెంకట రాములు తమ బృందాలతో రంగంలోకి దిగారు. దాదాపు నెల రోజులు నిఘా ఉంచి ఉస్మాన్, యాకూబ్, నందకుమార్, మహ్మద్ ఇమ్రాన్, నవీన్లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షల విలువైన ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బోల్డ్స్తో పాటు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. మిగిలిన నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు యాకూబ్ను అతడి దేశానికి డిపోర్టేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరి నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్ల ద్వారా ఈ నెట్వర్క్లోని ప్రధాన సూత్రధారులు, తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కస్టమర్ల పాత్రను బట్టి రీహాబ్కు తరలించడం లేదా అరెస్టు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఫొటో, లోకేషన్ షేర్ చేయడం ద్వారా... ఈ డ్రగ్ను డెలివరీ బాయ్ ఉస్మాన్ డెడ్ డ్రాప్ విధానంలో కస్టమర్కు చేరుస్తాడు. బహిరంగ ప్రదేశంలో ఎవరికీ అనుమానం రాని ప్రాంతంలో డ్రగ్ ప్యాకెట్ను ఉంచుతాడు. ఎండ, వానల వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్యాక్ చేస్తాడు. దీని ఫొటో, లోకేషన్ను వాట్సాప్ ద్వారా బెంగళూరులోని సప్లయర్కు పంపిస్తాడు. అతడు ఇదే సమాచారం కస్టమర్కు షేర్ చేస్తాడు. వీటి ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్లే కస్టమర్ ఆ సరుకు తీసుకుంటాడు. దీనినే డెడ్ డ్రాప్ విధానం అని పిలుస్తుంటారు. డెడ్ డ్రాప్ చేయడానికి డెలివరీ బాయ్ ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు, పాన్ డబ్బాలు, మెట్రో పిల్లర్లు తదితరాలను ఎంచుకుంటున్నారు. పెడ్లర్స్, సప్లయర్స్ ఇలా తాము సంపాదించిన మొత్తంలో 30 నుంచి 40 శాతం డెలివరీ బాయ్కు చెల్లిస్తారు. -
డ్రగ్స్ దందాలో టీవీ చానల్ అధినేత
సాక్షి, హైదరాబాద్: ఆయనో మీడియా అధినేత.. తండ్రి స్థాపించిన టీవీ చానల్ నిర్వహణ పగ్గాలు వారసత్వంగా పొందారు. గతంలోనే పలు వివాదాలు ఆయన్ను చుట్టుముట్టగా, ఇటీవల ఓ ‘సొసైటీ’ వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర వివాదాస్పదమైంది. తాజాగా ఆయనకు సంబంధించిన మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు, అనుమానితులతో సదరు న్యూస్ చానల్ యజమానికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 15 మంది డ్రగ్స్ వినియోగదారులు, అనుమానితులతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు పోలీసులకు ఆధారాలు లభించడంతో పటిష్ట నిఘా వేసి ఉంచారు. కొన్నాళ్లుగా పరిశీలిస్తున్న పోలీసులు రాష్ట్ర పోలీసు విభాగం కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఒకప్పుడు ఏదైనా కేసులో దొరికిన డ్రగ్ పెడ్లర్ వద్దే దర్యాప్తు, విచారణ ఆగిపోయేది. తద్వారా మాదకద్రవ్యాల దందాకు కళ్లెం పడట్లేదని భావించిన పోలీసు విభాగం కొత్త పంథా అనుసరించడం మొదలెట్టింది. డ్రగ్స్ విక్రేతలు, ఖరీదు చేసే వారితో పాటు అనుమానితులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సైతం సమకూర్చుకుంది. ఏదైనా ఓ కేసులో డ్రగ్ సప్లయర్, పెడ్లర్, కన్జ్యూమర్లతో పాటు వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను ఆద్యంతం పరిశీలిస్తోంది. ఆయా వివరాలతో ప్రత్యేకంగా డేటాబేస్ సైతం రూపొందిస్తోంది. దాన్ని కేంద్రం ఆ«దీనంలోని క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ అండ్ ట్రాకింగ్ సిస్టంతో (సీసీటీఎన్ఎస్) అనుసంధానించింది. ఓ కేసు దర్యాప్తులో దొరికిన తీగ పోలీసు విభాగం కొన్నాళ్ల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ డ్రగ్ వినియోగదారుడికి సంబంధించిన కాల్డేటాలో సదరు మీడియా సంస్థ అధినేత వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వినియోగదారుడితో ఈయన సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో పోలీసులు మరికొంత లోతుగా ఆరా తీశారు. దీంతో ఆయనకు ఈ డ్రగ్ వినియోగదారుడితో పాటు మరో రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న 14 మందితో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో డ్రగ్స్ వినియోగదారులతో పాటు ఆ కేసుల్లో అనుమానితులు సైతం ఉన్నారు. కొందరితో చాలా కాలంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారని తెలిసింది. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్లు సైతం ఉండటం గమనార్హం. కదలికలపై కన్ను డ్రగ్స్ దందా చేస్తున్న వారితో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిలో ప్రముఖులు కూడా ఉంటున్నారు. ఉన్నత కుటుంబాల్లో ఈ జాఢ్యం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఈ వర్గాల్లో పెరిగిన డిమాండ్తోనే సింథటిక్ డ్రగ్స్ దందా జోరందుకుంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఇటీవలి కాలంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ మీడియా సంస్థ అధినేతకే మాదకద్రవ్యాల వినియోగదారుడు, ఆ కేసుల్లో అనుమానితులతో సంబంధాలు ఉన్నట్టుగా తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు ఆ జాబితాలోని వారిపై నిఘా ఉంచడంతో పాటు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 2011 నుంచి సంబంధాలు మీడియా ఛానల్ అధినేతకు, మాదకద్రవ్యాల కేసుల్లో అనుమానితులు, వినియోగదారులుగా ఉన్న వారి మధ్య జరిగిన సంప్రదింపులు భారీ స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మందితో 2,500 కాల్స్ ఉన్నట్లు తెలిసింది. వీటిలో అత్యధికం ఇన్కమింగ్ కాల్స్ కాగా ఎస్సెమ్మెస్ల్లో మాత్రం ఎక్కువగా ఔట్ గోయింగ్ ఉన్నాయి. వీరిలో కొందరితో ఆయన 2011 నుంచి సంబంధాలు కలిగి ఉండటం గమనార్హం. వారి మధ్య వందల నిమిషాల సేపు సంప్రదింపులు జరిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితోనూ కాల్స్, ఎస్సెమ్మెస్లు ఉండటంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. -
యువ సంగీత కెరటం లియాం పెనీ హఠాన్మరణం
బ్యూనస్ ఎయిర్(అర్జెంటీనా): బ్రిటన్ సంగీత సంచలనం, పాప్ గాయకుడు, గేయ రచయిత 31 ఏళ్ల లియాం పెనీ కన్నుమూశారు. బుధవారం సాయంత్రం అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్ సిటీలోని ఒక విలాసవంత హోటల్ మూడో అంతస్థు బాల్కనీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మద్యం, మత్తుపదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల హోటల్ గది అంతా చిందరవందర చేసి కిందపడి చనిపోయారని వార్తలొచ్చాయి. పోస్ట్మార్టమ్ నివేదిక తర్వాతే మరణానికి కారణాలు తెలిసే వీలుంది. ఆయన బస చేసిన కాసాసర్ హోటల్ గదిలో మద్యంతోపాటు బెంజోడైజీపైన్ అనే ఔషధంను కనుగొన్నారు. బెంజోడైజీపైన్ను ఉద్రేకాన్ని తగ్గించేందుకు, మూర్ఛ, నరాల సంబంధ చికిత్సల్లో వాడతారు. పెనీ తన గది బాల్కనీ నుంచి దూకి ఉంటారని నగర భద్రతా మంత్రి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పాబ్లో పోలీసీచియో మీడియాతో చెప్పారు. 14 ఏళ్లకే సంచలనం 2010లో బ్రిటన్ ప్రఖ్యాత టాలెంట్ రియాలిటీ షో ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టి అద్భుతంగా పాటి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. మరో నలుగురితో కలిసి ‘వన్ డైరెక్షన్’పేరిట బాయ్బ్యాండ్ను నెలకొల్పాడు. ఈ బ్యాండ్ నుంచి వెలువడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. 7 కోట్ల ‘రికార్డ్’లు అమ్ముడుపోయాయి. 2016లో బ్యాండ్ నుంచి విడిపోయాక సోలోగా కెరీర్ను మొదలుపెట్టి సంచలనాలు సృష్టించారు. ఈయన చేసిన సంగీత విభావరిలు సైతం పెద్ద హిట్ అయ్యా యి. సొంత ఆల్బమ్స్ లక్షల్లో అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో వీటిని దాదాపు 390 కోట్ల సార్లు చూశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మద్యపానంతో ఇబ్బంది పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. గత ఏడాది మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక ‘టియర్డ్రాప్స్’ పాట అందర్నీ నిరాశపరిచింది. -
కుటుంబసభ్యులే గూఢచారులు!
హైదరాబాద్లో డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్కు బానిసయ్యాడు. మత్తు ఇంజక్షన్ కావాలని రోజుకు రూ.500 ఇవ్వాలంటూ తల్లిదండ్రులను వేధించేవాడు. ఎన్నిసార్లు వద్దని వారించినా వినిపించుకోకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు.చివరకు ఆ యువకుడి తల్లిదండ్రులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.దీంతో యువకుడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులువిచారించగా, ఈ మత్తుఇంజక్షన్లను బిహార్ నుంచికొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్టు చెప్పాడు. లావాదేవీలు, కొరియర్లపై నిఘా పెట్టినపోలీసులు ఆ నెట్వర్క్నుబ్రేక్ చేసి స్థానిక పోలీసులకుఅప్పగించారు. సాక్షి, హైదరాబాద్: మాదక ద్రవ్యాల నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు తపన పడుతున్నారు. కుటుంబసభ్యులే పోలీసులకు గూఢచారులుగా మారుతున్నారు. మాదక ద్రవ్యాల బాధిత కుటుంబసభ్యులను విశ్వసిస్తున్న పోలీసులు, వారి సమాచారంపై నిఘా పెట్టి డ్రగ్స్ పెడ్లర్లు, నెట్వర్క్ల ఆట కట్టిస్తున్నారు. డీ–అడిక్షన్ సెంటర్లకు.. మత్తు మహమ్మారి నుంచి తమ పిల్లలను బయటపడేసి, వారిని మాములు మనుషులుగా మార్చాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. డ్రగ్స్కు బానిసలుగా మారుతున్న తమ పిల్లలు ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకోవడమే కాకుండా నిత్యం తల్లిదండ్రులకు ఇంట్లో నరకం చూపిస్తున్నారు. గత నెల రోజుల్లో 20కు పైగా కుటుంబసభ్యులు తమ పిల్లల ప్రవర్తన గురించి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్)కు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, వారికి మాదక ద్రవ్యాల గుర్తింపు కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొంతమంది దగ్గర డ్రగ్స్, గంజాయి దొరకగా.. మరికొందరిలో డ్రగ్స్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలింది. మత్తుపదార్థాలు దొరికిన వారికి వినియోగదారుల కింద కేసులు నమోదు చేసి వారిని డీ–అడిక్షన్ కేంద్రాలకు పంపించారు. ఇలా కుటుంబ సభ్యుల నుంచి రోజుకు 3–5 కాల్స్ వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలను తరిమికొట్టాలని ఇటీవల ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో సినీ హీరోలు, సెలబ్రిటీలతో లఘు చిత్రాలు చిత్రీకరించారు. జూనియర్ ఎనీ్టఆర్ రిలీజ్ చేసిన ఓ వీడియోకు ఒక్క రోజే 3.75 లక్షలు, మెగాస్టార్ చిరంజీవి వీడియోకు లక్షల్లో వ్యూస్ రావడం గమనార్హం. -
టీనేజీలోనే గంజాయి
సాక్షి, హైదరాబాద్: గంజాయి, మద్యం, సిగరెట్, డ్రగ్స్ వినియోగం, వాటికి బానిసలై పోవడం సాధారణంగా యువకులు, పెద్దల్లోనే చూస్తుంటాం. కానీ టీనేజ్ పిల్లలు కూడా ఈ చెడు అలవాట్లకు ఎక్కువగా లోనవుతున్నారట. ఆ మాటకొస్తే పిల్లల్లో ఎక్కువ శాతం గంజాయి సేవిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మానసిక రుగ్మతల కారణంగా టీనేజీ పిల్లలు ఈ వ్యసనాల బారిన పడుతుండటం. మానసిక సమస్యలు కూడా పెద్దవారికే అధికంగా ఉంటాయని అనుకుంటాం. కానీ పెద్ద వయస్సు వారికంటే యువతీ యువకుల్లోనే మానసిక రుగ్మతలు అధికంగా ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)లు తేలి్చచెప్పాయి.‘యువకులు, చిన్న పిల్లల మానసిక ఆరోగ్యంపై మార్గదర్శకత్వం’పేరుతో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ తాజాగా ఓ నివేదిక విడుదల చేశాయి. ఐదేళ్ల నుంచి 24 ఏళ్లలోపు వారికి సంబంధించిన మానసిక సమస్యలపై పలు ఆసక్తికర అంశాలను పొందుపరిచాయి. మానసిక రుగ్మతల నుంచి టీనేజీ పిల్లలను రక్షించాలంటే చట్టాలు సరిగా ఉండాలని, సామాజిక భద్రత..ఆర్థిక భరోసా ఉండాలని, మౌలిక సదుపాయాలు కలి్పంచాలని సూచించాయి. నివేదికలో ఏముందంటే.. పెద్దలు తట్టుకుంటారు.. పిల్లలు కుంగిపోతారు మూడో వంతు మానసిక సమస్యలు 14 ఏళ్లలోపే మొదలవుతాయి. అందులో సగం 10 ఏళ్లలోపే ప్రారంభం అవుతాయి. 15–19 ఏళ్ల వయస్సు బాల బాలికల్లో మద్యం తాగేవారు 22 శాతం ఉన్నారు. అలాగే పెద్దల కంటే టీనేజీ పిల్లల్లోనే గంజాయి వాడకం ఎక్కువగా ఉంది. ఆ వయస్సు వారిలో 5.5 శాతం మంది టీనేజీ పిల్లలు గంజాయి తాగుతున్నారు. ఆ వయస్సులోనే మద్యం, డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు. 13–19 ఏళ్ల మధ్య వయస్సులోని టీనేజీ పిల్లల్లో ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక రుగ్మత ఉంది. పెద్ద వారు మానసిక సమస్యలను తట్టుకోగలరు. కానీ చిన్న పిల్లలు తట్టుకోలేరు. చదువు, కెరీర్ వంటివి వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. 15–19 మధ్య వయస్సు వారిలో మానసిక సమస్యలు అత్యధికంగా 15 శాతం ఉండటం గమనార్హం. ఆ వయస్సులో చదువు కీలకమైన దశలో ఉంటుంది. కెరీర్ను నిర్ణయించుకునే దశ, ప్రేమలు, ఆకర్షణలు వంటివివారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆ వయస్సువారే వివిధ మానసిక కారణాల వల్ల నేరస్థులుగా మారుతున్నారు. ఆత్మహత్యలూ 15–24 ఏళ్లలోపు వారిలోనే అధికంగా ఉంటున్నాయి. అందులో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. బాలికలు ఎక్కువగా భావోద్వేగపరమైన ఒత్తిడికి (ఎమోషనల్ డిస్టర్బెన్స్) గురవుతుంటారు. పిల్లల్లో కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వంటివి కూడా మానసిక రుగ్మతకు సంబంధించిన అంశాలే. పెద్దవారిలో డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి కీలకంగా ఉంటాయి. అతిగా తినడమూ, తక్కువ తినడమూ మానసిక వ్యాధి లక్షణాలే. 40 ఏళ్లలోపు వరకు మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. 70 ఏళ్లు పైబడిన వారిలో మతిమరుపు వస్తుంది. ఏ వయస్సు వారిలో మానసిక రుగ్మతలు ఎంత శాతం అంటే.. ⇒ 5–9 మధ్య వయస్సు వారిలో 8 శాతం ⇒ 10–14 ఏళ్లు 15 శాతం ⇒ 15–19 ఏళ్లు 15 శాతం ⇒ 20–24 ఏళ్లు 14 శాతం ⇒ 25–29 ఏళ్లు 13 శాతం ⇒ 30–34 ఏళ్లు 12 శాతం ⇒ 35–39 ఏళ్లు 11 శాతం ⇒ 40–44 ఏళ్లు 9 శాతం ⇒ 45–49 ఏళ్లు 7 శాతం ⇒ 50–54 ఏళ్లు 6 శాతం ⇒ 55–59 ఏళ్లు 5 శాతం ⇒ 60–64 ఏళ్లు 3 శాతం ⇒ 65–69 ఏళ్లు 3 శాతం ⇒ 70 ఏళ్లకు పైబడి 2 శాతం ప్రాథమిక ఆరోగ్యంలో ఇది భాగం కావాలి లింగ భేదాలు కూడా మానసిక సమస్యలకు కారణంగా ఉంటున్నాయని ఆ నివేదిక తేలి్చంది. పురుషులు కుటుంబ బాధ్యతలు, అనేక ఇతర సమస్యలతో మద్యానికి బానిసలవుతున్నారు. అలాగే బయటకు చెప్పలేని పరిస్థితులూ ఉంటున్నాయి. ఉద్యోగం, ఉపాధి, ఆర్థికంగా నిలదొక్కుకోవడం వంటివి ఇబ్బందికి గురిచేస్తాయి. మానసిక రుగ్మతలకు వైద్యం చేసే పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రాథమిక ఆరోగ్యంలో కలపాలి. ప్రస్తుతం ప్రాథమిక, జిల్లా ఆసుపత్రుల్లో మానసిక సమస్యలకు సంబంధించిన వైద్యులు లేకపోవడాన్ని నివేదిక ఎత్తి చూపింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యంపై ఆయా దేశాల బడ్జెట్లలో కేవలం 0.1 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. 80 శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యంపై ఒక ప్రత్యేక వ్యవస్థ అనేది లేనేలేదు. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రొఫెసర్ అనెస్థీíÙయా, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..⇒ టీనేజీ పిల్లలు బయటి పరిస్థితులు, ఇంటి పరిస్థితులకు మధ్య ఘర్షణతో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ⇒ 5–9 ఏళ్ల పిల్లలపై స్నేహితులు, తల్లిదండ్రులు పెంచే విధానం, స్కూలు, పరిసరాల ప్రభావం ఉంటుంది. ⇒ ఆర్థిక, సామాజిక, లింగపరమైన అసమాన త్వం, సామాజిక బహిష్కరణ వంటి వాటి వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ⇒ పేదరికం, యుద్ధ వాతావరణంలో ఉండే పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో తల్లి మద్యానికి బానిసైతే పుట్టే పిల్లల్లో మానసిక సమస్యలు రావొచ్చు. ⇒ తల్లిదండ్రులకు మానసిక సమస్యలుండటం, తల్లిదండ్రులు..కుటుంబ కలహాలు, తల్లిదండ్రులు విడిపోవడం, పిల్లలను హాస్టళ్లలో చేర్చ డం వంటివి కూడా ప్రభావితం చేస్తున్నాయి. ⇒ మానసిక రుగ్మతకు గురైన వారికి త్వరగా చికిత్స చేస్తే పెద్దయ్యేసరికి మొండిజబ్బుగా మారకుండా చూసుకోవచ్చు. ⇒ కరోనా సమయంలో అన్ని వయస్సుల వారిలో మానసిక వ్యాధులు 25 శాతం పెరిగాయి. ఉద్యోగాలు పోవడం, చదువు మధ్యలో ఆపేయడం, ఆప్తుల్ని కోల్పోవడం, ఆసుపత్రుల పాలు కావడం లాంటి అనేక కారణాలతో మానసిక సమస్యలు పెరిగాయి. -
డ్రగ్స్ సరఫరాపై కఠినంగా వ్యవహరించండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా ముఠా లపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో గురువారం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధి కారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ చార్జి సందీప్ శాండిల్యతోపాటు పలువురు పోలీ సు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ....రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాల ను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫ రా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశా లు జారీ చేశారు.రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూ రో పకడ్బందీగా వ్యవహరించి డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నుంచి సిబ్బందిని అదనంగా బ్యూరోకి కేటాయిస్తామని తెలిపారు. విదేశీయులెవరైనా డ్రగ్ వ్యవహారాల్లో తల దూర్చితే వారిని తిరిగి వారి దేశాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ...నిందితులను పట్టుకోవడంతోపాటు వారికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పించాలని సూచించారు. అదనపు సిబ్బందిని కేటాయించడం పట్ల సందీప్ శాండిల్య సంతోషం వ్యక్తం చేశారు.నూతన నేర చట్టాలను పకడ్బందీగాఅమలు చేసేందుకు చర్యలు తీసు కో వాలని డీజీపీ జితేందర్ సూచించారు. క్షేత్రస్థాయి లో నూతన నేర చట్టాల అమలుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డీజీపీ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఐడీ డీజీ శిఖాగోయెల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్భగవత్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో రూ. 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఢిల్లీ: ఢిల్లీలోని రమేష్ నగర్లో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. గురవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 200 కిలోల కొకైన్ను పట్టుబడింది. పట్టుబడిన కొకైన్ విలువ రూ. 2 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. వారం రోజుల్లో ఇప్పటివరకు సుమారు 7 వేల కోట్ల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.ఢిల్లీ స్పెషల్ పోలీసులు జీపీఎస్ ద్వారా డ్రగ్స్ సరఫరాదారుని ట్రాక్ చేసి.. పశ్చిమ ఢిల్లీలోని రమేష్ నగర్లో ఓ వ్యక్తిని పట్టుకున్నారు. నిందితులు లండన్కు పరార్ అయినట్లు తెలిపారు. అక్కడ లభించిన డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల్లో రూ. 7,500 కోట్ల విలువైన 762 కిలోల డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఇక.. గత వారం ఢిల్లీలో 500 కిలోల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలో దాడులు చేసి.. డ్రగ్స్తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. పంజాబ్లోని అమృత్సర్లోని విమానాశ్రయంలో జస్సీ అలియాస్ జితేంద్ర పాల్ సింగ్ను స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అతను లండన్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వీరికి దేశంలోని పలు నేరాలు, అక్రమ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న పాన్ ఇండియా నెట్వర్క్కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. -
రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ పట్టివేత
-
డ్రగ్స్కు హబ్గా గుజరాత్: తమిళనాడు మంత్రి
అహ్మదాబాద్:గుజరాత్పై తమిళనాడు మంత్రి రేగుపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే గుజరాత్ డ్రగ్స్కు హబ్గా మారిందన్నారు.డ్రగ్స్ రవాణాను అదుపు చేయడంలో తమిళనాడు పోలీసులు విఫలమయ్యారన్న గవర్నర్ రవి వ్యాఖ్యలకు కౌంటర్గా రేగుపతి ఈ వ్యాఖ్యలు చేశారు.గవర్నర్కు గుజరాత్ కనిపించడం లేదా ప్రశ్నించారు.నిజానిజాలు తెలియకుండా తమిళనాడు గురించి గవర్నర్ మాట్లాడుతున్నారన్నారు.అసలు గవర్నర్కు డ్రగ్స్ కేసులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అన్నాడీఎంకే నేతలను డ్రగ్స్ కేసుల్లో విచారించేందుకుగాను అనుమతివ్వడానికి ఏడాదికిపైగా సమయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాతే డ్రగ్స్ను కట్టడి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ఇదీ చదవండి: జిలేబీ నచ్చిందా నాయనా -
రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి సుమారు 1,814 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటీఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఢిల్లీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్, వాటి తయారికి ఉపయోగించే ముడిసరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారని గుజరాత్ హోం సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.Kudos to Gujarat ATS and NCB (Ops), Delhi, for a massive win in the fight against drugs!Recently, they raided a factory in Bhopal and seized MD and materials used to manufacture MD, with a staggering total value of ₹1814 crores!This achievement showcases the tireless efforts… pic.twitter.com/BANCZJDSsA— Harsh Sanghavi (@sanghaviharsh) October 6, 2024‘‘డ్రగ్స్పై పోరాటంలో భారీ విజయం సాధించిన గుజరాత్ ఏటీఎస్ , ఎన్సీబీ, ఢిల్లీ అధికారులకు అభినందనలు.వీరు భోపాల్లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, ఎండీ, ఎండీ డ్రగ్స్ తయారీకి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ రూ. 1814 కోట్లు ఉంటుందని అంచనా. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. సమాజ ఆరోగ్యం, భద్రతను కాపాడటంలో వారి ప్రయత్నం చాలా కీలకం. చట్టాన్ని అమలు చేసే సంస్థల అంకితభావం నిజంగా అభినందయం. భారతదేశాన్ని సురక్షితమైన, ఆరోగ్యకరమైన దేశంగా మార్చే వారి మిషన్కు మద్దతునిస్తూనే ఉందాం’’ అని అన్నారు.చదవండి: ఆపరేషన్ తోడేలు సక్సెస్.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు -
5 వేల కోట్ల డ్రగ్స్ రాకెట్.. కాంగ్రెస్పై అమిత్ షా ధ్వజం
న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోనే పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. దేశంలోని యువతను డ్రగ్స్తో నిండిన చీకటి ప్రపంచంలోకి కాంగ్రెస్ నడిపిస్తోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రభుత్వం డ్రగ్స్పై ‘జీరో టాలరెన్స్’ విధానానికి కట్టుబడి ఉందని తెలిపారు. యువతను విద్య, క్రీడలు ఆవిష్కరణల వైపు నడిపించేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ తన రాజకీయ పరపతిని ఉపయోగించుకొని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. ‘మాదక ద్రవ్య రహిత భారత్’ కోసం మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్న వేళ.. ఢిల్లో స్వాధీనం చేసుకున్న రూ. 5,600 కోట్ల మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ కాంగ్రెస్ నేత ప్రమేయం ఉండటం అత్యంత ప్రమాదకరం. సిగ్గుచేటు’ అని షా పేర్కొన్నారు.एक ओर जहाँ मोदी सरकार 'नशामुक्त भारत' के लिए जीरो टॉलरेंस की नीति अपना रही है, वहीं उत्तर भारत से पकड़ी गई ड्रग्स की ₹5,600 करोड़ की खेप में कांग्रेस के एक प्रमुख व्यक्ति की संलिप्तता बेहद खतरनाक और शर्मनाक है।कांग्रेस के शासन में ड्रग्स से पंजाब, हरियाणा और समग्र उत्तर भारत…— Amit Shah (@AmitShah) October 4, 2024కాంగ్రెస్ హయాంలో పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో యువతపై డ్రగ్స్ ప్రభావం చూపిందని విమర్శించారు.యువతను మళ్లీ డ్రగ్స్ ప్రపంచంలోకి లాగేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదే మోదీ ప్రభుత్వం యువతను క్రీడలు, విద్య, ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి యువతను డ్రగ్స్ ఊబిలోకి నెట్టడం దారుణమన్నారు. దీనిని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ జరగనివ్వదని, రాజకీయాలతో సంబంధం లేకుండా డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని షా అన్నారు.అయితే తుషార్ గోయల్తో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఖండించింది. అయినప్పటికీ ఆయన గతంలో 2022 వరకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్కు ఆర్టీఐ సెల్ చైర్మన్గా పనిచేశాడనిఅధికారుల విచారణలో అంగీకరించాడు. సోషల్ మీడియాలో డిక్కీ గోయల్ పేరుతో అతడు లోక్సభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్తోతో సహా పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలతో దిగిన ఫోటోలను పోస్టు చేసినట్లు అధికారులు గుర్తించారు. -
మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం
-
దయచేసి ఆ ఒక్క తప్పు చేయకండి!
-
రండి.. నాతో చేతులు కలపండి.. యూత్కి ఎన్టీఆర్ పిలుపు
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విటర్)లో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.‘మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమే, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమో మాదక ద్రవ్యాలపై ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నింటికంటే విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111 సమాచారం అందించండి ’అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. (చదవండి: ‘ఆచార్య’ ఫలితం తర్వాత చిరంజీవీ మెసేజ్ చేశాడు...‘దేవర’ మార్పులు చేశా: కొరటాల)కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్లో రేవంత్ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కూడా దేవర సినిమా రిలీజ్కి రెండు రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు. ఇక దేవర విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ ప్లే చేశాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Telangana Anti Narcotics Bureau (@telanganaantinarcoticsbureau) -
అమ్మే దిగివస్తే మత్తు దిగదా..
పంజాబ్లో హెరాయిన్ని ‘చిట్టా’ అంటారు. దీని అడిక్షన్లో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ను వ్యతిరేకించడానికి నేడు తల్లులే రంగంలోకి దిగారు. పంజాబ్లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ మొదలైంది. నిజానికి ఇది ప్రతి రాష్ట్రంలో జరగాలి. డ్రగ్స్ నీడ లేని ఇల్లే సమాజానికి వెలుగు.పంజాబ్లో ‘డ్రగ్స్’ మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రకృతిలోని మహమ్మారికి మందు ఉంది వాక్సిన్లు ఉన్నాయి... కాని ఈ మహమ్మారికి మందు లేదు. దీనిని నివారించాలంటే మానవశక్తి కావాలి. మహా శక్తి కావాలి. ఆ శక్తి తల్లే తప్ప మరెవరూ కాలేరని పంజాబ్లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమం మొదలైంది. ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ అనే సంస్థ సెప్టెంబర్ 15న హోషియార్పూర్లో ఈ ఉద్యమం మొదలెట్టింది. ఈ కార్యక్రమానికి తల్లులు భారీగా తరలి వచ్చారు. పిల్లలు వ్యసనాల బారిన పడితే కడుపుకోతకు గురయ్యేది మొదట తల్లులే. పిల్లల్ని కాపాడుకోవాల్సింది మొదట వారే.13 నుంచి 18 ఏళ్ల మధ్యలోపిల్లల వయసు 13 నుంచి 18 ఏళ్ల మధ్య వరకు తల్లులు వారిని జాగ్రత్తగా గమనించుకుంటే డ్రగ్స్ నుంచి కాపాడుకోవచ్చని ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ స్థాపకుడు, రచయిత కుష్వంత్ సింగ్ అన్నాడు. పంజాబ్లోని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఆయన ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమానికి అంకురార్పణ చేశాడు. ‘పంజాబ్లో 13 నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లలు డ్రగ్స్కు పరిచయం అవుతున్నారు. 14 నుంచి 24 ఏళ్ల మధ్య వీళ్లు అడిక్ట్స్గా మారుతున్నారు. వీరిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్స్లో పడేస్తే మారే వారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు. అంటే డ్రగ్స్ బానిసత్వం ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి’ అన్నాడాయన. ‘పంజాబ్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా గత సంవత్సరం చండీగఢ్ నుంచి భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్ వరకూ పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఎందరో తల్లులు వచ్చి మా పిల్లలు బాగుపడే మార్గం లేదా అని అడిగేవారు. తల్లులే మొదటి రక్షకులుగా మారితే పిల్లలను డ్రగ్స్వైపు వెళ్లకుండా ఆపొచ్చని నాకు అనిపించింది. దాని ఫలితమే ఈ ఉద్యమం’ అని తెలిపాడతడు.మంచాలకు సంకెళ్లుపంజాబ్లో హెరాయిన్ వ్యసనపరులు లెక్కకు మించి ఉన్నారు. దీనిని అక్కడ ‘చిట్టా’ అంటారు. దాని కోసం పిల్లలు ఎంతకైనా తెగిస్తారు. వారిని డ్రగ్స్ కోసం వెళ్లకుండా ఉంచేందుకు తల్లిదండ్రులు మంచాలకు సంకెళ్లు వేసి కట్టేసి ఉంచడం సర్వసాధారణం. పంజాబ్లో కొన్ని ఊళ్లు డ్రగ్స్ వల్ల చని΄ోయిన వ్యక్తుల భార్యలతో నిండి ‘వితంతువుల పల్లెలు’గా పేరు పడటం సమస్య తీవ్రతను తెలుపుతుంది.తల్లులకు ట్రైనింగ్ ఇస్తేమదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్ ఉద్యమంలో తల్లులను ఒకచోట చేర్చి డ్రగ్స్ గురించి అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన గౌరవ్ గిల్ అనే బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ డ్రగ్స్కు అలవాటు పడుతున్నవారి శారీరక కదలికలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ సందర్భంగా తల్లులకు తెలియచేసి పిల్లల్లో ఈ మార్పు చూడగానే అలెర్ట్ అవ్వాలని కోరాడు. ‘తొలి రోజుల్లోనే గమనిస్తే చాలా మేలు జరుగుతుంది. చాలాసార్లు పరిస్థితి చేయి దాటి ΄ోయాకే పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యారని తల్లిదండ్రులు గమనిస్తున్నారు’ అని అక్కడకు వచ్చిన ΄ోలీసు అధికారులు తెలిపారు. అందుకే ఈ ఉద్యమంలో డ్రగ్స్ కార్యకలాపాలు గమనించిన వెంటనే ΄ోలీసుల హెల్ప్లైన్కు ఎలా తెలపాలి, ΄ోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో తెలియచేస్తారు. ‘గ్రామీణ స్త్రీలకు ఈ శిక్షణ ఉంటే గ్రామాల్లో యువకులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోగలరు’ అంటున్నారు ఈ ఉద్యమ బాధ్యులు.ఎన్నో రకాలుమత్తు పదార్థాలంటే హెరాయిన్, గంజాయి మాత్రమే కాదు. వైటెనర్స్తో మొదలు దగ్గుమందు వరకు ఎన్నో ఉన్నాయి. డ్రగ్స్ చలామణి కోసం పంజాబ్లో దగ్గుమందు ముసుగులో ఫ్యాక్టరీలు తయారయ్యి ్రపాణాంతకస్థాయిలో దగ్గుమందులోని రసాయనాలను ఇంజెక్షన్లుగా ఎక్కించునే విధంగా తయారు చేస్తున్నారు. అంతేకాదు గ్రాము బరువుకు ఎక్కువ పొడి వచ్చే విధంగా తయారు చేయడంతో ఒక్క గ్రాముతో కూడా రోజు గడపొచ్చనుకుని అలవాటు పడుతున్నారు.ఏం చేయాలి?తల్లిదండ్రులు పిల్లలతో తరచూ సమయం గడపాలి. వారితో విహారాలు చేయాలి. ఆ సమయంలో వారి మనోభావాలు విని స్నేహాలు తెలుసుకోవాలి. చదువుల్లో మార్కులు తెలుసుకోవాలి. ప్రవర్తనను గమనించాలి. ఇవన్నీ ఏమాత్రం తేడా వున్న అనుమానించి ఆదుకోవాలి. ఈ స్పీడు యుగంలో ఎవరూ ఈ పని చేయడం లేదు. తల్లులకు తప్పదు. వారే రక్షకులు. అమ్మ వల్లే మారాను‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమంలో భాగంగా డ్రగ్స్ నుంచి బయటపడి సామాన్య జీవితం గడుపుతున్న వారి కథనాలు కూడా స్వయంగా వినిపించారు. ‘నేను డ్రగ్స్ నుంచి కేవలం మా అమ్మ వల్ల బయట పడ్డాను. ఒక దశలో హెరాయిన్ డోస్ కోసం 2 లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడలేదు. మా అమ్మ నా కోసం అనేక త్యాగాలు చేసి మామూలు మనిషిని చేసింది’ అని ఒకతను తెలిపాడు. -
గుడ్న్యూస్ అంటూ వీడియో రిలీజ్ చేసిన హేమ
బెంగళూరు రేవ్పార్టీ ఛార్జ్షీట్లో తన పేరు రావడంపై టాలీవుడ్ నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదన్నారు. బెంగళూరు పోలీసులు బ్లడ్ షాంపిల్స్ కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని హేమ ప్రకటించారు. అయితే,ఛార్జీషీట్లో తన పేరు ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు.డ్రగ్స్ తీసుకున్న హేమబెంగళూరు పోలీసులు మాత్రం నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారని మరోసారి ఛార్జ్షీట్ ద్వారా తెలిపారు. ఈ మేరకు 1086 పేజీలతో ఛార్జ్షీట్ను రెడీ చేసిన పోలీసులు కోర్టుకు అందించారు. హేమ ఫ్రెండ్ వాసు అనే వ్యక్తి ఆహ్వానించడం వల్లే ఆమె రేవ్ పార్టీకి వెళ్లినట్లు బెంగుళూరు పోలీసులు పేర్కొన్నారు.చార్జిషీట్లోనూ నెగెటివ్తాజాగా హేమ.. గుడ్న్యూస్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అఫీషియల్ చార్జిషీట్లోనూ నాకు నెగెటివ్ వచ్చిందని రాశారు. అనవసరంగా నాపై కొందరు నిందలు వేస్తున్నారు. నేను ఎవర్నీ వదిలిపెట్టను. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటాను అని వీడియోలో మాట్లాడారు. ఈ వీడియో కింద నెటిజన్లు ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా బాబూ అని కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
డ్రగ్స్ కేసులో ఉన్నావంటూ బెదిరించి...
పటాన్చెరు టౌన్: మలేసియాకు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నావు.. మనీలాండరింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్నావంటూ బెదిరించి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ. కోటి 58 లక్షల 47 వేలు కాజేశాడు ఓ సైబర్ నేరగాడు. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్చెరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఆగస్టు 29వ తేదీన అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వ చ్చి0ది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని, మీపై అక్రమ డ్రగ్స్ రవా ణా అలిగేషన్ ఉందని, అదేవిధంగా మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని బెదిరించారు. పేరు తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో బెదిరిపోయిన ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.. కోటి 58 లక్షల 47 వేలు పంపాడు. ఇంకా డబ్బులు వే యాలని ఒత్తిడి చేయడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
హైదరాబాద్లో ‘డేట్ డ్రగ్’
సాక్షి, హైదరాబాద్ : డేట్ డ్రగ్ ఎంఫెటమైన్ (8.5 కేజీలు) భారీస్థాయిలో పట్టుబడింది. దీనిని రేప్ డ్రగ్ అని కూడా అంటారు. డేటింగ్ పేరుతో యువతులను తీసుకెళ్లి వారికి తెలియకుండా వారు తాగే నీరు, కూల్డ్రింక్స్లో కలిపి ఇచ్చేసి అప స్మారక స్థితిలోకి చేరాక అఘాయిత్యాలకు పాల్పడటానికి కొందరు ఈ డ్రగ్ను వినియోగిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. డీసీపీలు సాధన రష్మి పెరుమాళ్, వైవీఎస్.సుధీంద్రలతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో హైదరాబాద్ సీపీ ఆ వివరాలు వెల్లడించారు. బౌరంపేటకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చంద్రారెడ్డి గార్డెన్స్ పేరుతో ఫంక్షన్హాల్, స్విమ్మింగ్ పూల్ నిర్వహించేవాడు. సాయికుమార్గౌడ్, రాకే‹శ్ కొన్నాళ్ల క్రితం ఫార్మా కంపెనీల్లో పనిచేశారు. వీరికి కెమికల్ ప్రాసెసింగ్పై పట్టు ఉంది. వీరితో కలిసి అల్ప్రాజోలం తయారు చేయాలని అంజిరెడ్డి పథకం వేశాడు. కొత్తపల్లికి చెందిన ప్రభాకర్గౌడ్ సహకారంతో అదే గ్రామంలో ఓ కోళ్ల ఫారం అద్దెకు తీసుకున్నారు. అందులో ఓ గదిలో డ్రగ్స్ ప్రాసెసింగ్కు అవసరమైన రియాక్టర్ ఏర్పాటు చేశారు. అంజిరెడ్డి బాలానగర్ నుంచి ముడి సరుకులు ఖరీదు చేసి ఇచ్చేవాడు. వీటిని వినియోగించి సాయి, రాకేశ్లు అల్ప్రాజోలం, ఎంఫిటమైన్ తయారు చేసేవారు. డిప్రెషన్ వంటి రుగ్మతలకు వైద్యుల చీటీ ఆధారంగా విక్రయించే ఔషధాలను తయారు చేయడానికి ఈ రెండింటినీ వాడతారు. వీటిని దుర్వినియోగం చేస్తూ మాదకద్రవ్యాలుగా వీరు విక్రయించడం మొదలు పెట్టారు. టీజీ ఏఎన్బీకి ఫిర్యాదుతో....ల్యాబ్లో మిగిలిన రసాయన వ్యర్థాలను కొత్తపల్లి శివార్లలో పడేసేవారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ వస్తున్న వాసనలతో స్థానికులు దీనిపై టీజీ ఏఎన్బీకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు జూన్ 18న దాడి చేసి అంజిరెడ్డి తదితరులను అరెస్టు చేసి 2.6 కేజీల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇదే ల్యాబ్లో అంజిరెడ్డి ఎంఫిటమైన్ తయారు చేయించాడు. అరెస్టు కావడానికి పదిరోజుల ముందు తన అనుచరుడైన కుంచల నాగరాజును పిలిచాడు.తన వద్ద ఉన్న 8.5 కేజీల ఎంఫిటమైన్ను అప్పగించి భద్రపర చాలన్నాడు. అంజిరెడ్డి అరెస్టు కావడం.. జైలుకు వెళ్లి రెండు నెలలు దాటినా అతడు బయటకు రాకపోవడంతో నాగరాజు ఆ సరుకును ముందు గ్రామం నుంచి నగరానికి చేరుద్దామని, ఆపై ఖరీదు చేయ డానికి ఆసక్తి చూపిన వారికి విక్రయిద్దామని భావించాడు. దీనికోసం వినోద్కుమార్గౌడ్, శ్రీశైలంలను సంప్రదించాడు. ఈ ముగ్గురూ కలిసి వాహనంలో ఎంఫిటమైన్ పెట్టుకొని బయలుదేరారు. దీనిపై హెచ్–న్యూకు సమాచారం అందింది. బోయిన్పల్లి చౌరస్తా వద్ద కాపుకాసి...ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, డానియేల్, బోయిన్ పల్లి ఇన్ స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణరెడ్డి బోయిన్పల్లి చౌరస్తా వద్ద కాపుకాశారు. అటుగా వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎంఫిటమైన్ దొరికింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి డ్రగ్తో పాటు వాహనం స్వాధీనం చేసుకున్నారు. ‘అత్యంత తీవ్ర ప్రభావం చూపే ఈ డ్రగ్ను ముక్కు ద్వారా పీల్చడం, నీరు/కూల్డ్రింక్స్లో కలిపి తాగడం, నీళ్లల్లో కలిపి ఇంజెక్షన్లా చేసుకోవడం ద్వారా సేవిస్తుంటారు.అనేక మందికి తెలియకుండానే దీనిని కూల్డ్రింక్లో కలిపి ఇచ్చి వారినీ బానిసలుగా మారు స్తారు. ఈ నేపథ్యంలోనే అపరిచితులు, డ్రగ్స్ అలవాటు ఉన్నవారు ఇచ్చే పార్టీలకు యువత వెళ్లకూడదు. ఈ కేసులో అంజిరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అతడిని పీటీ వారెంట్పై అరెస్టు చేస్తాం’ అని కొత్వాల్ శ్రీనివాస్రెడ్డి చెప్పారు. -
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 8.5 కేజీల డ్రగ్స్ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ చేపట్టి భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. ఒక డ్రగ్ పెడ్లర్తో పాటు ఇద్దరు సహాయకులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ రూ. 8.5 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.హైదరాబాద్లొ భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టాస్క్ఫోర్స్, నార్కోటిక్ వింగ్, బోయినపల్లి పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారని అన్నారు. ‘ఒక డ్రగ్ పెడ్లర్తో పాటు ఇద్దరు సహాయకులు అరెస్ట్ చేశాం. నిందితుల వద్ద నుండి 8.5 కేజీల అమ్ఫేటమైన్ డ్రగ్ సీజ్ చేశాం. దీనిద్వారా ఎండీఎంఏ డ్రగ్ తయారు చేస్తారు. మార్కెట్లో కేజీ కోటి నుంచి కొటీ 20 లక్షలు పలుకుతుంది. రూ. 8.5 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడింది.డ్రగ్స్ పెడ్లర్ నాగరాజుతో పాటు, వినోద్ కుమార్, శ్రీశైలంలు అరెస్ట్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో అంజిరెడ్డి అనే వ్యక్తి కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేశారు. నిందితులపై నేషనల్ డొమెస్టిక్ ప్రిపేర్డ్నెస్ కన్సార్టియం(NDPC)యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు. -
రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం.. నైజీరియన్ కిలాడీ లేడీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రాజేంద్రనగర్లో భారీగా డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ను సీజ్ చేశారు. నైజీరియన్ కిలాడీ లేడీని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్నారు.భార్య, భర్తతో పాటు మరో ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియాకు చెందిన తంబా ఫిడెల్మాను జైల్కు తరలించారు. సన్ సిటీని అడ్డాగా చేసుకొని డ్రగ్స్ దందా సాగుతోంది. -
156 ఔషధాలపై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: రోగుల ఆరోగ్యానికి హాని కలిగంచే 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషనల్ను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.ఈ మందుల ఉత్పత్తి, నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మందులు మనుషులకు ప్రమాదకరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది.ఈ 156 ఎఫ్డీసీ మెడిసిన్స్ తయారీని, అమ్మకాన్ని, డిస్ట్రిబ్యూషన్ను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ), నిపుణుల కమిటీ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆగస్ట్ 12న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. నిషేధిత ఔషధాలలో 'అసెక్లోఫెనాక్ 50ఎంజీ+ పారాసెటమాల్ 125ఎంజీ టాబ్లెట్, మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజైన్ హెచ్సిఎల్ + పారాసెటమాల్+ ఫినైల్ఫ్రైన్ హెచ్సీఎల్+ పారాసెటమాల్ వంటివి ఉన్నాయి. -
హైదరాబాద్: పబ్బులపై పోలీసుల దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో పలు పబ్బులపై పోలీసు అధికారులు దాడులు చేశారు. ఎక్సైజ్, టీఎస్ న్యాబ్ సంయుక్తంగా పబ్బులపై ఆపరేషన్ చేపట్టారు. గ్రేటర్ పరిధిలోని 25 పబ్బుల్లో ఏకాకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. ఒక్కొక్క పబ్లో 50 మందికి డ్రగ్ టెస్టులు చేశారు. కొత్తగా వచ్చిన డ్రగ్స్ కిట్లతో పరీక్షలు చేశారు. డ్రగ్స్ సేవిస్తున్నారన్న సమాచారంతో పబ్బుల్లో తనిఖీలు చేశారు. -
కాలేజీల్లో డ్రగ్స్ కట్టడికి క్లబ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసిని అరికట్టడం, డ్రగ్స్ ముప్పును నివారించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు 24/7 పనిచేసే టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తేనుంది. వారం పది రోజుల్లో ఈ టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు.ఎక్కడ ఇలాంటి తప్పులు జరిగినా విద్యార్థులు నిర్భయంగా ఈ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వారి వారి జీవితాలతోపాటు దేశాన్ని సైతం నాశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయిలో డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్లను ఏర్పాటుచేశామని, కాలేజీల్లో సైతం ఇలాంటి క్లబ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.పటిష్టమైన వ్యవస్థ: డీజీపీ జితేందర్తెలంగాణను డ్రగ్ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. రాష్ట్రంలో ర్యాగింగ్ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాలు తగ్గుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగానే ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి, స్కిల్స్ కోర్సులను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.నగరాల్లోని వర్సిటీలు, కాలేజీలే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని చిన్న కాలేజీల వరకు డ్రగ్స్ చేరాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్తో కుటుంబాలు సైతం ఆర్థికంగా చితికిపోతున్నాయని పేర్కొన్నారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. యాంటీనార్కోటిక్స్ బ్యూరో తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. మన యువతను నాశనం చేయాలని కొంతమంది దుష్టులు కంకణం కట్టుకున్నారని, డ్రగ్స్ అనే యాసిడ్ను పిల్లలపై ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.యాంటీనార్కోటిక్స్ బ్యూరో డైర్టెర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని 87126 71111 నంబర్కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ర్యాగింగ్కు సంబంధించి ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ దందాలో రాజస్తాన్ వ్యాపారులు
గచ్చిబౌలి: నగరంలో స్థిరపడిన రాజస్తాన్కు చెందిన కొందరు వ్యాపారుల ద్వారా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వినీత్ ఆ కేసు వివరాలు వెల్లడించారు. ఘట్కేసర్కు చెందిన దినేశ్చౌదరి, మంగళారంచౌదరి హెరాయిన్ పేస్ట్ కోసం రాజస్తాన్కు చెందిన సవర్ఝట్కు రూ.48 వేలు అడ్వాన్స్గా చెల్లించారు.ఈ నెల 7వ తేదీన రాజస్తాన్ నుంచి ఓ కారులో సైనిక్పురికి హెరాయిన్ పేస్ట్ తీసుకొచ్చారు. ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డులోని ఓ హోటల్లో మంగరామ్, దినేశ్, గణేశ్లు రమేశ్చంద్, సురేశ్చంద్లను కలిశారు. హెరాయిన్ ఎలా విక్రయించాలో వివరించారు. ఆ తర్వాత మరో కారులో గచ్చిబౌలి టెలికాంనగర్లోని ప్రకాశ్ లైట్హౌస్లో హెరాయిన్ పేస్ట్ను దాచేందుకు తీసుకొచ్చారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంలో ఎస్ఓటీ మాదాపూర్, రాయదుర్గం పోలీసులు 14న రాత్రి 11 గంటల సమయంలో లైట్హౌస్పై దాడి చేశారు.హెరాయిన్ పేస్ట్తోపాటు పెడ్లర్స్ మంగళారంచౌదరి, దినేశ్ చౌదరి, గణేశ్ చౌదరిలతోపాటు వినియోగదారులు నితిన్గుర్జార్, ప్రకాశ్ లైట్హౌస్ యజమాని ప్రకాశ్ చౌదరితోపాటు అమీన్పూర్కు చెందిన జైవత్రం వసనారం దేవసి, సైనిక్పురికి చెందిన ప్రకాశ్æచౌదరి, భువనగిరికి చెందిన బానారాం చౌదరిలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సవర్ఝట్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.4.34 కోట్ల విలువైన హెరాయిన్ పేస్ట్, రెండు కార్లు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులకు మెడికల్ టెస్ట్లు నిర్వహించగా అందరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు.ప్రకాశ్ లైట్హౌస్ యజమాని మధ్యప్రదేశ్లోని ఓ పీఎస్లో ఎన్డీపీఎస్ చట్టం కింద ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. రాజస్తాన్కు చెందిన ప్రధాన పెడ్లర్ సవర్ఝట్ ఎక్కడి నుంచి హెరాయిన్ తీసుకొస్తున్నారనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తామని డీసీపీ తెలిపారు. నగరంలో స్థిరపడిన రాజస్తాన్కు చెందిన వ్యాపారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. డ్రగ్ సరఫరా చేసినా, కొనుగోలు చేసినా, వాడుతున్నట్టు తెలిసినా డయల్ 100, 9490617444 ఫోన్నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీలు జయరాం, శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ విక్రయించే రాజస్తానీ అరెస్ట్8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం స్వాధీనంపటాన్చెరు టౌన్: మాదకద్రవ్యాలు విక్రయించే ఓ రాజస్తానీ వ్యక్తిని అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పటాన్చెరు పోలీస్స్టేషన్లో అదనపు ఎస్పీ సంజీవరావు ఆ వివరాలు వెల్లడించారు. పటాన్ చెరు మండల పరిధిలోని చిట్కుల్ రాధమ్మ కాలనీలో మాదకద్రవ్యాలు నిల్వ ఉన్నాయనే సమాచారం మేరకు టీనాబ్, ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసులు సంయుక్తంగా ఓ ఇంటిపై దాడులు చేశారు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజస్తాన్కు చెందిన రెయిలింగ్ పనులు పనిచేసే బుధారామ్ను అదుపులోకి తీసుకొని విచారించారు.దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీడీఎల్లో ఉంటున్న చిన్నాన్న కొడుకు కోశాలరామ్ డ్రగ్స్ తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవాడని, తొలుత తమకు అలవాటు అయ్యిందని, ఆ తర్వాత వ్యాపారంగా మార్చుకున్నట్టు నిందితుడు తెలిపాడు. అతని నుంచి 8 గ్రాములు హెరాయిన్, 34 గ్రాములు ఓపీఎం, సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
మత్తు వదిలిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాలు రవాణా చేసే ముఠాలను కట్టడి చేయడంతోపాటు మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారిని అందులోంచి బయటపడేసే వ్యూహంతో ముందుకు వెళితేనే మత్తు మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యమవుతుందని నిపుణులు చెపుతున్నారు. మద్యం, కల్తీకల్లు, గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ సెంటర్లకు రోగుల సంఖ్య ఇటీవల పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల గురించి అవగాహన పెరుగుతుండటంతో డీ–అడిక్షన్ సెంటర్లలో చేరే రోగుల సంఖ్యా పెరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీ–అడిక్షన్ సెంటర్ల పనితీరును టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవలే పరిశీలించి ఓ నివేదికను తయారు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 డీ–అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తుండగా.. ఐదు సెంటర్లు పూర్తిగా మూతపడినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా డీ–అడిక్షన్కు ప్రాధాన్యం పెరగడంతోనషాముక్త భారత్ అభియాన్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీసం 10 చొప్పున బెడ్లు అందుబాటులోకి తెచ్చారు. మద్యం బానిసలే ఎక్కువ.. డీ–అడిక్షన్ సెంటర్లలో చేరుతున్న రోగులలో ఎక్కువ మంది మద్యానికి బానిసలైన వారే ఉంటున్నారు. తర్వాత పెద్ద సంఖ్యలో గంజాయి బానిసలు ఉంటున్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 12 వరకు డీ–అడిక్షన్ సెంటర్లలో చేరిన రోగుల సంఖ్య ఆధారంగా చూస్తే.. హనుమకొండలోని డీ–అడిక్షన్ కేంద్రంలో 1,067 మంది మద్యానికి బానిసలైన వారుండగా, గంజాయి రోగులు 344 మంది ఉన్నారు. ఆదిలాబాద్ సెంటర్లో 781 మంది మద్యానికి బానిసలైన వారు చేరగా.. 53 మంది గంజాయి బాధితులు ఉన్నారు.ఎల్బీనగర్లోని సెంటర్లో 933 మంది మద్యానికి బానిసలైన రోగులు, 39 మంది గంజాయికి బానిసలైన రోగులున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో 850 మంది మద్యం బానిసలు, 30 మంది గంజాయికి బానిసలైన రోగులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని సెంటర్లో 722 మంది మద్యానికి బానిసలైన వారు.. 24 మంది గంజాయికి అలవాటుపడిన వారున్నారు. ఖమ్మం జిల్లా మధిర‡ సెంటర్లో 427 మంది రోగులు మద్యానికి బానిసలైన వారుండగా, 23 మంది గంజాయి నుంచి డీ–అడిక్షన్ కోసం చేరారు. డీ–అడిక్షన్ సెంటర్లు అంటే..? మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించి వారిని తిరిగి ఆరోగ్యవంతులుగా మార్చే కేంద్రాలను డీ–అడిక్షన్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్ఏపీడీడీఆర్) పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులలో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. -
Hyderabad: రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 650 గ్రాముల హెరాయిన్ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు రాజస్థాన్కు వాసులుగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ గ్యాంగ్లో ముగ్గురు పెడ్లర్స్, నలుగురు కంజూమర్స్గా పోలీసులు గుర్తించారు. -
కోటి రూపాయల డ్రగ్స్ సీజ్..
-
HYD: డ్రగ్స్ కలకలం.. కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి ఎంతో ఖరీదు చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 256 గ్రాముల మల్టీపుల్ డ్రగ్స్ను పట్టుకున్నారు. డ్రగ్స్ విలువ దాదాపు కోటీ పది లక్షలపైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు.కాగా, డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. దాడుల్లో భాగంగా 256 గ్రాముల మల్టీ పుల్ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, ఇంటర్ స్టేట్ డ్రగ్స్ సప్లయర్తో పాటు డ్రగ్ డెలివరీ బాయ్ను అరెస్టు చేశారు. ఇక, పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు కోటీ పది లక్షలకుపైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్
-
హైదరాబాద్లో మరో డ్రగ్స్ రాకెట్ అరెస్ట్ 11 కోట్ల డ్రగ్స్ సీజ్
-
డార్క్ వెబ్లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
HYD: కొరియర్ చేస్తుండగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్లో డీఆర్ఐ అధికారులు శనివారం(ఆగస్టు10) భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు డ్రగ్స్ కొరియర్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.రూ. 60 లక్షల విలువైన 3 కిలోల ఎఫెడ్రిన్ సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ప్యాకెట్లలో డ్రగ్స్ పొడిరూపంలో ఉన్నాయి. అరెస్టు చేసిన వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
‘మత్తు’ చిత్తుకు ద్విముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: యువత భవిష్యత్తును చిత్తు చేసే ‘మత్తు’మహమ్మారి కట్టడికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల ముఠాల సప్లై చైన్ కట్టడి మరోవైపు మత్తు పదార్థాల వైపు యువత వెళ్లకుండా అవగాహన పెంచే వ్యూహంతో పనిచేస్తున్నామన్నారు. మత్తుదందాలో ఎంతటివారున్నా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా పౌరుల కష్టార్జితాన్ని దోచుకొనే సైబర్ ముఠాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామని.. గత ఆరు నెలల్లోనే రూ. 150 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించగలిగామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామ న్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐదో డీజీపీగా జూలై 10న బాధ్యతలు స్వీకరించిన జితేందర్ శనివారంతో పదవీబాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విజన్ను ఆవిష్కరించారు. ప్రశ్న: పోలీస్ బాస్గా మీ నెల రోజుల పనితీరు ఎంతమేర సంతృప్తినిచి్చంది? జవాబు: డీజీపీగా ఈ నెల రోజుల పనితీరు ఎంతో సంతృప్తినిచి్చంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా పూర్తి చేశాం. భారీ నేరాలేవీ జరగకుండా కట్టడి చేశాం. పోలీస్ కమిష నర్లు, జిల్లా ఎస్పీలతో ఓ రోజంతా సమావేశమై రాష్ట్రంలో పోలీసింగ్ తీరుతెన్నులు, దృష్టిపెట్టాల్సిన అంశాలు, మత్తుపదార్థాల రవాణా, సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లపై స్పష్టత ఇవ్వగలిగాం. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు మెరుగయ్యాయి. ప్రజలకు అత్యవసర సేవలందించే డయల్ 100 సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టా. డయల్ 100 రెస్పాన్స్ టైం గతంలో కంటే సరాసరిన 5నిమిషాలు తగ్గింది. ప్రశ్న: మీ ప్రధాన ఫోకస్ ఏ అంశాలపై ఉండనుంది? జవాబు: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలను ఆర్థికంగా గుల్ల చేస్తున్న సైబర్ నేరాల కట్టడిపై, యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు ముఠాల అణచివేతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నా. అదే సమయంలో మహిళలు, చిన్నారుల భద్రతలో రాజీ ఉండదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? జవాబు: రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్యలో చెప్పదగ్గ స్థాయిలో పెరగలేదు. హత్యలు, అత్యాచారాలు పెరిగాయని కొన్ని రకాల దు్రష్పచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై గణాంకాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం అసెంబ్లీలో ఇటీవలే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ఎంతో కఠినంగా ఉన్నాం. విజుబుల్ పోలీసింగ్ను పెంచాం. ప్రశ్న: డ్రగ్స్ కేసుల్లో శిక్షలు అంతంతమాత్రమేనన్న విమర్శలపై ఏమంటారు? జవాబు: కొన్ని సాంకేతిక కారణాలతో గతంలో ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసుల్లో శిక్షలు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీజీ యాంటీనార్కోటిక్స్ బ్యూరోతో కలిసి దాదాపు 18 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పక్కాగా కేసుల నమోదు, దర్యాప్తుతో శిక్షలు పెరిగాయి. ఈ నెల రోజుల్లో నాలుగు ఎన్డీపీఎస్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో రెండు కేసుల్లో దోషులకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారైంది. కొందరు విదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉంటూ ఇక్కడ డ్రగ్స్ దందాలో దిగుతున్నారు. అలాంటి వారిపై దృష్టిపెట్టాం. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారిని స్వదేశాలకు పంపుతున్నాం. గత నెల రోజుల్లో ముగ్గురు విదేశీయులను వెనక్కి పంపాం. ప్రశ్న: దొంగతనం కేసులో ఇటీవల ఓ దళిత మహిళను పోలీసులు కొట్టడం వంటి ఘటనల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారు? జవాబు: చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందిపైనా కఠినంగానే ఉంటాం. ఇందులో ఏ మినహాయింపు ఉండదు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిందే. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సిబ్బందిని ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తూనే ఉంటాం. ప్రశ్న: మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి? జవాబు: కేవలం మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోనే మార్పు రాదు. దీనిపై తల్లిదండ్రులు సైతం ఆలోచించాలి. తమ పిల్లలే ప్రమాదాల బారిన పడతారన్న విషయాన్ని వారు గుర్తిస్తేనే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది. రోడ్డు ప్రమాదాల నియ ంత్రణకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. ప్రశ్న: అతిపెద్ద ముప్పుగా మారిన సైబర్ నేరాలను ఎలా ఎదుర్కొంటున్నారు? జవాబు: సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా బ్యూరో ఏర్పాటు చేసిన ఏకైన రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేర ముఠాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. గత ఆరు నెలల్లో సైబర్ బాధితులకు రూ. 150 కోట్లు రీఫండ్ చేయించడం గొప్ప ఏచీవ్మెంట్. ఒకవైపు సైబర్ కేసుల సత్వర దర్యాప్తు మరోవైపు మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. ప్రశ్న: డ్రగ్స్, గంజాయిని ఎంత మేర కట్టడి చేశామనుకుంటున్నారు? జవాబు: మత్తు పదార్థాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పూర్తిస్వేచ్ఛ ఉండటంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు పెంచాం. ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. గతానికి భిన్నంగా పబ్బులు, క్లబ్బుల్లోనూ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నాం. కేసుల నమోదు పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే గంజాయి కట్టడికి గంజాయి తాగిన వాళ్లను గుర్తించే కిట్లను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వంటి కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాలకు పంపాం.సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలిసైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్లో డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, యువత వారి ఆలోచన విధానాన్ని విస్తృతపర్చుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోకలిసి టీజీ సైబర్ సెక్యూరిటీ ‘ది గ్రేట్ యాప్సెక్ హ్యాకథాన్ 2024’ నిర్వహిస్తోంది. శుక్రవారం బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ హ్యాకథాన్ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, సామాజిక భద్రత విషయంలో సైబర్ భద్రత అత్యంత ప్రధానంగా మారిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ ౖఈ హ్యాకథాన్లో 20కి పైగా దేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈనెల 22న ఈ హ్యాకథాన్ ఫలితాలు వెల్లడిస్తామని, తెలంగాణలో మొదటి ఐదుగురు, జాతీయస్థాయిలో తొలి ఐదుగురు, అంత ర్జాతీయ స్థాయిలో తొలి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తామ న్నారు. వీరికి తెలంగాణ సైబర్సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ⇒ ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ గతేడాది సైబర్ క్రైమ్ కారణంగా రూ. 7,500 కోట్లు కోల్పోగా, ఆ సొమ్మును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కాపాడారని చెప్పారు. దీనికి సంబంధించి రీఫండ్ ఆర్డర్లను బాధితులకు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సెబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు దేవేందర్సింగ్, హర్షవర్ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాంబంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ జితేందర్ స్పందించారు. హైదరాబాద్లో ఉంటున్న బంగ్లా దేశీ యులపై నిఘా ఉంచామన్నారు. హైదరాబాద్కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారమే నడుచుకుంటామన్నారు. -
రండి.. ‘మత్తు’ వదిలిద్దాం
డ్రగ్ మహమ్మారి అంతటా విస్తరిస్తోంది. ఓ పక్క గంజాయి.. మరో పక్క సింథటిక్ డ్రగ్స్.. ఇవి చాలవన్నట్లు దుర్వినియోగం అవుతున్న ఔషధాలు పేద, ధనిక తేడా లేకుండా యువతను బలి కోరుతున్నాయి. ముప్పేట ముంచుకొస్తున్న ముప్పు నుండి రేపటి తరాన్ని కాపాడుకుందాం. ‘నిషా ముక్త్ తెలంగాణ’ సాకారం దిశగా అడుగేద్దాం. వీటి కట్టడికి ఇప్పటికే పోలీస్, ప్రత్యేక విభాగాలు తమవంతు పనిని వేగిరం చేశాయి. ఇప్పటికే మన నగరం, పట్టణం, మన ఊరికి వచ్చిన డ్రగ్స్.. మన ఇంటికి, స్కూలు, కాలేజీకి రాకుండా అప్రమత్తమవుదాం.ఆ దిశగా ‘సాక్షి’ మీకు.. నార్కోటిక్స్ బ్యూరోకు మధ్య వారధిగా నిలుస్తుంది. మీకు ఎలాంటి సహా య సహకారాలు కావాలన్నా, మాదక ద్రవ్యాలపై సమాచారం తెలిసినా, కుటుంబీకులు, బంధు వులు, స్నేహితులు, పరిచయస్తులు.. వీరిలో ఎవ రైనా డ్రగ్స్కు బానిసలుగా మారారనో, ఇతర సందేహాలు ఉన్నా.. వెంటనే 89777 94588 నంబర్కు వాట్సాప్ చేయండి. సందేశం, వాయిస్ మెసేజ్, ఫొటోల రూపంలో పంపండి. వీటిని ‘సాక్షి’ టీజీ ఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య దృష్టికి తీసుకువెళ్తుంది. ఆయన స్పందన మీకు చేరేలా చేస్తుంది. రండి.. అందరం కలిసి కమ్ముకుంటోన్న మత్తును వదిలిద్దాం..నోట్:పేరు, వివరాలను గోప్యంగా ఉంచాలని ఎవరైనా కోరితే... వారి అభిప్రాయాన్ని ‘సాక్షి’ కచ్చితంగా గౌరవిస్తుంది. – సందీప్ శాండిల్య -
రండి.. ‘మత్తు’ వదిలిద్దాం!
డ్రగ్ మహమ్మారి అంతటా విస్తరిస్తోంది. ఓ పక్క గంజాయి.. మరో పక్క సింథటిక్ డ్రగ్స్.. ఇవి చాలవన్నట్లు దుర్వినియోగం అవుతున్న ఔషధాలు పేద, ధనిక తేడా లేకుండా యువతను బలి కోరుతున్నాయి. ముప్పేట ముంచుకొస్తున్న ముప్పు నుండి రేపటి తరాన్ని కాపాడుకుందాం. ‘నిషా ముక్త్ తెలంగాణ’ సాకారం దిశగా అడుగేద్దాం. వీటి కట్టడికి ఇప్పటికే పోలీస్, ప్రత్యేక విభాగాలు తమవంతు పనిని వేగిరం చేశాయి. ఇప్పటికే మన నగరం, పట్టణం, మన ఊరికి వచ్చిన డ్రగ్స్.. మన ఇంటికి, స్కూలు, కాలేజీకి రాకుండా అప్రమత్తమవుదాం.ఆ దిశగా ‘సాక్షి’ మీకు.. నార్కోటిక్స్ బ్యూరోకు మధ్య వారధిగా నిలుస్తుంది. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, మాదకద్రవ్యాలపై సమాచారం తెలిసినా, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు.. వీరిలో ఎవరైనా డ్రగ్స్కు బానిసలుగా మారారనో, ఇతర సందేహాలు ఉన్నా.. వెంటనే 89777 94588 నంబర్కు వాట్సాప్ చేయండి. సందేశం, వాయిస్ మెసేజ్, ఫొటోల రూపంలో పంపండి. వీటిని ‘సాక్షి’ టీజీ ఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య దృష్టికి తీసుకువెళ్తుంది. ఆయన స్పందన మీకు చేరేలా చేస్తుంది. రండి.. అందరం కలిసి కమ్ముకుంటోన్న మత్తును వదిలిద్దాం..– సందీప్ శాండిల్య -
బాయ్స్ హాస్టల్ లో డ్రగ్స్
-
Raj Tarun - Lavanya Case: వేధిస్తోందంటూ లావణ్యపై ఫిర్యాదు
మణికొండ: తనను మోసం చేశాడంటూ నటుడు రాజ్తరుణ్పై ఫిర్యాదు చేసిన లావణ్యపై ప్రీతి అనే మహిళ పోలీస్లకు ఫిర్యాదు చేసింది. లావణ్య తనను ఫోన్ చేసి వేధిస్తోందని, తనకు డ్రగ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి శుక్రవారం రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై నార్సింగి అడ్మిన్ ఎస్ఐ సుఖేందర్రెడ్డిని వివరణ కోరగా ప్రీతి అనే మహిళ ఇచి్చన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, అది తమ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశంతోపాటు..అందులోని ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిపై ఇపుడే ఏమి చెప్పలేమన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఈ ఫిర్యాదుపై వివరాలను వెల్లడిస్తామన్నారు. ఫిర్యాదుదారు ప్రీతితో పాటు ఆర్జే శేఖర్ బాష, న్యాయవాది శర్మ ఉన్నారు. -
డ్రగ్స్, గంజాయి బంద్ చేయాలంటే ఒక్కరోజు చాలు: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్, గంజాయిని నిర్మూలించాలంటే ఒక్కరోజు చాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్కు డ్రగ్స్, గంజాయి ఎక్కడ్నుంచి వస్తుందో పోలీసులకు అంతా తెలుసు. నిర్మూలించాలనే ఉద్దేశం ఉంటే పోలీసులకు ఒక్కరోజు చాలు. నేరాలు చేసేవారిని, అత్యాచారాలు చేసే వారిని పట్టుకోకుండా..సామాన్యుల ఇళ్లలోకి చొరబడి విచారించడం, వారిని కొట్టడం లాంటి ఘటనలు పాతబస్తీలో ఎక్కువయ్యాయి.విధులు ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చేవారిని, అత్యవసర పరిస్థితిలో బయటకు పోయేవారిని విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతీ పోలీస్స్టేషన్కు మామూళ్లు అందుతున్నాయి. నిలోఫర్ కేఫ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచే ఉంటుంది. కమిషనర్కు చాయ్, బిస్కట్ అక్కడ్నుంచి తీసుకెళతారు కాబోలు అందుకే దాన్ని మూసివేయరు. మిగతా పేదలు, సామాన్యుల దుకాణాలను మాత్రం లాఠీలు చూపించి మూసేస్తారు.బీసీ సంక్షేమశాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఏడేళ్లలో భారీగా నిధులు కేటాయించినట్టు చూపించిన గత ప్రభుత్వం..ఖర్చు మాత్రం అత్యంత తక్కువగా చేసింది. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యాశాఖను నిరీ్వర్యం చేసింది. ఫలితంగా 16 లక్షల మంది పిల్లలు వివిధ కేటగిరీల్లో డ్రాపౌట్లు అయ్యారు. ఇలాంటి తప్పిదాల వల్లే ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో కూర్చొంది.ప్రస్తుత ప్రభుత్వం కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీలకు నిధులు ఇవ్వకుంటే..వారికోసం ఎంఐఎం కొట్లాడుతుంది. బీసీలు, దళితులు, మైనారీ్టల హక్కుల సాధనలో ఎంఐఎం ముందుంటుంది. అన్ని వర్గాలకు సరైన కేటాయింపులు జరిపిన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన హయాంలో నేను ఎన్నిసార్లు నిధులు డిమాండ్ చేసినా.. అవసరానికి తగినట్టు మంజూరు చేశారు’అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. సర్కారీ కరెంట్ బిల్లుల బకాయిలు రూ. 28 వేల కోట్లు ∙వాటి వసూళ్ల బాధ్యతను అదానీకి అప్పగించాలి ∙పాతబస్తీ వెంట పడటం సరికాదు ∙అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల నుంచి రూ.28వేల కోట్ల విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు వసూలు కావడం లేదని, వాటి వసూలు బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. పాతబస్తీలో 100% విద్యుత్ బిల్లులు వసూలు అవుతున్నాయని, తప్పుడు ప్రచారంతో దాని వెంటపడ్డారని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ...మొత్తం రాష్ట్రంలో 20% విద్యుత్ నష్టాలున్నాయని, ఒక్క పాతబస్తీలోనే లేవన్నారు.అక్కడకాలం చెల్లిన సరఫరా వ్యవస్థ ఉండటంతోనే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని గతంలో అధికారులు తనతో చెప్పారన్నారు. టీజీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ పాతబస్తీలో తన ఇంటి వరకు కవర్డ్ కండక్టర్లతో నిరంతర సరఫరా కోసం ప్రత్యేక లైన్ వేసుకున్నారని, పాతబస్తీలో మాత్రం పనులు చేయలేదని వివరించారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఏరియా అభివృద్ధి సంస్థకు రూ.120 కోట్లను కేటాయించారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వెల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదని తప్పుబట్టారు. -
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ‘ఎల్ మయో’ అరెస్ట్
ఆస్టిన్: అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మెక్సికో డ్రగ్ లార్డ్ ఇజ్మాయెల్ ‘ఎల్ మయో’ జాంబాదా(76) ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. టెక్సాస్ ఎల్పాసోలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా న్యాయ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఎల్ మయోతో పాటు మరో డ్రగ్ కింగ్పిన్ అయిన ఎల్ చాపో కొడుకు లిటిల్ చాపోస్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రైవేట్ విమానంలో దిగిన వెంటనే ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ మయోతో పాటు వాకిన్ ‘‘ఎల్ చాపో’’ గుజ్మన్ కొడుకు, సినాలోవా కార్టెల్ డ్రగ్స్ మాఫియాకే చెందిన మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఎల్ చాపోతో కలిసి మెక్సికో కులియాకాన్ సిటీలో డ్రగ్స్ సామ్రాజ్యం సినాలోవా కార్టెల్ స్థాపించాడు జాంబాదా. ఇది తర్వాతి కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద నేరసామ్రాజ్యంగా మారింది. అత్యంత ప్రమాదకరమైన ‘ఫెంటానిల్’ డ్రగ్స్ తయారీ, ఇతర దేశాలకు అక్రమ రవాణా, మరణాలకు కారణమయ్యాడనే తీవ్ర ఆరోపణలు జాంబాదాపై ఉన్నాయి.మరోవైపు.. అమెరికాలో 18-45 మధ్య వయస్కులు వందల సంఖ్యలో ‘ఫెంటానిల్’ బారినపడి మరణించారు. అమెరికా లక్ష్యంగా జాంబాదా డ్రగ్స్ రాకెట్ నడిపించాడని, తమ దేశ పౌరుల మరణాలకు కారణమయ్యాడని ఆ దేశ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నేరాభియోగాలు చేశారు. ఇప్పటికే ఎల్ చాపో(67) కొలరాడో జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని నలుగురు వారసులు లిటిల్ చాపోస్(నలుగురికీ ఒకే పేరు) ఆ డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారు. ఎల్ మయో, ఎల్ చాపో కొడుకు అరెస్ట్ కావడంతో అల్లర్లు జరగవచ్చని అమెరికా అప్రమత్తం చేయడంతో.. కులియాకాన్ అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. -
జోర పబ్బులో నార్కెటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు..
-
దేశాన్ని కమ్మేస్తున్న మత్తు మబ్బులు.. సినిమా ప్రభావమా?.. వ్యవస్థలో లోపమా ?
-
పట్టుబడ్డ రూ. 10 కోట్ల డ్రగ్స్ ఎవరికి అమ్మడానికంటే
-
హైదరాబాద్లో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శంషాబాద్లో దాదాపు కేజీ హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు..వివరాలు.. నగరంలోని రాజస్థాన్కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రాజస్థాన్కు చెందిన నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 7 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం ఇదే తొలిసారి అని తెలిపారు. కేజీకి పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన డ్రగ్ పెడ్లర్ నేమి చాంద్ భాటితోపాటు నార్పట్ సింగ్, అజయ్ భాటి, హరీష్ సిర్వి, సంతోష్ ఆచార్య అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా రాజస్థాన్ నుంచి బస్లో డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ తెలిపారు.స్వీట్ బాక్సుల్లో పైన స్వీట్స్ పెట్టి.. కింద 250గ్రా. హెరాయిన్ ఉంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోనే హెరాయిన్ ఎక్కువగా తయారు అవుతోందని.. ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
డ్రగ్స్ క్వీన్ బ్లెస్సింగ్!
సాక్షి, హైదరాబాద్: నైజీరియన్ డ్రగ్స్ సిండికేట్లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కింగ్పిన్ డివైన్ ఎబుకా సుజీ దేశంలోని అన్ని మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకొని దందా నిర్వహించేవాడు. నగరానికి ఒకరిని చొప్పున అంకితమైన డ్రగ్ పెడ్లర్ను నియమించుకునేవాడని, ఈక్రమంలో హైదరాబాద్కు అనోహా బ్లెస్సింగ్ కొరియర్గా వ్యవహరించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇటీవల తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్), సైబరాబాద్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడెషోలాతో సహా ఐదుగుర్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.నకిలీ పాస్పోర్టుతో..2018లో ఉపాధి నిమిత్తం ముంబైకి వచ్చిన బ్లెస్సింగ్.. కొంతకాలానికి బెంగళూరుకు మకాం మార్చింది. హెయిర్ స్టయిలిస్ట్గా పనిచేస్తూ స్థానిక డ్రగ్ పెడ్లర్తో పరిచయం పెంచుకుంది. తొలుత చిన్న మొత్తాల్లో డ్రగ్స్ సరఫరా ప్రారంభించిన ఈమె క్రమంగా సుజీ ఆదేశాల మేరకు బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి ఎదిగింది.పోలీసులకు చిక్కినా తన అసలు గుర్తింపులు బహిర్గతం కాకుండా చూసుకునేది. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జోనా గోమ్స్ పేరుతో పశ్చిమ ఆఫ్రికాలోని గినియా బిస్సా దేశం పాస్పోర్టును తీసుకుంది. కేవలం అంతర్జాతీయ సిమ్ కార్డులు, వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరుపుతుండేది. 2019 సెప్టెంబర్ 27న ఒకసారి ధూల్పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.డ్రగ్స్తో 20సార్లు హైదరాబాద్కు..సుజీ సూచనల మేరకు ఆమె నివసించే బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తుంది. అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేదా అప్పటికే నిర్మానుష్య ప్రాంతంలో ఉంచిన డ్రగ్ పార్సిల్ను తీసుకొని హైదరాబాద్కు సరఫరా చేసేదని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 20సార్లు నగరానికి డ్రగ్స్ సరఫరా చేయగా.. ఇందులో ఏడు సందర్భాల్లో విమానంలో ప్రయాణించిందని, 13 సందర్భాల్లో రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకుందని ఓ అధికారి తెలిపారు. బ్లెస్సింగ్ తన బ్యాగేజ్లో కొకైన్ దాచి పెట్టి, దాన్ని విమానం ఎక్కేక్రమంలో చెకిన్ లగేజ్లో ఇచ్చేదని, విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల ఉనికి గుర్తించడంలో భద్రతా సిబ్బంది డొల్లతనానికి ఇదొక ఉదాహరణనని ఆయన పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చాక ఈ డ్రగ్ పార్సిల్ను లంగర్హౌస్లోని సన్సిటీలో ఉంటున్న ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలేషి లేదా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన అజీజ్ నోహీమ్ అడెషోలాకు అందజేస్తుంది. ఈమె డ్రగ్స్ను నేరుగా వినియోగదారులకు లేదా ఇతర పెడ్లర్లకు విక్రయించేదని, డ్రగ్స్ హైదరాబాద్కు చేర్చిన ప్రతీసారి సుజీ... బ్లెస్సింగ్కు రూ.20 వేలు చెల్లించేవాడని పోలీసులు గుర్తించారు. బ్లెసింగ్కు ఈ డ్రగ్ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే సుజీ పోలీసులకు చిక్కితేనే ఈ కేసు మూలాలు బయటపడతాయని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. -
డ్రగ్స్ కేసులో కీలక మలుపు గుర్తించిన ఏడు పబ్బులు, రకుల్ తమ్ముని పాత్ర..
-
కోర్టు బోనులో రకుల్ తమ్ముడు..
-
సాక్షి చేతిలో డ్రగ్స్ కేసు FIR 18 మందిలో రకుల్ తమ్ముడి పేరు
-
డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా శిక్షలు తప్పవు
స్టేషన్ఘన్పూర్: ఎవరైనా సరె డ్రగ్స్ తీసుకున్నా.. విక్రయించినా, నిల్వ ఉంచుకున్నా శిక్షలు తప్పవని స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ అన్నారు. మండలంలోని శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్ వలన కలిగే దుష్పరిమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం యువత డ్రగ్స్కు అలవాటు పడ్డారని, ఇలా వాడుతూ దొరికితే జీవితంలో ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా అవుతారన్నారని, అందుకు డ్రగ్స్ వాడి జీవితాలను నాషనం చేసుకోవద్దని సూచించారు. సీఐ రాజు, ఎస్సైలు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.రఘునాథపల్లి: విద్యార్థులు గంజాయి లాంటి మత్తు పరార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్యాదవ్ సూచించారు. సోమవారం మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో కలిగే అనర్దాలపై ప్రిన్సిపాల్ వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలతో పాటు విలువైన జీవితం అందకారం కానుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఎస్సై దూదిమెట్ల నరేశ్ ఉన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం.పాలకుర్తి టౌన్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలని పాలకుర్తి సీఐ గట్ల మహేందర్రెడ్డి అన్నారు. వరంగల్ సీపీ అదేశాల మేరకు మండలంలోని గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. హీరోయిన్ రకుల్ సోదరుడు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ అమ్ముతున్న అయిదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 2 కోట్లకు పైగా విలువైన 200 గ్రాముల కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అయితే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయిదుగురు నైజీరియన్లతోపాటు వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన అయిదుగురు ప్రముఖులను అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో సీని రంగ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. నైజీరియన్ నుంచి వీరంతా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పట్టివేతపై కాసేపట్లో రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడనున్నారు. -
సూదిమొనపై ఎయిడ్స్ భూతం
చిన్న నిర్లక్ష్యం ఒక జీవితాన్నే తారుమారుచేస్తుంది. అలాంటిది భావిభారత పౌరులుగా ఎదగాల్సిన పాఠశాల విద్యార్థులు భయానక ఎయిడ్స్ భూతం బారిన పడితే ఆ పెను విషాదానికి అంతే ఉండదు. అలాంటి విపత్కర పరిస్థితిని ఈశాన్య రాష్ట్రం త్రిపుర ఎదుర్కొంటోంది. అక్కడి విద్యార్థులపాలిట హెచ్ఐవీ వైరస్ మహమ్మారి పెద్ద శత్రువుగా తయారైంది. 800 మందికిపైగా విద్యార్థులు ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కఠోర వాస్తవం అక్కడి రాష్ట్ర ప్రజలకు మాత్రమేకాదు యావత్భారతావనికి దుర్వార్తను మోసుకొచి్చంది. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల్లో పెచ్చరిల్లడమే ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని రాష్ట్ర నివేదికలో బట్టబయలైంది. త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నివేదిక అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టింది. పాఠశాల, కాలేజీ స్థాయిలోనే మాదకద్రవ్యాల విచ్చలవిడి వినియోగాన్ని అడ్డుకోలేక ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర పోతోందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు. 828 మంది విద్యార్థులకు వైరస్ సోకిందని, వారిలో 47 మంది మరణించారని ప్రభుత్వం చెబుతోంది. 572 మంది విద్యార్థులు ఎయిడ్స్తో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలా మంది ఇప్పటికే పాఠశాల విద్యను పూర్తిచేసుకుని ఉన్నత చదువులకు రాష్ట్రాన్ని వీడారని ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. దీంతో వీరి వల్ల ఇతర రాష్ట్రాల్లో ఇంకెంత మందికి వ్యాధి సోకుతుందోనన్న భయాందోళనలు ఎక్కువయ్యాయి. విద్యార్థుల్లో డ్రగ్స్ విచ్చలవిడి వినియోగం ‘‘త్రిపురలో ఏటా వందల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇటీవలికాలంలో పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఎక్కువగా హెచ్ఐవీ సోకుతోంది. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే విష సంస్కృతి ఇక్కడ విస్తరించింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తి వాడిన ఇంజెక్షన్ను ఇంకొక వ్యక్తి వాడటం ద్వారా హెచ్ఐవీ సోకడం చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. 2015–2020 కాలంలో ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ వాడకం(ఐడీయూ) 5 శాతముంటే కోవిడ్ తర్వాత అంటే 2020–23లో అది రెట్టింపు అయింది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పాజిటివ్ రేట్ కూడా పెరిగింది. శృంగారం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి తగ్గింది. సెక్స్ ద్వారా వ్యాప్తి రేటు గత ఏడాది 2శాతం కూడా లేదు. కానీ సూది ద్వారా హెచ్ఐపీ వ్యాప్తి చాలా ఎక్కువైంది’’ అని త్రిపుర రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ సమర్పితా దత్తా వెల్లడించారు. గత దశాబ్దంతో పోలిస్తే 2023 జూలైలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య 300 శాతం పెరగడం రాష్ట్రంలో హెచ్ఐవీ ఎంతగా కోరలు చాచిందనే చేదు నిజాన్ని చాటిచెప్తోంది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక బయటికొచ్చాక మీడియాలో, ప్రజల్లో గగ్గోలు మొదలైంది. విమర్శలు వెల్లువెత్తడంపై మాణిక్ సాహా సర్కార్ అప్రమత్తమైంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని సీఎం సాహా ప్రకటించారు. ‘‘పాజిటివ్ వచి్చన విద్యార్థుల గురించి పట్టించుకుంటున్నాం. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా విద్యార్థులందరికీ యాంటీ–రిట్రోవైరల్ ట్రీట్మెంట్(ఏఆర్టీ) ఇప్పిస్తున్నాం’’ అని సాహా స్పష్టంచేశారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ చికిత్సకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ విధానం ఏఆర్టీ. శరీరంలో వైరస్ లోడును తగ్గించేందుకు పలు రకాలైన మందులను రోగులకు ఇస్తారు. ఏఆర్టీ ద్వారా రక్తంలో వైరస్ క్రియాశీలతను తగ్గించవచ్చు. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తూనే ఎయిడ్స్ మరింత ముదరకుండా ఏఆర్టీ చూస్తుంది. అయితే ఎయిడ్స్ను శాశ్వతంగా నయం చేయలేముగానీ ఆ మనిషి జీవితకాలాన్ని ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించేందుకు ఈ చికిత్సవిధానం సాయపడుతుంది. మే నెలనాటికి చికిత్స కోసం రాష్ట్రంలోని ఏఆర్టీ కేంద్రాల్లో 8,729 మంది తమ పేర్లను నమోదుచేసుకున్నారు. మే నెల లెక్కల ప్రకారం 5,674 మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కొత్త కేసుల్లో టీనేజీ వాళ్లు ఎక్కువగా ఉంటున్నారన్న మీడియా వార్తలు అక్కడి టీనేజర్ల తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నాయి. 43 రెట్లు ఎక్కువ శృంగారం, రక్తమారి్పడి, ఇతర కారణాల వల్ల ఎయిడ్స్ బారిన పడ్డ పేషెంట్లతో పోలిస్తే ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ను కొనితెచి్చకుంటున్న యువత సంఖ్య ఏకంగా 43 రెట్లు అధికంగా ఉందని గణాంకాలు విశ్లేషించాయి. ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ బారినపడిన 16–30 ఏళ్ల వయసు వారిలో 87 శాతం మంది యుక్తవయసు వాళ్లే ఉన్నారు. ఇందులో 21–25 ఏళ్ల వయసు వారు ఏకంగా 43.5 శాతం మంది ఉన్నారు. 15 ఏళ్లలోపు వారు సైతం ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకుని ఎయిడ్స్ కోరల్లో చిక్కుకున్నారు. సంపన్నుల పిల్లలే ఎక్కువ మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. వీటిని కొనేంత స్తోమత సాధారణ కుటుంబాలకు చెందిన పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉండదు. సంపన్నులకే ఇది సాధ్యం. ప్రభుత్వ నివేదికలోనూ ఇదే స్పష్టమైంది. ఎక్కువ మంది పిల్లలు సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. ‘ఉద్యోగాల్లో బిజీగా మారి తమ పిల్లలు ఏం చేస్తున్నారు? పాకెట్ మనీని వేటి కోసం ఖర్చుచేస్తున్నారు? అనే నిఘా బాధ్యత తల్లిదండ్రులకు లేదు. అందుకే పిల్లల భవిష్యత్తు ఇలా అగమ్యగోచరమైంది’ అని సమరి్పత అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ది కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
-
Hyderabad: పబ్లో డ్రగ్స్ కలకలం
గచ్చిబౌలి: ఎలక్ట్రికల్ మ్యూజిక్ అంటేనే హై హోల్టేజీ సౌండ్ ఉంటుంది. ఆ మ్యూజిక్ను వినాలంటే మామూలుగానైతే కర్ణబేరి బద్దలైనట్లు ఉంటుంది. కాని డ్రగ్స్ తీసుకున్న వారు ఆ మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే తరహలో సైబరాబాద్ కమిషనరేట్కు కూతవేటు దూరంలో ఖాజాగూడలోని ద కేవ్ పబ్లో ‘ఫారెస్ట్ సైకెడలిక్ పార్టీ’ని నిర్వహించారు. డ్రగ్స్ సేవించి పార్టీలో పాల్గొన్నారని సమాచారం అందడంతో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ నార్కొటిక్ బ్యూరో శనివారం రాత్రి ఖాజాగూడలోని ఎస్వీ ఆర్కెడ్ లోని నాల్గవ అంతస్తులో ఉన్న ‘ద కేవ్ పబ్పై మెరుపు దాడి చేసింది. పార్టీలో పాల్గొన్న వారందరికీ మెడికల్ టెస్ట్లు నిర్వహించారు. 24 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఆదివారం గచ్చిబౌలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కేసు వివరాలను వెల్లడించారు. రాత్రి 10.30 గంటల సమయంలో నార్కొటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా కేవ్ పబ్పై దాడి చేశారని తెలిపారు. పారీ్టలో పాల్గొన్న, హోటల్లో పని చేస్తున్న 55 మందిని అదుపులోకి తీసుకొని టెస్ట్ చేయగా 24 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. పలు మల్టీ నేషనల్ కంపెనీలలో పని చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉన్నారని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారితో పాటు కేవ్ పబ్ మేనేజర్ బెంగళూర్కు చెందిన సందీప్ శర్మ(44)ను అరెస్ట్ చేశామన్నారు. పబ్ యజమానులు రాజేష్, అభినవ్, సాయి కృష్ణ, సన్నీలు పరారీలో ఉన్నారని వివరించారు. సైకెడలిక్ పార్టీ ఆర్గనైజర్, డీజే ఆపరేటర్ న్యూ మల్లెపల్లికి చెందిన అబ్ధుల్ అయూబ్(24) ఇన్స్ట్రాగామ్లో సైకెడలిక్ పార్టీ ఉన్నట్లు ప్రచారం చేశారన్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు బృందాలు వేర్వేచు చోట్ల గంజాయి, కొకైన్ , ఎండీఎంఏ సేవించి వచి్చనట్లు గుర్తించినట్లు తెలిపారు. 17 మంది గాంజా, ఇద్దరు కొకైన్, గాంజా, నలుగురు ఎండీఎంఏ, గాంజా, ఒకరు ఎండీఎంఏ సేవించినట్లు డీసీపీ తెలిపారు. గాంజా, ఎండీఎంఏ, కొకైన్ ఎక్కడ సేవించారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే అంశాలపై సమగ్ర విచారణ చేయాల్సి ఉందన్నారు. నార్కొటిక్ బ్యూరో డీఎస్పీ సీహెచ్.శ్రీధర్ , టాస్్కఫోర్స్ డీఎస్పీ టి.శ్రీనివాస్, ఏడీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్లు దాలినాయుడు, సంజయ్, సీహెచ్.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పబ్లపై చర్యలు తప్పవు డ్రగ్ సేవించే వారి కోసం పార్టీలు నిర్వహిస్తే పబ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ వినీత్ హెచ్చరించారు. ర్యాండమ్గా పబ్లలో తనిఖీలు చేస్తామని అక్కడికక్కడే యూరిన్ కిట్ల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పాజిటివ్గా తేలితే సంబంధిత వ్యక్తులపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు. మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు, వాడుతున్నట్లు సమాచారం 8712671111 ఫోన్ నెంబర్కు తెలియజేయాలని సూచించారు. డ్రగ్ రహిత సమాజం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.24 మందికి పాజిటివ్ ద కేవ్ పబ్ డీజే ఆపరేటర్, ఈవెంట్ ఆర్గనైజర్ మల్లెపల్లికి చెందిన అబ్ధుల్లా అయూబ్, మేనేజర్ శేఖర్ కుమార్(52), పార్టీకి వచి్చన కస్టమర్లు మహ్మద్ అడ్నన్ బారీ(23), మహ్మద్ అలీ(29), సాయి కిరణ్ బేగరీ(31), గిరిధర్ మనీష్(39), చింతమ్ పూజిత్ (24), మహేష్ చంద్ర(24), మహ్మద్ యాసిన్(22), మహ్మద్ రఫీ నిజామీ(22), సాయి ప్రణీత్(23), కంది రేగుల కిరణ్(25), నేరడుమల్లీ సందీప్(24), పోతురి వంశీ కృష్ణ(24), మహ్మద్ అర్బజ్(24), మిరాజ్ అసద్ అహ్మద్(25), మహ్మద్ సయ్యద్రజా(26), పూలపల్లి శివ(22), ఎం.డి.నవాజుద్ధీన్(29), అయలసోమయాజుల సాయి గౌరంగ్(26), ఎం.హరికృష్ణ(26), కె.మధుసూదన్(24), అనీస్ ముష్రాఫ్(39), డి.రోహిత్ వర్మ(26)లకు పాజిటివ్గా తేలింది. వారందరికి తదుపరి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. -
కేవ్ క్లబ్ డ్రగ్స్ కేసు.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
పబ్ లో డ్రగ్స్ కలకలం.. 50 మందికి డ్రగ్స్ టెస్ట్
-
దీ కేవ్ పఫ్ క్లబ్'లో డ్రగ్స్ కలకలం..
-
HYD: పబ్లో డ్రగ్స్ కలకలం.. 24 మందికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖజాగూడ ‘దీ కేవ్ పఫ్ క్లబ్’లో డ్రగ్స్ కలకలం రేపింది. పబ్పై పోలీసులు, నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 50 మందికి టెస్ట్లు చేయగా 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. అందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక.. పట్టబడ్డవారిలో పబ్ నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు సేవించిన ఆనవాళ్లు లభించాయి. క్లబ్లో ఉన్న 55 మందికి డ్రగ్స్ టెస్టులు చేశామని పోలీసులు చెప్పారు. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులుకేవ్ పబ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్లో సైకడిక్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీకెండ్ ముత్తులో తేలడానికి పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. సైకడిక్ట్ పార్టీలో 80 డెసిబుల్స్ సౌండ్ మించి శబ్దంతో డీజే గౌరవ్ హోర్రెతించాడు. గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్లు పోలీసులు తేల్చారు. పట్టుబడ్డ వారంతా రెండు రోజులుగా డీజే ఆర్టిస్ట్ గౌరవ్తో కాంటాక్ట్లో ఉన్నట్లు గుర్తించారు. గౌరవ్తో కోడ్ లాంగ్వాజీలో డ్రగ్స్ కొరకు కస్టమర్స్ చాటింగ్స్ చేసినట్లు తెలిపారు. డీజే గౌరవ్కు హైదరాబాద్లో ప్రముఖుల కాంటాక్ట్స్పై పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటివరకు పార్టీలో 26 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు పోజిటివ్ వచ్చింది. పబ్ ఓనర్లు ముగ్గురుపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉసూరుమనిపించారు.. రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ
సాక్షి, అమరావతి: విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పక్కదారి పట్టింది. కీలకమైన విభజన అంశాలపై కాకుండా ఇతర అంశాలపై అత్యధిక సమయం వెచ్చించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాలు సాగిన భేటీలో ఏ విషయంపై కూడా ఓ అంగీకారానికి రాలేదు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇరు రాష్ట్రాల మంత్రులతో రెండు కమిటీలు వేయాలని నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. మిగిలిన సమయం అంతా డ్రగ్స్, సైబర్ క్రైమ్, మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై కేటాయించడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. అధికారుల కమిటీ రెండు వారాల్లోగా సమావేశమై చర్చలు జరపనుంది. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చిస్తుందని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మంత్రుల కమిటీ నిర్ణయాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించనున్నారు. వీరి స్థాయిలో కూడా ఫలితం తేలకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ భేటీ అయ్యి చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్లు సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు.సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు ప్రశ్నలపై దాటవేతపోలవరం ముంపు మండలాలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై చర్చించారా అని ఇరు రాష్ట్రాల మంత్రులను విలేకరులు ప్రశ్నించగా.. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. నేరుగా సమాధానం ఇవ్వకుండా అన్ని విషయాలు చర్చించామన్నారు. విలేకరులు మరో ప్రశ్న వేస్తుండగానే సమావేశం ముగించి వెళ్లిపోయారు. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహూకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వెంకటేశ్వరస్వామి ఫొటో బహూకరించి, రేవంత్, భట్టిలకు చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్రెడ్డి, సీఎస్, ఇతర అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, సీఎస్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చర్చలు జరిపానని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందన్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయడానికి కలిసి పనిచేస్తాంపదేళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. వీటి పరిష్కార మార్గం కోసం కలిసి పని చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడం కోసం సీఎస్ స్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో ఇంకో కమిటీ వేశాం. ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ రెండు వారాల్లోగా సమావేశం అవుతుంది. ముందుగా అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలను చర్చిస్తాం. అక్కడ ఫలితం రాకపోతే ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు ఉంటాయి. మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే తిరిగి ముఖ్యమంత్రులు సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారంతో పాటు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్ను అరికట్టడం వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకొని అందుకోసం ఏడీజీ స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏడీజీ స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్న కోరికను అంగీకరించింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలను అరికట్టడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి పని చేస్తున్నాం.– తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపిల్లల స్కూల్ బ్యాగుల్లో గంజాయివిభజన చట్ట సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చర్చలతో సత్వరం పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తాం. ఇరు రాష్ట్రాలు కలసి అభివృద్ధి చెందేలా తరచూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. తెలంగాణ కోరిన విధంగా రాష్ట్రంలో గంజాయి సరఫరా నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేశాం. ఏపీలో 8వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతోంది. ఏపీలో అత్యధికంగా సాగవుతున్న గంజాయి తమ రాష్ట్రానికి వస్తోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు హర్షించేలా విభజన సమస్యలను పరిష్కరిస్తాం.– ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాలపై నిఘా పెట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాలపై నిఘా పెట్టి నేరస్తులను పట్టు కోవాలి. ప్రజలు ఎన్నుకుంటే ప్రజాప్రతినిధులుగా వచ్చాము. మాకు మితిమీరిన సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరికి ఎంత అవసరమో అంతే భద్రత ఇవ్వాలి. భద్రత విషయంలో నాతో సహా ఎవరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వా ల్సిన అవసరం లేదు. భద్రత, ఇతర విషయాల్లో కొన్నిసార్లు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. ఆ ఉత్సాహాన్ని నేరాల నియంత్రణపై చూపాలి’ అని ముఖ్యమంత్రి డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులకు హితవు పలికారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల అధికారులు, సిబ్బందితో నగరంలో శాంతిభద్రతలపై సీఎం సమీక్షించారు. వారికి కీలక సూచనలు చేశారు.డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి సామర్థ్యాలు పెంచుకోవాలితెలంగాణకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి గంజాయి వస్తోందనే సమాచారం ఉందని సీఎం రేవంత్ చెప్పారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా అప్రమత్తంగా ఉంటూ ఉగ్రమూకలు చొరబడకుండా పహారా కాస్తోందో.. రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అలా పహారా కాసి తెలంగాణలోకి గంజాయి, డ్రగ్స్ రాకుండా చూడాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టేందుకు అవసరమైన సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. సింగరేణి కాలనీలో ఒక బాధితుని కుటుంబాన్ని, ఔటర్ రింగ్రోడ్డులో ఒక బాధితుడైన డాక్టర్ను పరామర్శించడానికి వెళ్తే వారంతా గంజాయికి అలవాటుపడిన వ్యక్తుల వల్లే బాధితులుగా మారామని చెప్పారన్నారు. తమ పిల్లలు డ్రగ్స్కు అలవాటుపడ్డారని.. తాము రూ. వందల కోట్లు సంపాదించినా ఉపయోగం లేకుండాపోయిందంటూ పలువురు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఇందుకు ప్రధాన కారణం పోలీసు వ్యవస్థ రాజకీయ నిఘాపై శ్రద్ధపెట్టి నేరస్తులను వదిలేయడమేనని సీఎం అభిప్రాయపడ్డారు.పోలీసు కుటుంబం నుంచే వచ్చాపోలీసుల పిల్లలు తాము పోలీసుల కుటుంబాల నుంచి వచ్చామని చెప్పుకొనేందుకు ఇబ్బంది పడతారని, అందుకు కారణం పోలీసు శాఖపై సమాజంలో ఉన్న దురభిప్రాయ మేనని సీఎం రేవంత్ అన్నారు. ఆ అభిప్రాయం మారాలని, తన తండ్రి, తన అన్న పోలీసు అని గర్వంగా చెప్పుకునేలా పోలీసుల ప్రవర్తన ఉండాలని ఆయన సూచించారు. తన సోదరుడు భూపాల్రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్గా పనిచేసి తనను చదివించారని, తన అన్న పెంపకం వల్లే తాను సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ వెల్లడించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పోలీసు శాఖ సమస్యలు పరిష్కరించుకోకుంటే ఇక జీవితకాలంలో ఎప్పటికీ పరిష్కారం కావన్నారు. పోలీసుల పిల్లలకు ఉచిత విద్యసైనిక స్కూళ్ల మాదిరే పోలీసు పిల్లల కోసం పోలీసు స్కూళ్లు ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. గ్రేహౌండ్స్కు చెందిన 50 ఎకరాల స్థలంలో పోలీసు స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందులో ఉంటుందని, హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు చదువుకోవచ్చని చెప్పారు. సామర్థ్యం, పనితీరుతోనే బదిలీలు కోరుకోవాలని సీఎం సూచించారు. సామర్థ్యం ఉన్నవారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని, అందుకు రిటైర్డ్ ఐపీఎస్ సందీప్ శాండిల్య ఉదాహరణ అని పేర్కొన్నారు. రిటైరైనప్పటికీ సందీప్ శాండిల్యకు మాత్రమే ప్రభుత్వం పదవీకాలం పొడిగించిన విషయం గుర్తించాలన్నారు.పైసలతో పోస్టింగ్లు కుదరదు!‘పైసలతో పోస్టింగ్లు తెచ్చుకుందామంటే కుదరదు. పనితీరు ఆధారంగానే బదిలీలు ఉంటాయి. డబ్బు పెట్టి పోస్టింగ్లు తెచ్చుకొని మళ్లీ డబ్బు దండుకోవాలంటే ఏసీబీ వెంటపడుతుంది’ అని సీఎం రేవంత్ పోలీసు అధికారులను హెచ్చరించినట్లు సమాచారం.తెలంగాణ బ్రాండ్ హైదరాబాద్..తెలంగాణ బ్రాండే హైదరాబాద్ అని, హైదరాబాద్ పోలీ సులంటే తెలంగాణకు గుండె లాంటి వారని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్లో నేరాలను, అరాచకాలను అరికట్టకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. అందుకే హైదరాబాద్ ఇమేజ్ను కాపాడాలన్నారు. -
హైదరాబాద్ లో డ్రగ్ విక్రయాలు.. పబ్ డీజే ప్లేయర్ల అరెస్టు
-
డ్రగ్స్తో జీవితం అంధకారమే
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘చెడు స్నేహాల వల్ల నేను డ్రగ్స్కు బానిసనయ్యా. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మారలేదు. చదువు మధ్యలోనే మానేశా. జీవితం అంధకారంగా మారిపోయింది. యువత డ్రగ్స్ బారిన పడొద్దు..’అంటూ నిట్ మాజీ విద్యార్థి నవీన్ నాయక్ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన కురుమ్తోత్ రాథోడ్ నవీన్ నాయక్ (27) చదువులో చురుకుగా ఉండేవాడు. 2015లో ఆలిండియా 800వ ర్యాంక్ సాధింఛి ట్రిచి (తిరుచిరాపల్లి) ఎన్ఐటీలో చేరాడు. అయితే చెడు సహవాసాలతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు.విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పారు. అయినా పెడచెవిన పెట్టాడు. 2018లో చదువు మానేసి బెంగళూరులో మార్కెటింగ్ రంగంలో పని చేసినా ఆదాయం లేకుండా పోయింది. దీంతో డ్రగ్స్ పెడ్లర్గా మారాడు. ఈ క్రమంలోనే 2022లో ఎండీఎంఏ డ్రగ్ను వెంకటేళ్వర్లు అనే వ్యక్తికి సప్లయ్ చేయడంతో దుండిగల్ పీఎస్లో కేసు నమోదైంది. 2023లో కేరళలోని పలక్కడ్ పీఎస్లో నమోదైన ఎన్డీసీఎస్ కేసులో శిక్ష పడింది. తాజాగా మాదాపూర్ పీఎస్ పరిధిలో గంజాయి సేవించేందుకు వెళ్లి పోలీసులకు చిక్కాడు. ఒత్తిడిని అధిగమించాలివిద్యార్థులు ఒత్తిడి పేరిట డ్రగ్స్కు బానిస కావద్దని, వ్యాయామం, యోగా లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలని నవీన్ నాయక్ చెప్పాడు. భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులు తనకెంతో చేశారని, వారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి జీవితం నాశనం చేసుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ తల్లిదండ్రులను క్షమాపణ కోరాడు. ముగ్గురికి పాజిటివ్మాదాపూర్లోని హైటెక్స్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక పోలీసులతో కలిసి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. దూద్ బౌలికి చెందిన డ్రగ్ పెడ్లర్ మోటికర్ సిచి్చతానంద్ అలియాస్ సచిన్ (28)తో పాటు గంజాయి సేవించిన కురుమ్తోత్ నవీన్ నాయక్, ప్రణీత్రెడ్డి, రాహుల్రాజ్ను అరెస్టు చేశామని చెప్పారు. మరో డ్రగ్ పెడ్లర్ ధూల్పేట్కు చెందిన రాజా పరారీలో ఉన్నాడన్నారు. శనివారం మాదాపూర్ డీసీపీ వినీత్తో కలిసి కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.ముగ్గురూ గంజాయి తాగినట్లు తేలిందని (పాజిటివ్) తెలిపారు. డ్రగ్స్ సేవించిన వారు తప్పించుకోలేరని, రక్తపు నమూనాల ఆధారంగా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. పీజీ హాస్టళ్లలోనూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్లు కానీ తెలిస్తే 8712671111 ఫోన్ నంబర్లో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు రివార్డులు అందిస్తామన్నారు. కాగా మాదాపూర్ జోన్ పరిధిలో డ్రగ్స్పై నిఘా పెట్టినట్లు డీసీపీ వినీత్ తెలిపారు. యాంటీ డ్రగ్ కమిటీలు యాక్టివ్గా పని చేస్తున్నాయన్నారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గంజాయి డాన్ నీతూ బాయ్ ఆస్తులు అటాచ్ చేశామని, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో టీజీఏఎన్బీ డీఎస్పీ రమే‹Ù, మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా.. డీజే అఖిల్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : బంజారాహిల్స్ కేంద్రంగా పలు పబ్బుల్లో డీజేగా పనిచేస్తున్న అఖిల్ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు రెక్కీ నిర్వహించారు. అయితే ఓ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతుండగా అఖిల్ను హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు నిందితుడు వద్ద గంజాయిని బెంగళూరు నుంచి హైదరాబాద్కు తెచ్చి సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపాడు. ఇక డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ అఖిల్ను పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ ఎవరికి అమ్మాడు, వారిలో సెలబ్రిటీలు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
డ్రగ్స్ను అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైంది: నటుడు విజయ్
చెన్నై: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని, దీనిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయ్ ధ్వజమెత్తారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు స్టాలిన్ సర్కార్ ఏ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.విజయ్ మాట్లాడుతూ.. 'ఇటీవల కాలంలో తమిళనాడు యువతలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది. ఒక పేరెంట్గా, రాజకీయ పార్టీ నాయకుడిగా నేనే దీని గురించి భయపడుతున్నాను. యువతను డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం. కానీ ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరం ఉందిస అని పేర్కొన్నారు.కాగా స్టాలిన్ ప్రభుత్వంపై విజయ్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని యోచిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. తమిళనాడులోని కళ్లకురిచిలో ఇటీవల కల్తీ సారా తాగడం వల్ల 60 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి, వారంలోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్కు నోటీసులు జారీ చేసింది. నివేదికను దాఖలు చేసేందుకు మద్రాసు హైకోర్టు జూలై 3 వరకు గడువు ఇచ్చింది. -
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీ
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం బీచ్ రోడ్డులో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు పోలీసులు మార్చ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అనిత తొలుత మార్చ్లో పాల్గొన్న వెయ్యి మందితో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విశాఖను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు యువత సహకారం అవసరమని చెప్పారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ మాట్లాడుతూ గంజాయి, ఇతర డ్రగ్స్ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మాదకద్రవ్యాల వినియోగంతో యువశక్తి ని ర్వీర్యం దేశాభివృద్ధిలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తుందని, అయితే మాదకద్రవ్యాల వినియోగం వలన ఆ యువశక్తిలో కొంత నిర్వీర్యం కావడం బాధాకరమని రాష్ట్ర డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ వాడకం విద్యార్థులకు ఒక ఫ్యాషన్గా మారుతుందని, అది వారి జీవితాన్ని కబళించి వేస్తుందని గ్రహించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ విక్రయాలు, వాడకాన్ని నిర్మూలించేందుకు వంద రోజుల ప్రణాళిక రెడీ అవుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో డ్రగ్స్ టాస్్కఫోర్స్ను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అడిషనల్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. -
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణ తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రవా ణాకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. మంగళవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వ ర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరో ధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. డ్రగ్స్ కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని బలహీనపరిచేందుకు దేశద్రోహులు డ్రగ్స్ను అస్త్రంగా ప్రయోగి స్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.బడ్జెట్ ఎంతైనా కేటాయిస్తాం..రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తామని భట్టి తెలిపారు. ఇప్పటికే అడిగినన్ని నిధులు ఇచ్చామని, రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినిపించకుండా చేయాల్సిన బాధ్యత నార్కోటిక్ విభాగానిదేనని పేర్కొన్నారు. డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రజలు అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. కలసికట్టుగా తరిమేద్దాం: డీజీపీకలసికట్టుగా ఉండి రాష్ట్రం నుంచి డ్రగ్స్ను తరిమే యాలని డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు. పిల్లలు డ్రగ్స్కు బానిసలు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాలేజీలు, స్కూళ్లను డ్రగ్ ఫ్రీ ప్రదేశాలుగా మలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే విద్యార్థుల జీవితాలతో పాటు వారి కలలు, కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అవుతాయని హెచ్చరించారు. చేయూతనివ్వాలి: హైదరాబాద్ సీపీడ్రగ్స్కు బానిసలైన వారిని చైతన్యపరచి, వారికి చేయూతనివ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. యువతను లక్ష్యంగా చేసుకుని దేశద్రోహులు డ్రగ్స్ కుట్ర పన్నుతున్నారని చెప్పారు. వారి ఉచ్చులో పడి యువత మత్తుకు బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు రూపొందించిన పాటను సీఎస్ శాంతికుమారితో కలిసి డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కోసం షార్ట్ఫిల్మ్ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. నెక్లెస్ రోడ్డుపై విద్యార్థుల ర్యాలీని భట్టి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య పాల్గొన్నారు.డ్రగ్స్పై సమాజాన్ని మేల్కొలుపుదాంమంత్రి పొన్నం ప్రభాకర్బంజారాహిల్స్ (హైదరాబాద్): యువ తను, విద్యా ర్థులను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రజా నాట్యమండలి కళారూ పాల ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. ‘డ్రగ్స్ను నిర్మూలి ద్దాం–సమాజాన్ని మేల్కొల్పుదాం’పేరిట చేపట్టే కళాయాత్ర లోగోను మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ బారి నుంచి యువతను మేల్కొల్పి వారిని చక్కటి బాట పట్టించేందుకు చేప ట్టిన కళాయాత్ర విజయవంతంగా కొనసాగా లని ఆకాంక్షించారు. ప్రభుత్వం డ్రగ్స్ను ఎంత కట్టడి చేసినా డ్రగ్స్ మాఫియా వివిధ రూపాల్లో వ్యాపా రం సాగిస్తూ చివరకు చిన్న పిల్లలు తినే చాక్లెట్స్లో డ్రగ్స్ కలిపి వ్యాపారం చేస్తూ వారి జీవి తాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేద న్నారు. ప్రజా నాట్య మండలి కళారూపాల ద్వారా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ఈ నెల 31 వరకు ఎగ్జిబిషన్స్, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కళా యాత్రతో వివిధ కార్యక్రమా లను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో ఆహ్వాన సంఘాన్ని ప్రకటించారు. సంఘం చైర్మన్గా మంత్రి పొన్నం ప్రభాకర్, చీప్ ప్యాట్ర న్స్గా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సినీ గేయ రచ యిత అశోక్తేజ, మాదాల రవి, గాంధీ హాస్పటల్ సూపరింటెండెట్ రాజారావు, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్, డాక్టర్ నీలిమ, డాక్టర్ జీఎన్రావులతో పాటు భారత్ ఇన్స్టి ట్యూట్స్ సీహెచ్.వేణుగోపాల్రెడ్డి, డీజీ నరసింహారావు, నాగటి మారన్న, మహరాజ్లను ప్రకటించారు. -
మత్తు డేగ ఎగురుతోంది... జాగ్రత్త
వీధి చివర బంకుల్లో మత్తు చాక్లెట్లు కాలేజీ క్యాంపస్లో గంజాయి పొగ పబ్లో మాదకద్రవ్యాలు బుద్ధిగా చదువుకోవాల్సిన టీనేజ్ పిల్లల్ని మత్తులోకి లాగడానికి పొంచి ఉన్న డేగలు. జాగ్రత్త... తల్లిదండ్రులూ.. జాగ్రత్త. పిల్లలు తెలిసీ తెలియక చిక్కుకుంటారు. గమనించాలి. చర్చించాలి. కాపాడుకోవాలి.స్కూల్ వయసు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా హర్యాణ రాష్ట్రంలో పోలీసులు ఆయా స్కూళ్లకెళ్లి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేది ఈ కార్యక్రమం పేరు. అంటే చిన్న వయసులోనే పిల్లల దృష్టిని ఆకర్షించి వారిని డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి చెప్పాలి. ఇందుకు వారు అంబాలలోని ఒక ప్రయివేటు స్కూల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేశారు. దాని పేరు ‘చక్రవ్యూహ్’. వరుసగా ఉన్న ఐదు గదుల్లో రకరకాల పజిల్స్ ఇచ్చి ఒక గదిలో నుంచి మరో గదిలోకి కేవలం తెలివితేటల ఆధారంగా తలుపు తెరుచుకుని ప్రవేశిస్తూ అంతిమంగా బయట పడాలి. ‘ఇది ఒక అద్భుత ప్రయోగం’ అని విద్యార్థులు అంటున్నారు.చక్రవ్యూహ్ ప్రయోగంచక్రవ్యూహ్ అనేది ఒక పజిల్ గేమ్. ఆటోమేటిక్ తాళాలు ఉన్న గదుల్లోకి నలుగురు విద్యార్థుల బృందాన్ని పంపిస్తారు. ఆ బృందం అక్కడ తమ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను పజిల్స్ రూపంలో ఎదుర్కొంటుంది. అంటే పరీక్షలో ఫెయిల్ కావడం, మంచి ర్యాంక్ రాకపోవడం, నిరుద్యోగం, ఒంటరితనం, తల్లిదండ్రుల కొట్లాట... ఇలాంటి సమయంలో ఆ సమస్యలను ఎలా దాటాలో అక్కడే క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ ద్వారా ముందుకు సాగితే తర్వాతి గదిలోకి తలుపు తెరుచుకుంటుంది. ఇదంతా íసీసీ టీవీల ద్వారా అధ్యాపకులు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రతి సవాలు ఎదుర్కొనే సమయంలో ఆ సమస్య నుంచి పారిపోయి డ్రగ్స్ను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాని ఈ మొత్తం చక్రవ్యూహ్లో కలిగే అవగాహన ఏమిటంటే నిజ జీవిత సమస్యల్ని తల్లిదండ్రుల, స్నేహితుల సాయంతో దాటితే వచ్చే కిక్కు డ్రగ్స్ తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడంలో లేదని తెలియడం. ఇలాంటి చక్రవ్యూహ్ ప్రయోగాన్ని హర్యాణలోని స్కూళ్లల్లో విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. జీవితపు చక్రవ్యూహంలో చిక్కుకుంటే బయటపడే దారి ఉంటుందిగాని డ్రగ్స్లో చిక్కుకుంటే దారి ఉండదు అని తెలియడం వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే గట్టి సందేశం అందుకుంటారు.కుతూహలం, సాంగత్యంటీనేజీ పిల్లలు అయితే కుతూహలం కొద్దీ లేదా దుష్ట సాంగత్యంలోని ఒత్తిడి వల్ల డ్రగ్స్ను ట్రై చేస్తున్నారని డీ అడిక్షన్ థెరపిస్టులు అంటున్నారు. పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గమనించే లోపు వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరదా షికార్లు, స్లీప్ ఓవర్ల సమయంలో సరదా కొద్ది సీనియర్లో స్నేహితులో డ్రగ్స్ ఇస్తున్నారు. మొదటి ఒక రకం డ్రగ్స్ తీసుకున్నాక మెదడు ఇంకా ‘హై’ కావాలని కోరుకుంటుంది. దాంతో పిల్లలు ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో చూద్దామని వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయని డ్రగ్స్కు బానిసలైన టీనేజ్ విద్యార్థులను పరిశీలిస్తున్న డీ అడిక్షన్ థెరపిస్టులు తెలియచేస్తున్నారు.బయట పడేయాలిడ్రగ్స్కు అలవాటు అయ్యారని తెలియగానే తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడానికి చూస్తారు. వెంటనే ఆ పిల్లలు ‘మీరిలా తిడితే ఇల్లు విడిచి వెళ్లిపోతాం’ అని బ్లాక్మెయిల్ చేస్తారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషుల్ని చేయాల్సి వస్తుంది. పోలీసుల గమనింపు ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల లోపు వారిని డ్రగ్ పెడలర్స్ లక్ష్యం చేసుకున్నా నేడు 14 ఏళ్ల పిల్లలతో మొదలు ప్రతి టీనేజ్ అమ్మాయి అబ్బాయి డ్రగ్స్ డేగ రెక్కల కింద ఉన్నట్టే లెక్క.నెగెటివ్ కుటుంబ వాతావరణంటీనేజ్ పిల్లలు డ్రగ్స్ వైపు మొగ్గు చూపడంలో ప్రధానంగా నెగెటివ్ కుటుంబ వాతావరణం ఒక ముఖ్యకారణమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరుచుకోకపోయినా ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్ ఇచ్చే డ్రగ్స్ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాలలోకి పిల్లలు వెళతారు. ఆ సంగతి తెలియనివ్వరు. చదువుతో పాటు క్రీడలు, ప్రకృతి ప్రేమ, బంధుమిత్రులు, క్రమశిక్షణ గల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయినవారు ఉన్నారన్న భరోసా, విలువలు లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక ఆలంబన... ఇవి టీనేజ్ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్ బారిన ఏ మాత్రం పడరు. తల్లిదండ్రులూ బహుపరాక్.ఎలా గుర్తించాలి?మీ టీనేజ్ పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడ్డారని ఎలా గుర్తించాలి?1. చాలా మూడీగా తయారవుతారు 2. సరిగా భోజనం చేయరు 3. సడన్గా కొత్త కొత్త స్నేహితులు ప్రత్యక్షమవుతుంటారు. తరచూ ఏవో పార్టీలున్నాయని వెళుతుంటారు. 4. గతంలో కంటే ఎక్కువ డబ్బు అడుగుతారు 5. పొడి పెదిమలు 6. ఎర్రబడ్డ కళ్లు 7. వాదనలకు దిగి ఆధిపత్యం ప్రదర్శించడం 8. కుటుంబంతో కలివిడిగా లేకపోవడం 9. అర్థం పర్థం లేని నిద్రా సమయాలు. -
మాదాపూర్లో మరోసారి భారీ డ్రగ్స్ కలకలం
సాక్షి,హైదరాబాద్ : మాదాపూర్లో మరోసారి భారీ డ్రగ్స్ కలకలం సృష్టించాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్కి డగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు సాయిచరణ్తో పాటు మరో వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి ,రాహుల్ ,సుబ్రహ్మణ్యంలను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిచరణ్ నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు దొరికినట్లు తెలుస్తోంది.డ్రగ్స్ సరఫరా దందా జరిగేది ఇలానార్కోటిక్ పోలీసుల వివరాల మేరకు..సాయి చరణ్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలించేందుకు నగరంలో పలు ట్రావెల్స్ ఏజెన్సీలకు చెందిన డ్రైవర్లను నియమించుకున్నాడు. వారికి బెంగళూరులో డ్రగ్స్ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి హైదరాబాద్కు తరలించినట్లు సమాచారం.ఇలా, 50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది.సాయిచరణ్ డ్రగ్స్ సరఫరా చేసిన వ్యాపారస్తులు హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలకు చెందిన వారేనని నార్కోటిక్ పోలీసుల విచారణ తేలింది. సాయిచరణ్తో పాటు ఇతర నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. -
అత్యంత ప్రమాదకరమైన అల్ఫాజోలం డ్రగ్ స్వాధీనం
-
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
-
భర్త పెడ్లర్ భార్య ట్రాన్స్పోర్టర్!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేసుకోవచ్చు, నగరంలో విక్రయిస్తున్న భార్యభర్తల దందాకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–నాబ్) అధికారులు చెక్ చెప్పారు. ఈ దంపతులుసహా ఐదుగురిని అరెస్టు చేసి, రూ.4 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్ స్వా«దీనం చేసుకున్నట్లు టీఎస్–నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య బుధవారం వెల్లడించారు. అంబర్పేటకు చెందిన సయ్యద్ ఫైజల్ పెట్స్ విక్రయిస్తుంటాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ దందా మొదలెట్టాడు. ఇతడిపై గతంలో అంబర్పేట, బాలానగర్ ఎక్సైజ్ పోలీసుస్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. కొన్నిసార్లు భార్య ముస్రత్తున్నిస్సా బేగంతో కలిసి ఈ దందా చేయడంతో ఆమె పైనా ఓ కేసు నమోదైంది. జైలుకు వెళ్లివచ్చినా తమ పంథా మార్చుకోలేదు. బెంగళూరుకు చెందిన జునైద్ ఖాన్, డబీర్పుర వాసి మహ్మద్ అబ్రార్, రహ్మత్ ఖాన్లను తమతో కలుపుకున్నారు. జునైద్ డ్రగ్ సరఫరాలో సహకరిస్తుండగా... మిగిలిన ఇద్దరూ నగరంలో కస్టమర్లను గుర్తించేవారు. పోలీసుల నిఘా పెరిగిందని గుర్తించిన సయ్యద్, వారికి చిక్కకుండా ఉండటం కోసం కొత్త పంథా మొదలెట్టాడు. బెంగళూరు నుంచి డ్రగ్స్ ఖరీదు చేస్తూ పెడ్లర్గా మారాడు. కస్టమర్లకు సరఫరా చేయడానికి మస్రత్తున్నిస్సా బేగంను ట్రాన్స్పోర్టర్గా వాడుతున్నాడు. బెంగళూరుకు వెళ్లి వచ్చా... ఇటీవల బెంగళూరు వెళ్లిన ఈ నలుగురు నిందితులు అక్కడ జునైద్ను కలిసి 34 గ్రాముల ఎండీఎంఏ ఖరీదు చేశారు. అనంతరం జునైద్తో కలిసి వారు నగరానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీఎస్–నాబ్ అధికారులు బహదూర్పుర పోలీసులతో కలిసి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.4 లక్షల విలువైన డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి క్రమం తప్పకుండా డ్రగ్ ఖరీదు చేస్తున్న 19 మంది కస్టమర్లను పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ కస్టమర్ల పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడానికి కృషి చేస్తున్నామన్న పోలీసులు వీటిపై సమాచారం తెలిస్తే 87126–71111 నెంబర్కు ఫోన్ చేసి లేదా ( tsnabho& hyd@tspolice. gov. in)కు ఈ–మెయిల్ ద్వారా తెలపాలని కోరారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. -
నటి హేమకు బెయిలు మంజూరు
బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు తాజాగా బెయిల్ లభించింది. కొద్దిరోజుల క్రితం బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు విచారించారు. ఈ క్రమంలో హేమకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
మెక్సికో పీఠంపై మహిళ!
అపారమైన వనరులున్నా ఏనాడూ కంటి నిండా కునుకు లేని మెక్సికో ప్రజానీకం అధ్యక్ష ఎన్నికల్లో వరసగా రెండోసారి సైతం వామపక్ష మొరెనా పార్టీకి పట్టంగట్టారు. ఆరుపదుల వయసుగల యూదు మహిళ క్లాడియా షీన్బామ్ను అధ్యక్ష పీఠానికి ఎన్నుకున్నారు. రెండు శతాబ్దాల రిపబ్లిక్ చరిత్రలో మహిళ దేశాధినేత కావటం ఇదే ప్రథమం. జనాభాలో యూదులు అత్యల్ప సంఖ్యాకులు కావటం గమనించదగ్గది. వచ్చే అక్టోబర్లో ఆమె పదవీబాధ్యతలు చేపడతారు. ఆకలి,నిరుద్యోగం, డ్రగ్స్ విజృంభణ, వ్యక్తుల అదృశ్యం... ఒకటి కాదు, మెక్సికోను సవాలక్ష సమస్యలు పీడిస్తున్నాయి. అంతటా నిరాశా నిస్పృహలు అలుముకున్న తరుణంలో అంతవరకూవున్న రెండు పార్టీల వ్యవస్థను బద్దలుకొడుతూ మొరెనా పార్టీ రంగంలోకొచ్చింది. 2018లో ఆరేళ్లకాలానికి అధ్యక్షుడైన ఆండ్రస్ మ్యాన్యువల్ లొపెజ్ అబ్రడార్ (ఆమ్లో) ఆశించిన స్థాయిలో పాలించకపోయినా శాంతిభద్రతలను కాస్త అదుపు చేయగలిగారు. అదే సమయంలో సంక్షేమపథకాలు అందించటం, మౌలిక సదుపాయాలు పెంచటం మొరెనా పార్టీని రెండోసారి అందలం ఎక్కించింది. అలాగని అంతా సవ్యంగా ఉందని కాదు. ఏడాదికి సగటున 30,000 హత్యలు జరగటం, అందులో 90 శాతం మిస్టరీగా మిగిలిపోవటం మెక్సికో ప్రత్యేకత. ఈ హత్యల్లో డ్రగ్స్ మాఫియాల వాటాతోపాటు, వాటిని అదుపు చేసే సాకుతో పారా మిలిటరీ దళాలు సాగించే నరమేధమూ ఉంటుంది. మారుమూల పల్లెల్లో ఏదో ఒకచోట హఠాత్తుగా ఖననం చేసిన శవాల గుట్టలు లేదా మాదకద్రవ్యాల డంప్లు బయటపడతాయి. అమెరికాకు చాటుగా వలసదారుల తరలింపు మరో పెద్ద వ్యాపారం. మూడునెలలక్రితం అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండ ప్రాంత ఆవాసాలపై మాదకద్రవ్య ముఠాలు డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించి వందలాది పౌరులను హతమార్చటంతోపాటు ఇళ్లను దహనం చేశారు. గ్రామస్థులు తమ సమాచారం పారా మిలిటరీ దళాలకు చేరేస్తున్నారన్నది వారి అనుమానం. ఈ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా దాదాపు డజనుమంది అభ్యర్థుల్ని మాదకద్రవ్యాల ముఠా కాల్చిచంపింది. ఇన్ని సమస్యలతో సతమతమయ్యే దేశానికి అధ్యక్షురాలు కావటం నిజానికి కత్తి మీద సామే. చిత్రమేమంటే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆమె శాంతిభద్రతల అదుపు కోసం ఏం చేస్తానన్నది చెప్పలేదు. కానీ మెక్సికో నగర మేయర్గా పనిచేసిన అనుభవం ఆమెకు అక్కరకొస్తుందన్న ఆశ జనానికి ఉంది. నగరాన్ని సీసీ కెమెరాలతో నింపడం, నేరాలు తరచూ జరిగే ప్రాంతాల్లో నిరంతరం పోలీసు బలగాలను మోహరించటం వంటివి హత్యలను గణనీయంగా తగ్గించాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య వాస్తవాలను ప్రతిబింబించటం లేదన్నది విపక్షాల ఆరోపణ. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన 1968 నాటి విద్యార్థి ఉద్యమంతో సహా అనేక సామాజికోద్యమాల్లో పాల్గొన్న యూదు కుటుంబంలో జన్మించటం వల్ల అటు రాజకీయాలపైనా, ఇటు పర్యావరణంపైనా ఆమెకు ఆది నుంచీ ఆసక్తి. అందుకే ఆ రంగంలో ఆమె పీహెచ్డీ చేయటంతోపాటు క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో తన అధ్యయనాన్ని కొనసాగించి నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 2007లో నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్న శాస్త్రవేత్తల బృందంలో క్లాడియా ఒకరు. 2018లో తెరపైకొచ్చిన మొరెనా పార్టీ ఆమెను సహజంగానే ఆకర్షించింది. వెంటనే మెక్సికో మేయర్ పదవి కూడా వరించింది. ఆ పదవికి మహిళ ఎన్నిక కావటం కూడా అదే ప్రథమం. 31 రాష్ట్రాలూ, 13 కోట్ల జనాభాగల దేశంలో నేరాలను అరికట్టడం మెక్సికో నగరాన్ని దారికి తెచ్చినంత సులభం కాదు. చాలా రాష్ట్రాల్లో మాదకద్రవ్య ముఠాలు వాహన సముదాయాల్లో ఏకే–47 తుపాకులతో సంచరించటం, పోలీసులు సమాచారం అందుకుని వచ్చేలోపే హత్యాకాండ ముగించి నిష్క్రమించటం తరచు కనబడే దృశ్యాలు. తల్లిదండ్రుల ఆలనా పాలనాలేని పిల్లల్ని, యువతను చేరదీస్తామని వారిలో అమాయకంగా కనబడేవారికి ప్రాధాన్యమిచ్చి ఏళ్లతరబడి ఆయుధ శిక్షణ ఇచ్చి మాదకద్రవ్యాల పంపిణీకీ హత్యలకూ వినియోగిస్తామని మాదకద్రవ్య ముఠా నాయకుడొకరు చెప్పాడు. ఆ కోణంలో దృష్టి సారించి పాఠశాల విద్య నుంచే స్కాలర్షిప్లిచ్చే పథకాన్ని ఆమ్లో అమలుచేశారు. కానీ పెద్దగా ఫలించలేదు. ఇవన్నీ అంతర్గత సమస్యలు. పొరుగునున్న అమెరికాతో అనేక పేచీలున్నాయి. ఆ దేశంలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారన్న కథనాలు మెక్సికోకు ఇబ్బందిగానే ఉన్నాయి. ఆ దేశంనుంచి వలసలను అరికట్టడానికీ, మాదకద్రవ్యాలను కట్టడి చేయటానికీ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని గతంలో ట్రంప్ ప్రకటించి పని మొదలెట్టినా బైడెన్ వచ్చాక ఆగిపోయింది. మరోపక్క లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికాతో వాణిజ్యం నెరపే దేశాల్లో మెక్సికోయే నంబర్ వన్. అందువల్ల ఆ దేశాన్ని అంత సులభంగా అమెరికా వదులుకోలేదు. పైగా మెక్సికో పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే కార్ల విడిభాగాల వల్లే అమెరికాలోని డెట్రాయిట్లో కార్ల పరిశ్రమలు సజావుగా సాగుతున్నాయి. మెక్సికో పవన విద్యుత్తోనే అమెరికా తయారీరంగ పరిశ్రమలు లక్షలమంది అమెరికన్లకు ఉపాధినిస్తున్నాయి. హృద్రోగులకు వాడే పేస్మేకర్లు మొదలుకొని పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాల వరకూ చాలా భాగం మెక్సికో నుంచి రావాల్సిందే. అందుకే ఇరుదేశాల వాణిజ్యమూ నిరుడు 80 వేల కోట్ల డాలర్ల వరకూ సాగింది. కనుక నేరస్థముఠాలను అరికట్టి శాంతిభద్రతలు తీసుకురాగలిగితే మెక్సికో సుసంపన్న దేశాల్లో ఒకటై నిలుస్తుంది. క్లాడియా ఆ పని చేయగలరా అన్నదే పెద్ద ప్రశ్న. -
గుజరాత్లో రూ. 130 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
గాంధీనగర్: గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. కచ్ తీరంలో సుమారు రూ. 130 కోట్ల విలువైన 13 ప్యాకెట్ల కొకైన్ను గురువారం తెల్లవారుజామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో మాదకద్రవ్యాలను దాచి పెట్టినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 13 ప్యాకెట్ల కొకైన్ను పట్టుకున్నారు. దీని విలువ రూ.130 కోట్లకు పైగా ఉంటుందని కచ్-ఈస్ట్ డివిజన్ పోలీసు సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ పేర్కొన్నారు. స్మగ్లర్లు కొకైన్ పట్టుబడకుండా సముద్ర తీరంలో ప్యాకెట్లను దాచిపెట్టినట్లు తెలిపారు. వీటిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఇదే ప్రాంతంలో రూ.800కోట్ల విలువైన 80 కొకైన్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
Gujarat: పిల్లల బొమ్మల్లో, లంచ్ బాక్సుల్లో దాచి..
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అహ్మదాబాద్లో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ. కోటికి పైగా విలువైన డ్రగ్స్ను కస్టమ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాలు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో అమెరికా, కెనడా, థాయ్లాండ్ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి రూ. 1.15 కోట్ల విలువైన హైబ్రిడ్, సింథటిక్ గంజాయి పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్లు, క్యాండీ విటమిన్లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఓ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఓజీ ఖుష్.. హైదరాబాద్లో కొత్తరకం డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్, సాక్షి: నగరంలో అత్యంత ప్రమాదకరమైన.. కొత్తరకం డ్రగ్స్ దందాను పోలీసులు పట్టుకున్నారు. అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ అక్రమ రవాణా, వినియోగం జరిగే ఓజీ ఖుష్ డ్రగ్స్ను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి బెంగళూరు మీదుగా ఈ మాదకద్రవ్యాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చి ఓ గ్యాంగ్ విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఓజీ ఖుష్ గంజాయిలో ఓ రకం. ఇది అత్యంత ప్రమాదకరమైంది. అఫ్గనిస్థాన్లోని హిందూఖుష్ కొండల్లో ఈ డ్రగ్స్ను సాగు చేస్తుంటారు. అందుకే దీని పేరులో ఖుష్ చేరింది. ఒక్క గ్రాము విలువ మన కరెన్సీలో రూ. 4 వేల దాకా ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం లాలాగూడలో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షల దాకా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
రాజేంద్రనగర్: గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్స్ను విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాదీనం చేసుకున్నారు. సన్సిటీ బండ్లగూడ జాగీర్లోని ఓ సూపర్ మార్కెట్ సమీపంలో గురువారం మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్ హోకం (21), మధ్యప్రదేశ్ శివుపురి గ్వాలియర్ ప్రాంతానికి చెందిన అనుభవ్ సక్సేనా (24)లు బ్యాగ్తో ప్యాసింజర్ ఆటోదిగి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న శంషాబాద్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.రాఘవేందర్, కానిస్టేబుళ్లు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ లభించింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. తాము ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. ఎండీఎం డ్రగ్స్ను ఐటీ, ఈవెంట్ మేనేజర్లకు విక్రయిస్తున్నామని తెలిపా రు. తాము చంద్రపూర్కు చెందిన సాబేర్ అనే వ్యక్తి ద్వారా కొరియర్ తెప్పించుకొని ఎక్కువ ధరలకు హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్ విలువ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందన్నారు. -
విచారణకు రాలేనంటూ లేఖ రాసిన హేమ
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ నేడు మే 27న విచారణకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె విచారణకు హాజరుకాలేనని లేఖ ద్వారా తెలిపింది.వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లేఖ ద్వారా పోలీసులకు హేమ తెలిపింది. అయితే ఆ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని హేమ కోరింది. అయితే, నేడు సాయంత్రం హేమకు మరో నోటీసు జారీ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. -
అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
బనశంకరి: ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ. బెంగళూరు నగరంలో నిర్వహించిన రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో అధిక మంది తెలుగువాళ్లే ఉన్నారని అందులోనూ రాజకీయ, సినీప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అసలు రేవ్ పార్టీలు అంటే ఏమిటి, ఇందులో కేవలం సెలబ్రెటీలే ఎందుకు పాల్గొంటారు, ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు, ఎందుకు సంపన్నులకు అంత వెర్రి అని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్కాగా.. క్లారిటీ ఇచ్చే యత్నమే ఈ కథనం. నైట్ క్లబ్లు, పబ్లు అనే పాశ్చాత్య సంస్కతి దేశంలో వేళ్లూనుకున్నాయి. సెలబ్రెటీలు, బడాబాబులు.. వాటిలో తనివితీరా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అంతకుమించి కావాలనుకునేవారి కోసం రేవ్ పార్టీలు రెడీగా ఉంటాయి. రేవ్ పార్టీ అనే సంస్కృతి 1950లో ఇంగ్లండ్లో ప్రారంభమై మెల్లగా ప్రపంచమంతా విస్తరించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో పెద్ద హాల్, లేదా ఎక్కడైనా చుట్టూ మూసి ఉన్న ప్రదేశంలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్సులు చేయడం, కావలసినంత మద్యం తాగడమే. ఆ షోలో నృత్యాలు చేసే కళాకారులు కూడా ఉండేవారు. అయితే..రానురాను ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తుంది. ఇందులోకి విచ్చలవిడి సంస్కృతి ప్రవేశించింది. నెమ్మదిగా ఈ రేవ్ పార్టీల్లోకి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జత అయ్యాయి. అతిథులు ఈ పారీ్టల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేయడం ఉంటాయని సమాచారం. అన్నింటికీ తెగించేవారే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం. అన్ని రకాల హడావుడిముంబై, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ లాంటి నగరాల్లోనే ఈ కల్చర్ పెరిగిపోతుంది. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకోవడం సబబే, కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకోవడం, అరుపులు, కేకలతో స్థానికులకు ఇబ్బంది పెట్టడం చట్ట విరుద్ధమే అవుతుంది. పైగా డ్రగ్స్, జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు అడుగు పెడుతున్నారు. సాధారణమైనా, రేవ్ అయినా పార్టీలపై పోలీసులు రైడ్చేసి అందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు. అశ్లీలత జరిగిందా, మైనర్లు పాల్గొన్నారా అన్నది కూడా ఆరాతీస్తారు. అనుమానం ఉంటే రక్తం, వెంట్రుకల నమూనాలను తీసుకుని టెస్టులకు పంపిస్తారు. ఆపై కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తారు. డ్రగ్స్ వాడినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. టికెట్ చాలా రేటు సాధారణంగా రేవ్ పార్టీలంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్పార్టీకి ఎంట్రీ ఫీజు సుమారు రూ.50 లక్షలు అని ప్రచారం సాగుతోంది. ఇంత డబ్బు పోసి టికెట్ కొనాలి. వాటిని చాలా గోప్యంగా నిర్వహిస్తారు. ఈ పారీ్టలో పరిమిత సంఖ్యలో పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. అతిథుల అభిరుచులను బట్టి పార్టీలో ఏర్పాట్లు ఉంటాయి. మద్యం, డ్రగ్స్, ఇంకా కొన్ని అంశాలు లభిస్తాయి. రేవ్పార్టీని బడా బాబుల ఫాంహౌస్, గెస్ట్ హౌస్లలో నిర్వహిస్తారు. 24 గంటల నుంచి 3 రోజుల వరకు కొనసాగవచ్చు. ఆహారం, ఆల్కహాల్ వంటి అన్ని వసతులూ లభిస్తాయి. ఊహల్లో మాత్రమే లభించే రకరకాల ఫాంటసీ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నా ఆశ్చర్యం లేదు. అందుకే అంత మోజు అంటారు. పార్టీలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు.ఉద్యానగరిలో దందా గత కొన్నేళ్లుగా సిలికాన్ సిటీలో రేవ్పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అనువైన వాతావరణం ఉండడమే కారణం. రెండేళ్ల క్రితం నగర పోలీసులు దాడిచేసి పలువురు సినీ సెలబ్రెటీలను అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ను కూడా పట్టుకున్నారు. టెక్కీలు, ధనవంతును లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఖరీదైన పార్టీలను సాగిస్తున్నారు. వాటి నిర్వాహకులకు అటు నాయకులు, ఇటు ఖాకీలతో సంబంధాలు ఉండడంతో చూసీచూడనట్లు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవో కొన్నిసార్లు మాత్రమే దాడులు జరుగుతున్నాయి. కొన్నిరోజులు హడావుడి జరగడం, ఆపై సద్దుమణగడం షరా మామూలుగా మారుతోంది. -
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
అమెరికన్ ప్రముఖ ర్యాపర్, గాయని నిక్కీ మినాజ్(41) అరెస్ట్ అయింది. అయితే, కొన్ని గంటల తర్వాత మళ్లీ ఆమెను విడుదల చేశారు. ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో నిక్కీ మినాజ్కు ఈవెంట్ ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ఆమ్స్టర్డామ్లోని షిపోల్ ఎయిర్పోర్ట్ వద్దకు నిక్కీ చేరుకుంది. తన బ్యాగ్లో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు ఆమెపై ఆరోపణలు రావడంతో ఆమ్స్టర్డామ్ అధికారులు ఆమెను నిర్బంధించారు. దీంతో ఆమె షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సంగీత్ కార్యక్రమం వాయిదా పడింది. ఆమె పాల్గొంటున్న ప్రోగ్రామ్ కోసం సుమారు ఇరువై వేల మంది టికెట్లు కొన్నారు. నిక్కీ వద్ద డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో తనిఖీల పేరుతో ఆమెను కొన్ని గంటల పాటు ఎయిర్పోర్టులోనే పోలీసులు ఉంచారు. ఫైనల్లీ తనవద్ద డ్రగ్స్ లేవని తేలడంతో ఆమెను పోలీసులు వదిలిపెట్టారు. అప్పటికే సమయం గడిచిపోవడంతో ఆమె పాల్గొనాలనుకున్న కార్యక్రమం వాయిదా పడింది. అయితే మరో కొత్త తేదీని ప్రకటిస్తామని అభిమానులకు నిక్కీ టీమ్ తెలిపింది. అయితే, పోలీసుల తీరుపట్ల నిక్కీ మినాజ్ అసహనం వ్యక్తం చేసింది. తన వద్ద డ్రగ్స్ లేకున్నా కావాలనే తన ప్రోగ్రామ్ చెడగొట్టేందుకు ఎవరో ఇలాంటి గేమ్ ప్లాన్ చేశారని ఆరోపించింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.కాగా 2010లో ‘పింక్ ఫ్రైడే’ అల్బమ్ తో నిక్కీ మినాజ్ పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ది పింక్ ప్రింట్, క్వీన్, ప్లే టైమ్ ఈజ్ ఓవర్ వంటి ఆల్బమ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. మినాజ్ ఎప్పటికప్పుడు అత్యంత ప్రభావవంతమైన హిప్ హాప్ కళాకారులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్ మొత్తంలో 10 గ్రామీ నామినేషన్లు, తొమ్మిది అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 11బీఈటీ అవార్డులు , నాలుగు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డులు, ఇతర పురస్కారాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి సంగీత అభిమానుల ప్రశంసలను ఆమె సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Barbie (@nickiminaj) -
హేమకు మద్దతు ప్రకటించిన మంచు విష్ణు
బెంగళూరు శివార్లలోని జీఆర్ ఫామ్హౌస్లో ఈ నెల 19న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నటి హేమ పేరు బయటకు రావడంతో టాలీవుడ్లో సంచలనంగా మారింది. తాజాగా రేవ్ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్ సేవించినట్లు తేలింది. ఈ క్రమంలో హేమ బ్లడ్ షాంపిల్స్లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో హేమ మే 27న విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం.బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు. నటి హేమపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని ఆయన కోరారు. ఆమెపై ఇంకా నేరం రుజువు కాలేదని ఆయన గుర్తుచేశారు. ఎవరికి వారే హేమ తప్పుచేసినట్లు నిర్ధారిస్తే ఎలా అని ప్రశ్నించారు. శ్రీమతి హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే భావించబడాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య అని గుర్తించాలి. ఇలాంటి పుకార్ల ఆధారంగా చేసుకుని ఆమెను దూషించడం అన్యాయం.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను తప్పకుండా ఖండిస్తుంది. ఒకవేళ హేమ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలను పోలీసులు ఇస్తే ఆమెపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలి.' అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు.Regarding the recent drug-related case at a rave party, few media outlets and individuals are making baseless allegations about actress Ms.Hema.I urge everyone to refrain from jumping to conclusions and spreading unverified information. Ms.Hema deserves to be presumed innocent…— Vishnu Manchu (@iVishnuManchu) May 25, 2024 -
TDP.. తెలుగు డ్రగ్స్ పార్టీ
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన నిందితుల్లో మరో ఇద్దరు టీడీపీ నేతలు హస్తం ఉన్న విషయం తాజాగా బయటపడింది.చిత్తూరు జిల్లా మద్దిపట్ల పల్లికి చెందిన ప్రణీత్ చౌదరితో పాటు అదే జిల్లా కొండేటివండ్ల గ్రామానికి చెందిన సుకుమార్ నాయుడు ఉన్నట్లు తేలింది. ఈ ఇద్దరూ టీడీపీ బెంగళూరు ఐటీ ఫారంకి చెందిన కీలక వ్యక్తులు. వీరికి పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో సత్సంబంధాలున్నాయి.కాగా, అంతకుముందు రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫోటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించగా, తాజాగా ప్రణీత్ చౌదరి, సుకుమార్ నాయుడులు సైతం ఇందులో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్కుమార్నాయుడులు ఈ రేవ్ పార్టీకి డ్రగ్స్ సప్లై చేశారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రణధీర్విక్రమ్నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్కుమార్నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు.డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో @naralokesh కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop… pic.twitter.com/8zi7mwScAH— YSR Congress Party (@YSRCParty) May 24, 2024మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు.ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. -
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు
-
డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. నటి హేమ రక్త నమూనా రిపోర్ట్ విడుదల
బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్లో జరిగిన రేవ్పార్టీ టాలీవుడ్ను కుదిపేసింది. ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులెవరూ ఈ పార్టీలో పాల్గొనలేదన్నారు. అయితే, పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ను వారు విడుదల చేశారు. దీంతో సినీ నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లుఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో పాల్గొన్న సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరి రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది. తాజాగా అందరి రక్త నమూనా రిపోర్ట్లు వచ్చాయని కర్ణాటక పోలీసులు తెలిపారు. తెలుగు నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు.86 మందికి పాజిటివ్డ్రగ్ టెస్టులో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్గా తేలిందని కర్ణాటక పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త నమూనా పరీక్షలో నిర్ధారణ అయిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇస్తుందన్నారు. పట్టుబడిన వారిలో 59 మంది పురుషుల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నాయన్నారు. 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 103 మందిలో మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు. వారందరికీ సమన్లు జారీ చేసి కౌన్సెలింగ్కు పిలిచే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ తీసుకున్నవాళ్లను బాధితులుగా పరిగణించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు.పేరు మార్చుకున్న హేమబెంగుళూరు డ్రగ్స్ కేసులో పోలీసులకు నటి హేమ వరుసగా ట్విస్ట్లు ఇచ్చింది. పార్టీకి వెళ్తున్న క్రమంలో తన పేరు బయటికి రాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంది. తన అసలు పేరుకు బదులుగా కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హేమా, చిరంజీవి, ఆశి రాయికి బెంగుళూరు సీసీబి పోలీసులు నోటిసులు ఇవ్వనున్నారు.రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ పేరు వచ్చిన వెంటనే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్లో ఫాంహౌస్లో ఉన్నాను అని చెప్పింది. ఆ సమయంలో ఆమె ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె తన ఇంట్లో ఉన్న మరొ వీడియోను విడుదల చేసింది. అయితే, తాజాగా పోలీసులు ఇచ్చిన ప్రకటనతో ఆమె ఇంకా రియాక్ట్ కాలేదు. -
‘రేవ్’ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!
చిత్తూరు అర్బన్: కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు ప్రధాన నిందితుల ఫొటోలు, వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్కుమార్నాయుడు ఉన్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు, వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణధీర్విక్రమ్నాయుడుకు చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయంటున్నారు. అరుణ్కుమార్నాయుడుది కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెబుతున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్న పోలీసులు ఐదుగురు మినహా.. మిగిలినవాళ్లను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వీళ్ల రక్తనమూనాలు సేకరించగా, విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని షరతు పెట్టారు. మాదక ద్రవ్యాలు విక్రయించిన ఐదుగురిలో వీరిద్దరితో పాటు మొహ్మద్ అబూబక్కర్ సిద్ధికి, ఎల్.వాసు, డి.నాగబాబులున్నారు. నిందితుల నుంచి 15.56 గ్రా. ఎండీఎంఏ పిల్స్, 6 గ్రాముల హైడ్రో గాంజా, 6.2 గ్రాముల కొకైన్తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం–1985, సెక్షన్ 8(సి), 22(బి), 22(సి), 22(ఏ), 27(బి), 25, 27, ఐపీసీ 1860 సెక్షన్ 290, 294 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతా ఓ పద్ధతి ప్రకారం.. వాసు బర్త్ డే పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో వాస్తవానికి ఎలాంటి బర్త్ డే వేడుకలు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ విక్రయించడం, వేశ్యా గృహాన్ని నిర్వహించడాన్ని పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఓ పాస్వర్డ్ ఇచ్చారు. వాసు బర్త్ డే పార్టీ అనే యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పినవాళ్లకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకులు ఓ ప్యాకేజీ ఇచ్చారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. తొలుత ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా, తర్వాత హెబ్బాగోడికి బదిలీ చేయాలనుకున్నారు. తాజాగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు(సీసీబీ) పోలీసులకు అప్పగిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు ప్రకటించారు. ఇందులో సెక్స్ రాకెట్ అంశం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించి, ఆ దిశగా సైతం విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన కార్లలో ఫార్చూనర్ కారు ఏపీ 39 హెచ్ 0002 నంబర్తో ఉంది. ఇది చిత్తూరులోని గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన త్యాగరాజులు నాయుడు అనే వ్యక్తి పేరిట ఉంది. త్యాగరాజులు నాయుడు కారు అక్కడ ఎందుకు ఉందనే దానిపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇంతలోపు ఈ కారును తొమ్మిది నెలల కిందటే మరో వ్యక్తికి విక్రయించినట్లు, అతను ఇంకా కారును తన పేరిట మార్చకోలేదని కొత్త డ్రామా చేస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత ఈ కారును ఉపయోగించినట్లు సమాచారం. -
బెంగళూరు రేవ్ పార్టీపై వెలుగులోకి సంచలన విషయాలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. రేవ్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు. ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, ‘సన్సెట్ టూ సన్రైజ్ విక్టరీ’ పేరుతో వ్యాపారి, క్రికెట్ బూకీ వాసు వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ దాదాపు 150 మంది ప్రముఖులు హాజరయ్యారు. బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ మొత్తానికి అరుణ్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. వాసు బర్త్డే పార్టీకి డగ్ర్ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్ కూడా రావడంతో డ్రగ్స్ వాడినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రేవ్ పార్టీ ఇచ్చిన క్రికెట్ బూకీ వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖులతో వాసుకు ఉన్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు. వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్లో నిఘా పెరగడంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు. వీరంతా రెండు రోజులుగా బెంగళూరు జీఆర్ ఫామ్హాస్లో మకాం వేసినట్టు సమాచారం. ఇక, నిన్న రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పార్టీలో తెలుగు, కన్నడ, తమిళ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రేవ్పార్టీలో 150 మంది ఉన్నారని డాగ్ స్క్వాడ్ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎక్కడ డ్రగ్స్ పార్టీలు జరిగినా టాలీవుడ్ నటులతో లింక్ పెడుతూ వార్తలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్పారీ్టలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. నటుడు శ్రీకాంత్, నటి హేమ వీరిలో ఉన్నారనే ప్రచారం జరగ్గా..దానిపై వారు వివరణ ఇచ్చారు. 2018లోనూ తెలంగాణ ఎక్సైజ్శాఖ అధికారులు దర్యాప్తు చేసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్ సహా పలువురిని ఎక్సైజ్ శాఖ అధికారులు రోజుల తరబడి విచారించడం సంచలనం సృష్టించింది. గతేడాది తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేసిన ఓ కేసులో నటుడు నవదీప్తో పాటు షాడో, రైడ్ చిత్రాల నిర్మాత ఉప్పలపాటి రవి, డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, మోడల్ శ్వేత, మహబూబ్నగర్ మాజీ ఎంపీ దేవరకొండ విఠల్ రావు కుమారుడు సురేశ్రావు తదితరుల పేర్లు బయటికి వచ్చాయి. తాజాగా బెంగళూరు పార్టీలో శ్రీకాంత్, హేమ ఉన్నారనే వార్తలు రావడం సంచలనం సృష్టించింది. -
సైలెంట్ మోడ్లో సీబీఐ.!
సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి.. భారీగా డ్రగ్స్ పట్టుకున్న సీబీఐ దాని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను కనిపెట్టే విషయంలో మాత్రం నిర్లిప్తత వహిస్తోంది. మూలాలు శోధించేందుకు బ్రెజిల్ వెళ్లిన బృందాలు కొండని తవ్వి కనీసం ఎలుక జాడ కూడా కనిపెట్టలేకపోయాయి. ప్రధాన పాత్రధారులుగా ఉన్న సంధ్యా ఆక్వా ప్రతినిధులు కళ్లెదుటే ఉన్నా కనీసం సమగ్రంగా విచారించకుండా వదిలేయడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ తీసుకొచ్చిన సంస్థపై చర్యలు తీసుకోకుండా గాలికొదిలేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మార్చి 19న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి రాకెట్ని సీబీఐ బట్టబయలు చేసింది. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన షిప్లోని కంటైనర్లో డ్రైఈస్ట్ని తీసుకొచ్చిన సంధ్యా ఆక్వా సంస్థ.. అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలీదంటూ బుకాయిస్తోంది. డ్రగ్స్ దొరికిన తొలి రోజున సంస్థ ప్రతినిధులను రెండు గంటల సేపు మాత్రమే సీబీఐ అధికారులు విచారించారు. తమకేమీ తెలీదని చెప్పడంతో వదిలేశారు. తర్వాత ఇంత వరకూ సంధ్యా ఆక్వా ప్రతినిధుల జోలికి సీబీఐ వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమికంగా సంధ్య ఆక్వా ప్రతినిధుల నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశాలున్నా కనీసం ఆ దిశగా సీబీఐ విచారించకపోవడం గమనార్హం. మొత్తం కంటైనర్లో వచ్చిన వెయ్యి బ్యాగుల్లో 70 శాతం బ్యాగ్స్లో ఉన్న డ్రైఈస్ట్లో కొకై న్, హెరాయిన్, ఓపియం, కొడైన్, మెథలాక్విన్ తదితర డ్రగ్స్ అవశేషాలున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే 30 శాతం బ్యాగుల్లో పూర్తిస్థాయిలో డ్రైఈస్ట్ లోడ్ చేసి ఒకవేళ పరీక్షలు నిర్వహించినా దొరకవనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికలతోనే డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐకి ఇంటర్పోల్ నుంచి సమాచారం రావడంతో ఈ రాకెట్ గుట్టురట్లు అయింది. పక్కాగా డ్రగ్స్ అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలున్నా సంధ్యా ఆక్వాపై ఇంతవరకూ సీబీఐ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.రిపోర్టులూ మరింత ఆలస్యం.?తమ దగ్గర ఉన్న కిట్స్ సాయంతో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో డ్రగ్స్ అవశేషాలున్నట్లు సీబీఐ గుర్తించింది. అయితే ఒక్కో బ్యాగ్లో ఎంత మొత్తం డ్రగ్స్ ఉన్నాయి.. ఏఏ డ్రగ్స్ ఎంత మేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించారు. అయితే ఇంతవరకూ దీనికి సంబంధించిన రిపోర్టులు రాలేదని సీబీఐ చెబుతోంది. సాధారణంగా ఎఫ్ఎస్ఎల్ నుంచి 10 నుంచి 15 రోజుల్లో నివేదిక వస్తుందని సంధ్యా డ్రగ్స్కు సంబంధించిన రిపోర్టు దాదాపు రెండు నెలలు కావస్తున్నా బయటికి రాకపోవడంపైనా సీబీఐ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.బ్రెజిల్ వెళ్లి ఏం చేశారు..?మరోవైపు డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తామంటూ సీబీఐకి చెందిన బృందం బ్రెజిల్ పయనమయ్యాయి. శాంటోస్ పోర్టుకు డ్రైఈస్ట్ తరలించిన ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ సంస్థతో పాటు కార్గో షిప్ వచ్చిన మార్గంతో పాటు షిప్ ఆగిన పోర్టుల్లో సీసీటీవీ పుటేజ్ సేకరించాలని సీబీఐ బృందం బ్రెజిల్ వెళ్లినట్లు తెలిసింది. అయితే దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే బ్రెజిల్ నుంచి సీబీఐ బృందం తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది. కానీ అసలు దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో కూడా సీబీఐ వెల్లడించకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఎక్కడ కంటైనర్ అక్కడే..రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ విషయంలోనూ సీబీఐ నిర్లక్ష్యం వహిస్తోంది. ఎక్కడైతే తనిఖీలు నిర్వహించారో ఆ ప్రాంతమైన వీసీటీపీఎల్లోనే డ్రగ్స్ దొరికిన కంటైనర్ని సీబీఐ సీజ్ చేసి విడిచి పెట్టేసింది. కంటైనర్ టెర్మినల్లో కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడిన కంటైనర్లతో పాటు ఈ డ్రగ్స్ కంటైనర్ కూడా విడిచిపెట్టేశారు. ఎర్రచందనం, నిషేధిత వస్తువులతో వచ్చిన కంటైనర్లను వీసీటీపీఎల్లోని ఓ ప్రాంతంలో ఉంచేస్తారు. దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా ఈ కంటైనర్లు ఇక్కడే ఉన్నాయి. వాటితో పాటుగా.. డ్రగ్స్ కంటైనర్ని కూడా సీబీఐ విడిచి పెట్టేసింది. కస్టమ్స్, వీసీటీపీఎల్ ప్రతినిధుల్ని ఆ కంటైనర్ భద్రపరచాలని సీబీఐ సూచించిందే తప్ప.. తమ తరఫున ఒక భద్రతా సిబ్బందిని కూడా కంటైనర్ వద్ద ఉంచకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా డ్రగ్స్ దోషులను బయటకి లాగాలని దర్యాప్తును సీబీఐ త్వరగా పూర్తి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. -
ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పట్టుకున్న నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర ప్రలోభావాల విలువ రూ.8889 కోట్లుంటుందని ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది. ఈ మేరకు ఈసీ శనివారం(మే18) ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రగ్స్,లిక్కర్ పట్టుకోవడంపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్గార్డ్ సంయుక్తంగా మూడు రోజుల్లో రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. -
రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్
గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. భారత్లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్గార్డ్ శనివారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి, పాకిస్థాన్కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్లో భాగంగా పాక్ నౌకని నిలువరించేందుకు కోస్ట్గార్డ్ నౌకలు, విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్రతన్లో ఎన్సీబీ,ఏటీఎస్ అధికారులు దాడులు చేశారు. Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024 -
రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వాడకాన్ని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన కూడళ్లు, చెక్పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. బాలాపూర్లో 24 గ్రాముల హెరాయిన్, మీర్పేట్లో 1.5 కేజీల ఓపీఎం, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఒక కంటైనర్, 8 బైక్స్, మొబైల్స్ సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.35 కోట్ల హెరాయిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన 5 కిలోల హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎవరి కంట పడకుండా హెరాయిన్ను లగేజ్ బ్యాగ్లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నిందితులు. స్కానింగ్ మిషన్లో లగేజ్ బ్యాగ్ పెట్టకుండా తప్పించుకునేందుకు యత్నించారు. అయితే కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా స్మగర్లను పట్టుకోవడంతో డ్రగ్స్ సీజ్ చేశారు. -
బర్త్ డే పార్టీలో డ్రగ్స్...
-
ప్యాకేజింగ్లోనే డ్రగ్స్ కలిశాయా?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ రాకెట్ చిక్కుముడిని విప్పేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను వేగవంతం చేసింది. బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన నౌక ట్రావెలింగ్ మ్యాప్ వివరాలను పిన్ టు పిన్ సేకరించే పనిలో సీబీఐ నిమగ్నమైంది. రావాల్సిన సమయం కంటే రెండు రోజులు ఆలస్యంగా ఎందుకు వచ్చిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య ఆక్వా సంస్థ గతంలో చేసుకున్న దిగుమతుల వివరాలను కూడా నిశితంగా పరిశీలిస్తోంది. బ్రెజిల్ నుంచి డ్రైఈస్ట్ కొనుగోలు చేసినట్లు చెబుతుండటంతో అక్కడి నుంచే పరిశోధించేందుకు దర్యాప్తు బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది. పది రోజుల ప్రయాణం.. అసలు ప్యాకేజింగ్లోనే డ్రగ్స్ కలిశాయా? లేదా మార్గమధ్యంలో చేరాయా? అనే కోణంలోనూ దర్యాప్తు మొదలైంది. బ్రెజిల్ నుంచి బయలుదేరిన నౌక విశాఖకు రెండు రోజులు ఆలస్యంగా వచ్చిందని సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సాధారణంగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు కంటైనర్ షిప్ వచ్చేందుకు 7 నుంచి 8 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ షిప్ 10 రోజులకు విశాఖ చేరుకుంది. అందుకు గల కారణాలేమిటనే అంశాలను అన్వేషిస్తున్నారు. ఆ రెండు పోర్టులకు ఎందుకు వెళ్లలేదు? ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో డ్రైఈస్ట్తో కూడిన కంటైనర్ కార్గో జిన్ లియాన్ యంగ్ గ్యాంగ్ కార్గో షిప్ హెచ్హెచ్ఎల్ఏ కంటైనర్ టెర్మినల్ నుంచి మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరింది. అక్కడి నుంచి షెడ్యూలింగ్ ప్రకారం ఈజిప్జులోని డామిట్టా కంటైనర్ టెర్మినల్కు, ఆ తర్వాత సూయజ్ కెనాల్లో బెర్తింగ్ కావాల్సి ఉంది. అయితే ఆ రెండు పోర్టులకు వెళ్లకుండా ‘స్కిప్ కాలింగ్’ చేశారు. నౌక నేరుగా మార్చి 9వతేదీ సాయంత్రం 4 గంటలకు బెల్జియంలోని ఆంట్వెర్ప్ గేట్వేకు చేరుకోగా అర్థరాత్రి 1.03 గంటలకు బెర్తింగ్ ఇచ్చారు. 10వతేదీ రాత్రి 9.43 గంటలకు నౌక తిరిగి అక్కడి నుంచి బయల్దేరింది. డాట్లాంటిక్లోని సీఎన్ఎం టెర్మినల్కు 11వ తేదీ వేకువ జామున 4 గంటలకు చేరుకుని 12వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరింది. అక్కడి నుంచి కొలంబో పోర్టుకు 13వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోగా రాత్రి 10.27 గంటలకు తిరిగి బయల్దేరింది. విశాఖ కంటైనర్ టెర్మినల్లోని టెర్మినల్–2కి 16వతేదీ సాయంత్రం 5.30 గంటలకు వచ్చింది. అదే రోజు రాత్రి 8.55 గంటలకు నౌకకు బెర్తింగ్ ఇచ్చారు. కొలంబో నుంచి నిర్ణీత సమయంలోనే.. కొలంబో నుంచి విశాఖ వచ్చేందుకు నౌకలకు 3 రోజుల సమయం పడుతుంది. అంటే ఆ నౌక నిర్ణీత సమయంలోనే చేరుకుంది. మరి బ్రెజిల్ నుంచి కొలంబో వచ్చే మార్గంలో సీల్ టాంపరింగ్ ఏమైనా జరిగిందా? అనే కోణంలోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రెండు పోర్టులకు వెళ్లకుండా నౌకను ఎందుకు దారి మళ్లించారనే విషయంపైనా ఆరా తీస్తున్నారు. రెండు పోర్టులకు వెళ్లకుండా నేరుగా వచ్చినప్పుడు రెండు రోజులు ఎందుకు ఆలస్యమైందనే అంశంపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్రెజిల్కు బృందాలు.. సంధ్యా ఆక్వా సంస్థ ప్రతినిధుల కాల్డేటాని విశ్లేషిస్తున్న సీబీఐ బృందం ఎవరెవరికి కాల్స్ వెళ్లాయి? ఏ ప్రాంతాలకు వెళ్లాయి? అనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించి ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసింది. బ్రెజిల్లో డ్రైఈస్ట్ ఆర్డర్ చేసిన సంస్థ దగ్గర నుంచి శాంటోస్, బెల్జియం, డాట్లాంటిక్, కొలంబో పోర్టులకు వెళ్లి షిప్ బెర్తింగ్ సమయంలో నిక్షిప్తమైన సీసీ టీవీ ఫుటేజీని సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం మరో బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. గతంలో సంధ్య ఆక్వా సంస్థ దిగుమతి చేసుకున్న కార్గో వివరాలు, సరుకు ఆర్డర్లు తదితర రికార్డులను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ అవశేషాలతో వచ్చిన కంటైనర్ని విశాఖ కంటైనర్ టెర్మినల్లోనే భద్రపరిచారు. -
డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదే..!
-
గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
-
అతి పెద్ద డ్రగ్స్ లింక్ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, బెంగళూరుతో ముడిపడ్డ భారీ డ్రగ్స్ నెట్వర్క్ను పంజాగుట్ట పోలీసులు చేధించారు. పెద్ద ఎత్తున 4.75 గ్రాముల 10 ఎక్స్టెసీ మాత్రలు, 5.18 గ్రాముల ఎండీఎంఏ, 109 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబాయికి చెందిన రోమి, పాలస్తీనా చెందిన సయీద్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడితో పాటు దేశంలో అక్రమంగా ఉంటూ హైదరాబాద్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న పాలస్తీనా శరణార్థిని అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకు సయూద్ విక్రయిస్తున్నారు. గోవా, బెంగళూరు, ముంబైలలో ఉంటూ దేశవ్యాప్తంగా 14 మంది స్మగర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇందులో ఏడుగురు నైజీరియన్లు ఉన్నట్లు నిందితులు వెల్లడించారు. హైదరాబాద్కి చెందిన 31 మంది వినియోగదారుల పేర్లు నిందితుల నుంచి పోలీసులు రాబట్టారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందర్ని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: Liquor Case: కవితకు జైలా? బెయిలా? -
యువతను చిత్తు చేస్తున్న మత్తు
-
‘సంధ్య’ నిర్వాకాలతో ఎగుమతులకు దెబ్బ
మహారాణిపేట: సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ దిగుమతి చేసుకున్న 25 వేల కిలోల ఇన్ యాక్టివ్ డ్రై ఈస్ట్లో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలడం మత్స్య ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ రవాణా వల్ల 20 ఏళ్ల క్రితం కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారుల త్యాగానికి విలువ లేకుండా పోయిందన్నారు. భూములిచ్చిన 766 మంది మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు ఇస్తామన్న మాటను ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. దేశ అభివృద్ధి కోసం విశాఖ పోర్ట్ యాజమాన్యానికి భూములిస్తే వారు ప్రైవేటు వ్యక్తులకు కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూములు అప్పగించారన్నారు. కంటైనర్ టెర్మినల్లో ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో అంతర్జాతీయ స్మగ్లర్లు అక్రమ వ్యాపారాలకు విశాఖను ఎంచుకుంటున్నారన్నారు. దీనివల్ల విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినడమే కాకుండా మత్స్య ఎగుమతులపై ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు భారత మత్స్య పరిశ్రమకు రాయితీలు, ప్రోత్సాహకాలు రద్దు చేయాలని నిర్ణయించడం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం నిర్వాకాలతో మత్స్య పరిశ్రమ, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంధ్యా ఆక్వా సంస్థతో పాటు విశాఖ కంటైనర్ టెర్మినల్, జేఎం బక్షి సంస్థలను దీనికి బాధ్యులుగా చేసి సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు కంటైనర్ దిగుమతులను విశాఖ పోర్ట్ అథారిటీ స్వయంగా పరిశీలించాలని కోరారు. దిగువ స్థాయి కస్టమ్స్ అధికారులు ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని, వీసీటీపీఎల్, జేఎం భక్షి సంస్థలు ఇందుకు బాధ్యత వహించాలన్నారు. విశాఖకు దిగుమతి అవుతున్న ప్రతి కంటైనర్ను పూర్తిగా స్కానింగ్ చేసిన తర్వాత దేశంలోకి అనుమతించాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు దూడపోలయ్య, గుంటు దానయ్య, వాసుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు . -
విశాఖ పోర్టు.. ఏమిటో లోగుట్టు?
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ రాకెట్ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. విశాఖలో ఫీడ్ యూనిట్ లేకపోయినా.. ప్రకాశం జిల్లాకు తరలించేందుకు ఇక్కడికి డ్రై ఈస్ట్ తీసుకు రావడంపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కస్టమ్స్ విభాగంలో దిగువ స్థాయి సిబ్బంది కొందరు ఈ తరహా వ్యవహారాలకు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే.. దూరమైనా సరే కొందరు విశాఖ పోర్టును ఎంపిక చేసుకుంటున్నారన్న కోణంలోనూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరోవైపు.. డ్రై ఈస్ట్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయన్న అంశంపై సంధ్యా ఆక్వా సంస్థ యజమానుల్ని దర్యాప్తు బృందం శనివారం విచారించింది. 25 వేల కిలోల డ్రై ఈస్ట్లో కొకైన్, హెరాయిన్, ఓపియం, కొడైన్, మెథక్విలాన్ మొదలైన డ్రగ్స్ అవశేషాలు బయట పడటంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంలో సంధ్యా ఆక్వా పాత్ర, ఇంకా ఎవరెవరి పాత్ర ఎంత అన్నదానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరా తీస్తుంటే.. అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి సంధ్య ఆక్వా సంస్థకు విశాఖలో ఫీడ్ యూనిట్ లేదు. ప్రకాశంలో దీనికి సంబంధించిన యూనిట్ ఉంది. అంటే.. విశాఖకు వచ్చిన డ్రైఈస్ట్ని ప్రకాశం యూనిట్కు తరలించేందుకు సంధ్య ఆక్వా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అలాంటప్పుడు.. నౌకని నేరుగా విశాఖ పోర్టుకు కాకుండా కృష్ణపట్నం పోర్టుకు తరలించవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కంటైనర్ హ్యాండ్లింగ్ని కృష్ణపట్నం పోర్టులో నిలిపివేశారు. తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుని కంటైనర్ టెర్మినల్గా అభివృద్ధి చేస్తున్నారు. ఒకవేళ.. ప్రకాశంకు తరలించాల్సి వస్తే.. కట్టుపల్లికి ఈ నౌకని బెర్తింగ్ కోసం పర్మిషన్ పెట్టుకోవాలి. దీని వల్ల.. సమయం, వ్యయం కూడా సదరు సంస్థకు ఆదా అవుతుంది. కానీ.. విశాఖకు ఎందుకు తరలించారన్న విషయంపై సదరు సంస్థ స్పందించకపోవడంపై సీబీఐ అనేక అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది. పోర్టు సిబ్బంది సహకారంపై సీబీఐ కన్ను విశాఖ కంటైనర్ టెర్మినల్లో కస్టమ్స్ వ్యవహార శైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ తనిఖీలు చేపట్టేందుకు ప్రయత్నించగా.. కస్టమ్స్ విభాగం వారు అడ్డుకున్నారని తెలుస్తోంది. తమ పరిధిలో హడావిడి చెయ్యడం తగదంటూ సీబీఐతో వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఫోన్లో జోక్యం చేసుకోవడంతో.. డ్రగ్స్ వ్యవహారంపై సీబీఐ ముందుకు వెళ్లగలిగింది. దీనిపై సీబీఐ గుర్రుగా ఉంది. కస్టమ్స్ విభాగం వ్యవహారంపైనా సీబీఐ కన్నేసింది. కస్టమ్స్లో దిగువ స్థాయి సిబ్బంది కొంత మంది.. కంటైనర్స్ తీసుకొస్తున్న సంస్థలతో లాలూచీ పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపడుతోంది. ఇటీవల విశాఖలో 600కు పైగా ఈ–సిగరెట్ బాక్సుల్ని నగర పోలీసులు పట్టుకున్నారు. ఇవి కూడా కంటైనర్ ద్వారా విశాఖ చేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ–సిగరెట్స్ని భారత్లో నిషేధించారు. అలాంటప్పుడు విశాఖ ఎలా చేరాయని ఆరాతీస్తే.. కంటైనర్ టెర్మి నల్లో కస్టమ్స్ని దాటుకొని నగరానికి వచ్చా యని తెలిసింది. ఇలా.. పలు అంశాల్లో కస్టమ్స్ విభాగానికి చెందిన కొందరు దిగువ స్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తూ.. ఈ తరహా నిషేధిత సరుకు బయటకి వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు నిజమేనని ఇలాంటి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. శనివారం కూడా మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి సంస్థ ఎండీ, డైరెక్టర్లను విచారించింది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు.. బ్రెజిల్ నుంచి ఫీడ్ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు.. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఆదివారం కూడా వారు మరోమారు విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించిందని తెలిసింది. -
'మత్తు' బంధం బహిర్గతం
కిలో కాదు.. రెండు కిలోలు కాదు.. ఏకంగా 25 వేల కిలోల డ్రై ఈస్ట్లో కలగలిసిన డ్రగ్స్ పట్టుబడిన వ్యవహారం చంద్రబాబు అండ్ గ్యాంగ్ వ్యాపార పునాదులను కదిలిస్తోంది. డ్రగ్స్ కంటైనర్ బ్రెజిల్ నుంచి నౌకలో బయలు దేరడం.. ఆ సమాచారం ఇంటర్పోల్ చెవిన పడటం.. వారు సీబీఐకి చేరవేయడం.. హుటాహుటిన సీబీఐ బృందం విశాఖ పోర్ట్కు రావడం.. ఆ కంటైనర్ను గుర్తించి సోదాలు, పరీక్షలు చేయడం.. అందులో కొకైన్ తదితర డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టం కావడం.. అంతా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఇంత భారీ పరిమాణంలో డ్రగ్స్ పట్టుబడిన ఈ వ్యవహారంలో అన్ని వేళ్లూ చంద్రబాబు, ఆయన బంధుగణంపైనే చూపిస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సాక్షి, అమరావతి: విశాఖ డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరికిన చంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన సంధ్యా ఆక్వా కంపెనీ కూనం కోటయ్య చౌదరి వెనుక ఉన్నది తమ కోటరీయేనని ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుట్రకు పదును పెడుతున్నాయి. అందుకే వాస్తవాలను వక్రీకరిస్తూ తమ అనుకూల మీడియా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా అవాస్తవాలను, అభూతకల్పనలను ప్రచారంలోకి తెస్తున్నాయి. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా.. ఫ్లెక్సీలను పట్టుకుని రాద్ధాంతం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఆ సాకుతో కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరిలతో దగ్గుబాటి కుటుంబ వ్యాపార బంధాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేస్తున్నాయి. సంధ్యా ఆక్వా కంపెనీతో టీడీపీ నేతల వ్యాపార లావాదేవీలు, బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు ఏమీ తెలీనట్లుగా ఓ వర్గం మీడియా నటిస్తోంది. కానీ కోటయ్య చౌదరి డ్రగ్స్ దందాచంద్రబాబు–దగ్గుబాటి కుటుంబాల మెడకు ఇప్పటికే చుట్టుకుందన్నది బహిరంగ రహస్యం. మసిపూసి మారేడుకాయ చేయాలన్న కుతంత్రాలు బెడిసి కొడుతుండటంతో చంద్రబాబు ఆత్మరక్షణలోపడిపోయారు. అంతా చౌదరి కుటుంబమే.. డ్రగ్స్ దందాలో పాత్రధారులు కూనం కోటయ్య చౌదరి కుటుంబం కాగా, సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ సభ్యులేనన్నది బట్టబయలైంది. బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేయించిన వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. కాగా ఈ దందాకు ఆర్థిక, రాజకీయ అండదండలు అందించడం, డ్రగ్స్ భారత్కు చేరుకున్నాక మార్కెటింగ్ వ్యూహం అమలు సూత్రధారులు అందరూ టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ నేతలే కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ వ్యవహారంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యుల వైపే వేళ్లన్నీ చూపుతున్నాయి. అసలు సంధ్యా ఆక్వా కంపెనీ ఏర్పాటులోనే దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం కీలక పాత్ర పోషించింది. ఆమె కుమారుడు దగ్గుబాటి చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగానే ఆ కంపెనీని స్థాపించారు. అనంతరం ఆ కంపెనీని మూడుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాగా ఆ అంతర్జాతీయ స్థాయి వ్యాపారం వెనుక డ్రగ్స్ స్మగ్లింగ్ లోగుట్టు దాగుందన్నది తాజాగా సీబీఐ సోదాల్లో వెల్లడైంది. మరోవైపు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ ముఖ్య నేతలు, వారి వారసులతో సంధ్యా ఆక్వా కంపెనీ కోటయ్య చౌదరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. దామచర్ల సత్య (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లతో ఓ కోటరీగా గూడుపుఠాణి నిర్వహించారన్నది వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు దామచర్ల జనార్ధన్ అత్యంత సన్నిహితుడు కాగా, ఆయన సోదరుడు దామచర్ల సత్య ప్రస్తుతం లోకేశ్ కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ పచ్చ ముఠా సభ్యులంతా తరచూ విదేశీ పర్యటనలు చేస్తారని.. ఆ ముసుగులో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారని.. కలసి ఎంజాయ్ చేస్తారనే ఫొటోలు సోషల్ మీడియాలో రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. ఆలపాటి రాజాకూ లింకు చంద్రబాబు గీచిన గీత జవదాటరనే పేరున్న ఆలపాటి రాజాకు సంధ్యా ఆక్వా కంపెనీ కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరీలతో ఆరి్థక బంధం ఉందని నిరూపించే పత్రాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ కలసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు నిగ్గు తేలింది. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాల్లో తమ దందాను విస్తరించిన సంధ్యా ఆక్వా కంపెనీతో నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. బాలయ్య చిన్న అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్ కుటుంబం విశాఖలో సంధ్యా ఆక్వా కంపెనీ ఎండీ కూనం కోటయ్య చౌదరికి పలు వ్యవహారాల్లో సహకారం అందించింది. భరత్ కుటుంబ సహకారంతోనే విశాఖపట్నంలో సంధ్యా ఆక్వా వ్యాపార కార్యకలాపాలు విస్తరించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి కూడా భరత్ కుటుంబంతో మొదటి నుంచీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న తరుణంలోనే భరత్ కుటుంబానికి చెందిన గీతం విద్యా సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించిందన్నది గమనార్హం. ఈ వాస్తవాలు, పరిణామాలన్నీ కూడా డ్రగ్స్ దందాలో పాత్రధారి అయిన సంధ్యా ఆక్వా కంపెనీతో చంద్రబాబు, పురందేశ్వరి కుటుంబాలు, కోటరీలకు సన్నిహిత సంబంధాలున్నాయని స్పష్టంచేస్తున్నాయి. పచ్చ గ్యాంగ్ నాడు అలా.. నేడు ఇలా భారీ డ్రగ్స్ను విశాఖ పోర్టుకు తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోయిన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్పై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే కొరడా ఝుళిపించింది. కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పాటించకుండానే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్(సీఎఫ్ఈ) కోసం విజయవాడలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జోనల్ కార్యాలయానికి సంధ్యా ఆక్వా దరఖాస్తు చేసింది. దీనిపై విచారణ జరపగా ఆ కంపెనీ నిబంధనలేమీ పాటించలేదని తేలింది. దీంతో దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు 2019 సెపె్టంబర్ 18న ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేస్తూ కంపెనీకి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. నిజానికి అంతకు ముందు కూడా దరఖాస్తు చేయగా తిరస్కరించామని, ఇదే కంపెనీ అదే మళ్లీ అలానే దరఖాస్తు చేసినందున తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. సంధ్యా ఆక్వాలో నీరు, గాలి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, వ్యర్థాలను శుద్ధి చేయడానికి తగినంత భూమి వారి వద్ద అందుబాటులో లేదని తెలిపింది. వ్యర్థాలను సమీపంలోని కాలువలో వదిలేస్తున్నట్లు తాము గుర్తించామని ఆర్డర్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పొల్యూషన్ బోర్డు అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. అప్పటికే ఏవైనా కార్యకలాపాలు ప్రారంభించి ఉంటే వెంటనే వాటన్నింటినీ నిలిపివేయాలని కూడా హెచ్చరించింది. దీనిని బట్టి సంధ్యా ఆక్వా అక్రమాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందనేది సుస్పష్టం అవుతోంది. అలాంటప్పుడు ఇంతలా చర్యలు తీసుకున్న ప్రభుత్వంపై బురదజల్లడానికి పచ్చ గ్యాంగ్, పచ్చ మీడియా విఫలయత్నం చేస్తోంది. తమ సన్నిహిత సంస్థ అని ఆ రోజు భుజానకెత్తుకుని, ఈ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదంటూ రచ్చ చేసిన టీడీపీ, ఎల్లో మీడియా.. ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం బయట పడేసరికి ప్లేటు ఫిరాయించాలని చూస్తోంది. కానీ నిందితులంతా టీడీపీ పెద్దలకు అత్యంత ఆప్తులనే విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నది టీడీపీ యత్నం డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో తమ వ్యవహారం బట్టబయలు కావడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు తానేం చేస్తున్నారో గుర్తించలేకపోతున్నారు. అయోమయానికి గురై వైఎస్సార్సీపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ తానే అడ్డంగా దొరికిపోతున్నారు. కూనం ప్రభాకర్ చౌదరి ఫొటోలు ఉన్న ఓ ఫ్లెక్సీని చూపిస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేసేందుకు యత్నిస్తున్నారు. ఆయన ఈ ఏడాది సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామంప్రకాశం జిల్లాలోని ఈదుమూడి వెళ్లారు. ఆ సందర్భంగా పార్టీలకు అతీతంగా కుటుంబ వ్యవహారంగా ఆ గ్రామస్తులు వేసిన ఫ్లెక్సీలో కూనం ప్రభాకర్ చౌదరి ఫొటోలు వేశారు. అదేమీ వైఎస్సార్సీపీ రాజకీయ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం అంత కంటే కాదు. భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ గ్రామస్తులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అది. అందులో ఎక్కడా వైఎస్సార్సీపీ పేరు కూడా లేదు. అయినా ఆ ఫ్లెక్సీలో ఫొటో ఉంది కాబట్టి కూనం ప్రభాకర్ చౌదరి వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అంటూ టీడీపీ దు్రష్పచారం చేస్తుండటం విడ్డూరం. డ్రగ్స్ దందాలో నిండా మునిగిన చంద్రబాబు ఈ ఫ్లెక్సీ పట్టుకుని గోదారి ఈదాలన్నట్టుగా భావిస్తుండటం హాస్యాస్పదంగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘మేత’వన్నె పులి
సాక్షి, అమరావతి: డ్రై ఈస్ట్ మాటున రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ను బ్రెజిల్ నుంచి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్టు కంపెనీ పేరిట దిగుమతి చేసుకున్న ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. రొయ్యల మేత మాటున రూ.లక్షల కోట్ల డ్రగ్స్ దందా సాగిస్తూ ‘మేత’వన్నె పులిగా ‘సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్’ ఖ్యాతిపొందింది. ఈ క్రమంలో అసలు డ్రై ఈస్ట్ అంటే ఏమిటి? ఎలా తయారవుతుంది.? ఏయే అవసరాల కోసం ఎంత మోతాదులో వినియోగిస్తారు. ఆక్వా ఫీడ్ తయారీలో నిజంగానే వాడతారా? ఫీడ్ తయారీలో ఈ సంస్థ ఎప్పుడు అడుగు పెట్టింది ? ప్లాంట్ సామర్థ్యం ఎంత ? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది? అనే అంశాలపై చర్చ జరుగుతోంది 90 శాతానికిపైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే డ్రై ఈస్ట్ అనేది సజీవ సూక్ష్మజీవుల సమాహారం. ఇదొక ఇమినో బూస్టర్లా ఉపయోగపడుతుంది. శిలీంధ్రాల జాతికి చెందిన దీని శాస్త్రీయ నామం సక్కరో మైసెస్. ప్రధానంగా యాక్టివ్ డ్రై ఈస్ట్, ఇన్స్టంట్ డ్రై ఈస్ట్, ఫాస్ట్ యాక్టింగ్ ఇన్స్టంట్ ఈస్ట్, బ్రెడ్ మెషిన్ ఈస్ట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా బేకరీ, ఆహార ఉత్పత్తుల తయారీలో వాటి ఆకృతి, రుచి, పెరుగుదలకు వాడుతుంటారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్ ఫీడ్ తయారీలోనూ కొద్దిగా వాడతారు. ఈస్ట్ను ఉత్పత్తి చేసే కంపెనీలు దేశీయంగా చాలా ఉన్నాయి. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడం, విదేశాలతో పోల్చుకుంటే ధర ఎక్కువగా ఉండడంతో మెజార్టీ ఆహార ఉత్పత్తుల తయారీదారులు విదేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటారు. బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, చైనాలో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. దేశీయంగా క్వాలిటీని బట్టి కిలో రూ.200 నుంచి రూ.480 వరకు ఉంటే, ఒక్క బ్రెజిల్లోనే కిలో రూ.70కు అందుబాటులో ఉంటుంది. కారణం ఇక్కడ ఎక్కువగా పండే బార్లీ నుంచి ఈస్ట్ ఉత్పత్తి చేసే కంపెనీలు ఎక్కువగా ఉండడమే. అందుకే ఒక్క బ్రెజిల్ నుంచి ఏటా 500 టన్నుల ఈస్ట్ మన దేశానికి దిగుమతి అవుతుంది. దిగుమతి అయ్యే డ్రై ఈస్ట్లో నూటికి 90 శాతానికి పైగా ఆహార ఉత్పత్తుల తయారీలోనే ఉపయోగిస్తారు. ఆక్వా, పౌల్ట్రీ, యానిమల్ ఫీడ్ తయారీలో వాడకం ఐదు శాతం లోపే ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువగా ఫీడ్ సప్లిమెంట్ కోసం వాడతారు. ఆక్వా సాగులోనూ హెక్టారుకు 5 గ్రాములకు మించి వాడరు ఆక్వాసాగులో ఈస్ట్ను రైతులు ఉపయోగిస్తుంటారు. సాగుకు ముందు చెరువులను సిద్ధం చేసే సమయంలో వాటర్ ఫ్యూరిఫికేషన్ చేస్తారు. ఈ సమయంలో వరిపిండి, తవుడు, బెల్లం, నీరు కలిపిన ద్రావణంలో 1–2 గ్రాములు ఈస్ట్ను కలిపి 24 గంటలపాటు పులియబెట్టి ఆ తర్వాత చెరువులో కలుపుతారు. దీనివల్ల పైటో ప్లాంటన్ (వృక్ష సంబంధమైన ప్లవకం), జూ ప్లాంటన్ (జంతు సంబంధమైన ప్లవకం) తయారవు తుంది. వీటిని తినేందుకు రొయ్యలు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. ఇలా హెక్టార్కు ఐదు గ్రాములకు మించి వినియోగించరు. ఆ తర్వాత వ్యాధికారక క్రిములను తట్టుకొని మెరుగైన రోగనిరోధకశక్తిని పొందేందుకు, నీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రో బయోటిక్స్గానూ వాడుతుంటారు. వీటి తయారీలో కూడా ఈస్ట్ను ఫీడ్ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. రొయ్యల మేత తయారు చేసే ఫీడ్ కంపెనీలు దేశీయంగా 16 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 14 లక్షల టన్నుల మేత ఉత్పత్తి జరుగుతుంది. ఒక్క అవంతి ఫీడ్ కంపెనీయే ఏటా 5–6 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత సీపీఎఫ్ కంపెనీ 2 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తుంటే, మిగిలిన కంపెనీలన్నీ ఏటా 50 వేల నుంచి లక్ష టన్నులలోపు ఉత్పత్తి చేస్తుంటాయి. ఏకంగా 25 టన్నులెందుకు? ఇక సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెట్ పేరిట అధికారికంగా పామర్రులో రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, నెల్లూరులో బ్లాక్వాటర్ షల్ ఫిష్ హేచరీ ఉంది. రెండు నెలల క్రితం కాకినాడ జిల్లా మూలపేట వద్ద మరో ప్రాసెసింగ్ ప్లాంట్, వజ్రకూటం వద్ద ఏటా 60వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్వా ఫీడ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా మార్కెట్లోకి రాలేదు. కేజీ మేత తయారీ కోసం కేవలం 5 గ్రాములకు మించి డ్రై ఈస్ట్ను వాడరు. అంటే 25 టన్నుల డ్రై ఈస్ట్ ద్వారా కనీసం 5 లక్షల నుంచి 6 లక్షల టన్నుల మేత తయారు చేయొచ్చు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 60 వేల టన్నులు మాత్రమే. ఈ లెక్కన ఇంత పెద్ద ఎత్తున డ్రైడ్ ఈస్ట్ దిగుమతికి ఆర్డర్ ఇవ్వడం వెనుక చాలా గూడుపుఠాణి ఉందని అర్థమవుతోంది. టీడీపీ, బీజేపీ పెద్దల సహకారంతోనే డ్రై ఈస్ట్ పేరిట డ్రగ్స్ను దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. రైతులకు రూ.కోట్లలో బకాయిలు మరోవైపు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ రోజుకు 80 టన్నుల నుంచి 150 టన్నుల రొయ్యలను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నెల్లూరు వరకు ఉన్న ఆక్వా రైతుల నుంచి కొనుగోలు చేస్తుంది. వీటిని ప్రాసెస్ చేసి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తుంది. గతంలో ఎక్స్పోర్ట్ కంపెనీలు చెప్పిందే ధర.. ఇచ్చిందే సొమ్ము అన్నట్టుగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అప్సడా చట్టం చేయడం, పైగా కౌంట్ల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ప్రాసెసింగ్ కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రతి 15రోజులకోసారి పర్యవేక్షిస్తుండడంతో కంపెనీల ఆటలు సాగడం లేదు. స్థానిక ఆక్వా రైతులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈక్వెడార్ నుంచి 17 కంటైనర్లలో రొయ్యలను దిగుమతి చేసుకొని వాటిని ప్రాసెస్ చేసి తిరిగి అమెరికా, చైనాకు ఎగుమతి చేస్తున్నారని తెలియడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కంపెనీని కొంతకాలం పాటు సీజ్ చేసింది. ఎగుమతులకూ బ్రేకులేసింది. ఇటీవల కాలంలో ఈ సంస్థ రైతులకు రూ.కోట్లలో బకాయి పడింది. రొయ్యలు సరఫరా చేసినందుకు ఈ కంపెనీ తనకు రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉందని భీమవరానికి చెందిన ఓ రైతు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విధంగా సుమారు రూ.10 కోట్లకు పైగా ఈ సంస్థ రైతులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. బకాయిలు చెల్లించేలా చూడాలి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదమే. ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను ప్రాసెస్ చేసి అమెరికాకు పంపుతున్న సమయంలో అప్సడా ఉక్కుపాదం మోపింది. చట్టపరంగా చర్యలు తీసుకుని కంపెనీని చాన్నాళ్లు మూసేసింది. ఇటీవల ప్రారంభించిన ఫీడ్ ప్లాంట్ తయారీకి ఎలాంటి అనుమతులూ లేవని చెబుతున్నారు. ఉత్పత్తిని పూర్తిస్థాయిలో ప్రారంభించని ఈ సంస్థకు ఇంతపెద్ద ఎత్తున డ్రై ఈస్ట్ దిగుమతి చేసుకోవల్సిన అవసరం ఏముంది? ఏదేమైనా ముందుగా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు అణాపైసలతో సహా చెల్లించి తీరాల్సిందే. ఈ సంస్థను అడ్డంపెట్టుకుని డ్రై ఈస్ట్ మాటున డ్రగ్స్ రాకెట్ నడుపుతున్న టీడీపీ, బీజేపీ పెద్దలెవరో తెలియాలంటే సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
డ్రగ్స్ ముఠాపై నార్కోటిక్ ఉక్కుపాదం
-
'మత్తు' చుట్టూ చుట్టాలే
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఒంగోలు/గాంధీ నగర్ (విజయవాడ సెంట్రల్)/ పిఠాపురం/ చీరాల/ విశాఖ సిటీ/ సాక్షి ప్రతినిధి,గుంటూరు: విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ దందాలో వేళ్లన్నీ టీడీపీవైపే చూపుతున్నాయి. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్ను దిగుమతి చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, అధిపతి కూనం కోటయ్య చౌదరి టీడీపీలో ప్రముఖులైన నారా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామచర్ల, లావు కుటుంబాలకు అత్యంత సన్నిహితులన్నది బహిర్గతమైంది. డ్రగ్స్ మాఫియా బండారం బట్టబయలు కావడంతో బెంబేలెత్తిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి దిగి విషయాన్ని పక్కదారి పట్టించాలని కుట్ర పన్నారు. ఈ అంకంలో భాగంగా ఒకపక్క సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతుండగానే గురువారం రాత్రే చంద్రబాబు, లోకేశ్ వరుస ట్వీట్లు చేస్తూ టీడీపీ శ్రేణులతోపాటు టీడీపీ అనుకూల మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలు, అభూత కల్పనలు జోడిస్తూ దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా డ్రగ్స్ దందా వెనుక తాము ఉన్నామనే విషయాన్ని కప్పిపుచ్చవచ్చని చంద్రబాబు భావించారు. అయితే కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతల వ్యాపార బంధం వెలుగు చూడటంతో బాబు కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబంతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. రాయపాటి, దామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు ఉన్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదురుతుందనే సంకేతాలు అందిన వెంటనే బ్రెజిల్ నుంచి భారీగా డ్రగ్స్ దిగుమతికి తెర తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం గమనార్హం. కింగ్ పిన్ కోటయ్య చౌదరి.. డ్రగ్స్ దందాలో కీలక పాత్రధారులైన సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితులని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆయన సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల జాబితాను చూస్తే ఆ విషయం తేలిపోతోంది. దామచర్ల సత్యం (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారంతా ఓ కోటరీగా పెద్ద ఎత్తున వ్యవహారాలు సాగించారన్నది వెల్లడైంది. వారు విదేశాల్లో అత్యంత సన్నిహితంగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దామచర్ల సత్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం ఉంది. సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరితోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆలపాటి రాజాకు వ్యాపార బంధం ఉంది. వారిద్దరూ సంతకాలు చేసిన పలు పత్రాలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విశాఖ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న సంధ్యా ఆక్వా కంపెనీకి నందమూరి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్కు కూనం కోటయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు. ఆయన కుటుంబం సహకారంతోనే విశాఖ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సంధ్యా ఆక్వా కంపెనీతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్నది ఇప్పటికే బయటపడింది. పురందేశ్వరి కుమారుడు చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగా కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి ఆక్వా వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో డ్రగ్స్ దందాలో తీగ లాగితే చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి కోటరీ అక్రమాల డొంకంతా కదులుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ.. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో మద్యం కుంభకోణానికి పాల్పడిన సిండికేట్లో ఆ కంపెనీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఆ కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు విశాఖ డ్రగ్స్ దందాను కూడా కలిపి మొత్తంగా మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో నిమగ్నమైంది. పొత్తుతోనే బరితెగింపు.. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎప్పుడో సిద్ధపడ్డారు. అందుకోసం కాళ్ల బేరానికి కూడా దిగజారతానని గతేడాదే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తును అవకాశంగా చేసుకుని భారీగా డ్రగ్స్ దందాకు పచ్చ మాఫియా బరితెగించింది. ఎన్నికల ముందు భారీగా డ్రగ్స్ను రాష్ట్రంలోకి తరలించేందుకు పథకం వేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సంధ్యా ఆక్వా కంపెనీ ద్వారా బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల ఈస్ట్ దిగుమతి ముసుగులో భారీగా డ్రగ్స్ను చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రెండు నెలల్లో డ్రగ్స్ విశాఖ చేరుకునేలా అంతా సిద్ధమైంది. అటు దగ్గుబాటి ఇటు చంద్రబాబు కుటుంబాలు సహకారం ఉండటంతో తమ దందాకు అడ్డు ఉండదని భావించారు. డ్రగ్స్ మాఫియాపై అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్కు ఉప్పందడంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం విశాఖ పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ బాగోతం బట్టబయలైంది. పచ్చ కుట్ర బెడిసికొట్టింది. ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ తక్షణమే ప్రతి స్పందించింది. డ్రగ్స్ దందాతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు ఉన్న బంధాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. నియమావళిని ఉల్లంఘిస్తూ చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో నివేదించింది. దీనిపై జాతీయ ప్రెస్ కౌన్సిల్కు కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. డ్రగ్స్ దందాపై సత్వరం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి పాత్రధారులతోపాటు సూత్రధారులను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసింది. కూనం కుటుంబం కథ... విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులైన సంధ్యా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అధినేతలు కూనం వీరభద్ర చౌదరి, కుమారుడు కూనం కోటయ్య చౌదరి స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి. ఆక్వా రంగంలో ఉత్థాన పతనాలను చూసిన వీరభద్ర చౌదరి డ్రగ్స్ వ్యాపారంలో కాలు మోపాడు. కాకినాడ ప్రధాన కేంద్రంగా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్ల ముసుగులో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అటు టీడీపీ ఇటు రాష్ట్ర బీజేపీ అగ్రనేతల అండదండలతో తన కార్యకలాపాలను విస్తరించాడు. కూనం కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంధ్యా ఆక్వా ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్లతో పాటు ఆక్వా కల్చర్ చెరువులు కూడా ఉన్నాయి. వీరి వ్యాపార లావాదేవీలు కొండపి, ఒంగోలు, కందుకూరు, పర్చూరు నియోజకవర్గాల్లోనూ సాగుతున్నాయి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్యనారాయణ(సత్య)తో కూనం కుటుంబానికి వ్యాపార లావాదేవీలున్నాయి. టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో దామచర్ల సత్యకు చెందిన పొగాకు గోడౌన్లో సంధ్యా ఆక్వా పేరుతో ప్రీ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటైంది. కూనం కుటుంబానికి విజయవాడకు చెందిన సౌమ్యుడిగా పేరున్న ఓ టీడీపీ నేతతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. కోటయ్య చౌదరి, టీడీపీ నేత తనయుడు తనయుడు విదేశాల్లో మంచి సన్నిహితులని తెలిసింది. కాకినాడ తీరంలో కలకలం డ్రగ్స్ తీగ లాగితే కాకినాడ జిల్లా కొత్తపల్లి తీరంలోని మూలపేటలో డొంక కదిలింది. మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 10 మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు జరిపారు. సీబీఐ ఇన్స్పెక్టర్ బల్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం ఈ తనిఖీలు చేసింది. జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి సమీపాన ఉన్న సంధ్య ఆక్వా సీడ్ తయారీ కంపెనీ, కృష్ణా జిల్లా పామర్రు తదితర ప్రాంతాల్లో ఉన్న సంధ్య ఆక్వా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెబుతున్నారు. కత్తిపూడి సమీపంలోని సంధ్య ఆక్వా సీడ్ కంపెనీని ఇటీవలే ప్రారంభించారు. దీనిలో ఆక్వా సీడ్ తయారీకి అవసరమైన ముడి సరుకును బ్రెజిల్ నుంచి దిగుమతి చేయడంతో ఆ సరకు నౌక ద్వారా విశాఖకు కంటైనర్లలో చేరింది. వాటిలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు సంధ్య కంపెనీలన్నింటిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించి మందులు, ఇతర శాంపిల్స్ సేకరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అధికారులు తిరిగి సోదాలు చేస్తామని తెలిపారు. చీరాలకు లింకు? డ్రగ్స్ దందాకు చీరాలతో కూడా లింకులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సంధ్యా ఆక్వా పేరుతో వాడరేవులో గత రెండేళ్లుగా కంపెనీ నడుస్తోంది. దీన్ని పురందేశ్వరి అల్లుడు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. గత పది రోజులుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయని సమాచారం. మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్ పరీక్ష డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం మరికొన్ని శాంపిల్స్ను పరీక్షించగా ఫలితాలు పాజిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో న్యాయమూర్తి సమక్షంలో 25 వేల కేజీల సరుకుతో కూడిన కంటైనర్ను సీజ్ చేశారు. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి రవాణా నౌక ద్వారా విశాఖకు వచ్చిన కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19, 20వ తేదీల్లో 49 బ్యాగుల్లో శాంపిల్స్ను పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో ఈ నెల 21వ తేదీన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం మరోసారి వీసీటీపీఎల్కు వెళ్లి మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్ను పరీక్షించారు. వాటి ఫలితాలు కూడా పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం. న్యాయమూర్తి సమక్షంలో రికార్డులతో పాటు శాంపిల్స్ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి సమక్షంలోనే బ్యాగులను సీజ్ చేశారు. మరికొన్ని సీబీఐ బృందాలు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోమరిన్ని ఆధారాలతో సీబీఐ అధికారులు త్వరలోనే అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘ఆలపాటి’ ఆర్థిక బంధం విశాఖ డ్రగ్స్ కేసులో కీలక పాత్రధారి కూనం వీరభద్ర చౌదరి(వీరభద్రరావు)తో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఉన్న ఆర్థిక సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఆలపాటి రుణాలకు కూనం సెక్యూరిటీ ఇవ్వడంతోపాటు ఎన్ఆర్ఐ అకాడమీతో భాగం పంపిణీ చేసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. 2015 అక్టోబరు 31న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు అరండల్పేట విజయా బ్యాంకు బ్రాంచ్లో రూ.2 కోట్లు రుణం (దస్తావేజు నంబరు 11158/2015) తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 9న మరో రూ.12 కోట్లు అదే బ్యాంకు నుంచి రుణాన్ని పొందారు. దీనికి ఆలపాటి రాజా భార్య ఆలపాటి మాధవితోపాటు కూనం వీరభద్రరావు, ఎన్ఆర్ఐ అకాడమీ ఆస్తులను (దస్తావేజు నంబరు 12521/2015) తనఖా పెట్టారు. 2021లో కూనం వీరభద్రరావుకు ఎన్నారై అకాడమీకి సంబంధించి పార్టీషన్ దస్తావేజు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. కూనం వీరభద్రరావు తమ ఆస్తులను తనఖా పెట్టి 2017లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్కు రుణాన్ని ఇప్పించారు (దస్తావేజు నంబరు 4581/2017). ఇదే దస్తావేజును 2021లో (నంబరు 12205/2021) రద్దు చేసుకున్నారు. దీంతోపాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా వీరిద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్ శివారులో రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఐడీఏ బొల్లారంలో భారీగా దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే మాదక ద్రవ్యాలను శుక్రవారం డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్ పోల్ సహకారంతో బొల్లారంలో డ్రగ్స్ రాకెట్ను గుట్టురట్టు చేశారు. స్థానికంగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పీఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అధికారులు సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి.. రూ. 9 కోట్ల విలువైన 90 కిలోల మేపిడ్రిన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. గత పదేళ్లుగా ఈ డ్రగ్స్ను తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. విదేశాలకు తరలిస్తున్న కస్తూరిరెడ్డిని అరెస్ట్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో వాటిని పెట్టి బయటకు తరలిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్లోనూ నిషేధిత డ్రగ్స్ అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: దానం నాగేందర్తో సహా పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు