డ్రగ్స్ కేసు: నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు ముమ్మరం | Hyderabad Youth Dies Drug Case Police Searching For Accused | Sakshi
Sakshi News home page

Drug Case: నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు ముమ్మరం

Apr 2 2022 8:12 AM | Updated on Apr 2 2022 10:50 AM

Hyderabad Youth Dies Drug Case Police Searching For Accused - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. లక్ష్మీపతికి హైదరాబాద్‌లో భారీ నెట్‌వర్క్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా లక్ష్మీపతి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌, ఇన్‌స్టా వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాం ద్వారా సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులకు వల వేస్తున్నట్లు పోలీసుల తెలిపారు. 

గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.  లీటర్‌ హాష్‌ ఆయిల్‌ను రూ.6 లక్షలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. డ్రగ్స్‌ దందాలో లక్ష్మీపతి నెట్‌వర్క్‌లో 100 మందికి పైగా వినియోగదారులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్‌లో లక్ష్మీపతిపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు లక్ష్మీపతి ఎప్పటికప్పుడు మకాం మారుస్తున్నట్లు సమాచారం. మొదట గంజాయి ఆ తర్వాత హాష్‌ ఆయిల్‌, డ్రగ్స్ విక్రయాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే దర్యా​ప్తులో భాగంగా స్పెషల్ టీంలు గోవాకు వెళ్లాయి.

చదవండి: డీజే.. డ్రగ్స్‌ రిస్క్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement