వివాహమై ఏడాది కాకముందే.. భార్యభర్తలు | Two Wheeler Accident Tragedy In Tamilnadu | Sakshi
Sakshi News home page

వివాహమై ఏడాది కాకముందే.. భార్యభర్తలు

Aug 15 2021 8:41 PM | Updated on Aug 15 2021 8:45 PM

Two Wheeler Accident Tragedy In Tamilnadu - Sakshi

సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు మృతిచెందారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన శరవణన్‌(39), నివేద(37) దంపతులు ఈ నెల 8వ తేదీ ద్విచక్ర వాహనంపై తిరుత్తణికి వెళుతున్నారు. పట్రపెరంబదూరు వద్ద వెనుక నుంచి లారీ ఢీకొనడంతో గాయపడ్డారు.

తిరువళ్లూరులో ప్రథమ చిక్సిత అనంతరం చెన్నై రాజీవ్‌గాంధీ వైద్యశాలకు తరలించారు. ఈ నెల 10న నివేద మృతి చెందగా, శనివారం శరవణన్‌ మృతి చెందాడు. వివాహమై ఏడాది కాకముందే భార్యభర్తలు కన్నుమూయడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement