
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా అధ్యాపకురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తూత్తుకుడి జిల్లాలో జరిగింది. నజ్రత్ డేనియల్ వీధికి చెందిన సెంథిల్ మురుగన్, శాంతి కుమార్తె వేలాంగని తెన్కాశిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. అదే కళాశాలలో పనిచేస్తున్న ఈ రోడ్డుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 9న వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో సోమవారం వేలాంగని తల్లితో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు, ఇంకా పెళ్లి కాలేదని..హోటల్కు తీసుకెళ్లి
Comments
Please login to add a commentAdd a comment