సిరిసిల్లలో ‘కిలేడీ’లు.. మాటలు కలిపి.. మనీ లాగేస్తూ.. | Woman Gang Steals Money In Karimnagar | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో ‘కిలేడీ’లు.. మాటలు కలిపి.. మనీ లాగేస్తూ..

Jul 30 2021 10:02 AM | Updated on Jul 30 2021 10:02 AM

Woman Gang Steals Money In Karimnagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్‌): మద్యం మత్తులో ఉన్నవారే వారి టార్గెట్‌. వారిని మాటల్లో దింపి మనీ తీసుకుని వెళ్లిపోవడంలో ఆరితేరిన ‘కిలేడీ’లు సిరిసిల్ల టౌన్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిరిసిల్ల పాతమార్కెట్‌ ఏరియాలోని కల్లు కాంపౌండ్‌ను అడ్డాగా చేసుకుని ముగ్గురు మహిళలు, మరో వ్యక్తి మందుబాబుల జేబుల్లోంచి డబ్బులు కాజేస్తున్నట్లు తెలిసింది. దీనిపై వచ్చిన సమాచారంతో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళలతో పాటు మరో వ్యక్తిపై నిఘావేశారు.

ఎట్టకేలకు డబ్బులు కాజేస్తున్న విషయం నిజం అని తెలడంతో మహిళ ల ను విచారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు వీరు మూడురోజుల క్రితం రూ.30వేలు దొంగతనం చేశారని, వారి చిరునామాలు, రోజువారి పనులు తెలుసుకునే పనిలో సిరిసిల్ల టౌన్‌ పోలీసులు నిమగ్నమై నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సిరిసిల్ల టౌన్‌ ఎస్సై అపూర్వరెడ్డిని వివరణ కోరగా మూడు రోజు ల క్రితం సమాచారం వచ్చిందని దీనిపై దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement