భూమానార్య శతక పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

భూమానార్య శతక పుస్తకావిష్కరణ

Published Fri, Mar 7 2025 8:56 AM | Last Updated on Fri, Mar 7 2025 8:57 AM

భూమానార్య శతక పుస్తకావిష్కరణ

భూమానార్య శతక పుస్తకావిష్కరణ

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో మదగాని విజయలక్ష్మి రచించిన తెలంగాణ మాండలిక భాషలో భూమనార్యశతకం పుస్తకాన్ని వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మాండలికం ప్రధానంగా పల్లెలో వాడుక భాష సహజమైన వ్యవహారిక భాష ఈ భూమనార్యశతకం అని కొనియాడారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి కేయూ తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యులు అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ..భూమనార్య మాట బుద్ది మాట మకుటంతో మదగాని విజయలక్ష్మి రాసిన భూనార్యశతకం ఒక విశేషమైనదన్నారు. ఈ సమావేశంలో తెలుగు విభాగం అధిపతి డాక్టర్‌ మామిడి లింగయ్య, డాక్టర్‌ చిర్రరాజు, గిరిజామనోహర్‌, సంగాల కోమల, స్వామి నాయక్‌, బేరి దేవేందర్‌, అభిరామ్‌, వేణు, ఎర్ర రాజు, ప్రసాద్‌, నిత్యానందం, విద్యార్థులు పాల్గొన్నారు.

పాలక మండలి సమావేశం వాయిదా!

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం ఈనెల 7న హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. వాయిదా పడినట్లు సమాచారం. పాలక మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ఎజెండాను కూడా కాకతీయ యూనివర్సిటీ అధికారులు రూపొందించారు. ఈమేరకు పాలకమండలి సభ్యులకు ఆ సమాచారం కూడా అందించారు. అయితే గురువారం రాత్రి పాలకమండలి సమవేశం వాయిదా వేశామని, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత సమాచారం అందిస్తామని వర్సిటీ అధికారులు పాలక మండలి సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement