ఈ ఉగ్ర గ్రూపులకు పాకిస్తానీలే బాస్‌లు | Pakistanis Leading Terror Groups | Sakshi
Sakshi News home page

ఈ ఉగ్ర గ్రూపులకు పాకిస్తానీలే బాస్‌లు

Jul 27 2020 4:22 AM | Updated on Jul 27 2020 5:01 AM

Pakistanis Leading Terror Groups - Sakshi

ఐక్యరాజ్యసమితి: భారత ఉపఖండంలో కార్యకలాపాలు సాగిస్తున్న అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తానీ జాతీయులే నాయకత్వం వహిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.  ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ ది లెవాంట్‌–ఖొరాసాన్‌ (ఐఎస్‌ఐఎల్‌–కె), తెహ్రిక్‌–ఇ–తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) తదితర ఉగ్రసంస్థల నేతల పేర్లను ఆంక్షల జాబితాలో చేర్చలేదని తెలిపింది. ఐఎస్‌ఐఎల్, అల్‌కాయిదా, వాటి అనుబంధ వ్యక్తులు, ఆస్తులపై ఐరాస ఏర్పాటు చేసిన ఆంక్షల సమీక్ష కమిటీ ఈ విషయాలు వెల్లడించింది.

  ఐఎస్‌ఐఎల్‌–కె అధిపతి అస్లాం ఫరూఖీ అలియాస్‌ అబ్దుల్లా ఒరాక్జాయ్‌తోపాటు మాజీ అధినేత జియా ఉల్‌హక్‌ అలియాస్‌ అబూ ఒమర్‌ ఖొరాసానీ, అల్‌కాయిదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌) నేత ఒసామా మహ్మూద్‌ కూడా పాకిస్తాన్‌కు చెందిన వారేననీ,వీరి పేర్లు ఆంక్షల జాబితాలో లేవని ఆ నివేదిక పేర్కొంది.  అఫ్గానిస్తాన్‌లోని అతిపెద్ద ఉగ్ర ముఠా   టీటీపీ చీఫ్‌ అమిర్‌ నూర్‌ వలీ మెహ్సూద్‌ కూడా పాకిస్తాన్‌కు చెందిన వాడేనని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement