సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Sat, May 18 2024 8:30 AM

-

గద్వాల రూరల్‌: ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుంచి జూన్‌3వ తేదీ వరకు సంప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు, ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3,664మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు, జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రాంచందర్‌, డీఎస్పీ సత్యనారాయణ, హృదయరాజు, డీప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement