లారీ ఢీకొని యువకుడి మృతి
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బైక్ను లారీ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు, కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యామ్ప్రసాద్(29) వేంపాడు సమీపంలో సుబి ఇన్ఫ్రా ఫ్యాబ్రికేషన్ వర్క్ షాపులో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బైక్పై టోల్ ప్లాజా వద్ద టీ పాయింట్కు వెళ్తుండగా, వెనుక నుంచి లారీ ఢీకొంది. బైక్ నడుపుతున్న శ్యామ్ప్రసాద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న స్నేహితుడు సాయిబాబాకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోలీసులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సన్నిబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment