కారును ఢీకొన్న టిప్పర్‌.. పాస్టర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న టిప్పర్‌.. పాస్టర్‌ దుర్మరణం

Published Wed, Mar 26 2025 12:44 AM | Last Updated on Wed, Mar 26 2025 12:42 AM

ఫెర్టిలైజర్‌సిటీ/ఎల్కతుర్తి: టిప్పర్‌.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కఽథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్‌టీపీసీ జ్యోతినగర్‌కు చెందిన కనుకపుడి కరుణాకర్‌(58) రామగుండం కార్పొరేషన్‌ 39వ డివిజన్‌ గౌతమినగర్‌లోని గ్లోరియస్‌ మినిసీ్‌ట్రస్‌ చర్చిలో పాస్టర్‌. సోమవారం రాత్రి ఒంటి గంటకు కారులో ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్‌ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులోని ఛాయ్‌ విహార్‌ సమీపంలో ముల్కనూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్‌ ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు నడుపుతున్న కరుణాకర్‌కు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పాస్టర్‌ కరుణాకర్‌ మృతికి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ సంతాపం తెలిపారు.

కారును ఢీకొన్న టిప్పర్‌.. పాస్టర్‌ దుర్మరణం 1
1/1

కారును ఢీకొన్న టిప్పర్‌.. పాస్టర్‌ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement