ఉచిత ప్రయాణం... సీట్ల కోసం కొట్టుకున్న మహిళలు | - | Sakshi
Sakshi News home page

ఉచిత ప్రయాణం... సీట్ల కోసం కొట్టుకున్న మహిళలు

Jun 21 2023 7:28 AM | Updated on Jun 21 2023 7:58 AM

- - Sakshi

మైసూరు: ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు కొట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడంతో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మైసూరులోని చాముండి కొండకు వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళల గుంపు సీట్ల కోసం కొట్టుకున్నారు. ఇటీవల కొంత మంది మహిళలు చాముండి కొండకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కారు.

అప్పటికే బస్సు రద్దీగా ఉంది. బస్సులో వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారని, వారికి సీట్లు ఇవ్వాలని కొందరు మహిళలు కూర్చున్న వారికి విజ్ఞప్తి చేశారు. వారు అంగీకరించకపోవడంతో తిట్టుకుంటూ మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టి కొట్టుకున్నారు. కొందరు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి ఫైటింగ్‌ మొత్తం సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement