భార్యతో వివాహేతర సంబంధం... మిత్రుని గొంతు కోసి రక్తం తాగాడు | - | Sakshi
Sakshi News home page

భార్యతో వివాహేతర సంబంధం... మిత్రుని గొంతు కోసి రక్తం తాగాడు

Jun 26 2023 8:04 AM | Updated on Jun 26 2023 9:58 AM

- - Sakshi

తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి పైశాచికంగా ప్రవర్తించాడు.

కర్ణాటక: తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి పైశాచికంగా ప్రవర్తించాడు. మిత్రుడని చూడకుండా గొంతు కోసి రక్తం తాగిన ఘోర సంఘటన చింతామణి తాలూకా సిద్దేపల్లి దగ్గర జరిగింది. వివరాలు.. తాలూకాలోని బట్లపల్లి గ్రామానికి చెందిన విజయ్‌, చేలూరు తాలూకాలోని మారేష్‌ ఇద్దరు కూడా బట్టలు వ్యాపారం చేసుకొని జీవించేవారు.

ఇరు కుటుంబాల వారు కలిసిమెలిసి ఉండేవారు. ఇరువురు చింతామణి పట్టణంలోని గాంధీనగరంలో అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు. తన భార్య మాలాతో మారేష్‌ చాలా సన్నిహితంతో ఉన్నాడని విజయ్‌కు అనుమానాలు వచ్చాయి. ఈనెల 19వ తేదీన విజయ్‌, మిత్రుడు జాన్‌బాబు కలసి బైక్‌ మీద మారేష్‌ను సిద్దేపల్లి దగ్గర నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు.

అక్కడ మారేష్‌ను విజయ్‌ చాకుతో గొంతుకోసి రక్తం తాగుతున్న వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. ఇది తెలిసి కంచార్లపల్లి పోలీసులు విజయ్‌, జాన్‌బాబును అరెస్టు చేసి కేసునమోదు చేశారు, కాగా, వారి నుంచి తప్పించుకున్న మారేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement