బాలికపై కుక్కలతో దాడి | - | Sakshi
Sakshi News home page

బాలికపై కుక్కలతో దాడి

Oct 15 2023 12:54 AM | Updated on Oct 15 2023 8:08 AM

వీణాను పరామర్శిస్తున్న అధికారులు   - Sakshi

వీణాను పరామర్శిస్తున్న అధికారులు

దొడ్డబళ్లాపురం: తల్లిదండ్రులు తన కోళ్లఫారంలోకి పనికి రాలేదనే కోపంతో ఓ వ్యక్తి వారి కుమార్తైపె కుక్కలను ఉసిగొల్పి దాడి చేయించిన అమానుష సంఘటన మాగడి తాలూకా చిక్కసోలూరు గ్రామంలో జరిగింది. కుక్కల దాడిలో సురేశ్‌, లీలావతి దంపతుల కుమార్తె వీణ (15)కు గాయాలయ్యాయి. వివరాలు.. గ్రామ శివార్లలో ఆనంద్‌కుమార్‌ అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫారంలో సకలేశపురకు చెందిన సురేశ్‌ దంపతులు పనిచేస్తున్నారు.

వీరి కుమార్తె వీణ చిక్కసోలూరులోని హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. దగ్గరిలోనే ఉన్న మరో కోళ్లఫారం యజమాని నాగరాజు ఆ దంపతులను తన ఫారంలో చేరాలని కోరగా ససేమిరా అన్నారు. దీంతో అక్కసు పెంచుకున్న నాగరాజు తన కోళ్లఫారం దగ్గర ఆడుకుంటున్న వీణపైకి పెంపుడు కుక్కలను ఉసిగొల్పడంతో అవి ఆమెను కరిచాయి. గాయపడిన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement