కుమారుడికి బెయిల్‌ ఇప్పిస్తానని తల్లిపై అత్యాచారం | - | Sakshi
Sakshi News home page

కుమారుడికి బెయిల్‌ ఇప్పిస్తానని తల్లిపై అత్యాచారం

Published Wed, Feb 28 2024 12:40 AM | Last Updated on Wed, Feb 28 2024 8:50 AM

- - Sakshi

నెలల తరబడి వివాహేతర సంబంధం

ఆమెతో దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్‌

ఆమె కుమార్తెనూ కిడ్నాప్‌ చేసిన వైనం

కీచకుడిపై పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

సాక్షి,బళ్లారి: ఓ హత్య కేసులో నిందితుడైన యువకుడి తల్లికి మాయమాటలు చెప్పి, మీ కుమారుడికి బెయిల్‌ ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళపై అత్యాచారం చేసి, అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఓ కీచకుడి ఉదంతం వెలుగు చూసింది. వివరాలు..బెళగావి జిల్లాలో ఓ యువకుడు హత్య కేసులో జైలు పాలయ్యాడు. నిందితుడి తల్లి కుమారుడికి బెయిల్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగింది. అంతలో ఓ కామాంధ కీచకుడి కన్ను ఆమె పైపడింది. మీ కుమారుడికి బెయిల్‌ ఇప్పిస్తానని నమ్మబలికి ఆమెతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుని తన అవసరాలను తీర్చుకున్నాడు.

ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్టు చేసేంత విక్రత చర్యలకు పాల్పడ్డాడు. ఆమె కుమార్తెను కూడా కిడ్నాప్‌ చేశాడు. ఇక ఆ కీచకుడి అరాచకాలకు తట్టుకోలేక సదరు మహిళ బెళగావి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని స్వచ్ఛంద సంస్థలను కూడా ఆశ్రయించింది. తన కుమార్తెను కిడ్నాపర్‌ చెర నుంచి విడిపించాలని కోరింది. ఈ ఘటన బెళగావి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మాయమాటలను మహిళలు నమ్మకూడదని పోలీసులు సూచించి, కీచకుడి ఆచూకీ కోసం వేట ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement