● వేలాదిగా సైబర్ మోసాలు జరుగుతుంటే పోలీసులు ఛేదిస్తున్నవి మాత్రం చాలా తక్కువ.
● వంచకులు వేల సంఖ్యలో నకిలీ బ్యాంక్ అకౌంట్ల కలిగి ఉండటం, క్రిప్టో కరెన్సీలోకి నగదు మార్చడం, అత్యాధునిక టెక్నాలజీ, వాయిస్ కాలింగ్ వ్యవస్థలను వాడడం వల్ల పోలీసులకు వారిని కనిపెట్టి నగదు స్వాధీనం చేసుకోవడం తలకు మించిన పనవుతోంది.
● బాధితుల ఖాతా నుంచి నేరగాళ్లు క్షణాల్లో వివిధ బ్యాంక్ అకౌంట్లకు నగదు బదిలీ చేస్తారు. బ్యాంకుల నుంచి సమాచారం రావడం ఆలస్యం కావడం పోలీసులకు ఆటంకంగా ఉంటోంది.
● దుబాయ్, కాంబోడియా, థాయ్లాండ్, హాంకాంగ్, చైనా దేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో వారి మూలాలను కనిపెట్టడం కష్టసాధ్యమని పోలీసు అధికారులు తెలిపారు.