![సబ్సిడీ వేరుశనగకు చురుగ్గా పేర్ల నమోదు](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/23/verusanaga_mr.jpg.webp?itok=H1ZxjjTo)
కర్నూలు(అగ్రికల్చర్): సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగకు ఆర్బీకేల్లో పేర్ల నమోదు చురుగ్గా జరుగుతోంది. బుధవారం సాయంత్రానికి 4వేల క్వింటాళ్లకు రైతులు సంబంధిత రైతుభరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఏపీ సీడ్స్ 3వేల క్వింటాళ్ల వేరుశనగను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచింది. ముందస్తు వర్షాలు పడుతుండటంతో వేరుశనగకు డిమాండ్ పెరిగింది. ఆదోని ప్రాంతంలో నాన్ సబ్సిడీ చెల్లించిన రైతులకు వేరుశనగ ప్యాకెట్లను పంపిణీ చేయడం కూడా మొదలు పెట్టడం విశేషం.