ప్రాణం తీసిన విద్యుదాఘాతం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన విద్యుదాఘాతం

Published Sun, Mar 30 2025 2:33 PM | Last Updated on Tue, Apr 1 2025 3:42 PM

దేవనకొండ: గ్రామసభ కోసం వేసిన టెంటును తొలగిస్తూ విద్యుదాఘాతంతో కింద పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన తెర్నెకల్‌ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం గ్రామసభను నిర్వహించి రాత్రి 7:30 గంటల సమయంలో టెంటును తొలగిస్తున్నారు. ఈ క్రమంలో టెంటుపైభాగాన ఉన్న హెవీ విద్యుత్‌ లైన్‌కు గిరిపోగు ప్రతాప్‌ ప్రతాప్‌ (30) చేయి తగిలింది. 

విద్యుదాఘాతంతో ఆ యువకుడు 12 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా సీసీ రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయాలు తగలడంతో దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గిరిపోగు ప్రతాప్‌కు వివాహం కాలేదు. తల్లి మునెమ్మ, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement