పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా..
హసన్పర్తి: సోదరి పెళ్లి పత్రికలు పంచేందుకు స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. యాదాద్రి–ఆరెపల్లి జాతీయ రహదారిపై రెడ్డిపురం క్రాస్ వద్ద శనివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.రవి కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరికి చెందిన గడ్డం చైతన్య(28), వరంగల్ నగరం కరీమాబాద్కు చెందిన ఎర్ర అఖిల్(28)లు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ యాప్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం కరీమాబాద్లో అఖిల్ సోదరి దివ్య వివాహం జరగనుంది. బంధువులు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంచడానికి అఖిల్, చైతన్య కలిసి బైక్పై యాదాద్రి–ఆరెపల్లి జాతీయ రహదారి మీదుగా హనుమకొండ వైపునకు బయలుదేరారు. రెడ్డిపురం వద్ద వీరి బైక్ను వెనుకవైపు నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ బైక్పై నుంచి ఎగిరిపడి పడ్డారు. తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
పెళ్లింట విషాదం..
ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు హుటాహుటి న ఘటనస్థలానికి చేరుకున్నారు. కాకతీయ యూని వర్సిటీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.రవికుమార్, ఎస్సై ర వీందర్ సంఘటన స్థలాన్ని చేరకుని పరిస్థితిని సమీ క్షించారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఈ సంఘటనతో పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
ప్రమాదకారకుడి అరెస్ట్,రిమాండ్..
మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనకు కారకుడైన గోలమర్రి అజిత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.రవికుమార్ తెలిపారు. మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
బైక్ను ఢీకొన్న కారు..
ఇద్దరు యువకుల దుర్మరణం
నేడు జరగాల్సిన
సోదరి వివాహం వాయిదా
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా..
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా..
Comments
Please login to add a commentAdd a comment