నిర్మలమ్మ.. కరుణించేనా..! | - | Sakshi
Sakshi News home page

నిర్మలమ్మ.. కరుణించేనా..!

Published Sat, Feb 1 2025 1:51 AM | Last Updated on Sat, Feb 1 2025 1:51 AM

నిర్మలమ్మ.. కరుణించేనా..!

నిర్మలమ్మ.. కరుణించేనా..!

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉన్న రైల్వే ప్రాజెక్టులకు ఈసారైనా నిధులు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల విస్తరణ, కొత్తగా రోడ్ల నిర్మాణానికి నిధులు అందజేస్తారన్న అంచనాలు ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నా.. నిరాశే ఎదురవుతుంది. ఈ ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ విషయంలో ప్రతిసారి కేంద్రం నుంచి రిక్తహస్తం ఎదురవుతోంది. ఈసారైనా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉమ్మడి జిల్లాకు నిధులు అందుతాయన్న ఆశలు నెలకొన్నాయి.

రహ‘దారుల’పై ఆశలు..

మ్మడి జిల్లామీదుగా వెళ్లే హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–44ను ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా అభివృద్ధి పరుస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఇందుకు అవసరమైన అ డుగులు మాత్రం ముందుకు పడలేదు. అలాగే హై దరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై సుమారు 63 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకోసం ప నులు డీపీఆర్‌ దశలో ఉన్నాయి. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు జాతీయ రహదారి పనులు ప్రా రంభమైనా, సోమశిల వద్ద ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుకాలేదు. టెండర్‌ ప్రక్రియను పూర్తిచేసి పనులను వేగవంతం చేయాల్సి ఉంది. నల్లమలలోని పదర మండలం మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించి ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలను మరింత సులభం చేయాలన్న అంశం ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది.

కేంద్ర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు ప్రతి ఏటా నిరాశే

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సాయం అందేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement