మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్లోని సీఎం నివాసంలో కలిసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం .. ఎమ్మెల్యేతో సంప్రదించి బ్రహ్మోత్సవాలకు ఏ రోజు వచ్చేది చెబుతానని పేర్కొన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మన్యంకొండ దేవస్థాన చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment