
పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కి విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్బీతోపాటు ఎంపీ సంతోష్కుమార్, హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ను అమితాబ్ అభినందించారు. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని అమితాబ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున కోరారు.
Comments
Please login to add a commentAdd a comment