
'పాలై పొళుదుమ్ ఉన్నోడు', 'సాలైయోరమ్' లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకుడు కే.మూర్తి కన్నన్ కొత్త సినిమాకు రెడీ అయ్యారు. ఈసారి పూర్తిస్థాయి కామెడీ స్టోరీని ఎంచుకున్నారు. స్మైలీ పిక్చర్స్ పతాకంపై ఎం.వసంతి, కె.కావ్య పెరుమాళ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడిన డైరెక్టర్.. ఒక ప్రముఖ నటుడి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బిగ్బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అర్జున్ ఎలిమినేట్!)
కూత్తుపట్రైలో శిక్షణ పొందిన ఎన్ టి.సెంథిల్ అనే మలేషియా తమిళుడిని ఈ చిత్రంలో ముఖ్యపాత్ర ద్వారా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు తమిళ తెరపై రానటువంటి డిఫరెంట్ కామెడీ, థ్రిల్లర్ కథతో ఈ సినిమా తీయబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు మూర్తి కన్నన్ తెలిపారు.
(ఇదీ చదవండి: బిగ్బాస్: ప్రశాంత్కు బంపరాఫర్ ఇచ్చిన శ్రీముఖి)