నిర్మాతగా కరిష్మా కపూర్‌ | Karisma Kapoor turn producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా కరిష్మా కపూర్‌

Sep 11 2020 3:26 AM | Updated on Sep 11 2020 3:26 AM

Karisma Kapoor turn producer - Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటి కరిష్మా కపూర్‌ పూర్తి స్థాయి సినిమాల్లో కనిపించక సుమారు ఎనిమిదేళ్లు పైనే అవుతోంది. ఇటీవలే ‘మెంటల్‌ హుడ్‌’ వెబ్‌ సిరీస్‌ ద్వారా కమ్‌బ్యాక్‌ ఇచ్చారు కరిష్మా. పిల్లల్ని పెంచడంలో తల్లి కష్టం ఏంటి? వంటి విషయాలను ఈ సిరీస్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం నిర్మాతగా మారాలనే ఆలోచనలో కరిష్మా ఉన్నారట. ముందు వెబ్‌ సిరీస్‌లు, ఆ తర్వాత సినిమాలు నిర్మించాలనుకుంటున్నారని సమాచారం. కొత్త కొత్త ఐడియాలను తమ బ్యానర్‌ ద్వారా ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నారట. త్వరలోనే మొదటి వెబ్‌ సిరీస్‌ విషయాలను ప్రకటించడానికి కరిష్మా సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement