web series
-
రాజకీయ ఒత్తిళ్లకు లొంగారు.. ‘నెట్ఫ్లిక్స్ ’పై అనురాగ్ కశ్యప్ ఫైర్!
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నెట్ఫ్లిక్స్ ఇండియాపై సంచలన వాఖ్యలు చేశాడు. నెట్ఫ్లిక్స్ ఇండియా(Netflix India)లో పనిచేసే పై స్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యారని, వారు నైతికంగా అవినీతిపరులేనని విమర్శించాడు. నెట్ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్ని ప్రశంసిస్తూ.. ఇలాంటి ప్రాజెక్టులను భారత్లో నెట్ఫ్లిక్స్ సంస్థ తిరస్కరిస్తోందని ఆరోపించాడు. నెట్ఫ్లిక్స్ ఇండియా దర్శకుల సృజనాత్మక స్వేచ్ఛను అణచివేస్తోందని, కమర్శియల్ కంటెంట్ను మాత్రమే ప్రోత్సహిస్తోందని కశ్యప్ మండిపడ్డాడు.అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ‘మాక్సిమం సిటీ’ వెబ్ సిరీస్ని నెట్ఫ్లిక్స్ 2024లో రద్దు చేసిన సంగతి తెలిసిందే. నెట్ఫ్లిక్స్ నిర్ణయాన్ని అనురాగ్ అప్పుడే వ్యతిరేకించాడు. తాజాగా మరోసారి నెట్ఫ్లిక్స్పై తనకున్న అసంతృప్తిని ఇన్స్టా వేదికగా వెల్లడించారు. ‘మాక్సిమం సిటీ’ రద్దుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆయన ఆరోపించాడు. సృజనాత్మక స్వేచ్ఛపై నెట్ఫిక్స్ ఆంక్షలు విధిస్తోందని విమర్శించాడు.దీనికి యూకే వెబ్ సిరీస్ అడోలసెన్స్ని ఉదాహరణగా చూపించాడు. ఈ వెబ్ సిరీస్ మార్చి 13 నుంచి నెట్ఫ్లిక్స్ యూకేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ యుక్త వయస్సు యొక్క చీకటి అంశాలను, ఆన్లైన్ ద్వేషం, మరియు సామాజిక సమస్యలను చూపిస్తుంది.ఇలాంటి సాహసోపేతమైన కథను నెట్ఫ్లిక్స్ ఇండియా అణచివేస్తోందని ఆయన ఆరోపించారు.‘మాక్సిమం సిటీ’ కథేంటి?సుఖ్దేవ్ సింగ్ సంధు రాసిన "మాక్సిమం సిటీ: బాంబే లాస్ట్ అండ్ ఫౌండ్" పుస్తకం ఆధారంగా అనురాగ్ కశ్యప్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు. ఈ సిరీస్లో ముంబై నగరం యొక్క చీకటి కోణాలను చూపించాలని భావించారు. అయితే, 2024లో నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ను రద్దు చేసింది, దీనిపై కశ్యప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే ‘సేక్రెడ్ గేమ్స్’మూడో సీజన్ కోసం కూడా నెట్ఫ్లిక్స్తో చర్చలు జరిగాయి. కానీ కంటెంట్తో పాటు బడ్జెట్పై వివాదాలు రావడంతో నెట్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును కూడా రద్దు చేసుకుంది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) -
తెలుగులో మిస్టరీ థ్రిల్లర్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలు, సిరీసులు నేరుగా వీటిల్లో రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే వాటిలో చాలా తక్కువ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఈ జానర్ లో తీసిన లేటెస్ట్ సిరీస్ 'టచ్ మీ నాట్'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేయండంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)నవదీప్, దీక్షిత్ శెట్టి ('దసరా' ఫేమ్) కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. స్కూల్ చదివే ఓ కుర్రాడి.. శవాన్ని ముట్టుకుని ఎవరు హత్య చేశారో చెప్పే అద్బుతమైన శక్తి ఉంటుంది. మరోవైపు పోలీస్ పాత్ర పోషించిన నవదీప్ మాత్రం ఈ కుర్రాడిపై కాస్త సందేహంగానే ఉంటాడు. మరి హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.హాట్ స్టార్ లో ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన సిరీస్ లు పెద్దగా క్లిక్ కాలేదని చెప్పొచ్చు. మరి 'టచ్ మీ నాట్' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
ఓటీటీలో మరో ఫ్యామిలీ సిరీస్.. టీజర్ రిలీజ్
ఓటీటీలో మరో ఫ్యామిలీ సిరీస్ వచ్చేందుకు రెడీ అయిపోయింది. 90స్, ఎర్లీ 20స్ లో జరిగిన కథలతో ఇదివరకే పలు సినిమాలు, సిరీసులు రాగా.. ఇప్పుడు ఆ తరహా కాన్సెప్ట్ తోనే తీసిన 'హోమ్ టౌన్' సిరీస్ రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఇప్పుడంటే సోషల్ మీడియా అందరికీ కామన్ అయిపోయింది. కానీ ఫేస్ బుక్ వచ్చిన కొత్తలో ముగ్గురు టీనేజర్స్ ఎంత సందడి చేశారు? అటు స్కూల్, ఇటు ఇంట్లో పాటు క్రికెట్ గ్రౌండ్ లోనూ వీళ్లు ఎలా అల్లరి చేశారు? అనేది తెలియాలంటే 'హోమ్ టౌన్' సిరీస్ చూడాలి.ఆహా ఓటీటీలో ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ తప్పితే పెద్దగా తెలిసిన ముఖాలు లేవు. కానీ టీజర్ చూస్తుంటే మాత్రం పర్లేదనిపించేలా ఉంది. 90స్ లో పుట్టి పెరిగిన వాళ్లు కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తోంది. శ్రీకాంత్ పల్లె దర్శకుడు. నవీన్ మేడారం షో రన్నర్.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి) -
నటుడిగా మారిన సౌరవ్ గంగూలీ.. వెబ్ సిరీస్తో గ్రాండ్ ఎంట్రీ!
క్రికెటర్లు కాస్త యాక్టర్లు అవుతున్నారు. గతంలో గ్రౌండ్లో పోర్లు, సిక్సర్ల వర్షం కురపించిన స్టార్ క్రికెటర్లు..ఇప్పుడు తమ యాక్టింగ్తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడానికి రెడీ అవుతున్నారు. చేసేది చిన్నదే అయినా.. కథకు చాలా కీలకమైన పాత్రల్లో మెరవబోతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘రాబిన్హుడ్’ సినిమాతో వెండితెర ఆరంగ్రేటం చేశాడు. ఇక ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కూడా నటుడిగా మారినట్లు తెలుస్తోంది. ఆయన ఓ వెబ్ సిరీస్లో కీలక పాత్ర పోషించినట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.పోలీసు పాత్రలో గంగూలీజీత్, ప్రోసెన్జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2). మార్చి 20 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.ఇందులో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఆయన పోలీసు డ్రెస్లో ఉన్న పిక్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఈ వెబ్ సిరీస్లో గంగూలీ పోలీసు ఉన్నతాధికారిగా కనిపించబోతున్నారట. తెరపై కనిపించేది కాసేపే అయినా.. కథకి కీలకమైన పాత్ర అయిన ప్రచారం జరుగుతోంది.ప్రమోషన్ కోసమేనా?అయితే ఈ వెబ్ సిరీస్లో గంగూలీ నటించారనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అలా అని ఈ రూమర్ని ఖండించడమూ లేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత నీరజ్ పాండే ఈ గాసిప్పై స్పందిస్తూ..‘నేను చెప్పడం ఎందుకు..మార్చి 20న తర్వాత గంగూలీ నటించారో లేదే మీకే తెలుస్తుంది’ అని అన్నారు. దీంతో గంగూలీ నిజంగానే ఈ వెబ్ సిరీస్లో నటించారని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతుంటే..మరికొంత మంది ఏమో సినిమా ప్రమోషన్లో ఆయన పాల్గొన్నారని, అందులో భాగంగానే పోలీసు యూనిఫాంలో కనిపించారని కామెంట్ చేస్తున్నారు. యదార్థ సంఘటనలతో ఖాకీ 2నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా ఖాకీ2 వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ని తెరకెక్కించారు. మరోవైపు గంగూలీ జీవిత చరిత్రపై ఓ సినిమా తెరకెక్కబోతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్కుమార్రావు హీరోగా నటిస్తున్నాడు. -
ఓటీటీలోకి అదిరిపోయే థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. 'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఇందులో జీత్, ప్రసేన్జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీతో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారనే వార్తలు ఇప్పటికే వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ట్రైలర్ ఈవెంట్లో నిర్మాత నీరజ్ పాండే పరోక్షంగా గంగూలీ ఉండొచ్చు అనే కామెంట్ చేశారు.'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' నెట్ఫ్లిక్స్లో మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళంలో అందుబాటులో ఉండనుంది.2000 సంవత్సరంలో బెంగాల్లోని పరిస్థితులను చూపిస్తూ ఈ సిరీస్ను దర్శకుడు దేబాత్మ మండల్ తెరకెక్కించారు. గ్యాంగ్స్టర్లు, రాజకీయ నాయకులలో అధికార దాహం ఉంటే.. అక్కడి నగరంలో శాంతిని కాపాడటానికి పోలీసు అధికారులు చాలా కష్టపడుతుంటారు. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఐపీఎస్ అర్జున్ మైత్రా చట్టాన్ని కాపాడేందుకు ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొన్నారనేది ఇందులో చూపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్ట్ను మేకర్స్ తెరకెక్కించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. బిహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా ఖాకీ: ది బిహార్ చాప్టర్ పేరుతో నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్గా రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది కూడా. వాస్తవానికి ఐపీఎస్ అధికారి అమిత్ ఒక గ్యాంగ్స్టర్ అశోక్ మెమతోను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిందే ఈ వెబ్ సీరిస్. -
ఓటీటీలోకి బోల్డ్ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో
థియేటర్లలో అంటే సెన్సార్ ఇబ్బందులు ఉంటాయి. కానీ ఓటీటీలో మాత్రం ఇబ్బందులు ఉండవు. దీంతో బోల్డ్, రియలస్టిక్ పేరిట బూతులు, రొమాన్స్ కాస్త గట్టిగానే చూపించేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?)ఆహా ఓటీటీలో 2022లో తమిళంలో రిలీజైన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. మహత్ రాఘవేంద్ర, మానస చౌదరి, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో హిట్ అయిన ఈ సిరీస్ ని ఇప్పుడు తెలుగులో ఫిబ్రవరి 28 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.లవ్ చేసుకున్న ఓ యువతీయువకుడు అనుకోని విధంగా విడిపోతారు. ఆ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. కొన్నిరోజులకు మాజీ లవర్ మళ్లీ ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. టీజర్ చూస్తే మాత్రం బోల్డ్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)Love, passion, and destiny. Will they find their way back? #Emoji Premiering February 28th, only on Aha#EmojionAha @Maanasa_chou @Devu_devika77 @Mahatofficial pic.twitter.com/XTqPqfAOPU— ahavideoin (@ahavideoIN) February 25, 2025 -
చరిత్రలో మరిచిపోలేని జలియన్ వాలాబాగ్ ఉదంతం.. ట్రైలర్ చూశారా?
భారతీయుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని దారుణ ఉదంతం జలియాన్ వాలాబాగ్ ఊచకోత. అప్పటి బ్రిటీశ్ పరిపాలన కాలంలో 1919 ఏప్రిల్ 13న ఈ మారణహోమం జరిగింది. ఈ అత్యంత పాశవిక ఘటన ఆధారంగా వెబ్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ పేరుతో రామ్ మాద్వానీ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు.తారుక్ రైనా, నిఖితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ వచ్చేనెల మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. యధార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Find out the conspiracy behind the Jallianwala Bagh massacre, as a nation awakens. Creator | Director Ram Madhvani brings to you a show inspired by true events #TheWakingOfANation, Streaming on 7th March on Sony LIV pic.twitter.com/Q5qM8ZN8Cn— Sony LIV (@SonyLIV) February 24, 2025 -
జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి
ఈ వెబ్ సిరీస్లో నటి జ్యోతిక (Jyotika)ను తీసుకోవాలనుకోలేదు. ఆమెను తీసేసి తన స్థానంలో మరొకరిని పెడితే బాగుంటుందనుకున్నా అంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ (Shabana Azmi). షబానా, షాలిని పాండే, జ్యోతిక, సాయి తంహంకర్, గజ్రాజ్ రావు, జిస్సు సేన్గుప్తా, అంజలి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ (Dabba Cartel). ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో షబానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.జ్యోతికను తీసేయాలనుకున్నా..ఆమె మాట్లాడుతూ.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ సిరీస్లో ఇద్దరు నటీమణుల్ని తీసేయాలనుకున్నాను. అందులో జ్యోతిక కూడా ఉంది. ఆమెకు ఈ విషయం తెలియదు. తర్వాత నేనే జరిగింది చెప్పాను. అయితే జ్యోతికను తీసేయమని చెప్తే నా మాట వినలేదు. నీకేది నచ్చితే అది చేసుకో.. కానీ జ్యోతికను మాత్రం వదులుకోము అన్నారు. కట్ చేస్తే జ్యోతిక చాలా బాగా నటించింది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. జ్యోతిక, షబానా అజ్మీనా తప్పే..తనను తీసేయాలనుకోవడం ముమ్మాటికీ నా తప్పే. అదే జరుగుంటే నీతో కలిసి పనిచేసే ఛాన్స్ మిస్సయ్యేదాన్ని. ఈ సిరీస్ను నా కొడుకు(సవతి కుమారుడు), కోడలు నిర్మించినందున నేనేమీ ఆలోచించకుండా నటించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. హితేశ్ భాటియా దర్శకత్వం వహించిన డబ్బా కార్టెల్ నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే? -
సుడల్ తెలుగు ట్రైలర్ విడుదల చేసిన నాగచైతన్య
తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సుడల్: ది వోర్టెక్స్' (Suzhal The Vortex) వెబ్ సిరీస్కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కదీర్ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్లోకి రానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను టాలీవుడ్ హీరో నాగచైతన్య విడుదల చేశారు. 2022లో విడుదలై తమిళ వెబ్ సిరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ సీక్వెల్గా పార్ట్2 తెరకెక్కింది. బ్రహ్మ జి - అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించగా.. విక్రమ్ వేదా చిత్రం ఫేమ్ గాయత్రి పుష్కర్ల ద్వయం నిర్మించింది. ఇందులో కదీర్, ఐశ్వర్యా రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో నటించారు. -
ఆర్థిక ఇబ్బందుల్లో సమంత వెబ్ సిరీస్.. వెలుగులోకి భారీ స్కామ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత నటిస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్కు ఆర్థిక కష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. సమంత నటించిన ఖుషి 2023లో విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో ఆమె నటించలేదు. అయితే, గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సమంత పలకరించింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. అయితే, ఇప్పుడీ వెబ్ సిరీస్కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయని నెట్టింట వైరల్ అవుతుంది.నెట్ఫ్లిక్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లలో రక్త్ బ్రహ్మాండ్ ఒకటి. ఆదిత్య రాయ్ కపూర్, సమంత నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ను డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్ట్ణు పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ రీసెంట్గా సిటాడెల్ సిరీస్ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో ప్రారంభించిన రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ను ఆర్థిక సమస్యల వల్ల తాత్కాలికంగా ఆపేశారని సమాచారం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న ఒకరు బడ్జెట్ విషయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల స్కామ్కు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ చిత్రీకరణ ఇప్పటి వరకు 25 రోజులు పూర్తి చేసుకుందట. ఇంకా చాలా షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయట. కానీ, ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చయిపోయినట్లు తెలిసింది. ఓ ఆడిట్ ద్వారా ఈ విషయం బయటపడిందట.. అకౌంటింగ్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో షూటింగ్ను ఆపేశారని టాక్ ఉంది. నెట్ఫ్లిక్స్, డీ2ఆర్ ఫిల్మ్స్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాయని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ పనులను రాజ్ అండ్ డీకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మేకింగ్ సమయంలో స్క్రీన్ ప్లేలను ఎప్పటికప్పుడు మార్చేస్తుండటంతో ఖర్చు భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ తప్పుబడుతుంది. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలా స్క్రిప్ట్ మారుస్తూ ఉండటంతో కనిపించని స్థాయిలో దుబారా అవుతుందని నెట్ఫ్లిక్స్ పేర్కొంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. -
జ్యోతిక ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్.. ఏ ఓటీటీలో చూడాలంటే?
షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో వస్తోన్న వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్' (Dabba Cartel Web Series). ఈ సిరీస్ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు.ఈ వెబ్ సిరీస్ను క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. They're cooking. And it's criminally good 👀 💸 Watch Dabba Cartel, out 28 February, only on Netflix. pic.twitter.com/ujxywmjaeW— Netflix India (@NetflixIndia) February 18, 2025 -
OTT: పది రోజులుగా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్
ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందిన కోబలి వెబ్ సిరీస్కు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా.. తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రేవంత్ లేవాక దర్శకత్వం వహించారు. 'నింబస్ ఫిలిమ్స్', 'యు1 ప్రొడక్షన్స్', 'టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్' సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 4న హాట్స్టార్లో రిలీజైన ఈ సిరీస్ ఏడు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం నాడు కోబలి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళయింది. కొత్తగా ఏదో ఒకటి చేయాలనే తపనతో 'కోబలి' మొదలుపెట్టాను. ఒక కాఫీ షాప్లో ఈ కథ విన్నాను. నచ్చింది. కానీ ఇది ముందుకు వెళ్తుందనే నమ్మకం కలగలేదు.ఎందుకంటే అంతా కొత్తవాళ్లే. ఈ కంటెంట్లో అమ్ముడు పోయే ముఖం ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ ఈ సిరీస్ను ప్రేక్షకులు ఆదరించారు. నిజాయితీగా పనిచేస్తే ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించారు" అంటూ చెప్పుకొచ్చారు. రాకీ సింగ్ మాట్లాడుతూ.. "చిన్న పాత్ర అయినా చేయడానికి ముందుకు వచ్చిన వెంకట్ గారికి థాంక్స్. కానీ సీజన్ 2 లో ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుంది. అసలైన కథ అక్కడ మొదలవుతుంది. ఇది జస్ట్ ట్రైలరే" అన్నారు. సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ.. "నిజంగానే ఇందులో అంతా కొత్తవాళ్లే. కానీ హాట్ స్టార్ సంస్థ మమ్మల్ని నమ్మింది. ప్రేక్షకులు బాగా ఆదరించారు. 7 భాషల్లోనూ కోబలి మంచి విజయాన్ని అందుకుంది. రేవంత్, నాతో కూడా ఒక సినిమా చెయ్యి. అంతకు మించి నీ హార్డ్ వర్క్ గురించి పొగడలేను. స్టార్లు ఉంటేనే కంటెంట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది పాత మాట. ఇప్పుడు కాలం మారింది.కంటెంట్ బాగుంటే కొత్త, పాత తేడా లేదని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు" అని చెప్పుకొచ్చారు. చదవండి: సుకుమార్ ఇంట వ్రతం.. ఫోటోలు షేర్ చేసిన తబిత -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్తో వాలెంటైన్స్ డే స్పెషల్
‘ప్రేమంటే ఏమిటంటే ...’’ యుగయుగాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదుకులాట నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి అర్థాలు వారివి. ఎవరి అనుభూతులు, అనుభవాలు వారివి. ఎవరి భావోద్వేగాలు వారివి. అందుకే రెండు హృదయాల మధ్య ప్రేమ సరికొత్తగా కొంగొత్తగా చిగురుస్తూనే ఉంది. చిక్కావే ప్రేమ.. అంటూ కూని రాగాలు కాదు...కాదు..కోటి రాగాలు పలికిస్తుంది. అదే ప్రేమ అనే రెండక్షరాల్లోని గమ్మత్తు... మత్తు. ఈ మత్తులోకి ఎవరికి వారు ఎపుడో ఒకపుడు జారిపోవాల్సిందే. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సివరపల్లి (పంచాయత్ సిరీస్ తెలుగు రీమేక్) హీరో రాగ్ మయూర్తో సాక్షి.కామ్ స్పెషల్గా ముచ్చటించింది.సినిమాబండి సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విలక్షణ నటుడు రాగ్ మయూర్. ముఖ్యంగా వాలెంటైన్స్ డే వీక్ మొదలైందంటే చాలు ‘స్వర మంజరీ’ అంటూ చెప్పే ఆయన డైలాగ్ గత మూడు నాలుగేళ్లుగా ట్రెండింగ్లో నిలుస్తోంది అంటే రాగ్ యాక్టింగ్ స్కిల్స్ను అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్ సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ నటించడమే కాదు, అటు విలన్ కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.ఇదీ చదవండి: MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!ఇపుడు తన కరియర్లో మైలురాయిలాంటి సివరపల్లిలో పంచాయతీ సెక్రటరీగా తన నటనతో ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఓటీటీలో జనాలను ఒప్పించి, మెప్పించిన హిందీ ‘పంచాయత్’ వెబ్ సిరీస్ను తెలుగులోకి రీమేక్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవడం విశేషమే మరి. తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని పల్లె వాతావరణంలో సాగే ఈ సిరీస్ పిల్లా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటోంది.సినిమాపై ఆయనకు ప్రేమ ఎలాపుట్టింది లాంటి వివరాలతో పాటు, నిజజీవితంలో ప్రేమ, ప్రేక్షకులతో ఆయన ప్రేమ, రాగ్ కిష్టమైన నటీ నటులు ఇలాంటి మరిన్ని విశేషాలు ఆయన సాక్షితో పంచుకున్నారు. ఈ మొత్తం చిట్చాట్ను రెండు భాగాలుగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. రాగ్ అందించిన ప్రేమ కబుర్లలో ఏ ఒక్కటీ మిస్ కాకుండా దీన్ని సంపూర్ణంగా వీక్షించి, మీ అభిప్రాయాలను పంచుకోండి. సాక్షి.కామ్ ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. -
ఐశ్వర్య రాజేశ్ హిట్ సిరీస్ సీక్వెల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
ఈ మధ్య సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. సినిమాలు, వెబ్ సిరీస్లు హిట్టయ్యాయంటే చాలు దానికి కొనసాగింపుగా రెండో భాగం, మూడో భాగం తీస్తూనే ఉన్నారు. తాజాగా తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సుడల్: ది వోర్టెక్స్' (Suzhal The Vortex) వెబ్ సిరీస్కు సీక్వెల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), కదీర్ (Kathir) ప్రధాన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్లోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.తమిళంలో వచ్చిన బెస్ట్ సిరీస్లో సుడల్ ఒకటి అని.. ఇన్నాళ్లకు రెండో పార్ట్ రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. సుడల్ మొదటి భాగం 2022లో అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. పార్తీబన్, కదీర్, ఐశ్వర్య రాజేశ్, శ్రేయారెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు. పుష్కర్-గాయత్రి జంట కథ అందించగా బ్రహ్మ అనుచరణ్ దర్శకత్వం వహించారు. రెండో భాగానికి కూడా వీళ్లే పని చేస్తున్నారు.సుడల్ కథేంటి?తమిళనాడులోని సాంబలూరు అనే చిన్న గ్రామంలో ప్రజలు సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఆ ఫ్యాక్టరీ ప్రారంభించిన సమయంలో ఓ అమ్మాయి కనిపించకుండా పోతుంది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఫ్యాక్టరీ తగలబడుతుంది. అప్పుడు ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ షణ్ముఖం (పార్తిబన్) కూతురు నీల కనిపించకుండా పోతుంది. మరి ఆ అమ్మాయిలు ఏమయ్యారు? నీల సోదరి నందిని (ఐశ్వర్య రాజేశ్) సొంతూరిని వదిలేసి కోయంబత్తూరులో ఎందుకుంటోంది? ఈ మిస్సింగ్ల వెనక నీల హస్తం ఉందా? అనే ఆసక్తికర అంశాలతో సిరీస్ ఉత్కంఠగా సాగుతుంది. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఉంటుంది. Some storms never settle.🌪️#SuzhalS2OnPrime, New Season, Feb 28 pic.twitter.com/sHDaA8sjW8— prime video IN (@PrimeVideoIN) February 11, 2025 చదవండి: తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్ -
సమంత వెబ్ సిరీస్.. ప్రతిష్టాత్మక అవార్డుల్లో నిరాశ
సినీ ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను(Critics Choice Awards) ప్రకటించారు. ఈ అవార్డుల కోసం సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ కూడా పోటీపడ్డాయి. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ల జాబితాలో నామినేట్ అయిన హనీ బన్నీ అవార్డ్ను సాధించలేకపోయింది. ఈ కేటగిరీలో కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్-2 అవార్డ్ను దక్కించుకుంది. గతేడాది నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్ సీజన్-2 2024లో విడుదలైంది. అంతేకాకుండా ఈ సిరీస్ సీజన్-3 ఈ ఏడాది జూన్లో అందుబాటులోకి రానుంది.అయితే బెస్ట్ ఫారిన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడిన మూవీ ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. ఈ మూవీకి కూడా నిరాశే ఎదురైంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ చిత్రం అవార్డ్ సాధించలేకపోయింది. దీంతో మన దేశం నుంచి పోటీలో నిలిచిన చిత్రాలకు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే గతేడాది కేన్స్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ను పాయల్ కపాడియా చిత్రం దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్లో జ్యూరీ గ్రాండ్ ప్రైజ్, గోథమ్ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ను కూడా అందుకుంది. ఈ అవార్డుల వేడుక శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్లో జరిగింది.క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల విజేతలు వీరే..ఉత్తమ విదేశీ వెబ్ సిరీస్ : స్క్విడ్ గేమ్ 2ఉత్తమ చిత్రం : అనోరాఉత్తమ నటుడు: డెమి మూర్ఉత్తమ నటి : కియేరన్ కుల్కిన్ఉత్తమ సహాయ నటుడు : కీరన్ కుల్కిన్ఉత్తమ సహాయనటి : జోయ్ సల్దానా -
నెట్ఫ్లిక్స్తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
Rag Mayur: కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
సినిమా బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవలే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సివరపల్లి అనే వెబ్ సిరీస్లో హీరోగా నటించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి పాత్రలో మెరిశారు. ‘పంచాయత్’ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలి అనుకునే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారితే ఎలా ఉంటుందనే కోణంలో తెరెకెక్కించారు. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే అదే రోజు గాంధీ తాత చెట్టు అనే సినిమా రిలీజైంది. సుకుమాక్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్గా సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ మరోసారి మెరిశాడు. నిజానికి అతనికి సినిమాలో ఉన్న స్క్రీన్ టైం తక్కువే అయినా తనదైన శైలిలో ఉన్న కాసేపు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో రాగ్ మయూర్ ఉండడంతో అది మరింత బాగా కలిసొచ్చింది. ఒకేరోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాతో పాటు సివరపల్లి వెబ్ సిరీస్ రెండిటికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఇలా భిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగులో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని భావిస్తున్న రాగ్ మయూర్.. ఇప్పటికే గీత ఆర్ట్స్2 లో ఒక పేరు పెట్టని సినిమాతో పాటు పరదా, అలాగే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నటిస్తున్నాడు.‘సివరపల్లి’ వెబ్ సిరీస్, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో దూసుకెళ్తున్నాడు. చదువులో స్టేట్ టాపర్ అయిన రాగ్ మయూర్ ప్రశాంతంగా చదువు పూర్తి చేసి తర్వాత నటన మీద శ్రద్ధ పెట్టాడు.. సినిమాల గురించి రివ్యూస్ రాసే స్థాయి నుంచి ఈరోజు అదే రివ్యూలలో తన గురించి రాయించుకునే స్థాయికి నటనతో ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.రాగ్ మయూర్ మొదటి సినిమా సినిమా బండిలో మరిడేష్ బాబు అనే పాత్రతో మెరిశాడు. ఆ పాత్రలో రాగ్ మయూర్ నటనతో సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఆ తర్వాత భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. భిన్నమైన జానర్ సినిమాలు చేస్తూ అందులో భాగంగానే కీడా కోలా అనే సినిమాలో లాయర్గా, బ్రహ్మానందం మనవడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రలో కూడా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని పరితపించే సగటు కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అతని పాత్రల ఎంపిక చూస్తే ఏ ఒక్క దానికి మరో పాత్రకి సంబంధం ఉండదు. అలా భిన్నమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. -
వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati)నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ విడుదలైంది.ఈ సిరీస్కు ఆదరణ దక్కడంతో మేకర్స్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రానా నాయుడు సీజన్-2 టీజర్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా విడుదలైన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్కు రీమేక్గా రానా నాయుడు వెబ్ సిరీస్ను రూపొందించారు. ఈ సిరీస్తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.Ab hogi todfod ki shuruvaat mamu, kyun ki ye Rana Naidu ka style hai 👊. Watch Rana Naidu Season 2, out in 2025, only on Netflix #RanaNaiduS2#RanaNaiduS2OnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/AKzezumPzN— Netflix India (@NetflixIndia) February 3, 2025 -
ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. ఈ పండక్కి మూడు పెద్ద సినిమాలు(గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్) సినిమాలు రిలీజ్ అయితే.. వాటిల్లో గేమ్ ఛేంజర్ మినహా మిలిగిన రెండు సినిమాలు హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అయితే రికార్డులను సృష్టిస్తోంది. అయితే సంక్రాంతి సందడి తర్వాత పెద్ద సినిమాలేవి రిలీజ్ కాలేదు. ఫిబ్రవరిలో వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజై సినిమాలు, వెబ్ సిరీస్లపై ఓ లుక్కేద్దాం.‘పట్టుదల’తో వస్తున్న అజిత్కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విడాముయార్చి’. తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘పట్టుదల’ పేరుతో తెలుగులోనూ రిలీజ్ కానుంది. అజర్బైజాన్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ కథలో త్రిష, అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లోని కారు ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ని పెంచాయి. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రాజు,సత్యల ప్రేమ కథనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. మత్స్సకారుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజుగా నాగ చైతన్య, సత్య(బుజ్జితల్లి)గా సాయి పల్లవి నటిస్తున్నారు. దేశ భక్తి అంశాలతో పాటు ఓ చక్కని ప్రేమ కథను ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.‘ఒక పథకం ప్రకారం’సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీ సోది, ఆషిమా నర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సముద్ర ఖని కీలక పాత్ర చేశారు. వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేశ్ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది.నెట్ఫ్లిక్స్హలీవుడ్ వెబ్సిరీస్ ‘ప్రిజన్ సెల్ 211’- ఫిబ్రవరి 5హలీవుడ్ వెబ్సిరీస్ ‘సెలబ్రిటీ బేర్ హంట్’- ఫిబ్రవరి 5హలీవుడ్ వెబ్ సిరీస్ ‘ది ఆర్ మర్డర్స్’- ఫిబ్రవరి 5అమెజాన్ ప్రైమ్ వీడియోది మెహతా బాయ్స్ (హిందీ మూవీ): ఫిబ్రవరి 7డిస్నీ+ హాట్స్టార్కోబలి (తెలుగు వెబ్సిరీస్): ఫిబ్రవరి 4సోనీలివ్బడా నామ్ కరేంగే (హిందీ వెబ్సిరీస్): ఫిబ్రవరి 7జీ 5మిసెస్ (హిందీ సినిమా): ఫిబ్రవరి 7 -
ప్రాణాలతో చెలగాటమాడే థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సీజన్-3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
2021లో రిలీజై అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game). తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇటీవల మరో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్కు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా సీజన్-2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుసగా రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరో సీజన్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్-3 ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ జూన్ 27న స్క్విడ్ గేమ్-3ని స్ట్రీమింగ్కు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. దీంతో ఇలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్లు ఇష్టపడే ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.Press ⭕ for the final round.Watch Squid Game Season 3 on 27 June. #NextOnNetflix pic.twitter.com/SwdBVLB83f— Netflix India (@NetflixIndia) January 30, 2025 -
స్క్విడ్ గేమ్ సిరీస్లో మన హీరోలు.. ఈ వీడియో చూశారా?
ఇటీవల విడుదలై ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోన్న వెబ్ సిరీస్ స్క్విడ్గేమ్-2(Squid Game-2) . గతంలో వచ్చిన సీజన్-1కు కొనసాగింపుగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు స్క్విడ్ గేమ్ -3 కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అది పొరపాటుగా పోస్ట్ చేశామని ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు. ఈ కొరియన్ వెబ్ సిరీస్కు(web series) ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఈ సిరీస్ అంతా ఆడియన్స్ను ఉత్కంఠకు గురి చేస్తుంది.అంతలా ఆదరణ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్లో మన హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహా ఎంత బాగుందో కదా? మరి అదే నిజమైతే బాగుండని మీకు అనిపిస్తోంది కదా? అవును.. మన హీరోలు ఆ గేమ్ను ఎలా ఆడతారో అనే ఆసక్తి ప్రతి ఒక్క సినీ ప్రియుడికి ఉంటుంది. అందుకే అసాధ్యం కాని వాటిన సుసాధ్యం చేయొచ్చని మరోసారి నిరూపించారు. అదెవరో కాదండి.. అదే మానవాళికి సవాలు విసురుతోన్న ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్). తాజాగా ఏఐ సాయం రూపొందించిన స్క్విడ్ గేమ్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.ఈ వీడియోలో మన స్టార్ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్ వీరంతా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్తో పాటు హీరోలు, కమెడియన్స్ సైతం ఈ స్క్విడ్గేమ్ వెబ్సిరీస్లోని పాత్రలతో వీడియోను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చేసిన ఈ వీడియో ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అభిమాన హీరోల ఏఐ ఇమేజ్ల వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్..ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న వెబ్సిరీస్ల్లో స్క్విడ్ గేమ్ ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైన స్క్విడ్గేమ్ సీజన్-2 ఓటీటీలో రికార్టులు సృష్టిస్తోంది. మొదటివారంలోనే అత్యధికంగా 68 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 92 దేశాల్లో నెట్ఫ్లిక్స్ ర్యాకింగ్స్లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.సీజన్-3పై అప్డేట్..స్క్విడ్ గేమ్ సీజన్-2కు (Squid Game Season-2) ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇటీవలే సీజన్-3 అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. కొత్త ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత పొరపాటున డేట్ రివీల్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ. This is so good !! AI Generated !! 💥💥💥#SquidGameSeason2 ft #TFI pic.twitter.com/QqAyf3kTQ8— Priyanka Reddy - Rayalaseema 🌬 (@BerrySmile112) January 7, 2025 -
స్క్విడ్ గేమ్ 3 రిలీజ్ డేట్.. నెట్ఫ్లిక్స్ కావాలనే లీక్ చేసిందా?
డబ్బు కోసం ఆశ.. అందుకోసం షార్ట్కట్స్ వెతికే జనాలు.. దీన్ని అలుసుగా తీసుకున్న ధనికులు.. వారి ప్రాణాలతో చెలగాటమాడే గేమ్ సృష్టిస్తారు. ఈ ఆటలో ఓడిపోయినవారు గేమ్లోనే కాదు జీవితంలోనే ఎలిమినేట్ ఆడతారు. అదే స్క్విడ్ గేమ్. ఈ కొరియన్ వెబ్ సిరీస్ సృష్టికర్త హ్వాంగ్ డాంగ్ హ్యుక్. అంతర్జాతీయ అవార్డులుఈ స్క్విడ్ గేమ్ సిరీస్ను 2021లో రిలీజ్ చేయగా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయింది. క్రిటిక్స్ ఛాయిస్, గోల్డెన్ గ్లోబ్, పీపుల్స్ ఛాయిస్.. ఇలా ఎన్నో అవార్డులు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన ఈ సిరీస్కు కొనసాగింపుగా 2024 డిసెంబర్లో సీక్వెల్ వచ్చింది. ఈ సిరీస్ కూడా ఆదరణ పొందింది కానీ క్లైమాక్స్ను సగంలోనే ముగించేసినట్లుగా ఉంటుంది.గుడ్న్యూస్దీంతో మూడో పార్ట్ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే సీజన్ 3 ఉంటుందని ఓ టీజర్ వదిలింది. అయితే అందులో పొరపాటున 2025 జూన్ 27న రిలీజ్ అవుతుందని పేర్కొంది. ఈ విషయం క్షణాల్లో వైరలవగా.. నెట్ఫ్లిక్స్ కొరియా యూట్యూబ్ ఛానల్ వెంటనే ఆ టీజర్ను డిలీట్ చేసింది.కావాలనే..?నెట్ఫ్లిక్స్ పొరపాటు చేసిందా? లేదంటే అందరూ మాట్లాడుకునేలా చేయాలని కావాలనే అలా రిలీజ్ డేట్ పెట్టి డిలీట్ చేసిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ సారి స్క్విడ్ గేమ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించకుండా ఆరు నెలల్లోనే ఎంచక్కా చూసేయొచ్చని అభిమానులు సంతోషిస్తున్నారు. Netflix accidentally reveals that the final season of ‘SQUID GAME’ releases on June 27. pic.twitter.com/3gswYQpoqf— The Hollywood Handle (@HollywoodHandle) January 1, 2025చదవండి: ఆ హీరోయిన్ ఆస్తులు 4600 కోట్లు.. అమితాబ్ కంటే ఎక్కువే! -
2025 ప్రారంభంలో ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్లు ఇవే!
హిట్లు, ఫ్లాపులు, అవార్డులు, రికార్డులు, వివాదాలతో సినీచిత్రపరిశ్రమ 2024కు ముగింపు పలుకుతోంది. గంపెడాశలతో 2025కి స్వాగతం చెప్తోంది. మరి కొత్త సంవత్సరం ప్రారంభంలో ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్లేంటో చూసేద్దాం..అమెజాన్ ప్రైమ్🎥 గ్లాడియేటర్ 2 - జనవరి 1🎥 బీస్ట్ గేమ్స్ షో (నాలుగో ఎపిసోడ్) - జనవరి 2🎥 ది రిగ్ (వెబ్ సిరీస్) - జనవరి 2🎥 గుణ సీజన్ 2 (వెబ్ సిరీస్) - జనవరి 3 హాట్స్టార్📺 ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ - జనవరి 3ఆహా🎥 జాలీ ఓ జింఖానా (తమిళ చిత్రం) - డిసెంబర్ 30నెట్ఫ్లిక్స్📺 అవిసీ: ఐయామ్ టిమ్ (డాక్యుమెంటరీ) - డిసెంబర్ 31📺 డోంట్ డై: ద మ్యాన్ హు వాంట్స్ టు లివ్ ఫరెవర్ - జనవరి 1📺 ఫ్యామిలీ క్యాంప్ - (జనవరి 1)📺 రీయూనియన్ - జనవరి 1📺 లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్) - జనవరి 1📺 మిస్సింగ్ యు (వెబ్ సిరీస్) - జనవరి 1📺 ద బ్లాక్ స్విండ్లర్ - జనవరి 1📺 సెల్లింగ్ ది సిటీ (వెబ్ సిరీస్) - జనవరి 3📺 వెన్ ది స్టార్స్ గాసిప్ (వెబ్ సిరీస్) - జనవరి 4 లయన్స్గేట్ ప్లే🎥 డేంజరస్ వాటర్స్ - జనవరి 3🎥 టైగర్స్ ట్రిగ్గర్ - జనవరి 3బుక్ మై షో📺 క్రిస్మస్ ఈవ్ ఇన్మిల్లర్స్ పాయింట్ - డిసెంబర్ 30మనోరమా మ్యాక్స్🎥 ఐయామ్ కథలన్ (మలయాళం) - జనవరి 1చదవండి: టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ -
ఓటీటీలోనే టాప్ సిరీస్.. రెండో సీజన్ చూసేందుకు సిద్ధమా?
ఓటీటీల్లో వందలకొద్దీ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. కానీ వీటిలో ఎక్కువమందికి రీచ్ అయినవి కొన్నే ఉంటాయి. అలాంటి ఓ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game). తొలుత కొరియన్ భాషలో తీసినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. తెలుగు, తమిళ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ దీన్ని డబ్ చేశారు. అలా ఓటీటీలో (OTT) అత్యధికంగా చూసిన వెబ్ సిరీస్గా నిలిచింది. ఇప్పుడు దీని రెండో సీజన్ గురువారం (డిసెంబర్ 26) నుంచి నెట్ఫ్లిక్స్లో (Netflix) తెలుగులోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తొలి సీజన్లో అసలేం జరిగింది? రెండో సీజన్లో ఏం జరగొచ్చు?(ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్)ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)మనుషులు నిజరూపాల్ని, స్వభావాలు బయటపెట్టిన సిరీస్ ఇది. తన వరకు వస్తే ఎంత మంచోడైనా సరే తాను చస్తానని తెలిస్తే ఎంతకు తెగిస్తాడు అనే ఒక్క లైన్ మీద కథను గ్రిప్పింగ్గా నడిపించడం అనేది స్క్రిప్ట్ సత్తానే. మరీ ముఖ్యంగా గోళీలాటలో అద్భుతమైన ఎమోషనల్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ గురించి చెప్పడం కంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ చివరిలో ఆటగాళ్లు ఎంత మానసికంగా కుంగిపోతారో, ప్రేక్షకుడి మనసు కూడా అంత బరువెక్కుతుంది.ఈ సిరీస్ చూడటం మొదలుపెట్టినప్పుడు ఏ పాత్ర గురించి మనకు తెలీదు. ప్రత్యేక అంచనాలు ఏం ఉండవు. కాని ఒక్కసారి సిరీస్ చూడటం మొదలుపెడితే ఏకబిగిన చూసేస్తారు. సిరీస్ చివరి ఎపిసోడ్ అంటే క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు.. అసలు ఎందుకు ఇలాంటి ప్రాణాంతక ఆటలు ఆడించాల్సి వచ్చిందో గేమ్ సృష్టికర్త చెబుతుంటాడు. హీరోకి అతడు మాట్లాడుతుంటే.. అది చెప్పినట్లు కాకుండా సమాజ స్వభావంపై వారి అభిప్రాయాల్ని చెబుతూ మనకు ప్రశ్నలను రేకెత్తిస్తారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)ఈ సిరీస్లోని కొన్ని పాత్రలు సొంతవాళ్లనే మోసం చేసుకొనే పరిస్థితులు వస్తాయి. మోసంతో పాటు స్నేహం, సహకారం, త్యాగం.. ఇలా అన్ని ఎమోషన్స్ అద్భుతంగా కుదిరేశాయి. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ సిరీస్లోని పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషుల్లాగే ఉంటాయి. ఇది కూడా సిరీస్ ప్రపంచవ్యాప్తంగా హిట్ కావడానికి కారణమని చెప్పొచ్చు.తొలి సీజన్లో చివరగా ఒక్కడు మిగులుతాడు. ప్రైజ్మనీతో బయటకొస్తాడు. ఇప్పుడు రెండో సీజన్ ట్రైలర్లోనూ మళ్లీ అతడే కనిపించాడు. అయితే ప్రాణాలు పోతాయని తెలిసినా హీరో రావడం బట్టి చూస్తుంటే ఈసారి అందరితో కలిసి గేమ్స్ ఆడుతూనే.. దీని తెర వెనక ఉన్న వాళ్ల వాళ్ల నిజ స్వరూపాల్ని బయటపెట్టడం లాంటివి చేస్తాడేమో అనిపిస్తుంది. తొలి సీజన్కి మించి ఈసారి ఎక్కువ భావోద్వేగ భరిత సీన్స్ ఉండాలి. అప్పుడే సిరీస్ వర్కౌట్ అవుతుంది. చూడాలి మరి 'స్క్విడ్ గేమ్ 2'లో ఏముంటుందో?(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?) -
ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ రెండో సీజన్
ఎలాంటి అంచనాల్లేకుండా ఓటీటీల్లో రిలీజయ్యే కొన్ని సిరీస్లు.. ఊహించని విధంగా బ్లాక్బస్టర్ అవుతుంటాయి. అలా 2020లో 'పాతాళ్ లోక్' పేరుతో వచ్చిన ఓ సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన ఈ సిరీస్కి ఇన్నాళ్లకు రెండో సీజన్ తీసుకొస్తున్నారు. అధికారికంగా ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి?స్టార్ జోడీ కోహ్లీ-అనుష్క శర్మ నిర్మించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ 'పాతాళ్ లోక్'. 2020లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్లో తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 40 నిమిషాల వరకు ఉన్నప్పటికీ.. ప్రతి నిమిషం థ్రిల్లింగ్ ఉండటంతో ఈ సిరీస్ని ఎగబడి చూశారు. మర్డర్స్, ధనిక-పేద మధ్య అంతరం లాంటివి చాలా రియలస్టిక్గా చూపించడంపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్గా అదరగొట్టేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)'పాతాళ్ లోక్' రెండో సీజన్.. జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. పోస్టర్లో ప్రధాన పాత్రధారి జైదీప్ అహ్లావత్ ముఖం ఓవైపు నార్మల్గా ఉండగా.. ఎద్దు పుర్రెతో కప్పినట్లు ఉంది. చూస్తుంటేనే రెండో సీజన్ కూడా రచ్చలేపడం గ్యారంటీ అనిపిస్తుంది.'పాతాళ్ లోక్' విషయానికొస్తే.. 20 ఏళ్లుగా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న హాతీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్) దగ్గర పాపులర్ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా (నీరజ్ కాబి) హత్యాయత్నం కేసు వస్తుంది. నలుగురు క్రిమినల్స్ని అరెస్ట్ కూడా చేస్తారు. దర్యాప్తు చేసే క్రమంలో హంతకుల బృంద నాయకుడైన హతోడా త్యాగి (అభిషేక్ బెనర్జీ) గురించి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అయితే ఈ కేసుని కొందరు ప్రభుత్వ పెద్దలు.. సీబీఐకి అప్పగిస్తారు. సస్పెండ్ అయినా కానీ హాతీరామ్ తన ఇన్వెస్టిగేషన్ ఆపడు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ హంతకుల గురించిన చేదు నిజాలతో పాటు పెద్ద రాజకీయ కుంభకోణమే బయట పడుతుంది. అసలు సంజీవ్ మెహ్రాని చంపడానికి పథకం ఎందుకు వేసినట్టు? కంటికి కనిపిస్తున్నవన్నీ నిజాలేనా లేక అసలు నిజాన్ని కప్పి పెట్టడానికి పెట్టిన డైవర్షన్లా? అనేదే అసలు కథ.(ఇదీ చదవండి: చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ) -
‘ఇది నీకు సెట్ కాదు’ అనేవాళ్లను పట్టించుకోను: హీరోయిన్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెరుస్తున్న మరో ముత్యం సంకీర్తనా విపిన్! ముందు వెబ్తెరకు పరిచమై తర్వాత వెండితెరను మురిపిస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఆమె గురించి కొన్ని వివరాలు.. 👉 సంకీర్తనా విపిన్.. సొంతూరు కేరళలోని నీలేశ్వర్ పట్టణం. తల్లిదండ్రులు సీమ, విపిన్లు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ చేసింది.👉 కిందటేడు ‘నరకాసుర’తో చిత్రరంగ ప్రవేశమూ చేసింది. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా ఆమె నటనకు మాత్రం ప్రశంసలు అందాయి. ఆమె ప్రతిభను తెలుగు చిత్ర పరిశ్రమా గుర్తించి ‘ఆపరేషన్ రావణ్’తో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసింది. అదీ పెద్దగా ఆడకపోయినా అవకాశాలు ఆగలేదు. ‘జనక అయితే గనక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. మంచి సినిమా అనే టాక్ను సొంతం చేసుకున్న ఆ చిత్రం.. సంకీర్తనకూ మంచి పేరే తెచ్చిపెట్టింది. అదిప్పుడు ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతోంది.👉 చిత్రకళ, ప్రయాణాల పట్లా సంకీర్తనకు మక్కువ ఎక్కువే! బీబీఏలో ఆమె ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ట్రావెల్ అండ్ టూరిజమే! ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా బ్యాగ్ సర్దేస్తుంది. ఏ మాత్రం స్ట్రెస్ అనిపించినా కుంచె పట్టేస్తుంది.👉 చిన్నప్పటి నుంచీ సినిమాలు అంటే ఇష్టం. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే ఆడిషన్స్కు వెళ్లేది. అలా మలయాళం వెబ్ సిరీస్ ‘ఒరు వడక్కన్ కేట్టుకథ’తో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. 👉 మాతృభాష మలయాళంలోనూ ఆమెకు చాన్సెస్ వస్తున్నాయి. ఆ జాబితాలోనివే ‘హిగుయిటా’, ‘కాడువెట్టి’ చిత్రాలు. ‘అసురగణ రుద్ర’ విడుదలకు సిద్ధంగా ఉంది. 👉 సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారి ‘ఇది నీకు సెట్ కాదు’ , ‘వేరే ప్రొఫెషన్ చూసుకో’ అంటూ నెగటివ్ కామెంట్స్తో వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. నేను అవేమీ పట్టించుకోను. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువే. నా టాలెంట్ మీద నమ్మకమూ జాస్తి! – సంకీర్తనా విపిన్ -
Kanchan Bamne: అందంతో అల్లాడించే 'పెళ్లివారమండి' వెబ్ సిరీస్ బ్యూటీ (ఫోటోలు)
-
ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్గా 'హరి కథ'.. స్ట్రీమింగ్కు రెడీ
టాలీవుడ్లో ఇప్పటి వరకు చాలా సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి మొదటిసారి ఒక వెబ్ సిరీస్ వస్తుంది. హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. డిసెంబర్ 13న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా రెండో ట్రైలర్ను విడుదల చేశారు.మిస్టరీ థ్రిల్లర్ జానర్గా 'హరి కథ: సంభవామి యుగే యుగే' వెబ్ సిరీస్ను దర్శకుడు మగ్గీ తెరకెక్కించారు. 3 రోజెస్ వెబ్ సిరీస్తో ఆయన గుర్తింపు పొందారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ వంటి వారితో పాటు బిగ్బాస్తో గుర్తింపు పొందిన దివి, అంబటి అర్జున్ తదితరులు నటిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి 'హరికథ' వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. -
‘వికటకవి’కోసం ‘మాభూమి’ సినిమా చూశాను: జోశ్యుల గాయత్రి దేవి
వికటకవి సిరీస్ తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. అది కూడా పీరియాడిక్ కథాంశం కావటంతో, చాలా రీసెర్చ్ చేశాను. 1940 సమయంలో హైదరాబాద్ ఎలా ఉండిందో ముందు నేను తెలుసుకోవాలనుకుంటున్న సమయంలో మా అసోసియేట్స్ ఏం చెప్పారంటే ‘మాభూమి’ అనే తెలంగాణ మూవీని చూడమన్నారు. ఆ సినిమా ద్వారా నాటి హైదరాబాద్ ఎలా ఉండింది.. అప్పటి ప్రజల వేషధారణ, సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలిసింది. దానికి తగ్గట్టు టీమ్ను ప్రిపేర్ చేశాను. కథకు తగ్గట్లు ప్యాంట్, షర్ట్ ఎలా ఉండాలనే దానిపై వీడియోలను డౌన్ లోడ్ చేశాను. లుక్ టెస్టులను చేశాం. టెక్నీషియన్స్గా ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్నిచ్చింది’ అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘వికటకవి’. నవంబర్ 28 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జోశ్యుల గాయత్రి దేవి మీడియాతో ముచ్చటిస్తూ.. ఈ పీరియాడిక్ డిటెక్టివ్ వెబ్ సిరీస్ అనుభవాలను పంచుకున్నారు. → రెగ్యులర్గా ఇతర డిజైనర్స్ వచ్చి నా దగ్గర స్టిచింగ్ చేసుకుని వెళుతుండేవారు. అలా మొదలైన ఈ ప్రయాణంతో నేను కూడా మెల్లగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. పలాస మూవీకి నేను డిజైనింగ్ మాత్రమే చేసిచ్చాను... షూట్కి వెళ్లలేదు. అయితే ఆహా వాళ్లు చేసిన కుడిఎడమైతే వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్గా నా కెరీర్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. తర్వాత పారాహుషార్ అనే మరో సినిమాకు వర్క్ చేశాను. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత కరుణకుమార్గారు రూపొందించిన కళాపురం సినిమాకు వర్క్చేశాను. తర్వాత ప్రదీప్ మద్దాలిగారు డైరెక్ట్ చేసిన సర్వం శక్తిమయం సిరీస్కు కాస్ట్యూమ్ డిజైనింగ్ వర్క్చేశాను. ఈ వెబ్ సిరీస్ నాకు చాలా ఎక్స్పీరియెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఓ ఫుల్ ఔట్డోర్ ప్రాజెక్ట్ని తక్కవు బడ్జెట్..తక్కువ మ్యాన్ పవర్తో ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకున్నాను.→ సర్వం శక్తి మయం సిరీస్కు పని చేయటం నాకు వికటకవి సిరీస్కు వర్క్ చేయటానికి ఎంతగానో హెల్ప్ అయ్యింది. నిజానికి సర్వం శక్తిమయం సిరీస్ తర్వాత పీపుల్ మీడియా బ్యానర్ సంస్థ నిర్మించిన సిరీస్ హరికథకు వర్క్ చేశాను. అది కూడా పీరియాడిక్ సిరీస్ 90వ దశకం కథ,కథనంతో రూపొందింది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రీరోజెస్ ఫేమ్ మ్యాగీ ఈ సిరీస్ను డైరెక్ట్ చేశారు. దీంతో పాటు వికటకవి సిరీస్కు వర్క్ చేసే అవకాశం ఒకేసారి వచ్చింది. పీరియాడిక్ సిరీస్ల్లో హరికథ ముందుగా స్టార్ట్ అయ్యింది.→ ఒక సిరీస్ షూట్ ఉన్నప్పుడు మరో సిరీస్ షూట్ లేకుండా ఉండటం కూడా కాస్త కలిసొచ్చింది. అలాగే హరికథ చేసిన వర్క్ వికటకవి విషయంలో హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సిరీస్లకు వర్క్ చేయటం అనేది రెగ్యులర్గా సాధ్యంకాదు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలంతే.→ సిరీస్లకు వర్క్ చేసే సమయంలో బడ్జెట్కు సంబంధించిన పరిమితులుంటాయి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఔట్పుట్ ఎదురు చూస్తారు. అయితే సినిమాల విషయానికి వచ్చే సరికి బడ్జెట్ విషయంలో కాస్త వెసులుబాటు ఉంటుంది. సిరీస్లకు వర్క్ చేసేటప్పుడు డైరెక్టర్తో పాటు ఓటీటీలకు సంబంధించిన ఇన్పుట్స్ చాలానే ఉంటాయి. కానీ సినిమాల్లో మాత్రం డైరెక్టరే ఫైనల్ డిసిషన్ మేకర్.→ టెక్నిషియన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. నేను సినిమాలు చేసిన తర్వాత వెబ్ సిరీస్లకు వర్క్ చేయలేదు. సిరీస్లకు వర్క్ చేయటంతోనే కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఓటీటీల్లో, వెబ్ సిరీస్లకు పని చేయటం అనేది యంగ్ టాలెంట్, యంగ్ టెక్నీషియన్స్కు గుడ్ ఫ్లాట్ఫామ్స్. అయితే వర్క్ పరంగా ఎప్పటికప్పుడు హిందీ, ఫ్రెంచ్, కొరియన్ వంటి ప్రాజెక్ట్స్ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామని అప్డేట్ కావటం మానుకోలేం.→ హీరో లుక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అప్పటి లుక్లో కనిపిస్తూనే పొడవుగా కనిపించాలి.. ఇవన్నీ మాకు చాలెంజింగ్గా అనిపించాయి. అయితే వాటన్నింటినీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. మేఘా ఆకాష్గారికి ముందుగా చుడీదార్ అనుకున్నాం. కానీ కథానుగుణంగా చుడీదార్ కంటే శారీనే బాగా నప్పుతుందనిపించింది. అలాగని పట్టు శారీలను ఉపయోగించలేదు. కాటన్, లెనిన్, ఖాదీ చీరలనే ఉపయోగించాం.→ ప్రస్తుతం సతీష్ వేగేశ్నగారు దర్శకత్వంలో హాట్ స్టార్ రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ మర్మయోగి కోసం వర్క్ చేస్తున్నాను. రీసెంట్గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే మానసచోర అనే సినిమాకు వర్క్ చేస్తున్నాను. -
అందుకే తల్లి పాత్రను తిరస్కరించాను: మల్లికా శెరావత్
‘‘ది రాయల్స్’ సిరీస్లో ఇషాన్ కట్టర్ తల్లి పాత్రలో నేను నటించాల్సి ఉంది. అయితే నాకు చెప్పిన కథకి, ఫైనల్ స్క్రిప్ట్కి సంబంధం లేదనిపించింది... అందుకే ‘ది రాయల్స్’ అవకాశాన్ని తిరస్కరించాను’’ అని చెప్పారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’. గత నెల 11న విడుదలైన ఈ సినిమాలో చందా రాణి అనే పాత్రలో తనదైన నటనతో అలరించారు మల్లికా శెరావత్.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇషాన్ కట్టర్ లీడ్ రోల్లో ‘ది రాయల్స్’ సిరీస్ని రూపొందించాలని నెట్ఫ్లిక్స్ సంస్థ భావించింది. ఇందులో ఇషాన్ తల్లి పాత్రలో నటించమని మేకర్స్ నన్ను సంప్రదించారు. నా పాత్ర, కథ ఎంతో నచ్చడంతో చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఫైనల్గా స్క్రిప్ట్ పేపర్ మీదకు వచ్చేసరికి ఎన్నో మార్పులు జరిగాయి. చెప్పిన దానికి, రాసిన దానికి సంబంధం లేదనిపించింది. దీంతో వాళ్లు నన్ను మోసం చేశారనిపించి, నేను చేయనని తిరస్కరించాను’’ అని తెలిపారు. అలాగే తన వ్యక్తిగత విషయం గురించి కూడా ఆమె స్పంది స్తూ– ‘‘గతంలో నేను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అయితే అది బ్రేకప్ అయింది. ప్రస్తుతానికి సింగిల్గానే ఉన్నాను. వివాహంపై నాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి మనసు ఉన్న వ్యక్తిని భర్తగా పొందడం కష్టమే. నా ఆరోగ్యంపట్ల నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాను. అలాగే మంచి భోజనం తింటా, సమయానికి నిద్రపోతా’’ అని తెలిపారు మల్లికా శెరావత్. -
Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్డ్రాప్తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్లో వచ్చే ఫ్లాష్బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'ఎలిమినేట్ అయితే చంపేస్తారు'.. స్క్విడ్ గేమ్ ట్రైలర్ చూశారా?
2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ను దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్కు దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి సీజన్ లాగే ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంతమంది వ్యక్తులు.. డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్లో భాగమవుతారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.తెలుగులోనూ విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ను మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. ట్రైలర్లో సన్నివేశాలు, ప్రమాదకరమైన గేమ్స్ చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.అసలు ఈ స్క్విడ్ గేమ్ ఏంటంటే..జీవితంలో అప్పులపాలైన 456 మందిని ఒక రహస్య దీవికి తీసుకెళ్తారు. అక్కడ రెడ్లైట్, గ్రీన్లైట్, టగ్ ఆఫ్ వార్ లాంటి చిన్నపిల్లలు ఆడుకొనే పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం సిక్స్ గేమ్స్ ఉంటాయి. చివరి గేమ్ పేరే స్క్విడ్ గేమ్. అయితే ఈ గేమ్స్లో ఓడిపోయిన వారిని ఎలిమినేషన్ పేరుతో చంపేస్తుంటారు. సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ను సొంతం చేసుకుంది. -
‘ ఫ్రీడం ఎట్ మిడ్ నైట్’ వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్ సిరీస్ టైటిల్ : ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ సీజన్ 1 (7 ఎపిసోడ్స్)నటీనటులు: సిద్ధాంత్ గుప్తా, చిరాక్ వోరా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా, లూక్ మెక్ గిబ్నే తదితరులునిర్మాతలు : మోనీషా అద్వాని , మధు భోజ్వాని, దనిష్ ఖాన్దర్శకత్వం : నిఖిల్ అద్వానిసంగీతం : అశుతోష్ పాఠక్ఓటీటీ: సోనీలివ్(నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)⇢ వెబ్ సిరీస్ ల సీజన్ లో కాస్త కొత్తగా ప్రయోగం చేయాలనుకుంటున్న వారు చరిత్రని సబ్జెక్ట్ గా ఎంచుకుంటున్నారు. మనకు తెలియని విషయాలను చెప్పడం వేరు, తెలిసిన విషయాలనే కొత్తగా చెప్పడం వేరు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. మనకు తెలిసిన విషయంలోనే తెలియని కోణాన్ని ఆవిష్కరించడం మరో పద్ధతి. భారత స్వాతంత్ర పోరాటం గురించి మనందరికీ తెలుసు. అయితే స్వాతంత్రం సిద్ధించే దశలో, దేశ విభజన కూడా జరిగింది. ఆ విభజన గురించిన చరిత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తీసిన వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్.⇢ గతంలో కూడా భారత స్వాతంత్ర పోరాటాన్ని చూపించే సినిమాలు, సీరియళ్లు, డాక్యుమెంటరీలు చాలానే వచ్చాయి. గాంధీ పాత్ర చిత్రీకరణతో చాలామంది ఆకట్టుకున్నారు. కానీ వాటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. భారత స్వాతంత్ర పోరాటం మొత్తాన్నీ ఈ వెబ్ సిరీస్ లో బంధించాలని చూడకుండా తన కథనాన్ని కేవలం 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు పరిమితం చేశాడు దర్శకుడు నిఖిల్ అద్వానీ. ఆయాపాత్రలకు ఎంపిక చేసుకున్న నటులు కూడా రాణించారు.⇢ కీలక పాత్రలైన గాంధీ, నెహ్రూ, పటేల్, జిన్నాల భావోద్వేగాలు ఇందులో ఇంపార్టెంట్. ఆయా పాత్రలకు ఎంచుకున్న నటులు తమ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే వారి నుంచి ఆ స్థాయిలో ఔట్ పుట్ రాబట్టారు నిఖిల్ అద్వానీ. అందరి లక్ష్యం ఒక్కటే స్వాతంత్రం. కానీ అందులో దేశ విభజన కూడా జరగాలని కోరుకునేవారు, దేశం కలిసే ఉండాలనుకునేవారు ఉండటం.. వారి మధ్య జరిగే సంఘర్షణ, చివరకు మనకు తెలిసిన ఫలితాన్నే కొత్తగా చూపించడం ఆసక్తికరంగా ఉంది.⇢ 1940-47 మధ్య జరిగే కథతో తెరకెక్కిన ఈ ఒరిజినల్ సిరీస్ లో స్క్రీన్ ప్లే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. టైటిల్ వేయడానికి ముందు బ్యాక్ స్టోరీ (1917-1920) చెప్పడం.. టైటిల్ పడిన తర్వాత దేశ విభజన కాలం గురించి చర్చించడం ఆకట్టుకుంది. ఇందులో ఎవ్వర్నీ హీరోలుగా, విలన్లుగా చూపించే ప్రయత్నం చేయలేదు దర్శకుడు. ఎవరి వెర్షన్ ఏంటి.. ఎవరి భావజాలం ఎలా ఉందనే విషయాన్ని బలంగా చెప్పాడు. బ్రిటిషర్లు మాట్లాడే ఇంగ్లిష్ అక్కడక్కడ ఇబ్బంది పెట్టినప్పటికీ.. సబ్ టైటిల్స్ తో సిరీస్ చూసే అలవాటున్న ప్రేక్షకులకు అదేమంత పెద్ద ఇబ్బంది అనిపించదు.⇢ ఈ వెబ్ సిరీస్లో మహాత్మా గాంధీగా చిరాగ్ వోహ్రా, జవహర్లాల్ నెహ్రూ గా సిద్ధాంత్ గుప్తా, వల్లభాయ్ పటేల్గా రాజేంద్ర చావ్లా, మహ్మద్ జిన్నాగా ఆరిఫ్ జకారియా, లూయిస్ మౌంట్ బాటన్గా ల్యూక్ మెక్ గిబ్నీ , లేడీ మౌంట్బాటన్కా డెర్డెలియా బుగేజా, సరోజినీ నాయుడు - మలిష్కా మెండోన్సా నటించారు.⇢ ఇలాంటి కథనాలకు నటీనటుల ఎంపికతోపాటు వారి కాస్ట్యూమ్స్, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే పరిసరాలు, భవనాలు కూడా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఆయా విభాగాలు తమ టాలెంట్ చూపించాయి. 1940ల నాటి భారత దేశాన్ని కళ్లకు కట్టాయి. వైస్రాయ్ హౌస్, కాంగ్రెస్ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలపై వెబ్ సిరీస్ టీమ్ బాగా పరిశోధన చేసిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. -
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్.. శోభిత ధూళిపాళ్లను వరిస్తుందా?
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల వేడుక మరి కొద్ది గంటల్లో జరగనుంది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ఈవెంట్ యూఎస్లోని న్యూయార్క్లో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్కు తొలిసారి ఇండియన్ కమెడియన్, నటుడు వీర్ దాస్ తొలిసారి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అవార్డులను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందజేయనుంది. భారత కాలమానం ప్రకారం ఈ వేడుక మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఐఎమ్మీస్.టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.కాగా.. ఈ ఏడాది 21 దేశాల నుంచి 56 మంది నామినేషన్స్లో ఉన్నారు. సినిమా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి పలు విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. దాదాపు 14 విభాగాల్లో ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తారు. ఈ ఏడాది అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూళిపాళ్ల నటించిన వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగం- 2024 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులకు నామినేషన్స్లో నిలిచింది.శోభిత ధూళిపాళ్ల నటించిన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్.. లెస్ గౌట్టెస్ డి డైయు (డ్రాప్స్ ఆఫ్ గాడ్) (ఫ్రాన్స్), ది న్యూస్ రీడర్ - సీజన్ 2 (ఆస్ట్రేలియా), ఐయోసి ఎల్ ఎస్పియా అర్రెపెంటిడో - సీజన్ 2 (అర్జెంటీనా)తో అవార్డు కోసం పోటీపడునుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
అలా పిలిస్తే నా లక్ష్యం నెరవేరినట్టే!
తెనాలి: మోక్ష... టీవీ షో, సీరియల్, వెబ్ సిరీస్ల ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. మూడున్నరేళ్లకే కెమెరా ముందు కనిపించింది. 13 ఏళ్లకు బాలనటిగా స్టార్డమ్ను తెచ్చుకుంది. తన అద్భుత నటనతో పద్మమోహన అవార్డు, జాతీయ ప్రతిభా పురస్కార్ సహా 19 అవార్డులను గెలుచుకుంది. ఇటీవల బాలల దినోత్సవంలో భాగంగా జరిగిన వివేక కల్చరల్ ఫెస్ట్లో బాల అతిథిగా తన మాట, ఆట, పాటతో సందడి చేసింది. ఈ నేపథ్యంలో పలుకరించిన ‘సాక్షి’తో బోలెడు కబుర్లు పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ నా పూర్తి పేరు మోక్ష విజయ రామలక్ష్మి. తల్లిదండ్రులు సురేష్బాబు, శంకరీ రాజ్యలక్ష్మి. స్వస్థలం రాజమహేంద్రవరం. మూడున్నరేళ్ల వయసులో ఓ ఫంక్షనుకు తీసుకెళ్లారు. అక్కడే టీవీ షోకు ఆడిషను జరుగుతోంది. నన్ను చూసి బాగుందనటంతోపాటు ఆడిషనులో కూర్చోబెట్టారు. సెలెక్టు చేసుకున్నారు. అందరికీ టికెట్లు పంపి, హైదరాబాద్కు ఆహ్వానించారు. అలా ఊహ తెలీని వయసులో ‘పిల్లలు పిడుగులు’ టీవీ షోలో నటించాను. తర్వాత అవకాశాలు వరుసకట్టాయి. హైదరాబాద్కు వచ్చేశాం..నాన్నకు ఊరిలో ఉన్న అట్టల ఫ్యాక్టరీని లీజుకిచ్చి హైదరాబాద్కు వచ్చేశారు. అమ్మ ఇక్కడే ‘అమెజాన్’లో వర్క్ చేస్తోంది. పలు టీవీ ఛానళ్లలో ‘అయస్కాంతం’, ‘కోడలు’, ‘సూర్యకాంతం’, ‘గుండమ్మకథ’, ‘శుభస్య శీఘ్రం’, ‘నువ్వేకావాలి’ సీరియల్స్, ‘పిల్లలు పిశాచాలు’తో ఆరంభించి ‘డ్రామా జూనియర్స్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ వంటి టీవీ షోలు, ‘మ్యూజిక్ స్కూల్’, ‘హీరో’ సినిమాలు, మరికొన్ని వెబ్ సిరీస్లలో నటించాను. కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. విభిన్న కళల్లోనూ ప్రతిభ నటనే కాదు.. రచన, చిత్రలేఖనం, డ్యాన్స్, యాంకరింగ్ నాకిష్టం. సినీనటులు శ్రేయ, నాని, అనసూయ ఈ విషయం తెలిసి ప్రశంసించారు. ప్రముఖ యాంకర్ సుమ, ‘నా తర్వాత నువ్వే మోక్ష’ అనటం సంతోషమేసింది. రచనంటే ఇష్టమని చెప్పాకదా... నేను మూడు కథలు రాసుకున్నా. అందులో రెండు షార్ట్ ఫిలిమ్స్, మరోటి వెబ్ సిరీస్. శివుడుకి సంబంధించిన భక్తిపూర్వక కథనం. నాకొచ్చిన కలను డెవలప్ చేసి కథ, స్క్రిప్టు సిద్ధం చేశా. నా దర్శకత్వంలోనే తీయాలని ఆశ పడుతున్నా. తగిన ప్రొడ్యూసర్ ముందుకొస్తే వెబ్ సిరీస్ తీసి, అతి పిన్న దర్శకురాలు అనిపించుకోవాలని ఆశిస్తున్నా. కథానాయిక కావాలనేదే లక్ష్యంపెద్దయ్యాక హీరోయిన్గా నటించాలనేది నా మరో డ్రీమ్. హైదరాబాద్లోనే తొమ్మిదో తరగతి చదువుతున్నా. నెలలో రెండు వారాలు బడికి, రెండు వారాలు షూటింగులకు కేటాయించుకున్నా. ఎక్కడకు వెళ్లిన బుక్స్ వెంటే ఉంటాయి. షూటింగ్ గ్యాప్లో చదువుకుంటా. పరీక్షల్లో 90 శాతం పైగానే మార్కులు వస్తుంటాయి. కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నా. నా కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఎంతో త్యాగం చేశారు. చదువు, నటన, రచన... అన్నింటిలోనూ గెలిచి, నా తల్లిదండ్రులను గెలిపిస్తూ ఉండాలనేది నా ఆశయం. టాలెంట్ ఉంటే బోలెడు వేదికలుటీవీ, ఓటీటీ ప్లాట్ఫాంలు వచ్చాక చిన్న పిల్లల్నుంచి పెద్దల వరకు నటన, సాంకేతిక నైపుణ్యంలో ఎన్నో అవకాశాలున్నాయి. టాలెంట్ ఉన్నవాళ్లు అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణించవచ్చు. పిల్లలు చదువుతోపాటు ఏదో ఒక కళలో నైపుణ్యం సాధించాలనేది నా భావన. అప్పుడు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని చెబుతాను. అందుకు నేనే నిదర్శనం. తెనాలి, రాజమహేంద్రవరం అంటే నాకెంతో ఇష్టం. ఎందరో కళాకారులు ఇక్కడ్నుంచి వచ్చారు. మహానటి సావిత్రి నాకు ఆదర్శం. ఆమె సినిమాలు ఇప్పటికీ ఎవర్గ్రీనే కదా!’’ -
'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!
'బాహుబలి' పేరు చెప్పగానే ప్రభాస్, రాజమౌళి.. ఈ సినిమా దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్కి గుర్తింపు. ఇలా చాలా గుర్తొస్తాయి. ఇప్పటికే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే చాలామంది దీని పేరే చెబుతారు. ఎంతో గుర్తింపు తెచ్చుకున్న 'బాహుబలి' విషయంలో ఓ చేదు జ్ఞాపకం కూడా ఉంది. ఓ హిందీ నటుడు ఇప్పుడీ విషయాన్ని మరోసారి బయటపెట్టాడు.'బాహుబలి' రెండు సినిమాలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్.. ఈ కాన్సెప్ట్తో సిరీస్ తీయాలని ప్లాన్ చేసింది. 'బాహుబలి: బిఫోర్ ద బిగినింగ్' పేరుతో 2018లో ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ జరగ్గా.. తొలిసారి ఓ టీమ్ పనిచేస్తే ఔట్పుట్ సరిగా రాలేదని మరో టీమ్తో పనిచేయించారు. అయినా సరే కంటెంట్ నచ్చకపోయేసరికి నెట్ఫ్లిక్స్ సంస్థ దాన్ని పక్కనబెట్టేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్బస్టర్ సినిమా 'లక్కీ భాస్కర్')ఈ సిరీస్లో కీలక పాత్రలో నటించిన నటుడు బిజయ్ ఆనంద్.. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 'బాహుబలి' సిరీస్ని నెట్ఫ్లిక్స్ సంస్థ మూలన పడేయడాన్ని బయటపెట్టాడు. దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేశారని, తాను కూడా దాదాపు రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశానని బిజయ్ చెప్పాడు. ఈ క్రమంలోనే డేట్స్ కుదరక ప్రభాస్ 'సాహో' మూవీలో ఛాన్స్ మిస్సయ్యాయని పేర్కొన్నాడు.దీనిబట్టి చూస్తే సినిమాగా హిట్ అయింది కదా అని ప్రతి దాన్ని క్యాష్ చేసుకుందామనుకుంటే కొన్నిసార్లు ఇలా ఎదురుదెబ్బలు కూడా తగులుతుంటాయి. బిజయ్ ఆనంద్ ఇప్పుడు చెప్పడంతో 'బాహుబలి' సిరీస్ మూలనపడ్డ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభు ఉద్యోగం) -
ఓటీటీలో తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
ఓటీటీలు రావడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ కథలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. అలా సినిమాలుగా తీయలేని కథల్ని కొన్నిసార్లు వెబ్ సిరీసులుగా తీయడం చూస్తూనే ఉన్నాయి. అలా రాజేంద్ర ప్రసాద్, దివి, శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సిరీస్ పేరే 'హరికథ'. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)మర్డర్ మిస్టరీకి మైథలాజికల్ టచ్ ఇచ్చి తీసిన ఈ సిరీస్ డిసెంబరు 13 నుంచి హాట్స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అధర్మం హద్దు మీరినప్పుడు, అన్యాయాన్ని ఎదురించాల్సిన వారు చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు.. ఆ ధర్మాన్ని కాపాడడానికి దేవుడే వస్తాడు అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అదే టైంలో రక్తపాతంతో భయంకరంగా అనిపించింది.పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి... ఇలా శ్రీవిష్ణు దశావాతారాల్లోని కొన్ని రూపాల్లో ఉన్న వ్యక్తి.. వరస హత్యలు చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్నది దేవుడా? మరెవరైనా అని పరిశోధించే పోలీస్ ఆఫీసర్గా శ్రీ రామ్ నటించారు. రంగస్థల నాటక కళాకారునిగా రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!) -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సిరీస్ రివ్యూ
భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం యాక్షన్లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సిరీస్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్బాటెన్ (ల్యూక్ మెక్గిబ్నీ) పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి.నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురివీ.. వేటికవే విభిన్న థృక్కోణాలైనా సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. ముహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు ఆరిఫ్ జకారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్బాటన్గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా సరోజినీ నాయుడుగా కనిపిస్తారు.ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు..ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథ, కథనాలను భావోద్వేగభరితంగా అందించటంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుటుంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ–జిన్నా చర్చలు విభజనకు దారితీసిన వంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలను చక్కగా చూపించారు.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంకు సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించి స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపొందించనుంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందుంది. దేశ ఆర్థిక వృద్ధిలో ఆర్బీఐ పాత్ర కీలకం. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆర్బీఐ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. వీటికి సంబంధించిన అంశాలను స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించనుంది.1935లో ఏర్పాటైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది ఏప్రిల్లో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రస్థానాన్ని తెలియజేసేలా వెబ్ సిరీస్ రూపొందించాలని ప్రముఖ కంపెనీలకు జులైలో సెంట్రల్ బ్యాంక్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) కింద బిడ్ ఆఫర్ చేసింది. ఇందులో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ లిమిటెడ్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా వంటి సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా టెక్నికల్ ఎవాల్యుయేషన్ రౌండ్లో అర్హత సాధించలేదు. దాంతో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18 చివరి రౌండ్లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ బిడ్ను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గెలుచుకుంది. వెబ్ సిరీస్ నిర్మించడానికి స్టార్ ఇండియాకు రూ.6.5 కోట్లు టెండర్ లభించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలుఆర్ఎఫ్పీ పత్రం ప్రకారం, ఆర్బీఐ 90 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ జాతీయ టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ప్రసారమయ్యేలా దాదాపు 25-30 నిమిషాల నిడివితో ఐదు ఎపిసోడ్లు రూపొందించాలి. ఈ ఎపిసోడ్లు ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రను తెలియజేసేలా ఉండాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ఉండాలి. ఆర్బీఐ కార్యకలాపాలు, విధానాలపై విశ్వాసం కలిగేలా రూపొందించాలి. -
ఆర్బీఐపై వెబ్ సిరీస్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై స్టార్ ఇండియా వెబ్ సిరీస్ను రూపొందించనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంక్ కీలక పాత్ర గురించి ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 1935లో ప్రారంభమైన ఆర్బీఐ.. ఈ ఏడాది ఏప్రిల్లో 90 వసంతాలు పూర్తి చేసుకుంది. వెస్ సిరీస్ రూపొందించేందుకు ఆర్బీఐ 2024 జూలైలో టెండర్లను పిలిచింది. స్టార్ ఇండియా, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా పోటీపడ్డాయి. స్టార్ ఇండియా రూ.6.5 కోట్ల విలువైన ఈ టెండర్ను దక్కించుకుంది. 25–30 నిముషాల నిడివిగల అయిదు ఎపిసోడ్స్ నిర్మిస్తారు. జాతీయ టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తారు. -
OTT: యానిమేటెడ్ సిరీస్ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ
మామూలు మూవీస్ లో సూపర్ కారెక్టర్స్ చెయ్యాలంటే చాలా ఖర్చు, కష్టం తో కూడుకున్న పని. కాని అదే యానిమేటడ్ కారెక్టర్స్ అయితే అంత ఖర్చు, కష్టం రెండూ ఉండవు. అంతేనా ఇప్పటి జెనరేషన్ కి బాగా నచ్చుతుంది కూడా. అందుకేనేమో రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కి డిమాండ్ & మార్కెట్ రెండూ ఎక్కువే. కాబట్టే ఒక్కో కారెక్టర్ సీరిస్ రూపేణా బోలెడన్ని పార్ట్స్ లో వస్తున్నాయి. అదే రేంజ్ లో ఇటీవల రిలీజ్ అయిన సినిమా డిస్పెకబుల్ మి 4. జియో సినిమా ఓటిటి వేదికగా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ లభ్యమవుతోంది. డిస్పెకబుల్ సీరిస్ లో ఇది 5వ సినిమా. క్రిస్ రేనాడ్ దర్శకత్వం వహించిన సినిమా అనుకున్నట్టుగానే సూపర్ రివ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ ఫాలో అవుతున్నవాళ్ళకి దీనిలో కారెక్టర్స్ తో పాటు కథ కూడా సులువుగా అర్ధమవుతుంది. దీనిలో మెయిన్ కారెక్టర్ గ్రూ. ఇక గ్రూతో పాటు ఫిల్, రోన్ మరియు రఫ్ అనే మీనియన్స్. ఈ డిస్పెకబుల్ మి 4 కథాంశానికొస్తే గ్రూ కి ఒక కొత్త ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. కాని ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గర బానే వుంటాడు కాని గ్రూకి మాత్రం విసుగు పుట్టిస్తుంటాడు. కాని గ్రూ కి ఆ బాబంటే ఎంతో ఇష్టం. మరో పక్క తన ఎనిమీ అయిన మాక్స్ మీ లీమాల్ జైలు నుండి తప్పించుకుని గ్రూ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన గ్రూ ఫ్యామిలీ సేఫ్ హౌస్ కి వెళుతుంది. ఇక అక్కడ నుండి గ్రూ మాక్స్ మీ లీమాల్ ను ఎలా ఎదుర్కుంటుందన్నదే మిగతా సినిమా. పైన చెప్పుకున్నట్టు రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కథను మరో లెవల్ కు తీసుకువెళతాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మీనియన్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సినిమా బ్యానర్ నేమ్ నుండే ఆ అల్లరి ప్రారంభమవుతుంది. గ్రూ చేసే సాహస విన్యాసాలు, మాక్సిమల్ క్రియేట్ చేసిన ఎక్సట్రార్డినరీ వెహికల్ సూపర్ గా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఈ వీకెండ్ కు మస్ట్ వాచ్ బుల్ మూవీ డిస్పెకబుల్ మి 4. జీయో సినిమా వేదికగా ఉంది చూసేయండి. - ఇంటూరు హరికృష్ణ. -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
సినీ ప్రియులు ఇప్పుడంతా ఓటీటీల వైపే చూస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు అభిమానులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను అందిస్తున్నాయి. అలా మరో యూత్ఫుల్ కామెడీ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తెరకెక్కించిన ఈ కామెడీ వెబ్సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్.. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అనేది ఉపశీర్షిక.బిగ్బాస్ రన్నరప్ అఖిల్ లీడ్ రోల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తెలుగు రియాలిటీ బిగ్బాస్లో రెండు సార్లు రన్నరప్గా నిలిచాడు. బిగ్బాస్ సీజన్ 4తో పాటు బిగ్బాస్ నాన్ స్టాప్లో అతడికి టైటిల్ చేజారింది. బిగ్బాస్తో ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ అఖిల్కు పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ ఈ సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అఖిల్. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ వెబ్సిరీస్లో అఖిల్ సార్ధక్, మహేష్ విట్టాతో పాటు పలువురు బిగ్బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు 50కి పైగా ఎపిసోడ్స్తో ఈ వెబ్సిరీస్ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.తమిళ రీమేక్గా వేరే లెవెల్ ఆఫీస్..తమిళంలో విజయవంతమైన వేర మారి ఆఫీస్కు రీమేక్గా ఈ వెబ్సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్ సీజన్- 2 ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్-1 యూత్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితం ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించినట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. View this post on Instagram A post shared by OTT Updates (@upcoming_ott_release) -
తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్డ్రాప్లో మిస్టరీ థ్రిల్లర్గా ఈ సిరీస్న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్బాస్ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సరికొత్త వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఫ్లాట్ఫామ్లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
తెలుగులో సరికొత్త వెబ్ సిరీస్.. డైరెక్టర్గా టాలీవుడ్ కమెడియన్!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త వెబ్ సిరీస్ను ప్రకటించింది. పౌరాణిక నేపథ్యంలో ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో ఈ సిరీస్ను రూపొందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్కు చిరంజీవా అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టాలీవుడ్ మైథలాజికల్ వెబ్ సిరీస్ డిసెంబర్లో స్ట్రీమింగ్ రానుందని ప్రకటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే భక్తి కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ వెబ్ సిరీస్ను రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించారు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్కు అచ్చు రాజమణి సందీతమందిస్తున్నారు. -
టాలీవుడ్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీల్లో వెబ్ సిరీసులకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ లాంటి సిరీస్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఏ భాషలోనైనా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే తెలుగులో స్ట్రైట్ వెబ్ సిరీస్లు చాలా తక్కువే వచ్చాయి. తాజాగా తెలుగులో తెరకెక్కించిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి రానుంది.(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి'. ఈ వెబ్ సిరీస్కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ను రిలీజ్ చేశారు. కాగా.. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఈ సిరీస్ను తెరకెక్కించడం మరో విశేషం. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. The suspenseful and suspicious tale of Amaragiri and the mystery that follows it. 🫣It will see you on screens from 28th November 💥#Vikkatakavi, Amaragiri and the team wish you a Happy Diwali 🪔#VikkatakaviOnZee5@nareshagastya @akash_megha @pradeepmaddali @srtmovies pic.twitter.com/0b2G7b69Lz— ZEE5 Telugu (@ZEE5Telugu) November 1, 2024 -
మున్నా భయ్య ఈజ్ బ్యాక్.. సినిమాగా 'మీర్జాపుర్' సిరీస్
మన దేశంలో ఓటీటీల్లోనే ద బెస్ట్ వెబ్ సిరీస్ల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు 'మీర్జాపుర్'. తొలుత హిందీలో మాత్రమే తీశారు. కానీ ఊహించని రెస్పాన్స్ వచ్చేసరికి తెలుగు లాంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేశారు. దీంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పటికే మూడు సీజన్లు రాగా.. నాలుగో సీజన్ కూడా ఉంటుందని అన్నారు. ఇంతలోనే మూవీగా దీన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)'మీర్జాపుర్' వెబ్ సిరీస్లో హీరో కంటే మున్నాభయ్య అనే విలన్ పాత్రకే బీభత్సమైన క్రేజ్ వచ్చింది. తొలి రెండు సీజన్లలో ఈ పాత్ర ఉండటంతో ఎంటర్టైనింగ్గా అనిపించింది. మూడో సీజన్లో మున్నాభయ్యా లేకపోయేసరికి చాలామందికి సిరీస్ నచ్చలేదు. ఇక నాలుగో సీజన్ అంటే సాహసమనే చెప్పాలి.సరే ఇదంతా పక్కనబెడితే 'మీర్జాపుర్' సిరీస్లో మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు, బూతులపై విమర్శలు వచ్చినప్పటికీ.. జనాలు వాటినే తెగ చూశారు. ఇప్పుడు 2026లో 'మీర్జాపుర్'ని సినిమాగా తీసుకొస్తామని ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ కొత్త కథ ఏం చూపిస్తారు? బూతులు, వయలెంట్ సీన్స్ లాంటివి లేకుండా ఇంటెన్సెటినీ ఎలా చూపిస్తారనేది పెద్ద క్వశ్చన్. అయితే ఇదంతా సిరీస్కి ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలానే అనిపిస్తుంది!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
'ప్రకృతిని కట్ చేస్తే ప్రళయమే'.. ఆసక్తిగా తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్!
పవన్ సిద్ధు, తేజస్వి, అనన్య శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్ సిరీస్ 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్-2'. తెలుగులో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మరోసారి ఓటీటీ ప్రియులను అలరించేందుకు అరుణ్కుమార్ సీజన్ 2 వచ్చేస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. తాజాగా సీజన్-2 ట్రైలర్ రిలీజైంది. సీజన్-1లో హర్షిత్ రెడ్డి హీరోగా కనిపించగా.. ఇందులో పవన్ సిద్ధు నటించారు.ఈ వెబ్ సిరీస్లో కార్పొరేట్ వరల్డ్లో ఓ యువకుడు ఎలా రాణించాడనే కథాంశంతో తెరకెక్కించారు. ఫుల్ కామెడీతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. అయితే ఇందులో డైలాగ్స్, సీన్స్ ఓటీటీ ప్రియులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిిరీస్కు ఆదిత్య కేవీ దర్శకత్వం వహించారు. -
ఆ విషయంలో వాళ్లిద్దరిని వేడుకున్నా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించిన అమెరికన్ స్పై-యాక్షన్ సిరీస్ సిటాడెల్కు ఇండియన్ వర్షన్గా ఈ సిరీస్ రూపొందించారు.అయితే ఈ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను మయోసైటిస్తో బాధపడుతున్న సమయంలో ఈ సిరీస్లో నా ప్లేస్లో వేరొకరిని తీసుకోవాలని దర్శకులైన రాజ్, డీకేలకు చెప్పానని సామ్ తెలిపింది. అంతేకాకుండా తన స్థానాన్ని భర్తీ చేయగల నటిని కూడా సిఫార్సు చేశానని వెల్లడించింది. కానీ తన విజ్ఞప్తిని వాళ్లిద్దరు తిరస్కరించారని సమంత పేర్కొంది. (ఇది చదవండి: నాకు వారి సపోర్ట్ లేకుండా ఉంటే.. మంత్రి వ్యాఖ్యలపై మరోసారి సమంత)సమంత మాట్లాడుతూ.. 'ఈ సిరీస్ నేను చేస్తానని నిజంగా అనుకోలేదు. అందుకే నా ప్లేస్లో మరొకరిని తీసుకోమని వారిని వేడుకున్నా. నేను చేయలేనని నేను కచ్చితంగా చెప్పా. ఆ పాత్రకు తగిన వారి పేర్లను కూడా పంపా. కానీ వాళ్లు నా స్థానంలో వేరొకరిని తీసుకునేందుకు నిరాకరించారు. ఇప్పుడు ఈ సిరీస్లో తాను నటించినందుకు సంతోషంగా ఉంది. దర్శకులు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు' తెలిపింది.కాగా.. సమంత గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీకి థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రానా చేతుల మీదుగా ట్రైలర్
నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ సిరీస్ను రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ విషయాన్ని రానా తన ట్విటర్లో షేర్ చేశారు. కాగా.. వెబ్ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు.DANGER awaits at every step.Ee Vaikuntapaali aata chudadaniki meeru siddhama?🔥Trailer Out Now: https://t.co/jpNQ20usGi#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 only on @PrimeVideoIN@stonebenchers @karthiksubbaraj @kalyanshankar @kaarthekeyens @Naveenc212 @nandaa_actor…— Rana Daggubati (@RanaDaggubati) October 16, 2024 -
ఓటీటీకి తెలుగు వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన అలరించిన టాలీవుడ్ వెబ్ సిరీస్. గతేడాది జూన్లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్కు రీమేక్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కార్పొరేట్ వరల్డ్లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేదే అసలు కథ. తొలి సీజన్ ఐదు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్-2 అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. కాగా.. ఈ సిరీస్ మొదటి సీజన్లో హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ కీలక పాత్రలు పోషించారు. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ బ్యానర్లపై బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ నిర్మించారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
తెలుగులోకి మరో క్రేజీ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సినిమాలు వచ్చినట్లే.. ఓటీటీలో కొత్త కొత్త వెబ్ సిరీసులు కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. తెలుగులో స్ట్రెయిట్గా తీయనప్పటికీ.. ఇతర భాషల్లో తీసిన సిరీస్లని డబ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా ఇప్పుడు ఓ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు?)'1000 బేబీస్' పేరుతో తీసిన ఈ సిరీస్ని సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఓ పోలీస్ టీమ్ దేనికోసమే సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు అడవి మధ్యలో ఓ ఇంట్లో ముసలావిడ. ట్రైలర్లో పెద్దగా కథని రివీల్ చేయలేదు గానీ చూస్తుంటే ఇదేదో మంచి థ్రిల్లర్లా అనిపిస్తుంది.మలయాళంలో తీసినప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అక్టోబరు 18న అంటే వచ్చే శుక్రవారం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. మీరు ట్రైలర్పై ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!) -
ఓటీటీకి సరికొత్త థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
సరికొత్త కంటెంట్తో ఓటీటీలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఏ భాషలో తెరకెక్కినా సరే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లకు మంచి డిమాండ్ పెరిగింది. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే మంచి కంటెంట్ను అందిస్తున్నారు. తాజాగా తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్.ఈ ఏడాది మార్చిలో ప్రైమ్ వీడియో ఈ సిరీస్ను ప్రకటించారు. ఈ సిరీస్లో నవీన్ చంద్ర, ముత్తు కుమార్, నందా, శ్రిందా, మనోజ్ భారతీ రాజా కీలక పాత్రల్లో నటించారు. నలుగురు పిల్లల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.ఈనెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్ను విడుదల చేస్తూ ట్వీట్ చేసింది.తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సిరీస్కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు. Roll the dice and accept your fate 🐍🪜#SnakesandLaddersOnPrime, New Series, Oct 18 pic.twitter.com/dFi8ZVCbt7— prime video IN (@PrimeVideoIN) October 7, 2024 -
ఒకే ఫ్రేమ్లో సమంత, ప్రియాంక.. థియేటర్లో సందడి (ఫోటోలు)
-
S Jaishankar: ఆ విమానంలో నా తండ్రి కూడా ఉన్నారు
జెనీవా: ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’వెబ్సిరీస్పై ఇంకా చర్చ జరుగుతున్న వేళ అలాంటి హైజాక్ ఉదంతంలో తన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడిగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. 1984 ఏడాదిలో జరిగిన విమాన హైజాక్ ఉదంతంలో తన కుటుంబం సైతం తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. జెనీవాలో ఒక భారతీయసంతతి వ్యక్తులతో భేటీ సందర్భంగా జైశంకర్ తన కుటుంబం గతంలో పడిన వేదనను అందరితో పంచుకున్నారు. ఏడుగురు హైజాకర్లు చొరబడి.. ‘1984 జులై ఐదో తేదీన ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ 421 విమానం శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయి మధ్యలో చండీగఢ్ సమీపంలోని పఠాన్కోట్లో ఆగింది. అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్పిట్లోకి చొరబడి విమానాన్ని తమ అ«దీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారంతా ఆలిండియా సిఖ్ స్టూడెంట్స్ ఫెడరేషన్కు చెందిన వాళ్లు. సిక్కు వేర్పాటువాది జరై్నల్ సింగ్ భింద్రన్వాలేతోపాటు ఇతర నేతలను విడుదలచేయాలని డిమాండ్ విధించారు. విమానాన్ని లాహోర్కు, తర్వాత కరాచీకి, చిట్టచివరకు దుబాయ్కు తీసుకెళ్లారు. విమానం విదేశీగడ్డపైకి వెళ్లడంతో భారత విదేశాంగ శాఖ సైతం రాయబారం నడిపేందుకు రంగంలోకి దిగింది. ఇండియన్ ఫారిన్ సరీ్వస్లో చేరిన తొలినాళ్లలో.. అప్పుడు నేను ఇండియన్ ఫారిన్ సరీ్వస్(ఐఎఫ్ఎస్) యువ అధికారిగా పనిచేస్తున్నా. ప్రయాణికులన విడిపించేందుకు హైజాకర్లతో చర్చలు జరపాల్సిన బృందంలో నేను కూడా సభ్యునిగా ఉన్నా. అత్యంత కీలకమైన పనిలో నిమగ్నంకావాల్సి ఉన్నందున ఇంటికి రాలేనని చెప్పేందుకు మా అమ్మకు ఫోన్ చేశా. అప్పుడు నా భార్య ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో పసిబిడ్డగా ఉన్న నా కుమారుడిని మా అమ్మ ఒక్కరే చూసుకుంటోంది. ‘‘ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ విమానాన్ని హైజాక్ చేశారు’’అని చెప్పా. అయితే పనిలో సీరియస్గా మునిగిపోయాక నాలుగు గంటల తర్వాత నాకో విషయం తెల్సింది. అదేంటంటే నా తండ్రి కృష్ణస్వామి కూడా అదే విమానంలో బందీగా ఉన్నారు. ఓవైపు హైజాక్ విషయం తెల్సి ప్రయాణికుల కుటుంబసభ్యులు భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో నేను ఉన్నా. మరోవైపు ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిని కూడా నేను. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నాది. ఏదేమైనా 36 గంటల ఉత్కంఠ తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు అధికారుల ఎదుట లొంగిపోవడంతో కథ సుఖాంతమైంది. విమానంలోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైజాక్ ఉదంతం విషాదాంతంగా ముగియకుండా ఒక సమస్యకు పరిష్కారంగా మలుపు తీసుకుంది’’అని అన్నారు. ‘‘నేనింకా కాందహార్ వెబ్సిరీస్ చూడలేదు. అయితే హైజాకర్లతో ప్రభుత్వం, మధ్యవర్తులు కాస్తంత వెనక్కి తగ్గి మాట్లాడినట్లుగా అందులో చూపించారట కదా. సినిమాల్లో హీరోను మాత్రమే అందంగా చూపిస్తారు. ప్రభుత్వం సరిగా పనిచేసినా చూపించరు’’అని అన్నారు. అణ్వస్త్ర విధానాల్లో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర మాజీ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణస్వామి హైజాక్ జరిగిన ఏడాది ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్, అనాలసిస్కు డైరెక్టర్గా ఉన్నారు. ఆ తర్వాత భారత ‘అణ్వస్త్ర’విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా పేరొందారు. ‘‘అణ్వాయుధాలను తొలుత భారత్ తనంతట తానుగా ఏ దేశం మీదా ప్రయోగించకూడదు. ఒక వేళ భారత్ మీద ఎవరైనా అణ్వాయుధం ప్రయోగిస్తే ధీటైన సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి’’అనే ప్రాథమిక సిద్ధాంతాల్లో రూపకల్పనలో ఈయన పాత్ర ఉందని చెబుతారు. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుకు తొలి కనీ్వనర్గా వ్యవహరించారు. హైజాకర్లతో చర్చల వేళ ‘‘కావాలంటే మొదట నన్ను చంపండి. ప్రయాణికులను ఏమీ చేయకండి’’అని హైజాకర్లతో కృష్ణస్వామి అన్నారని నాటి పాత్రికేయులు రాజు సంతానం, దిలీప్ బాబ్లు చెప్పారు. -
ఐటీ నుంచి డైరెక్షన్ దాకా..
‘ఇక్కడకు డైరెక్టర్ అవుదామనే వచ్చాను. ఎస్.. ముందు ఊహించిన దానికన్నా ప్రాక్టికాలిటీలో భిన్నంగానే ఉంది. అయినాసరే అనుకున్నది సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది’ అంటున్నారు మానసశర్మ. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన మానస.. సోనీలివ్లో గురువారం నుంచి అందుబాటులోకి రానున్న బెంచ్లైఫ్ వెబ్సిరీస్ ద్వారా దర్శకురాలిగా మారుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘మాది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం. చిన్నప్పటి నుంచి కథలు చదవడం ఇష్టం. అలాగే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ విఠలాచార్య వంటి గొప్ప నటుల, దర్శకుల చిత్రాలు బాగా చూశాను. వాటి ద్వారా ఫిల్మ్ మేకింగ్పై ఇష్టం ఏర్పడింది. వైజాగ్లో ఇంజనీరింగ్ చదివే సమయంలో మల్టీమీడియా ప్రాజెక్ట్ సబి్మట్ చేయమంటే నా క్లాస్మేట్స్కు భిన్నంగా నేను షార్ట్ ఫిల్మ్ చేశా. చదువు పూర్తయ్యాక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఏడాది పాటు పనిచేసినా.. సినిమాలపై ఉన్న ఇష్టం నన్ను అక్కడ ఉండనివ్వలేదు. రిజైన్ చేసి డైరెక్టర్ కావాలనే లక్ష్యంతోనే సినీరంగంలోకి ప్రవేశించాను. రైటర్ టూ డైరెక్టర్.. తొలుత రచయితగా 3 వెబ్సిరీస్లకు పనిచేశాను. మెగా డాటర్ నిహారిక బెంచ్లైఫ్ ద్వారా నాకు డైరెక్టర్గా తొలి అవకాశం ఇచ్చారు. తొలిసారి రాజేంద్రప్రసాద్, తనికెళ్లభరణి లాంటి గ్రేట్ యాక్టర్స్ని డైరెక్ట్ చేశాను. వారు కూడా నన్ను ప్రోత్సహించారు. షూటింగ్లో 40 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. క్లైమాక్స్ సీన్ చేశాక.. ‘ఆ నలుగురూ సినిమా తర్వాత గ్లిజరిన్ అవసరం లేకుండా కన్నీళ్లు పెట్టించిన సీన్ మళ్లీ ఇదే’ అని రాజేంద్రప్రసాద్ అనడం.. నా ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పాలి. ఒక్క ఛాన్స్.. చాలు.. మొదటి నుంచీ డైరెక్టర్ అవుదామనే నా లక్ష్యం నెరవేరుతున్నందుకు హ్యాపీ. రాసుకున్న కథ సరైన రీతిలో అందించాలని వచి్చన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని తప్ప వేరే విషయాలు ఆలోచించడం లేదు. త్వరలో పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేయనున్నా. యువన్శంకర్ రాజా మ్యూజిక్.. మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి’ అంటూ ముగించారు మానసశర్మ. ఏదేమైనా విజయనిర్మల, నందినీరెడ్డిల తర్వాత భూతద్ధంలో పెట్టి వెదికినా లేడీ డైరెక్టర్ కనిపించని పరిస్థితుల్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో మన ముందుకు వస్తున్న తెలుగమ్మాయి మానస శర్మ దర్శకురాలిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ..చెప్పేద్దాం.. ఆల్ ద బెస్ట్... -
ఓటీటీకి టాలీవుడ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన టాలీవుడ్ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్. ఈ వెబ్ సిరీస్కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల నిర్మించారు. ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.ఐటీరంగంలో బెంచ్పై ఉండడం అనే మాటలు తరచుగా వింటుంటాం. ఆ సబ్జెక్ట్నే వెబ్ సిరీస్గా ఆవిష్కరించారు. ట్రైలర్లో డైలాగ్స్, సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు దాదాపు ఏడు భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్లో ఈ సిరీస్ ప్రసారమవ్వనుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, నయన్ సారిక, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్కు పీకే దండి సంగీతమందించారు. -
నెట్ఫ్లిక్స్ సిరీస్పై తీవ్ర అభ్యంతరం.. ఇకపై తప్పు జరగదన్న మేకర్స్!
ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన సరికొత్త వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. ఈ సిరీస్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సిరీస్లోని కొన్ని సన్నివేశాలపై పెద్దఎత్తున వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే సిరీస్పై మండిపడ్డ కేంద్రం వివరణ ఇవ్వాలంటూ మేకర్స్కు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ కేంద్ర, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు.ఇకపై కంటెంట్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కంటెంట్ను ప్రసారం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులకు సంబంధించిన కంటెంట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ అంగీకరించింది.అసలేంటీ వివాదం..1999లో భారత విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్లో హైజాకర్ల పేర్లను శంకర్, భోలా అని మార్చి చూపించడమే కాకుండా.. వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చిత్రీకరించారు. దీంతో హైజాకర్లు తమ మత గుర్తింపు దాచిపెట్టేందుకే మారుపేర్లు పెట్టుకున్నారని.. ఈ సిరీస్ రూపొందించిన వారు కావాలనే ఆ పేర్లనే క్యారెక్టర్స్కు పెట్టారని భాజపా ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేసింది. -
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీల్లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్కు మంచి డిమాండ్ ఉంది. ఈ జానర్ సినిమాలే కాదు.. వెబ్ సిరీస్లు సైతం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. అందువల్లే క్రైమ్ జానర్లో ఎక్కువగా వెబ్ సిరీస్లు తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.విలక్షణ నటుడు కెకె మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ముర్షిద్. ఈ సిరీస్లో ఆయన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈనెల 30 నుంచే జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా.. కెకె మీనన్ ఈ మధ్యే శేఖర్ హోమ్ అనే మరో సిరీస్లోనూ కనిపించారు. అంతేకాకుండా ఈ క్రైమ్ థ్రిల్లర్లో తనూజ్ వీర్వానీ, వేదికా భండారీ, అనంగ్ దేశాయ్, జాకిర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు.Dushmanon ke liye bura waqt bankar, 20 saal baad, Bambai ka raja - Murshid Pathan apni takht par laut raha hai! 👑🔥#Murshid premieres 30th August, only on #ZEE5. Trailer out now! #MurshidOnZEE5 pic.twitter.com/mlh1I8skXS— ZEE5 (@ZEE5India) August 20, 2024 -
OTT: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: ‘చట్నీ సాంబార్’ వెబ్ సిరీస్నటీనటులు: యోగిబాబు, వాణి భోజన్, చంద్రన్, నితిన్ సత్య, దీపా శంకర్, తదితరులుదర్శకత్వం: రాధామోహన్ఓటీటీ: హాట్ స్టార్వేడుకేదైనా, వేదికేదైనా, సందర్భం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా మనిషికి ఎప్పటికీ తృప్తినిచ్చేది రుచికరమైన వంటలు. లేచీ లేవగానే కాఫీ టీ ల దగ్గర నుండి రాత్రి పడుకోబోయేముందు డెజర్ట్ వరకు మనం తినే ప్రతి పదార్ధానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది మరి. తినే పదార్థాల మార్కెట్ అన్ని రంగాలలో విరివిగా వుంది. ఆ కోవలేనే హాట్ స్టార్ వేదికగా ఇటీవల ఓ సిరీస్ విడుదలైంది. దాని పేరే చట్నీ సాంబార్. మనం రోజూ విరివిగా వాడే పదాలు ఇవి. చట్నీ సాంబార్ రుచిలో ఎంత బాగుంటాయో ఈ సిరీస్ కూడా అదే విధంగా ఉంటుంది.ప్రముఖ దర్శకులు రాధామోహన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వర్ధమాన తమిళ హాస్య నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో నటించాడు. ఇక కధాంశానికొస్తే రత్నసామి అనే వ్యక్తి ఊటీలో అముదా కేఫ్ను నడుపుతుంటాడు , ఈ కేఫ్ లో సాంబార్ చాలా ఫేమస్. ఒకరోజు రత్నసామి తీవ్రఅనారోగ్యానికి గురవుతాడు. మరణశయ్యపై, అతను తన తల్లిని వివాహం చేసుకునే ముందు అముద అనే మహిళతో నివసించాడని మరియు ఆమె ద్వారా తనకు ఒక కొడుకు ఉన్నాడని తన కొడుకు కార్తీక్కు వెల్లడిస్తాడు. కార్తీక్ నుండి తన సవతి సోదరుడిని కలుస్తానని వాగ్దానం పొందిన తరువాత, రత్నసామి మరణిస్తాడు. కార్తీక్ సవతి సోదరుడు సచిన్. చెన్నై నగరంలో సచిన్ ఓ దోసెలబండి నడుపుతుంటాడు. అతని దగ్గర చట్నీ ఫేమస్. కార్తీక్ సచిన్ ను కనుగొని, అతనిని ఊటీకి రత్నసామి అంత్యక్రియలు జరపడానకి తీసుకువస్తాడు. ఇంట్లో ఉన్న ఎవరికీ సచిన్ నచ్చడు. మరి ఇంట్లో వారినందరినీ మెప్పించి సచిన్ వచ్చిన పని నెరవేర్చాడా? ఈ దశలో కార్తీక్ మరియు సచిన్ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కున్నారన్న విషయం ఇడ్లీ లేదా దోశలు తింటూ ఈ చట్నీ సాంబార్ ను హాట్ స్టార్ లో చూశేయండి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ ఈ చట్నీ సాంబార్.-ఇంటూరు హరికృష్ణ -
నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా నిశ్చితార్థం తర్వాత చైతూ చాలా సంతోషంగా ఉన్నాడని నాగ్ తెలిపారు.అయితే చైతూకు ఎంగేజ్మెంట్ కావడంతో అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపైనే పడింది. చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.డైరెక్టర్తో డేటింగ్?ఈ సంగతి అటుంచితే.. తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రెడ్ఇట్ కథనం ప్రకారం సామ్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అతను సమంత నటిస్తోన్న సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. అయితే సమంత- రాజ్ నిడిమోరుపై వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లయిన రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.కాగా.. 2017లో సమంత- నాగచైతన్య పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు తమ తమ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. -
ఓటీటీకి క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
కోలీవుడ్ నటుడు సత్యరాజ్, రేఖ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్ 'మై హస్బెండ్ ఫర్ఫెక్ట్'. ఈ సిరీస్లో టాలీవుడ్ హీరోయిన్ వర్షబొల్లమ్మ కూడా నటించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్కు తమిర దర్శకత్వం వహించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ డేట్ను కూడా ఖరారు చేశారు.ట్రైలర్ చూస్తుంటే ఓ ఉమెన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసే పాత్రలో సత్యరాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు భార్యగా రేఖ కనిపించనున్నారు. టైటిల్ చూస్తుంటేనే భార్య, భర్తల కోణంలోనే కథను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో వచ్చే సన్నివేశాలు చూస్తుంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎమోషన్స్తోనే ప్రధానంగా తెరకెక్కించారని కనిపిస్తోంది.కాగా.. మై పర్ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ను మహమ్మద్ రషిత్ నిర్మించగా.. విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ను ఆగస్టు 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని హాట్స్టార్ అధికారికంగా వెల్లడించింది. -
వెబ్ ప్రపంచంలోకి ఐశ్వర్య లక్ష్మి
బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి. ఈమె నిర్మాత కూడా. మలయాళంలో పలు సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించారు. ఇకపోతే తమిళంలో జగమే తంతిరం, యాక్షన్, కట్టాకుస్తీ, పొన్నియిన్ సెల్వన్ తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్,థ్రిల్లర్ థగ్ లైఫ్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్న ఐశ్వర్య లక్ష్మి తాజాగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారని తెలిసింది. యాలీ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న తమిళ వెబ్సిరీస్లో నటి ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. నవ దర్శకుడు పరిచయం అవుతున్న ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా చాలా మంది ప్రముఖ నటీమణులు ఇప్పుడు వెబ్ సిరీస్లో నటించడానికి ఆసక్తి చూసుతున్నారు. ఆ కోవలో నటి ఐశ్వర్యలక్ష్మి కూడా చేరుతున్నారన్నమాట. -
ఓటీటీలో మరో క్రేజీ టైమ్ ట్రావెల్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
థియేటర్లలో ఎలాంటి సినిమాలొచ్చినా చూస్తారు కానీ ఓటీటీల్లో మాత్రం చాలావరకు థ్రిల్లర్స్ని చూసేందుకు జనాలు ఇష్టపడతారు. అందుకు తగ్గట్లే అన్ని భాషల్లోని దర్శకులు డిఫరెంట్ స్టోరీలతో మూవీస్ తీస్తుంటారు. అలా టైమ్ ట్రావెల్ అనేది మంచి కాన్సెప్ట్. హాలీవుడ్లో ఈ తరహావి ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు హిందీలోనూ ఇలాంటి ఓ క్రేజీ వెబ్ సిరీస్ని రెడీ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి మరీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)గ్యారా గ్యారా (11:11) పేరుతో తీసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. 1990లోని ఓ పోలీస్, 2001లోని అంటే భవిష్యత్ కాలంలోని పోలీస్తో వాకీ టాకీ ద్వారా మాట్లాడుతుంటాడు. ఇది కూడా ప్రతిరోజు రాత్రి 11 గంటల 11 నిమిషాలకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇలానే వీళ్లు మర్డర్ మిస్టరీలని పరిష్కరిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎదుర్కొంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.ఇలా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో వచ్చిన వాటిలో 'డార్క్' అనే వెబ్ సిరీస్ నం.1 అని చెప్పొచ్చు. 'గ్యారా గ్యారా' ట్రైలర్ చూస్తుంటే.. 'డార్క్' సిరీస్ని స్ఫూర్తిగా తీసుకుని ఇది తీశారా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నట్లు 'గ్యారా గ్యారా' కూడా 1990, 2001, 2016 టైమ్ లైన్స్లో జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 9 నుంచి జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా) -
‘నాగేంద్రన్స్ హనీమూన్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: నాగేంద్రన్స్ హనీమూన్స్నటీనటులు: సూరజ్ వెంబరమూడు, శ్వేత మీనన్, గ్రేస్ ఆంటోనీ, నిరంజన, అనూప్ తదితరులునిర్మాత: నితిన్ రెంజీ పనికర్దర్శకత్వం: నితిన్ రెంజీ పనికర్ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్స్టార్నాగేంద్రన్స్ హనీమూన్స్ సిరీస్ పేరు వినగానే ఇదేదో రొమాంటిక్ కథ అనుకుంటాం. కాని ఈ కథలో రొమాన్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉండడం విశేషం. మెల్ల మెల్లగా భారతీయ ఓటీటీ ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను కూడా ఆదరించడం హర్షణీయం. నాగేంద్రన్స్ హనీమూన్ సిరీస్ ఓ మంచి రొమాంటిక్ కామెడీ అని చెప్పవచ్చు. ఓ పెళ్ళి చేసుకోవడానికి వంద అబద్ధాలైనా ఆడవచ్చు అన్న నానుడి వినే ఉంటాం. కాని ఈ కథలోని కథానాయకుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నాడు అన్నదే పాయింట్. వధువు ఇచ్చే కట్నకానుకలపై కన్నేసిన కథానాయకుడు ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడుతూ చివరికి ఏమయ్యాడన్నదే ఈ నాగేంద్రన్స్ హనీమూన్. విలక్షణ మళయాళ నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన ఈ సినిమాను నితిన్ రెంజి పానికర్ దర్శకత్వంలో రూపొందించారు. కథ సిరీస్ కాబట్టి స్క్రీన్ ప్లే సరదాగా రాసుకున్నాడు దర్శకుడు. ఎక్కడా బోర్ ఫీలవకుండా ప్రేక్షకుడు ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చూసేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అక్కడక్కడా కొంత లాగ్ ఉన్నా వెరైటీ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు మంచి వాచబుల్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్.-ఇంటూరు హరికృష్ణ -
ఇండస్ట్రీ అంతా ఒక్క వెబ్ సిరీస్లో... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో క్రేజీ అంటే క్రేజీ వెబ్ సిరీస్ రిలీజ్కి రెడీ అయిపోయింది. ఇది ఎందుకు అంతలా స్పెషల్ అంటే.. ఏదైనా సినిమాలో గానీ సిరీస్లో మహా అయితే ఒకరిద్దరు స్టార్స్ నటిస్తారు. కానీ దీని కోసం మాత్రం దాదాపుగా ఇండస్ట్రీనే కదిలొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సిరీస్లో అంతమంది స్టార్స్ ఉన్నారు. అసలు దీని సంగతేంటి? తాజాగా రిలీజైన ట్రైలర్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: మ్యూజీషియన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)ఈ ఏడాది ఏ ఇండస్ట్రీకి లేనంత సక్సెస్ రేట్ మలయాళ చిత్రపరిశ్రమ దక్కించుకుంది. మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం, భ్రమయుగం, ప్రేమలు.. ఇలా వరసపెట్టి సినిమాలు హిట్ కొట్టాయి. వందల కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్నాయి. స్వతహాగా మలయాళ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఈ భాషలోని స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ పాజిల్.. ఇలా టాప్ సెలబ్రిటీలు చాలామంది 'మనోరథంగల్' అనే వెబ్ సిరీస్ చేశారు.రెండేళ్లుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సిరీస్.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 15 నుంచి జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ స్టార్ రైటర్ ఎమ్టీ వాసుదేవర్ నాయర్ రాసిన స్టోరీతో ఈ సిరీస్ తీశారు. 9 భాగాల అంథాలజీని 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కించారు. ఇందులో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, కమల్ హాసన్, బిజు మేనన్, పార్వతి తిరువత్తు, అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ, సిద్ధిఖీ.. ఇలా దాదాపు టాప్ సెలబ్రిటీలు అందరూ నటించడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. అంచనాలు పెంచేసిన ట్రైలర్!
టాలీవుడ్ భామ అంజలి ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో అభిమానులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్తో ఫ్యాన్స్ను పలకరించేందుకు వస్తోంది. అంజలి లీడ్ రోల్లో వస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. ముకేశ్ ప్రజాపతి దర్శకత్వంలో రూపొందించిన ఈ సిరీస్ను జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్లపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించారు.విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో వస్తోన్న సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. 'మంచోడు చేసే మొదటి తప్పు ఏంటో తెలుసా..? చెడ్డోడి చరిత్ర తెలుసుకోవడమే..' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సిరీస్లో అంజలి వేశ్యపాత్రలో కనిపించనుంది. దీంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్లో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. Thrilled to Launch the trailer for #BahishkaranaOnZee5! Always was impressed with the director @iamprajapathi with his work in BiggBoss and now this!!Anjali looking good bringing strength and depth to her character Pushpa!!https://t.co/ewhjAwzSFD@yoursanjali @ZEE5Telugu…— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 10, 2024 -
బృంద వస్తోంది
హీరోయిన్ త్రిష టైటిల్ రోల్లో నటించిన థ్రిల్లింగ్ క్రైమ్ మిస్టరీ వెబ్ సిరీస్ ‘బృంద’. సూర్య మనోజ్ వంగాలా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో ఆగస్టు 2 నుంచి ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్లో పోలీసాఫీసర్ బృందగా త్రిష నటించారు. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. -
ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. టీజర్ చూస్తే చాలు!
కోలీవుడ్ భామ త్రిష గతేడాది లియోతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించనున్నారు. స్టాలిన్ తర్వాత మెగాస్టార్తో మరోసారి జతకట్టనున్నారు. వశిష్ట డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో హీరోయిన్ త్రిష కూడా చేరిపోయారు. త్రిష కృష్ణన్, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న ఎమోషనల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్రింద. సూర్య మనోజ్ వంగలదర్శకత్వంలో ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే 'ఈ ప్రపంచంలో మనం రాకముందు ఎంత చెడైనా ఉండొచ్చు.. కానీ వెళ్లేముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మన బాధ్యత అనే డైలాగ్' విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 2వ తేదీ నుంచి సోనిలివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్లో జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఏడు ఎపిసోడ్లుగా ఏకం.. ట్రైలర్ చూశారా?
ప్రకాశ్ రాజ్, రాజ్ బి శెట్టి, షైన్ శెట్టి, మానసి సుధీర్, ప్రకాశ్ తుమినడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ఏకం. ఇందులో ఏడుగురి జీవితాలను ఏడు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదుగురు దర్శకులు పని చేశారు. సుమంత్ భట్, స్వరూప్ ఎలమొన్, సనల్ అమన్, శంకర్ గంగాధరన్, వివేక్ వినోద్ దర్శకత్వం వహించారు. వీరిలో సనల్, వివేక్ మినహా మిగతా ముగ్గురూ స్క్రీన్ప్లే అందించారు. ఈ స్క్రీన్ప్లేకు జీఎస్ భాస్కర్ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. ఈ సిరీస్ జూలై 13న ఏకం ద సిరీస్ (https://www.ekamtheseries.com/) వెబ్సైట్లో విడుదల కానుంది.భావోద్వేగాల సమ్మేళనంఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమ, భయం, ధైర్యం, బాధ.. ఇలా అన్నిరకాల ఎమోషన్స్ను రంగరించారు. ఎంతో సహజసిద్ధంగా కనిపిస్తున్న ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యుంటే ఎక్కువమంది చూసే ఆస్కారం ఉండేది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ సిరీస్ను తిరస్కరించడంతో మరో అవకాశం లేక సొంత ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.పట్టించుకోని ఓటీటీలుఈ విషయాన్ని కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించాడు. '2020 జనవరిలో ఏకం ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది. 2021 అక్టోబర్లో ఫైనల్ కట్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ అద్భుతమైన సిరీస్ను ప్రపంచానికి చూపించాలని ఆరాటపడ్డాను. కానీ ఎంత ఎదురుచూసినా, ప్రయత్నించినా ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఏకం తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే మా సొంత ప్లాట్ఫామ్లోనే దీన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు' అని ట్వీట్ చేశాడు. Presenting #EKAM – with love, from us to you! 🤗Join the waitlist now!🔗 https://t.co/PFMuw92M13 @ParamvahStudios @teamjourneyman #SumanthBhat @sandeep_ps5 @AaronMac05 @prakashraaj @RajbShettyOMK @ShineShetty_ @worldofekam @definestudio_ pic.twitter.com/e6DCwAj7tD— Rakshit Shetty (@rakshitshetty) June 17, 2024చదవండి: అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో? -
మరోసారి వేశ్య పాత్రలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్!
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన నటి అంజలి. ఇటీవల విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో మెప్పించింది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది.అంజలి ప్రస్తుతం మరోసారి అలాంటి విభిన్నమైన పాత్రతో అభిమానులను పలకరించనున్నారు. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ బహిష్కరణ. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో ముఖేష్ ప్రజాపతి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్పై రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ ఈనెల 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ గురించి అంజలి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.అంజలి మాట్లాడుతూ..'పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాత్ర చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి సమాజంలో అసమానతలను ఎదుర్కొనే స్త్రీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ అని.. ఇందులో ఆమె చేసిన ప్రయాణం, వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, బేబీ చైత్ర కీలక పాత్రలు పోషించారు.A tale of misused power and enraged beauty.Get ready for #Bahishkarana on 19th July#BahishkaranaOnZee5 @PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @yoursanjali @AnanyaNagalla @RavindraVijay1 @prasannadop @SidharthSadasi1 pic.twitter.com/bvtplrLhgV— ZEE5 Telugu (@ZEE5Telugu) July 4, 2024 -
థియేటర్లలో కల్కి దూకుడు.. ఓటీటీకి ఒక్క రోజే ఎన్ని సినిమాలంటే!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇప్పటికే థియేటర్లలో కల్కి మానియా నడుస్తోంది. వారం రోజులుగా కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో రెండో వారంలోనూ ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ వారంలో చిత్రాలు రిలీజయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.ఎప్పటిలాగే ఈ వీకెండ్లో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతంలో అత్యంత ఆదరణ పొందిన మీర్జాపూర్-3 వెబ్ సిరీస్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ సిరీస్లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు సీజన్లుగా యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్సిరీస్ మీర్జాపూర్: సీజన్3 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దీంతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) - జూలై 05 గోయో (స్పానిష్ మూవీ) - జూలై 05అమెజాన్ ప్రైమ్ మీర్జాపూర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 05 జియో సినిమా హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) - జూలై 05ఆహా హరా (తమిళ సినిమా) - జూలై 05బుక్ మై షో ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - జూలై 05 విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) - జూలై 05సోనీ లివ్ మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) - జూలై 05మనోరమ మ్యాక్స్ మందాకిని (మలయాళ సినిమా) - జూలై 05 -
ఓటీటీలోకి మీర్జాపూర్ 3... సీజన్ 1, 2లో ఏం జరిగింది?
‘మీర్జాపూర్’.. ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరిస్ ఇది. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకుల అంతా ఈ క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్ని ఆదరించారు. ముఖ్యంగా యూత్కి ఈ సిరీస్ బాగా నచ్చింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు రాగా.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. అలీ ఫజల్, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి, పంకజ్ త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటించిన మీర్జాపూర్ సీజన్ 3 జులై 5 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో అసలు సీజన్ 1, 2లలో చెప్పారు? సీజన్ 3లో ఏం చూపించబోతున్నారు? తెలుసుకుందాం.గన్స్, డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. మీర్జాపూర్ మొత్తం కాలీన్ భాయ్(పంకజ్ త్రిపాఠి) చేతిలో ఉంటుంది. అక్కడి మాఫియా సామ్రాజ్యానికి అతనే మహా రాజు. కాలీన్ భాయ్ కొడుకు మున్నా భాయ్(దివ్యేంద్) ఓ పెళ్లి కొడుకును గన్తో కాల్చి చంపేస్తాడు. ఈ కేసును లాయర్ రమాకాంత్ పండిత్(రాజేశ్ తైలాంగ్) వాధిస్తాడు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్ద కొడుకు పేరు గుడ్డు పండిత్(అలీ ఫజల్), చిన్న కొడుకు బబ్లూ పండిత్(విక్రాంత్ మస్సే), కూతురు డింపీ(హర్షిత). కొడుకును కాపాడుకునేందుకు కాలీన్ భాయ్ భారీ ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో తన వ్యాపార పనులను గుడ్డు, బబ్లులకు అప్పగిస్తాడు. దీంతో మున్నా..తీవ్ర కోపంతో రగిపోతుంటాడు. గుడ్డు ప్రేయసి స్వీటీపై కన్నేస్తాడు. ఆమె దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన గుడ్డు, స్వీటీ, బబ్లూ, డింపీలపై మున్నా తన గ్యాంగ్తో దాడి చేస్తాడు. ఈ దాడిలో గర్భిణి అయిన స్వీటీతో పాటు బబ్లు కూడా చనిపోతాడు. గోలు సహాయంతో గుడ్డు తప్పించుకుంటాడు. ఇంతటితో సీజన్ 1 ముగుస్తుంది.మున్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరంభమయ్యే సన్నివేశాలతో సీజన్-2 మొదలవుతుంది. మరోవైపు డింపీ, గోలు కలిసి ఓ డాక్టర్ని కిడ్నాప్ చేసి గుడ్డుకు చికిత్స చేయిస్తారు. మున్నాను ఎలాగైన చంపేయాలనే పగతో రగిలిపోతుంటారు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్కు అత్యంత నమ్మకస్తుడైన మక్బూల్.. ఒకప్పుడు తన కుటుంబ సభ్యుడి చావుకు కారణం అయ్యాడనే కోపంతో కాలీన్ తండ్రిని చంపేందుకు ప్లాన్ వేస్తాడు. కాలీన్ భార్య బీనా కూడా అతనితో చేతులు కలిపి మామను చంపేందుకు ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు మీర్జాపూర్ డాన్ సింహాసనంపై ఆశపడి తండ్రినే చంపేందుకు ప్లాన్ వేస్తాడు మున్నా. అందుకోసం శరత్ శుక్లాతో చేతులు కలుపుతాడు. అయితే గుడ్డు, గోలులు మాత్రం పక్కా ప్లాన్తో మున్నాపై దాడికి దిగుతారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాలీన్ భాయ్ని శరత్ కాపాడగా.. మున్నాను మాత్రం ప్రాణాలు కోల్పోతాడు. అనంతరం గుడ్డు మీర్జాపూర్ సింహాసనాన్ని అధిరోహిస్తాడు. ఇంతటితో సీజన్ 2కి ఎండ్ కార్డు పడుతుంది.మీర్జాపూర్ 3లో ఏం చూపించబోతున్నారు?మీర్జాఫూర్ ప్రాంతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న గుడ్డు.. పూర్వాంచల్లో తన ఆదిపత్యాన్ని కొనసాగించాలనుకుంటాడు. మీర్జాపూర్లో కాలీన్ భాయ్ గుర్తులేవి లేకుండా చేస్తాడు. మరోవైపు భర్త మున్నాభాయ్ మరణంతో అతని భార్య, యూపీ సీఎం కూతురు మాధురి రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. కాలీన్ భాయ్పై సింపథీ క్రియేట్ చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో కాలీన్ భాయ్ తిరిగి వచ్చినట్లు ట్రైలర్లో చూపించారు. మీర్జాఫూర్ మాఫీయా సామ్రాజ్యాన్ని కాలీన్ భాయ్ తిరిగి పొందడా? డాన్గా ఎదిగిన తర్వాత గుడ్డు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? మాధురి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది? తదితర విషయాలన్నీ తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే. -
మూవీస్ వెబ్ సిరీస్ తో సామ్ బిజీ.. బిజీ
-
సమంత మరో వెబ్ సిరీస్కు సిద్ధం
నటి సమంత ఈ పేరే ఒక సంచలనం. తమిళంలో నటిగా కెరీర్ను ప్రారంభించినా, తెలుగులో ముందుగా స్టార్ అంతస్తును పొందిన నటి ఈమె. తెలుగులో ఏమాయ చేశావే చిత్రంతో అక్కడి ప్రేక్షకుల మనసులను దోచేసిన సమంత ఆ తరువాత స్టార్ హీరోలతో వరుసగా నటించి కథానాయకి లిస్టులో చేరిపోయారు. ఆ తరువాతనే తమిళంలో విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల సరనస నటించే అవకాశాలు వరించాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాగచైతన్యతో మనస్పర్థలు రావడం, విడిపోవడం, ఆ వెంటనే మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడం వంటి సంఘటనలు సమంతను ఒకసారిగా కృంగదీశాయనే చెప్పాలి. అయితే ఈమె మొక్కవోని ఆత్మవిశ్వాసంతో వాటి నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యల కారణంగా సినిమాలకు కాస్త దూరం అయిన మాట వాస్తవమే అయినా, అభిమానులకు మా త్రం దూరం కాలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా వారికి గ్లామ రస్, వర్కౌట్ ఫొటోలతోనో, ఏదో టీట్లతోనో ఎప్పుడూ టచ్లోనే ఉంటున్నారు. ఇకపోతే ఖుషీ చిత్రం తరువాత సమంత ఇప్పటివరకూ మరో చిత్రంలో నటించలేదు. ఇటీవల సొంత నిర్మాణం చేపట్టి కథానాయకిగా నటించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత దాని ఊసే లేదు. ఇకపోతే తమిళంలో మరోసారి విజయ్తో జత కట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అదీ ప్రచారానికే పరిమితం అయ్యింది. అలాగే మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది. కాగా తాజాగా సమంత మరోసారి హిందీ, తెలుగు, తమిళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తూపొందనున్న వెబ్ సిరీస్లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రముఖ నటీనటులందరూ వెబ్ సిరీస్ల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. అయితే సమంత ఇంతకు ముందే ఫ్యామిలిమెన్–2, సిట్టాడల్, హని పన్ని వెబ్ సిరీస్లో నటించి పాపులర్ అయ్యారు. తాజాగా మరో వెబ్ సిరీస్లో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. రాజ్, డీకేల ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్కు రక్తపీజ్ అనే టైటిల్ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది ఆగస్టు నెలలో ప్రారంభం కా నున్నట్లు తెలిసింది. ఈ వెబ్ సిరీస్ కోసం నటీనటులతో రిహార్సల్ చేయిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద చాలా గ్యాప్ తరువాత నటి సమంత కెమెరా ముందుకు వెళ్లనున్నారన్నమాట. -
Samantha: మరో వెబ్ సిరీస్లో సమంత.. టైటిల్ ఇదే!
సమంత మరో వెబ్ సిరీస్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్స్-2’లో సామ్ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి తెరకెక్కించిన మరో వెబ్ సిరీస్ ‘సిటాడెల్:హనీ బన్నీ’లోనూ సమంత నటించింది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తికాక ముందే సామ్ అనారోగ్యం బారిన పడింది. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’నే సామ్ చివరి చిత్రం. ఆ తర్వాత చిక్సిత కోసం అమెరికాకు వెళ్లింది. ఈ మధ్యే పూర్తిగా కోలుకొని మళ్లీ సినిమాల్లో నటించేందేకు రెడీ అవుతుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో కూడా నటించాలని సమంత ఫిక్స్ అయిందట. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించే తాజా వెబ్ సిరీస్లో సామ్ లీడ్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్లో బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్కి రక్తబీజ్' అనే టైటిల్ ఖరారు చేశారట. ఆగస్ట్లో షూటింగ్ మొదలు కానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందట. యాక్షన్ సిరీస్ కావడంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు సమాచారం. -
స్ట్రీమింగ్కు వచ్చేస్తోన్న ఆసక్తికర వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది!
ఓటీటీ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకున్న వెబ్సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే రెండు సీజన్స్ సినీ ప్రియులను అలరించాయి. తాజాగా మూడో సీజన్ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే నెల 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజాగా మూడో సీజన్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ , శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్ కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తే గత సీజన్లను మించి ఉంటుందని అర్థమవుతోంది. కొత్త సీజన్లో మరికొన్ని పాత్రలు పరిచయం చేయనున్నారు. -
తనను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది: మెగాస్టార్ ట్వీట్ వైరల్
నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ పరువు. జూన్ 14న ఓటీటీకి వచ్చేసిన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు.పరువు సీజన్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఓ చక్కటి ప్లాన్తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరకి ఈ జంట తప్పించుకుందా లేదా అనే విషయంపై చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నారు. తెలుగు ఓటీటీలో అద్భుతమైన కంటెంట్ అందించిన సుష్మిత కొణిదెలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. నా సోదరుడు నాగబాబు అద్బుతంగా నటించారని చిరంజీవి కొనియాడారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, మిత్ తివారి కీలక పాత్రలు పోషించారు.Congratulations #Paruvu team on the huge success👏. Proud of you @sushkonidela for creating this groundbreaking Telugu OTT content and my dear brother @NagaBabuOffl for a brilliant performance. ఒక చక్కటి plan తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2024 -
ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగు హీరోయిన్
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొచ్చాయి. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాల్ని ఎక్కువగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోహీరోయిన్లు సైతం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లిస్టులో వెంకటేశ్, రానా, నాగచైతన్య, అంజలి లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు హీరోయిన్ చేరింది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)మల్లేశం, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల.. వీటితో పాటు ప్లే బ్యాక్, శాకుంతలం, మళ్లీ పెళ్లి, తంత్ర, అన్వేషి సినిమాలు చేసింది గానీ బ్రేక్ అందుకోలేకపోయింది. ఈ ఏడాది 'తంత్ర' అనే హారర్ మూవీతో వచ్చింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'పొట్టేల్' అనే మూవీ ఉంది.మరోవైపు ఓటీటీలోకి కూడా అనన్య నాగళ్ల ఎంట్రీ ఇస్తోంది. 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్లో కీలక పాత్ర చేస్తోంది. అంజలి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్ల నుంచి సెట్స్పై ఉన్న ఈ సిరీస్ నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. అంజలికి పుట్టినరోజు విషెస్ చెబుతూ చిన్న వీడియో రిలీజ్ చేశారు. అంజలి ఇప్పటికే ఓటీటీలో నవరస, ఫాల్, ఝాన్సీ సిరీస్ లు చేసింది. ఇకపోతే 'బహిష్కరణ' సిరీస్ ని త్వరలో సిరీస్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: ‘కార్తీక దీపం’నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ ఫోన్ చేసి..) Happy Birthday @yoursanjaliWe cannot wait for the world to see your new avatar from #Bahishkarana#BahishkaranaOnZee5 Coming Soon!@PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @prasannadop@SidharthSadasi1 pic.twitter.com/YW4Stiidvy— ZEE5 Telugu (@ZEE5Telugu) June 16, 2024 -
Abha Sharma: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు
చిగుళ్ల వ్యాధి వల్ల 35 ఏళ్ల వయసులో పళ్లు కోల్పోయింది అభా శర్మ. 45 ఏళ్ల వయసులో ఆమెకు అవయవాలు కంపించే అరుదైన వ్యాధి వచ్చింది. అయినా నటి కావాలన్న కోరికను ఆమె చంపుకోలేదు. నాటకాల్లో పాత్రలు వేయసాగింది. ఇప్పుడు ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్లో పల్లెటూరి అమ్మగా నటించి దేశం మొత్తానికి అభిమాన నటి అయ్యింది. 75 ఏళ్ల వయసులో విజయాన్ని చూసిన అభా శర్మ పరిచయం.ఉత్తర ప్రదేశ్లోని ‘ఫుల్వారా’ అనే పల్లెటూళ్లో ఒక ముసలామె పంచాయతీ ఆఫీస్కు వచ్చి– ‘నా కొడుకు నన్ను ఇంట్లోంచి తరిమి కొట్టాడు. నాకో ఇల్లు మంజూరు చేయి నాయనా’ అని పంచాయతీ ఆఫీసర్ని ప్రాధేయపడుతుంది.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఊరికి 11 ఇళ్లు మంజూరై ఉంటాయి. వాటిని ఎవరెవరికి ఇవ్వాలనేది సర్పంచ్, పంచాయతీ ఆఫీసర్ నిర్ణయించాలి. ఈ ముసలామెకు ఇల్లు మంజూరు చేద్దామా అనుకుంటాడు ఆఫీసర్. కాని పల్లెల్లో అదంత సులభం కాదు. ‘నిజంగానే ముసలామెను కొడుకు తరిమి కొట్టాడా లేదా’ అనే ఎంక్వయిరీ జరుగుతుంది. ఊరి జనం కూడా ముసలామె ఇంటి మీద నిఘా పెడతారు. కొడుకు కాపురం ఒక గదిలో ఉంటే ముసలామె వేరొక గుడిసెలో అవస్థలు పడుతూ ఉంటుంది. ఇదంతా నిజమని భావించిన ఆఫీసర్ ముసలామెకు ఇల్లు మంజూరు చేస్తాడు. కాని ఇదంతా అబద్ధమని తేలుతుంది. ‘పేదవాడైన నా కొడుక్కి ఒక ఇల్లు ఇచ్చి వెళితే వాడు సుఖపడతాడని ఈ నాటకం అంతా ఆడాను’ అంటుంది ముసలామె. కాని ‘ఇంటి కోసమని నా కొడుకు, కోడలు, మనవణ్ణి వదిలి వేరే కుంపటి పెట్టి ఎలా బతకగలను’ అని బాధ పడుతుంది.ఒక వైపు పేదరికపు దీనత్వం, మరోవైపు బాంధవ్యాల దృఢత్వం... ఇవి ‘పంచాయత్ 3’ సిరీస్లోని ‘ఘర్’ అనే ఎపిసోడ్లో కనిపిస్తాయి. ఈ ఎపిసోడ్లోని ‘అమ్మాజీ’గా నటించిన అభా శర్మ ఇప్పుడు దేశంలో చాలామందికి అభిమాన నటిగా మారింది.75 ఏళ్ల వయసులో...అభా శర్మది లక్నో. ఇప్పుడామె వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె ఎర్రటి ఎండల్లో మధ్యప్రదేశ్లో ఔట్డోర్కు వెళ్లి షూట్ చేయడమే కాదు అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక ఉంది. కాని మా అమ్మ పడనివ్వలేదు. నేను టీచర్గా పని చేస్తూ ఆ కోరికను మనసులోనే అదిమేశాను. కాని మా అమ్మ చనిపోయాక నా 47వ ఏట నటన మొదలెట్టాను. లక్నోలోని నాటక బృందాలతో నాటకాలు ఆడాను. నాకు 54 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారి ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాను. కాని ఇప్పుడు పంచాయత్ 3లో నేను చేసిన వేషం ప్రపంచమంతా చూసింది. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది. 75 ఏళ్ల వయసులో నేను ఇంత గుర్తింపు పొందడం చూశాక– ఎవరైనా సరే తమ కలలను చివరి వరకూ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలని చె΄్పాలనిపించింది’ అని చెప్పింది అభా శర్మ.జీవితంలో సవాళ్లుతండ్రి చనిపోయాక అభా శర్మకు తల్లిని చూసుకునే బాధ్యత వచ్చింది. ఆమె కోసం అభా శర్మ వివాహం చేసుకోలేదు. కాని 35వ ఏట ఆమెకు చిగుళ్ల వ్యాధి వచ్చి పళ్లు ఊడిపోయాయి. అంటే కాలక్రమంలో కృత్రిమ పళ్లు పెట్టడానికి కూడా వీలు కాని స్థితి. సాధారణంగా స్త్రీలు ఇలాంటి స్థితిలో నలుగురి ముందుకు రావడానికి ఇష్టపడరు. కాని అభా ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు తల్లిని చూసుకుంది. ఆమె మరణించాక నాటకాల్లోకి వచ్చింది. అయితే ఆమెకు శరీర అవయవాలు కంపించే అరుదైన వ్యాధి కూడా వచ్చింది. దాని వల్ల ఆమె మాట్లాడే విధానం చాలా స్లో అయిపోయింది. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ నటించాలనే పట్టుదలతో నటించి విజయం సాధించింది అభా శర్మ.పంచాయత్ అంటే...టి.వి.ఎఫ్. నిర్మాణ సంస్థ అమేజాన్ కోసం తీసిన కామెడీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’. ఇప్పటికి రెండు సిరీస్లు ఘన విజయం సాధించి ఇప్పుడు మూడో సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. భారతదేశంలోని చిన్న ఊళ్లలో మనుషుల అమాయకత్వం, వారి చిన్న చిన్న ఆకాంక్షలు, రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా వారికి అందాల్సిన సాయాల్లో వచ్చే ఆటంకాలు... ఇవన్నీ ఈ సిరిస్లో సహజంగా చూపించడంతో సూపర్ హిట్ అయ్యింది. రఘవీర్ యాదవ్, నీనా గు΄్తా, జితేంద్ర కుమార్ ప్రధాన తారాగణం. -
ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్
ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు అంటే దాదాపు థ్రిల్లర్ కథలే ఉంటాయి. ఇప్పుడు అదే జానర్లో వస్తున్న తెలుగు స్ట్రెయిట్ సిరీస్ 'పరువు'. రీసెంట్గా హీరోయిన్ నివేదా పేతురాజ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగిందని ఓ వీడియో వైరల్ అయింది కదా! అది ఈ సిరీస్ కోసమే. ఇప్పుడు దీని ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?)హీరోయిన్ నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'పరువు'. నాగబాబు కీలక పాత్ర చేశాడు. బిందుమాధవి విలన్గా చేసింది. సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. జూన్ 14 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి జాహ్నవి, విక్రమ్ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లని చంపడానికి కొందరు కిల్లర్స్ ప్రయత్నిస్తారు. వీళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రేమికులు కాస్త హంతకులుగా మారాల్సి వస్తుంది. చివరకు ఏమైంది అనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!) -
బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?
యావత్ సీనీ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కల్కి 2989 ఏడీ’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రచారాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ వినూత్నంగా ప్లాన్ చేశాడు. ప్రధాన పాత్రలు..వాటి నేపథ్యాన్ని ముందే ప్రేక్షకులను తెలిసేలా చేస్తున్నాడు. ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న ‘బుజ్జి’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్) పరిచయం కోసం ఓ ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయడమే కాకుండా.. బుజ్జిని దేశంలోని ప్రధాన నగరాలలో తిప్పుతూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. అంతేకాదు బుజ్జి, భైరవ(ప్రభాస్) ఎలా కలిశారనేది తెలియజేయడానికి ఓ యానిమేటెడ్ సిరీస్ని కూడా రూపొందించారు. ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్..ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ యానిమేటెడ్ సీరిస్ ఎలా ఉందో చూద్దాం.‘బుజ్జి అండ్ భైరవ’కథేంటంటే..కల్కి సినిమాలోని ప్రధాన పాత్రలైన ‘బుజ్జి’, ‘భైరవ’లను పరిచయం చేస్తూ ఈ సిరిస్ సాగుతుంది. BU- JZ- 1 అనే కోడ్ నేమ్తో ఉన్న ఏఐ మిషన్(కీర్తి సురేశ్) చాలా ఏళ్లుగా కార్గో వెహికల్లో పని చేస్తుంటుంది. సరైన గైడెన్స్ ఇస్తూ 99 మిషన్స్ విజయవంతంగా పూర్తి చేస్తుంది. అయితే చివరగా 100వసారి కార్గో డెలివరీ చేసేందుకు వెళ్తుండగా.. ఓ దాడి జరుగుతుంది. రెబల్స్ అటాక్లో బుజ్జి ఉన్న వెహికల్ ధ్వంసం అవుతుంది. దీంతో బుజ్జికి కాంప్లెక్స్ సిటీతో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయి స్క్రాప్లోకి వెళ్లిపోతుంది. మరోపక్క భైరవ(ప్రభాస్) కాశీ పట్టణంలో సరదాగా తిరుగుతూ దొంగలను, దోపిడీదారులను పట్టుకొని యూనిట్స్(2898సంవత్సరంలో డబ్బు) సంపాదిస్తుంటాడు. ఎప్పకైనా కాంప్లెక్స్కు షిప్ట్ కావాలనేది అతని కోరిక. కానీ భైరవ ఏ పని చేసినా..నష్టాలే తప్ప లాభాలు రావు. అద్దె కూడా సరిగా చెల్లించకపోవడంతో యజమాని(బ్రహ్మానందం) ఇంటిని ఖాలీ చేయమని పోరు పెడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో భైరవ చేతికి బుజ్జి దొరుకుతుంది. బుజ్జి ఇచ్చే సలహాలతో ఓ స్పెషల్ కారును తయారు చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ స్పెషల్ కారుని బుజ్జి ఎందుకు రెడీ చేయించింది? కాంప్లెక్స్కి వెళ్లాలనే భైరక కోరిక నెరవేరిందా లేదా? భైరవను బుజ్జి ఎందుకు మోసం చేయాలనుకుంది? అనేది తెలియాలంటే అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో పూర్తి సిరీస్ చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ‘కల్కి’లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ప్రేక్షకులకు అంత ఈజీగా అర్థం కావు. ఇందులోని పాత్రలు..వాటి నేపథ్యం గురించి ముందే కొంచెం తెలిసి ఉంటే..సినిమా చూసినప్పుడు వాటితో కనెక్ట్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటాం. అందుకే ఇలాంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాల్లోని పాత్రలను, స్టోరీని ముందే చెబుతూ టీజర్, ట్రైలర్లను కట్ చేస్తుంటారు మేకర్స్. సినిమా ప్రమోషన్స్లో కూడా ప్రధాన పాత్రల ప్రవర్తన ఎలా ఉండబోతుందో చెప్పేస్తుంటారు. ‘బాహుబలి’సమయంలో రాజమౌళి ఇలానే చేశాడు. సినిమా కథ, అందులోని పాత్రలను ప్రేక్షకులను ముందే చేరువయ్యేలా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపట్టి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ‘కల్కి’ సినిమా స్టోరీ ఏంటి? బుజ్జి, భైరవ పాత్రల స్వభావం ఏంటి? అనేది ముందే చెప్పేస్తున్నాడు. ప్రధాన పాత్రలపై ఎలాంటి సందేహాలు రాకుండా ముందే ఓ సిరీస్ని వదిలి మంచి పని చేశాడు. యానిమేటెడ్ రూపంలో తీసుకొచ్చిన ఈ సిరీల్లో బుజ్జి, భైరవ పాత్రలు..వాటి స్వభావం ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించారు. అంతేకాదు కల్కి ప్రపంచం ఎలా ఉండబోతుందనేది కొన్ని సీన్లలో చూపించారు. 2898 సంవత్సరంలో డబ్బుని యూనిట్స్ అంటారని చెబుతూనే.. ఆ కాలంలో నిర్మాణాలు ఎలా ఉండబోతున్నాయనేది చూపించారు. ప్రభాస్ పాత్రకు యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోడించడం బాగుంది. మధ్య మధ్యలో బ్రహ్మానందం చేసే కామెడీ డైలాగ్స్ నవ్వులు పూయిస్తుంది. మొదటి ఎపిసోడ్లో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం..వాటి నేపథ్యాన్ని చూపించి..రెండో ఎపిసోడ్లో వారిద్దరు కలిసి ఏం చేశారనేది చూపించారు. తన సినిమా కాన్సెప్ట్ ఏంటనేది ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఇందులో కల్కి చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ల గురించి ప్రస్తావననే లేదు. వారిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది ఇందులో చూపించలేదు. కానీ ఓ సీన్లో భారీ విగ్రహాన్ని చూపించారు. అది కమల్ హాసన్ని పోలి ఉంది. ఆ విగ్రహం స్టోరీ ఏంటనేది ప్రమోషన్స్లో చెబుతారో లేదా డైరెక్ట్గా సినిమా చూసే తెలుసుకోమంటారో చూడాలి. టెక్నికల్ పరంగా కూడా ఈ సిరీస్ చాలా బాగుంది. సినిమాటోగ్రపీ, బీజీఎం అదిరిపోయింది. మొత్తానికి 28 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేటెడ్ సిరీస్ ‘కల్కి 2898’ ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. -
ఓటింగ్ పెంచేందుకు ఈసీ మీమ్స్
సార్వత్రిక ఎన్నికల సమరం చివరాఖరి దశకు చేరుకుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నిస్తున్నా ఇప్పటిదాకా జరిగిన ఆరు విడతల్లో పెద్ద మార్పేమీ కనిపించలేదు. దాంతో చివరిదైన ఏడో విడతలోనైనా ఓటింగ్ శాతాన్ని వీలైనంత పెంచేందుకు ఈసీ పలు ప్రయత్నాలు చేస్తోంది. యువ ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించేందుకు వారికి బాగా కనెక్టయ్యే మీమ్స్ను ఎంచుకుంది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత హిట్టయిందో, అందులోని మున్నా భయ్యా పాత్ర కూడా అంతే ఫేమస్ అయింది! ఈసీ రిలీజ్ చేసిన కొత్త మీమ్లో మున్నా భయ్యా డైలాగ్ను ఓటింగ్కు అన్వయించింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్లో మున్నా భయ్యా క్లాస్ రూమ్లో చెప్పే ‘పడాయీ లిఖాయీ కరో, ఐఏఎస్ వయ్యేఎస్ బనో’ (చదువుసంధ్యలపై దృష్టి పెట్టు, కలెక్టరో మరోటో అవ్వు) అనే ఒరిజినల్ డైలాగ్ ఇప్పటికీ రీల్స్, షార్ట్ వీడియోల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈసీ ఇప్పుడు దీనికి ఓటింగ్ ట్విస్ట్ ఇచి్చంది. ‘యే క్యా రీల్స్ మే టైమ్ బర్బాద్ కర్ రహే? జావో వోట్ దో, లోక్తంత్ర్ కో మజ్బూత్ కరో (రీల్స్ వెంటపడి ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటారు? వెళ్లి ఓటేయండి... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి) అని ఓటర్లకు మున్నా భయ్యా చెబుతున్నట్లుగా మీమ్ రూపొందించింది. ‘యువతను మున్నా భయ్యా ఓటేయాలని కోరుతున్నాడు’ అంటూ క్యాప్షన్ను కూడా జోడించింది! ఏడు విడతల సుదీర్ఘ షెడ్యూల్లో ఇప్పటికి ఆరు విడతలు పూర్తయ్యాయి. 57 లోక్సభ స్థానాలకు జూన్ 1న చివరి విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఆఖరి దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో సహా బిహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లో పోలింగ్ జరగనుంది. దాంతో అక్కడ ప్రచారం దుమ్మురేగిపోతోంది. చివరి దశలో ప్రధాని మోదీ సహా మొత్తం 904 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ మున్నా భాయ్ మీమ్ ప్రయోగం యూత్ను ఏ మేరకు పోలింగ్ బూత్లకు రప్పిస్తుందో చూడాలి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిరుత హీరోయిన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్తోనే భయపెట్టేశారు!
ప్రస్తుతం అంతా ఓటీటీల యుగం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త సిరీస్లు, సినిమాలు సినీ ప్రియులను అలరించేందుకు వస్తున్నాయి. ముఖ్యంగా హారర్, క్రైమ్ జానర్ లాంటి కథలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటికే ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది. తాజాగా మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. నేహా శర్మ నటించిన తాజా వెబ్ సిరీస్ 36 డేస్ ఓటీటీలో సందడి చేయనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు 'సీక్రెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ట్రైలర్లోనే ట్విస్టులు భయపెట్టేలా ఉన్నాయి. ఇవాళ విడుదల చేసిన ట్రైలర్తో ఈ సిరీస్పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సిరీస్లో పూరబ్ కోహ్లి, శృతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, షరీబ్ హష్మి, అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రల్లో నటించారు. అయితే మర్డర్ మిస్టరీ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. నేహా శర్మ టాలీవుడ్లో చిరుత మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన మెరిసింది. -
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'హీరామండి: ది డైమండ్ బజార్'. మే 1న నెట్ఫ్లిక్స్లో రిలీజైన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఓటీటీలో టాప్ ట్రెండింగ్తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్లో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఇందులో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా లాంటి స్టార్స్ కనిపించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్ లాహోర్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సిరీస్లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి షర్మిన్ సెగల్. సంజయ్ లీలీ మేనకోడలైన ఆమె తనదైన నటనతో మెప్పించింది. ఆడియన్స్ నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే తాజాగా షర్మిన్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె భర్త అమన్ మెహతా ఓ బిలినీయర్ అన్న వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారింది.ప్రముఖ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్లో అమన్ మెహతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీకి కో-ఛైర్మన్లుగా అతని తండ్రి సుధీర్ మెహతా, మామ సమీర్ మెహతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంస్థ బ్లూమ్బెర్గ్ 2024- ఇండెక్స్ ప్రకారం సుధీర్ మెహతా, సమీర్ మెహతా నికర విలువ దాదాపు రూ. 53,800 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమన్, అతని తండ్రి సమీర్ కంపెనీ ఫార్మాస్యూటికల్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక్క టోరెంట్ ఫార్మా దాదాపు రూ.38,412 కోట్లు రాబట్టిందని ఫోర్బ్స్ అంచనా వేసింది.కాగా.. సంజయ్ లీలా భన్సాలీకి మేనకోడలు అయిన షర్మిన్ సెగల్.. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమన్ మెహతాను నవంబర్ 2023లో వివాహం చేసుకుంది. షర్మిన్ సెగల్ తల్లి బేలా సెగల్ ఫిల్మ్ ఎడిటర్గా, ఆమె తండ్రి దీపక్ సెగల్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీకి చెల్లెలు అయిన బేలా సెగల్ 2012లో షిరిన్ ఫర్హాద్ కి తో నికల్ పాడి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
కళ్ళు చెదిరే అద్భుత జ్యుయలరీ కలెక్షన్ (ఫోటోలు)
-
మనిషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా!
ఓటీటీలో ‘హీరామండి’ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే చర్చిస్తున్నారు. వేశ్యల జీవితాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. లాహోర్లోని హీరామండిలో ఉండే వేశ్యల జీవితాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు భన్సాలీ. (చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)మనీషా కొయిరాల, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్ కీలక పాత్రలు పోషించారు. రూ. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ వెబ్సిరీస్కి ఓటీటీ ప్రేక్షకులను అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫరీదాన్ పాత్రలో సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించింది.మనీషా కొయిరాల, సోనాక్షి మధ్య వచ్చే సన్నివేశాలు వెబ్ సిరీస్కే హైలెట్. కొన్ని సీన్లలో మనిషాతో సోనాక్షి దురుసుగా ప్రవర్తిస్తుంది. తాజాగా సోనాక్షి ఆ సీన్ల గురించి మాట్లాడుతూ.. మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పింది. ‘నాకు మనీషా అంటే చాలా ఇష్టం. హీరామండి వెబ్ సిరీస్ మొత్తం చూశాక ఆమెకు సారీ చెప్పాను. కొన్ని సీన్లలో ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. సిరీస్ చూశాక..నేను అలా ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే మనీషాకు క్షమాపణలు చెప్పాను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించింది. షూటింగ్ మొత్తం సరదాగా గడిపాం. అవకాశం వస్తే మళ్లీ ఆమెతో కలిసి నటించాలని ఉంది’ అని అన్నారు. ఇక భన్సాలి గురించి మాట్లాడుతూ..‘ఆయన సినిమాలో నటించేవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సీన్ షూటింగ్కి ముందే అన్ని విషయాలు చర్చిస్తారు. ఆయన నన్ను మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. హీరామండి లాంటి వెబ్ సిరీస్లో ఇంతగొప్ప పాత్ర ఇచ్చినందుకు భన్సాలిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’అని సోనాక్షి చెప్పారు. -
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్ హీరామండి హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఈ సిరీస్లో కీలక పాత్రల్లో నటించిన ప్రముఖ నటీ నటుల వివరాలపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ మేనకోడలు గ్లామరస్ 'అలంజేబ్' పాత్రలో అలరించిన షర్మిన్ సెగల్ ఎవరు. ఆమె భర్త ఎవరు. అతని నెట్వర్త్ ఎంత అనేది ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీ కోసం.ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో 1995లో జన్మించింది షర్మిన్ సెగల్. తండ్రి, దీపక్ సెగల్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్లో కంటెంట్ హెడ్గా పనిచేశారు. తల్లి బేలా సెగల్ పాపులర్ ఫిల్మ్ ఎడిటర్. తల్లి సోదరుడే , బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ. ఖామోషి, దేవదాస్, బ్లాక్ లాంటి ఎన్నో చిత్రాలకు బేలా సెగల్ పనిచేశారు.అంతేకాదు బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా , మేరీ కోమ్ వంటి చిత్రాలకు షర్మిన్ మామ సంజయ్ లీలా బన్సాలీతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది షర్మిన్ సెగల్. ఆ తర్వాతే నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. షర్మిన్ సెగల్ 'మలాల్' చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన సంజయ్ లీలా బన్సాలీ క 'హిరామండి'లో షర్మిన్ గ్లామరస్ పాత్రను దక్కించుకుంది.రూ. 50 వేల కోట్ల ఆస్తిషర్మిన్ సెగల్ భర్త, పారిశ్రామికవేత్త అమన్ మెహతా వేల కోట్లకు యజమాని. గత ఏడాది నవంబరులో అమన్ మెహతా , షర్మిన్ సెహగల్ పెళ్లి చేసుకున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ అనుబంధ సంస్థటోరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమన్మెహతా. మెహతా కుటుంబ నికర విలువ 50000 కోట్లకు పైమాటే. అమన్ టోరెంట్ గ్రూప్ను అమన్ తాత యు.ఎన్. మెహతా 1959లో ప్రారంభించారు. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం అమన్ తండ్రి సమీర్ మెహతా సోదరుడు సుధార్ మెహతా ఇద్దరూ కంపెనీ కో-ఛైర్మెన్గా ఉన్నారు. టోరెంట్ గ్రూప్నకు టొరెంట్ ఫార్మా, టొరెంట్ పవర్, టొరెంట్ కేబుల్స్, టొరెంట్ గ్యాస్ ,టొరెంట్ డయాగ్నోస్టిక్స్ లాంటి అనుబంధ కంపెనీలున్నాయి.టోరెంట్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమన్ మెహతా 2022 నుండి టోరెంట్ ఫార్మాలో డైరెక్టర్గా ఉన్నారు. ఇండియతో పాటు, ఇతర దేశాలలోకంపెనీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అమన్ టోరెంట్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్కు కూడా డైరెక్టర్గా ఉన్నారు.ఫోర్బ్స్ ప్రకారం, అమన్ మెహతా తండ్రి సమీర్ మెహతా నికర విలువ 6.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 50,939 కోట్లు). టోరెంట్ ఫార్మా ఆదాయం 4.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 38,412 కోట్లు). సమీర్, అమన్ ఇద్దరూ తమ కుటుంబ వ్యాపారంలో ఫార్మా రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. అమన్ మెహతా విద్యార్హతలుఅమన్ మెహతా బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అమెరికాలోన కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. ఎంబీఏ పూర్తికాక ముందు అమన్ 3 సంవత్సరాల పాటు టోరెంట్ పవర్లో డిస్ట్రిబ్యూషన్ మేనేజర్గా అనుభవం సంపాదించాడు. ఎంబీఏ పూర్తి అయిన తరువాత టోరెంట్ ఫార్మాలో సీఎంఓగా చేరి మూడేళ్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదోన్నతి పొందాడు. -
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
అమెజాన్ ప్రైమ్లా బెస్ట్ వెబ్ సిరీస్లో లిస్ట్లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కోసం మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.కామెడీ డ్రామా సిరీస్లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్సిరీస్ల లిస్ట్లో టాప్ ప్లేస్లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.తాజాగా విడుదలైన ట్రైలర్తోనే పంచాయత్ మూడో సీజన్పై భారీ అంచనాలను పెంచేశారు. తొలి రెండు సీజన్లు ఎంతటి హిట్ అందుకున్నాయో.. మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అంచనావేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కామెడీకి ఎక్కువ చోటు కల్పించిన దర్శకుడు రెండో భాగం ముగింపులో కాస్త భావోద్వేగాలను కూడా జోడించడంతో మరింతగా ప్రేక్షకులకు ఈ సిరీస్ దగ్గరైంది. -
టబుకి హాలీవుడ్ చాన్స్.. ఆ వెబ్ సీరీస్లో కీలక పాత్ర!
సీనియర్ నటి టబు సెకండ్ ఇన్నింగ్స్లో వరుస బాలీవుడ్ చిత్రాలతో దూసుకెళుతున్నారు. ఇటీవల విడుదలైన ‘క్రూ’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న టబు ప్రస్తుతం హిందీలో మరికొన్ని ప్రాజెక్ట్లు కమిట్ అయ్యారు. అలాగే హాలీవుడ్ సూపర్ హిట్ టెలివిజన్ సిరీస్ ‘డ్యూన్: ఫ్రొఫెసి’లో నటించే లక్కీ చాన్స్ అందుకున్నారు. ‘డ్యూన్’ సిరీస్కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. తొలి భాగానికి మంచి స్పందన రావడంతో రెండో భాగం ‘డ్యూన్: ఫ్రొఫెసి’ని ప్లాన్ చేశారు మేకర్స్. ఇందులో సిస్టర్ ఫ్రాన్సెస్ అనే ఎంతో ప్రాధాన్యమైన పాత్రలో టబు నటించనున్నారు. డయాన్ అడెము–జాన్ క్రియేషన్లో ఈ సిరీస్ రూపొందనుంది. పది వేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? అనే పాయింట్తో ‘డ్యూన్’ తొలి భాగం రూపొందింది. ‘డ్యూన్: ఫ్రొఫెసి’ని సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కించనున్నారట. తొలి భాగం కంటే ఐదు రెట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. -
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మధ్య కాలంలో లాహోర్లో రెడ్లైట్ ప్రాంతంగా పేరున్న హీరామండిలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు భన్సాలీ. (చదవండి: హీరామండి రివ్యూ)మనీషా కోయిరాలా , అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హా , ఫర్ధీన్ ఖాన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ప్రతి ఒక్కరు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా పోషించిన ఫరీదాన్ పాత్ర వెబ్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర పోషించినందుకుగాను సోనాక్షిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. ఆ ఇంటిమేట్ సీన్స్, దానికి గల కారణం సరిగ్గా చూపించలేదంటూ కొంతమంది విమర్శించారు. తాజాగా దీనిపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. ఫరీదాన్ అనే పాత్ర స్వలింగ సంపర్కురాలు అని.. అందుకే ఆమె మరో మహిళతో రొమాన్స్ చేసిందని చెప్పుకొచ్చింది. ‘భన్సాలీ నాకు కథ చెప్పినప్పుడే ఫరీదాన్ పాత్ర గురించి పూర్తిగా వివరించాడు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందులో నేను స్కలింగ సంపర్కురాలు పాత్ర పోషించాను. అందుకే అలాంటి సీన్స్ ఉన్నాయి’ అని సోనాక్షి చెప్పుకొచ్చింది.అలాగే ఇందులో నటుడు ఇంద్రేష్ మాలిక్తో కలిసి సోనాక్షి ఇంటిమేట్ సీన్స్లో నటించింది. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అసౌకర్యానికి గురయ్యాయని, సోనాక్షినే తనకు ధైర్యం చెప్పి,సపోర్ట్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇంద్రేష్ చెప్పాడు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలే వేసవికాలం.. బయటచూస్తే మండుటెండలు భయపెట్టేస్తున్నాయి. స్కూళ్లకు సైతం సెలవులు రావడంతో పిల్లలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసం ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను అందిస్తున్నాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ జానర్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ క్రమంలోనే మర్డర్ ఇన్ మహిమ్ అనే పేరుతో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.ఈనెల 10 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఏకంగా ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇది కేవలం జియో సినిమా ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి రానుంది. Bas teen din mein milenge saare sawalon ke jawab🔪Murder In Mahim streaming 10th May onwards, exclusively on JioCinema Premium.Subscribe to JioCinema Premium at Rs. 29 per month. Exclusive content. Ad-free. Any device. Up to 4K. pic.twitter.com/kL5cnFp8Uy— JioCinema (@JioCinema) May 7, 2024 -
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్లు నటించారు. బాలీవుడ్ భామ రిచ్చా చద్దా ఈ సిరీస్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకుంటోంది. మే 1వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిచా సహానటులపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా నటీమణులు, మహిళా నిర్మాతలతో పనిచేయడం గురించి మాట్లాడింది. తనతో పోటీపడేందుకు ప్రయత్నిస్తున్న వారితో కలిసి పనిచేసినట్లు వెల్లడించింది. ఎలాంటి సూచనలు ఇవ్వకుండా తన ఎదుగుదలను అడ్డుకునే వారితో కలిసి నటించడం చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది.రిచా చద్దా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో చాలామంది స్త్రీవాదులనే ఆలోచనను నేను అంగీకరించను. చెక్కులు బౌన్స్ అయిన మహిళా నిర్మాతలతో కూడా పనిచేశా. అంతే కాదు వారితో కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా. అలాంటి వారు కేవలం ట్విట్టర్లో మాత్రమే స్త్రీవాదులుగా చలామణి అవుతుంటారు. సినిమా సెట్లో నటీనటుల మధ్య సోదరి భావం ఎప్పుడూ ఉండదు. తనకు ఎలాంటి సరైన సూచనలు ఇవ్వకుండా.. సన్నివేశాలలో లైట్స్ ఆఫ్ చేసే సహనటులు ఇప్పటికీ నాతో నిరంతరం పోటీ పడుతున్నారు. స్త్రీవాదమనేది జెండర్కు సంబంధించినది కాదు. పురుషుల్లోనూ బలమైన స్త్రీవాదులు ఉన్నారని తెలుసు' అని అన్నారు. పురుషులు కూడా స్త్రీవాదులు కావచ్చు.. అలాగే స్త్రీలు కూడా పురుషవాదులు కావచ్చని పేర్కొంది. కాగా.. రిచా చద్దా ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ'హీరామండిలో తన నటనకు ప్రశంసలు అందుకుంది. -
హమ్మయ్యా.. బ్లాక్ బస్టర్ సిరీస్ మూడో సీజన్ మొదలైంది
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్ల కంటే ఓటీటీల్లో మూవీస్-వెబ్ సిరీసులు చూసేవాళ్లే ఎక్కువయ్యారు. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు సరికొత్త సిరీసులు తీసుకొస్తున్నాయి. అలానే కొన్ని హిట్ సిరీస్లకు తర్వాత భాగాల్ని కూడా మొదలుపెడుతున్నాయి. అలా ఓటీటీలో సెన్షేషన్ సృష్టించిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది.దేశభక్తి అనేది ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. ఇప్పటికే వందలాది సినిమాలు వచ్చాయి. పదుల సంఖ్యలో సిరీసులు వస్తున్నాయి. అయితే దేశభక్తి ప్లస్ ఓ మధ్య తరగతి వ్యక్తి నేపథ్యంగా తీసిన 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్.. ఈ జానర్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తెలుగు దర్శక ద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్లో మనోజ్ భాజ్పాయ్-ప్రియమణి జంటగా నటించారు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)2019 సెప్టెంబరు 20న అమెజాన్ ప్రైమ్లో తొలి సీజన్ రిలీజైంది. కామెడీ, యాక్షన్, దేశభక్తి ఇలా అన్ని అంశాలతో తీసిన ఈ సిరీస్.. జనాలకు తెగ నచ్చేసింది. రిపీట్స్లో చూశారు. రెండో సీజన్.. 2021 జూన్ 4న రిలీజ్ చేశారు. తొలి భాగమంతా కానప్పటికీ మంచి స్పందన దక్కించుకుంది. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు.అయితే రెండో సీజన్ వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇప్పటికీ అప్డేట్ లేకపోయేసరికి చాలామంది దీని గురించి మర్చిపోయారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూడో సీజన్ షూటింగ్ మొదలైందని డైరెక్టర్స్ ప్రకటించారు. లొకేషన్ నుంచి ఓ పిక్ కూడా రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది దీని రిలీజ్ ఉంటుంది.(ఇదీ చదవండి: ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా) View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మే 1 స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. అయితే ఈ సిరీస్లో మనీషా కొయిరాలా కూతురిగా మెప్పించిన షర్మిన్ సెగల్పై పాత్రపై విమర్శలొచ్చాయి. హీరామండిలో అలంజేబ్ పాత్రపై చాలామంది ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.చాలా మంది ప్రేక్షకులు హీరామండిలోని నటనను ప్రశంసించగా, ఈ సిరీస్లో కొయిరాలా పాత్ర మల్లికా జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్, ముఖ్యంగా ఆమె నటనకు విమర్శలను అందుకుంది. తన పాత్రలో ప్రతి సీన్లో ఓకే ఎక్స్ప్రెషన్తో కనిపించడంతో కొందరు ఆమెపై కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా తన ఇన్స్టా పోస్ట్కు కామెంట్ సెక్షన్ను నిలిపేసింది బాలీవుడ్ భామ. ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం సంజయ్ చేసిన బిగ్ మిస్టేక్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ స్వయాన సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు కావడం విశేషం. ఆమె సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలాల్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. అంతే కాకుండా గోలియాన్కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఆ తర్వాత హారర్ కామెడీ 'అతిథి భూతో భవ సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
హీరామండి.. భారీ బడ్జెట్తో నిర్మితమైన వెబ్ సిరీస్. పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ కళాఖండం మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ సిరీస్లో కొన్ని పొరపాట్లను నెటిజన్లు గుర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.జర్నలిస్టు ట్వీట్ఐదో ఎపిసోడ్లో సోనాక్షి సిన్హా వార్తా పత్రిక చదువుతున్న సమయంలోని పొరపాటను ఎత్తిచూపుతున్నారు. ఈ మేరకు పర్వేజ్ ఆలమ్ అనే జర్నలిస్టు ఓ ట్వీట్ చేశాడు. హీరామండి సిరీస్ 1920-40 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. స్వతంత్రానికి ముందు బ్రిటీష్ పాలనలో ఉన్న లాహోర్లో కథ సాగుతుంది. ఉర్దూ పేపర్ఐదో ఎపిసోడ్లో ఫరీదన్ (సోనాక్షి సిన్హ) ఉర్దూ పేపర్ చదువుతుంది. అందులోని హెడ్లైన్స్లో వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్: టికెట్లు ఇచ్చిన టీఆర్ఎస్ అని ఉంది. 50వేల మాస్కులను పంపిణీ చేయనున్న యూత్ కాంగ్రెస్.., కరోనాతో పోరాడాలంటే ఆత్మస్థైర్యం ఉండాలి: కరోనా రోగులకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు సలహా.. ఇలాంటి హెడ్లైన్సే ఉన్నాయి అని రాసుకొచ్చారు. అది కూడా తెలీదా?మరో నెటిజన్.. ఉర్దూ పేపర్ను ఎడమ నుంచి కుడికి చదవడం మాత్రం హైలెట్ అని సెటైర్ వేశాడు. ఉర్దూని కుడి నుంచి ఎడమకు చదువుతారని కూడా తెలీకుండా ఆ పాత్రను డిజైన్ చేయడం, కనీసం ఎవరైనా భాషాజ్ఞానులను సంప్రదించకపోవడం విచారకరం అని కామెంట్లు చేస్తున్నారు. Sanjay Leela Bhansali’s epic web series Heera Mandi on Netflix is set against the Indian independence/British Raj in Lahore of the 1920s-1940s. Fareedan (Sonakshi Sinha) is supposedly reading an Urdu newspaper (EP5). Headlines say, “Warangal Municipal Elections: TRS Distributes… pic.twitter.com/EI44Z61rkt— Pervaiz Alam (@pervaizalam) May 3, 2024 -
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్లో ఈ భారీ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్లు
ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే జనం వణికిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సూరీడు అందరిపైనా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు వెళ్లడం లేదు. వారందరికీ వినోదాన్ని పంచేందుకు ఓటీటీలు బోలెడంత కంటెంట్తో రెడీ అయ్యాయి. సినిమాలు, సిరీస్లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్నాయి. మరి మే నెలలో ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్లు ఏంటో చూసేద్దాం..నెట్ఫ్లిక్స్👉హీరామండి: ద డైమండ్ బజార్ (వెబ్ సిరీస్)👉షైతాన్👉ద హాలీడే👉ఎ మాన్ ఇన్ ఫుల్ (వెబ్ సిరీస్)👉టి- పిబన్ (వెబ్ సిరీస్)👉అన్ఫ్రాస్టెడ్👉ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో (ఎపిసోడ్ 6)(పైవన్నీ మే నెల ప్రారంభంలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి)👉సూపర్ రిచ్ ఇన్ కొరియా (వెబ్ సిరీస్) - మే7👉ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ (వెబ్ సిరీస్) - మే 7👉ద ఫైనల్: అటాక్ ఆన్ వెంబ్లీ - మే 8👉క్రేజీ రిచ్ ఆసియన్స్ - మే 8👉మదర్ ఆఫ్ ద బ్రైడ్ - మే 9👉లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10👉బ్లడ్ ఆఫ్ జీయస్ (సీజన్ 2)- మే 10👉ద గ్రేడ్ ఇండినయ్ కపిల్ షో (ఎపిసోడ్ 7) - మే 11👉బ్రిడ్జర్టన్ (మూడో సీజన్- ఎపిసోడ్ 1)👉మేడ్మి వెబ్ - మే 14👉తెల్మా ద యునికార్న్ - మే 17👉అట్లాస్ - మే 24లయన్స్ గేట్ ప్లే📽️ బ్లాక్ మాఫియా ఫ్యామిలీ (సీజన్ 3) - మే 3📽️ ద మార్ష్ కింగ్స్ డాటర్ - మే 10📽️ కాప్షాప్ - మే 17📽️ వాంటెడ్ మ్యాన్ - మే 24📽️ విజిల్ (సీజన్ 2) - మే 31హాట్స్టార్🎞️ బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్🎞️షార్డ్లేక్🎞️వెల్కమ్ టు వ్రెక్జామ్🎞️ప్రామ్ డేట్స్🎞️స్టార్ వార్స్: టేల్స్ ఆఫ్ ద ఎంపైర్(మే ప్రారంభం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి)🎞️మాన్స్టర్స్ ఎట్ వర్క్ - మే 5🎞️మంజుమ్మెల్ బాయ్స్ - మే 5🎞️ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ - మే 8🎞️అండర్ ద బ్రిడ్జ్ - మే 8🎞️లెట్ ఇట్ బి - మే8🎞️డాక్టర్ హు - మే 11🎞️క్రాష్ - మే 13🎞️అంకుల్ సామ్సిక్ - మే 15🎞️క్వీన్ రాక్ మాంట్రియల్ - మే 15🎞️పాలైన్ - మే 22🎞️మార్వెల్ స్టూడియోస్ అసెంబ్ల్డ్: ద మేకింగ్ ఆఫ్ ఎక్స్ మెన్ 97 - మే 22🎞️ద కర్దాషియన్స్ - మే 23🎞️ద బీచ్ బాయ్స్ - మే 24🎞️కాండెన్ - మే 29🎞️జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ - మే 31అమెజాన్ ప్రైమ్📽️ అమెరికన్ ఫిక్షన్ - మే 14📽️ ద బ్లూ ఏంజెల్స్ - మే 23📽️ ద బాయ్స్ ఇన్ ద బోట్ - మే 28బుక్ మై షో స్ట్రీమ్👉 డేర్ డెవిల్ ముస్తఫా👉 ఆర్కెస్ట్రా మైసూరు👉 మిస్టర్ నట్వర్లాల్👉 కాంక్రీట్ ఉటోపియా👉 మాన్స్టర్👉 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ద న్యూ ఎంపైర్👉 ఎండేవర్ సీజన్ 1👉 ఎండేవర్ సీజన్2👉 ఎండేవర్ సీజన్ 3👉 ఎండేవర్ సీజన్ 4👉 ఎండేవర్ సీజన్ 9👉 ఎండేవర్ - పైలట్అల్ట్రాజకాస్🎞️ రంగీత్🎞️ యాసిడ్🎞️ అభ్యూహమ్🎞️ డోంట్ లుక్ అవే🎞️ టైగర్ రాబర్స్📺 ఫ్యామిలీ కట్టా (షో)📺 కుకరీ షో📺 మహారాష్ట్రచీ హస్యజాతర (షో)📺 అనైతిక్ (వెబ్ సిరీస్)📺 ఉదర్ బైకో (వెబ్ సిరీస్)📺 నజరబండి (వెబ్ సిరీస్)📺 లైసా (వెబ్ సిరీస్)యాపిల్ టీవీ👉 అకాపుల్కో (సీజన్ 3) - మే 1👉 డార్క్ మ్యాటర్ - మే 8👉 హాలీవుడ్ కాన్ క్వీన్ - మే 8👉 ద బిగ్ సిగర్ - మే 17👉 ట్రైయింగ్ (సీజన్ 4) - మే 22అమెజాన్ మినీ టీవీ📽️ ద రిటర్న్ ఆఫ్ రెబల్ - మే 2📽️ మగధీర - మే 2📽️ మిడిల్ క్లాస్ అబ్బాయి - మే 2📽️ యు ఆర్ మై డెస్టినీ - మే 8📽️ 96 - మే 9📽️ దేవ్ - మే 9📽️ ప్రేమమ్ - మే 9📽️ అమర్ అక్బర్ ఆంటోని - మే 9📽️ డేంజరస్ ఖిలాడీ 2 - మే 9📽️ టర్న్ బ్యాక్ - మే 13📽️ అండర్కవర్ కౌంటర్ అటాక్ - మే 14📽️ ఐ బిలాంగ్డ్ టు యువర్ వరల్డ్ - మే 15📽️ మర్డర్ ఇన్ ద ఫస్ట్ - మే 15మ్యాక్స్👉 స్టాప్ మేకింగ్ సెన్స్ - మే 3👉 ద ఐరన్ క్లా - మే 10👉 మూవీపాస్, మూవీ క్రాష్ - మే 29హుళు🎞️ ప్రామ్ డేట్స్ - మే 3🎞️ ఈలెన్ - మే 10🎞️ బయోస్పియర్ - మే 10🎞️ బర్త్/ రీబర్త్ - మే 17🎞️ ద స్వీట్ ఈస్ట్ - మే 17🎞️ ద వెంట్ దట్ వే - మే 17🎞️ ఫెరారీ - మే 24🎞️ ద ప్రామిస్డ్ ల్యాండ్ - మే 30🎞️ సింపతీ ఆఫ్ ద డెవిల్ - మే 31చదవండి: అందరికీ నచ్చకపోయినా పర్లేదు.. మధ్యలో చై ఎందుకో! -
ఇండియాలో హిట్ కొట్టిన వెబ్ సిరీస్.. సీజన్ 3 రిలీజ్ డేట్ ఇదే
అమెజాన్ ప్రైమ్లా బెస్ట్ వెబ్ సిరీస్లో లిస్ట్లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్కు మేకర్స్ గుడ్న్యూస్ వినిపించారు. ఓటీటీలోకి ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందా..? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.అభిషేక్ త్రిపాఠి అనే యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉంటాడు. అతనికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగం రాదు. కానీ, కొన్ని కారణాల వల్ల స్నేహితుల సలహా మేరకు పంచాయతీ సెక్రటరీలో ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ రత్యా ఉత్తర ప్రదేశ్లోని ఫులేరా అనే గ్రామంలో అభిషేక్ అడుగుపెడుతాడు. భిన్న మనస్తత్వాలు కలిగిన గ్రామస్తుల మధ్య ఆయనకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అభిషేక్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి..? ఈ క్రమంలో దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా కామెడీని పండించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ కామెడీ డ్రామా సిరీస్లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్సిరీస్ల లిస్ట్లో టాప్ ప్లేస్లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.you moved the laukis, we unlocked your reward! #PanchayatOnPrime S3, May 28@TheViralFever @ArunabhKumar @StephenPoppins #ChandanKumar @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @chandanroy77 @malikfeb @Sanvikka #PankajJha pic.twitter.com/ouN5ON5hGp— prime video IN (@PrimeVideoIN) May 2, 2024 -
తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. గతంలో గంగూభాయి కతియావాడి మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన మరోసారి అలాంటి కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్ను భారీ బడ్జెట్తో తెరకెక్కించడం మరో విశేషం.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. మే 1వ తేదీ నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్లతో పాటు 14 భాషల్లో హీరామండి సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావు హైదరి, సంజీదా షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. పోషించారు.కాగా.. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలోని 1940 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరామండిని తెరెకెక్కించారు. పాకిస్తాన్లోని రెడ్లైట్ ప్రాంతంలో జరిగే సంఘర్షణ, కుట్రల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. హీరామండి ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనలను ఈ సిరీస్లో చూపించారు. కాగా.. హీరామండి ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్లోని లాహోర్లో ఉంది. -
రియల్ స్టోరీతో వస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం గంగూభాయి కతియావాడి. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ముంబయిలో వేశ్యవాటిక నేపథ్యంలో వచ్చిన గంగూభాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.తాజాగా అలాంటి కథతోనే సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంజయ్. ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. హీరామండి: ది డైమండ్ బజార్ పేరుతో వస్తోన్న వెబ్ సిరీస్ మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో సందడి చేయనుంది.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదికరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్లో మల్లికాజాన్గా మనీషా కొయిరాలా, ఫరీదాన్గా సోనాక్షి సిన్హా, బిబ్బోజాన్గా అదితి రావు హైదరీ, అలంజేబ్గా షర్మిన్ సెగల్, వహీదాగా సంజీదా షేక్, లజ్జోగా రిచా చద్దా నటించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పాకిస్తాన్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. పాక్లోని రెడ్-లైట్ ఏరియాలో నివసించే మహిళల పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
'40 రోజులు వనవాసం'.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి తన శక్తికి మించిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. మహానటిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తాజాగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా అక్కా అనే వెబ్ సిరీస్లో నటి రాధిక ఆప్టేతో కలిసి నటించారు. ధనరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్ తాజాగా తన ఇన్స్ట్రాగామ్లో పంచుకున్నారు. దాదాపు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానని రాసుకొచ్చారు. అక్కా వెబ్ సిరీస్లో నటించడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ షెడ్యూల్ని ముగించుకుని ఇంటికి తిరిగిరావడం సరి కొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర మూవీ షూటింగ్లకు హాజరవుతానని తెలిపారు. కాగా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివెడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు కావడం విశేషం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
తెలంగాణ బ్యాక్ డ్రాప్ వెబ్ సిరీస్.. ఆ ఓటీటీలోనే రిలీజ్?
ఓటీటీల వల్ల చాలామంది సినిమాలు, వెబ్ సిరీసులకు బాగా అలవాటుపడిపోయారు. కొత్త రిలీజులు ఏమున్నాయా? వాటిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు స్ట్రెయిట్ వెబ్ సిరీస్ ఒకటి రెడీ అయిపోయింది. తెలంగాణ నేపథ్యంగా ఈ సిరీస్ తీయడం విశేషం. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఆచితూచి సినిమాలు, సిరీసులు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులోనూ 'దూత' లాంటి స్ట్రెయిట్ వెబ్ సిరీస్ వచ్చింది. అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు అలానే 'వికటకవి' అనే డిటెక్టివ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ తెలుగు వెబ్ సిరీసులో నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. డేట్ చెప్పాల్సి ఉంది. అయితే ఏప్రిల్ చివర్లో లేదా మే తొలివారంలో స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) -
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో నెట్ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు. ఈ సిరీస్లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
సేవ్ ది టైగర్స్ సీజన్-2.. అది చెప్పేందుకు ప్రయత్నిస్తా : మహి వి రాఘవ్
ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సీజన్-1కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వతా వచ్చిన సైతాన్ సైతం సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఆయన సేవ్ ది టైగర్ సీజన్ -2 ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సేవ్ ది టైగర్స్ సీజన్- 1, సైతాన్ సూపర్ హిట్, సేవ్ ది టైగర్స్ సీజన్ -2 సక్సెస్తో హ్యాట్రిన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఓటీటీలో హ్యాట్రిక్ విజయంపై మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. 'ఇంత మంచి విజయాలు అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించారు. దీంతో ఎంటర్టైన్మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి నేను ప్రయత్నిస్తా. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని అన్నారు. వెబ్ సిరీస్ గురించి చెబుతూ.. 'సేవ్ ది టైగర్స్ సీజన్- 1లో ఫ్రస్టేషన్తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే.. సీజన్- 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్- 2పై కాస్త ఒత్తిడిగా ఫీలయ్యా. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. అలాగే సినిమాలను, వెబ్ సిరీస్లను నిర్మిస్తున్నాం. మా బ్యానర్కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే మరికొన్ని వెబ్ సిరీస్లతో మీ ముందుకు వస్తా' అని అన్నారు. -
ఓటీటీలో హైజాక్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. సముద్రంలో షిప్పులను హైజాక్ చేసే నేపథ్యంలో ఈ సిరీస్ను తెరకెక్కించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన లూటేరే వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రెండు ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ హైజాక్ థ్రిల్లర్ సిరీస్ లూటేరే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధానంగా షిప్ హైజాక్ నేపథ్యంలోనే ఈ సిరీస్ను తెరకెక్కించారు. సోమాలియా సముద్రపు దొంగల చుట్టూ తిరిగే ఈ సిరీస్పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వచ్చే వారంలో మిగిలిన ఎపిసోడ్లను కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. లూటేరే వెబ్ సిరీస్ను ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా క్రియేట్ చేయగా.. ఆయన తనయుడు జై మెహతా డైరెక్షన్లో తెరకెక్కించారు . సోమాలియా పైరేట్స్ ఓ షిప్ను హైజాక్ చేయడం.. దానిని విడిపించడానికి జరిగే ప్రయత్నాలు చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో రజత్ కపూర్, వివేక్ గోంబర్, అమృతా ఖన్విల్కర్, ప్రీతికా చావ్లా, చందన్ రాయ్ సన్యాల్ ప్రధాన పాత్రలు పోషించారు. Time to drop the anchor! ⚓🚢#HotstarSpecials #Lootere is now streaming. Watch now: https://t.co/KnAtofkAqW pic.twitter.com/NSqwm5GUnG — Disney+ Hotstar (@DisneyPlusHS) March 21, 2024 -
అమెజాన్ ప్రైమ్లో ఏకకాలంలో బోలెడు సినిమాలు విడుదల!
ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియో క్రేజీ అప్డేట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. రానున్న రోజుల్లో విడుదల చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ల లిస్ట్ ప్రకటించింది. ముంబై వేదికగా జరిగిన ఈవెంట్లో ఈ జాబితాను వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలతో పాటు తెలుగు,తమిళ, హిందీ భాషల్లో రాబోయే వెబ్ సిరీస్ లిస్ట్ను ఒకే రోజు రిలీజ్ చేసింది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు పలు తెలుగు సినిమాలు అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో సందడి చేయబోతున్నాయి. అలాగే సిటాడెల్: హనీ బన్నీ,మీర్జా పూర్-3, పాతాళ్ లోక్-2, బందిష్ బండిట్స్, పంచాయత్-3, గుల్కంద్ టేల్స్, ది రానా కనెక్షన్, ఇన్ ట్రాన్సిస్ట్, రంగీన్, మట్కా కింగ్, దల్దల్, డేరింగ్ పార్ట్నర్స్, ది గ్రేట్ ఇండియన్ కోడ్, సుబేదార్, ఉప్పు కప్పురంబు లాంటి వెబ్ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతున్న కొత్త సినిమాలివే టైటిల్: గేమ్ ఛేంజర్; నటీనటులు: రామ్ చరణ్, కియరా అద్వానీ టైటిల్: ఫ్యామిలీస్టార్; నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ టైటిల్:కంగువ; నటీనటులు:సూర్య,జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు టైటిల్: ఉస్తాద్భగత్ సింగ్; నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రీలీల టైటిల్: హరి హర వీర మల్లు; నటీనటులు: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ టైటిల్: కాంతార 2; నటీనటులు: రిషబ్ శెట్టి,రుక్మిణీ వసంత్ టైటిల్: తమ్ముడు; నటీనటులు:నితిన్, సప్తమి, లయ టైటిల్: ఓమ్ భీమ్ బుష్; నటీనటులు: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్: అశ్వత్థామ; నటీనటులు: షామిద్ కపూర్ టైటిల్: ఘాటి; నటీనటులు: అనుష్క శెట్టి టైటిల్: భాఘీ 4, నటీనటులు: టైగర్ ష్రాప్; నిర్మాత: సాజిద్ నడియాద్వాలా టైటిల్: చందు ఛాంపియన్; నటీనటులు: కార్తిక్ ఆర్య టైటిల్: ఇక్కీస్; నటీనటులు:అగస్త్య నంద, ధరేంద్ర, జైదీప్ అహల్వత్ టైటిల్: స్త్రీ; నటీనటులు: షాహిద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ టైటిల్: తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా; నటీనటులు: షాహిద్ కపూర్, కృతి సనన్, ధర్మేంద్ర, డింపు అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సిరీస్ జాబితా సిటాడెల్: హనీ బన్నీ మీర్జా పూర్-3 పాతాళ్ లోక్-2 మట్కా కింగ్ చోరీ2 ది మెహతా బాయ్స్ సుబేదార్ సుడల్ 2 బండిష్ బ్యాండిట్స్ 2 ది మెహతా బాయ్స్ బి హ్యాపీ చీకటి లో యే వతన్ మేరే వతన్ జిద్దీ గర్ల్స్ బ్యాండ్వాలే దిల్ దోస్తీ డైలమా ఫాలో కర్లో యార్ కాల్ మి బే డాల్డల్ ఖౌఫ్ గ్యాంగ్స్ కురుత్తి పునల్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ -
ఓటీటీలో మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు వెబ్ సిరీస్ ఏదో తెలుసా!
ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. గతేడాది నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో డిసెంబర్ 1న స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఎనిమిది ఎపిసోడ్లుగా వచ్చిన ఈ సిరీస్ను శరద్ మరార్ నిర్మించారు. ఈ సిరీస్కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగులో అత్యంత సక్సెస్ఫుల్గా నిలిచిన వెబ్ సిరీస్గా ఘనతను సొంతం చేసుకుంది. ఇవాళ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రైమ్ వీడియో ప్రజెంట్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేదికపై నాగచైతన్యతో పాటు ఈ సిరీస్ దర్శక, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. కాగా.. ఇటీవలే ఈనెల 19న దూత సీజన్-2 గురించి హింట్ ఇచ్చారు నాగచైతన్య. కానీ అప్డేట్ అయితే రాలేదు.. దూత సిరీస్ మాత్రం అమెజాన్ ప్రైమ్లో తెలుగు సక్సెస్ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్గా నిలిచింది. Celebrating #DhoothaOnPrime - Our most successful Telugu Original series.#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/PeZ6I8bZlb — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
కన్ఫ్యూజ్ అవుతున్నారా?.. ఆ రోజు క్లారిటీ ఇస్తా: నాగ చైతన్య
యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. సముద్రం బ్యాక్డ్రాప్లో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ మత్య్సకారుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. అయితే ఇదిలా ఉండగా.. గతేడాది నాగ చైతన్య ఓటీటీలోను ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చైతూ ప్రధాన పాత్రలో దూత అనే వెబ్ సిరీస్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దూత వెబ్ సిరీస్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ కూడా రానుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. దూత సీజన్ 2 గురించి ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా నాగ చైతన్య వీడియోను అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో నాగచైతన్య చదువుతున్న న్యూస్ పేపర్లో మార్చి 19 అని రాసి ఉంది. దీంతో అదే రోజున దూత సీజన్-2 అప్డేట్ అదే రోజున రానుందని అర్థమవుతోంది. ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇంకా క్లూస్ కావాలా? మార్చి 19న.. మీరు రెడీనా? అని నాగచైతన్య అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముఖ్యంగా దూత వెబ్ సిరీస్లో న్యూస్ పేపర్ ప్రధానంగా ఉంటుంది. ఈ వీడియోలో న్యూస్ పేపర్తో చైతూ కనిపించడంతో సీజన్ 2 గురించే నని క్లారిటీ ఇచ్చినట్లు ఉంది. మార్చి 19న ఈ రెండో సీజన్కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన చేసేలా కనిపిస్తోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే. Are you ready Are you ready Are you ready 𝟏𝟗 𝐌𝐚𝐫𝐜𝐡 ✅ Em plan chesav mawa @PrimeVideoIN...?🤔@chay_akkineni || #NagaChaitanya pic.twitter.com/kLEJ6jg3Rh — ChayAkkineni ™ 🏹 (@MassChayCults) March 17, 2024 -
నా కెరీర్లో క్లిష్టమైన పాత్ర అది!
‘ఏ మాయ చేశావె’తో కథానాయికగా కెరీర్ ఆరంభించిన సమంత ఈ పద్నాలుగేళ్లల్లో సవాల్ అనిపించే పాత్రలు చాలానే చేశారు. హీరోయిన్గా యాభై చిత్రాలు చేసిన ఆమె ‘మహానటి’, ‘బేబీ’, ‘యశోద’ తదితర చిత్రాల్లో చాలెంజింగ్ రోల్స్ చేశారు. కానీ, ఇన్నేళ్ల కెరీర్లో ‘సిటాడెల్’లో చేసిన క్యారెక్టర్ తనకు చాలా క్లిష్టంగా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో సమంత పేర్కొన్నారు. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ గురించి సమంత మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లోనే ‘సిటాడెల్’లో చేసిన రోల్ టఫ్ అనడానికి కారణం నేను శారీరకంగా బలహీనం (మయోసైటిస్ వ్యాధిని ఉద్దేశించి) గా ఉన్నప్పుడు ఆ షూటింగ్ జరిగింది. నా పరిస్థితి బాగాలేనప్పుడు షూటింగ్లో పాల్గొనాల్సి రావడం అనేది చాలా కష్టంగా అనిపించింది’’ అన్నారు. ప్రియాంకా చోప్రా నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్లో సమంత నటించారు. సమంత ఓ లీడ్ రోల్లో ‘ఫ్యామిలీ మేన్’ సిరీస్ తెరకెక్కించిన రాజ్, డీకే ఈ సిరీస్కి కూడా దర్శకులు. త్వరలో ‘సిటాడెల్’ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో.. ‘‘నా దృష్టిలో ఈ సిరీస్ ఆల్రెడీ హిట్ అయినట్లే. ఎందుకంటే క్లిష్టమైన పరిస్థితుల్లో నటించాను. నేను చేయగలనని అనుకోలేదు. కానీ చేశాను. అందుకు గర్వంగా ఉంది’’ అని కూడా సమంత అన్నారు. -
Save The Tigers 2 Review: సేవ్ ద టైగర్స్ 2.. ఎలా ఉందంటే?
వెబ్ సిరీస్ రివ్యూ: సేవ్ ద టైగర్స్ 2 నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు క్రియేటర్స్: మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం రైటర్స్ : ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్ ఆనంద్ కార్తీక్ దర్శకత్వం : అరుణ్ కొత్తపల్లి క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం సంగీతం : అజయ్ అరసద ఎడిటర్ : శ్రవణ్ కటికనేని విడుదల తేది: మార్చి 15, 2024 (డిస్నీ ప్లస్ హాట్స్టార్) ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్సే కానీ కామెడీ జాడేది అనుకుంటున్న తరుణంలో సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ రిలీజైంది. గతేడాది హాట్స్టార్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. భార్యా బాధితులుగా హీరోలు పడే అగచాట్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. ఈ హిట్ సిరీస్కు సీక్వెల్గా తాజాగా సేవ్ ద టైగర్స్ 2 విడుదలైంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం... కథ హీరోయిన్ హంసలేఖ(సీరత్ కపూర్) మిస్ అవడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. తను ఏమైందన్న ఆందోళనతో రెండో సీజన్ కథ మొదలవుతుంది. హంసలేఖ ఎక్కడ? అని పోలీసులు విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను ప్రశ్నిస్తారు. తమకు తెలియదు మహాప్రభో అని మొర పెట్టుకున్నా సరే.. పోలీసులు లెక్క చేయకుండా ముగ్గురికీ లాఠీదెబ్బల రుచి చూపిస్తారు. మరోవైపు మీడియాలో హంసలేఖను ఈ ముగ్గురూ పార్టీ నుంచి తీసుకెళ్లిన వీడియో చూపించి ఏకంగా ఆమెను హత్య చేశారంటూ కథనాలు ప్రసారం చేస్తారు. ఇంతలో హంసలేఖ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముగ్గురినీ పోలీసులు వదిలేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఏం జరిగింది? ఆ ముగ్గురి భార్యలు స్పంద కౌన్సిలర్ (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకెళ్లారు? రాహుల్, అతడి భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మధ్య దూరిన మూడో వ్యక్తి హారిక (దర్శనా బానిక్) ఎవరు? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలన్న రవి భార్య హైమావతి(జోర్దార్ సుజాత) కల నెరవేరిందా? విక్రమ్ భార్య రేఖ (దేవయాని శర్మ) లాయర్ ప్రాక్టీస్ ఎందుకు ఆపేయాలనుకుంది? మూడు జంటల మధ్య మళ్లీ గొడవలు ముదరడానికి కారణమేంటి? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ మొదటి సీజన్లాగే ఈ సీజన్లోనూ కామెడీకి కొదవలేదు. కామెడీతో పాటు ఓ సందేశాన్ని జోడించారు. కళ్లతో చూసే ప్రతీది నిజం కాదని నొక్కి చెప్పారు. చూసిన ప్రతీది నిజమని గుడ్డిగా నమ్మేసి ఓ అభిప్రాయానికి రాకూడదని, ఏది నిజం? ఏది అబద్ధం? అనేది మనమే తెలుసుకోవాలని మహి వి రాఘవ్ మెదడుకు ఎక్కేలా చెప్పాడు. ఈ విషయంలో మహిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే! మహి క్రియషన్స్, అరుణ్ డైరెక్షన్ ఎక్కడా సింక్ మిస్ అయినట్లు అనిపించదు. సిరీస్ నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. కథకు తగ్గట్టుగా అజయ్ అరసద సంగీతం అందించాడు. ఎవరెలా చేశారంటే? ఈ సిరీస్లో ఎవరి నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. ప్రియదర్శి, అభినవ్, చైతన్య బాగా నటించారు. సుజాత, దేవయాని, పావని వారితో పోటీపడి నటించినట్లు అనిపించినా మగజాతి ఆణిముణ్యాలదే ఇక్కడ పైచేయి అని చెప్పాలి. ముఖ్యంగా ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కూతురు పెద్దమనిషి అయ్యాక ఆమెతో మాట్లాడిన సీన్.. ఆ అమ్మాయి స్కూల్లో తన గురించి మాట్లాడేటప్పుడు అతడు భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల్లో ప్రియదర్శి చింపేశాడు. గంగవ్వ, అవినాష్, , వేణు.. తమ పాత్రల పరిధిమేర నటించారు. పనిమనిషితో పెట్టుకుంటే మడతెడిపోద్ది అనే రీతిలో రోహిణి మరోసారి ఫుల్గా నవ్వించింది. ఫైనల్గా చెప్పాలంటే.. ఓపక్క నవ్విస్తూనే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తుందీ సిరీస్. తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఏడిపిస్తుంది. వీకెండ్లో హ్యాపీగా చూసేయొచ్చు. -
మూడునెలలుగా ట్రెండింగ్లో ఉన్న సిరీస్.. ఏదో తెలుసా?
ఏ సినిమా అయినా ఓటీటీలోకి రాగానే కొద్దోగొప్పో గుర్తింపు వస్తుంది. సినిమా బాలేదంటే రెండు, మూడు రోజుల్లోనే దాన్నెవరూ పట్టించుకోరు. అదే బాగుందంటే మాత్రం వెంటనే టాప్ 10లో ట్రెండింగ్ అవుతుంది. అయితే కొత్త సినిమా రాగానే కాస్త వెనకబడిపోతుంది. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ వెబ్ సిరీస్ మాత్రం రోజులు, వారాలుగా కాదు ఏకంగా మూడు నెలల నుంచి టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఏదో మన దేశంలో మాత్రమే అనుకునేరు.. కానే కాదు.. ఏకంగా 36 దేశాల్లో వంద రోజులుగా టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది.. అంతలా క్లిక్ అయిన వెబ్ సిరీస్ మనదే.. ఇంతకీ అదె అనుకుంటున్నారా? ద రైల్వే మ్యాన్. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తయిన భోపాల్ గ్యాస్ లీక్ ఘటన ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఆర్ మాధవన్, కేకే మీనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ్ రావలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ గతేడాది నవంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు విపరీత ఆదరణ దక్కడంతో సిరీస్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ సిరీస్కు ఈ రేంజ్లో క్రేజ్ రావడం నిజంగా గ్రేట్ అంటున్నారు వెబ్ వీక్షకులు. చదవండి: చివరి రోజు షూటింగ్.. అమ్మ ఇక లేదంటూ ఫోన్ కాల్.. నిర్మాతకు చెప్తే.. -
ఓటీటీకి వచ్చేసిన రొమాంటిక్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. భాష ఏదైనా సరే సబ్ టైటిల్స్తోనే కంటెంట్ను ఆస్వాదిస్తున్నారు. సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సరికొత్త కాన్సెప్ట్తో వెబ్ సిరీస్లు రూపొందిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్లో రిలీజైన మలయాళ వెబ్ సిరీస్ పోచర్కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా మరో సరికొత్త కంటెంట్తో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ అదేంటో చూద్దాం. అయాలి నటి అనుమోల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ హార్ట్ బీట్. మెడికల్ జానర్లో దీపక్ సుందర్రాజన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సిరీస్లో చాలామంది కొత్తవారు నటించారు. ఈ రొమాంటిక్ యూత్పుల్ సిరీస్ మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ను అమెరికన్ షో గ్రేస్ అనాటమీ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్లో యోగలక్ష్మి, థాపా, దీపా బాలు, చారుకేష్, జయరావు, గిరి ద్వారకేష్, దేవిశ్రీ, కవితాలయ కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Tamil (@disneyplushotstartamil) -
ఓటీటీకి వచ్చేస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో వెబ్ సిరీస్ కంటెంట్పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. దీంతో సరికొత్త కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. హుమా ఖురేషి ప్రధాన పాత్రలో తెరకెక్కించిన పొలిటికల్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాకపోతే అది టాలీవుడ్కు సంబంధించినది మాత్రం కాదు. మొదటి, రెండు సీజన్స్ సూపర్ హిట్గా మహారాణి సీజన్-3 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈనెల 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది. ఈ సిరీస్లో బీహార్లో హానికరమైన మద్యం వ్యాపారం గురించి చూపించనున్నారు. ఈ సిరీస్ను సుభాష్ కపూర్ కథను అందించగా.. కరణ్ శర్మ దర్శకత్వం వహించారు. రాజకీయాలు నేపథ్యంగా కల్పిత కథ ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించారు. కాంగ్రా టాకీస్ పతాకంపై డింపుల్ ఖర్బందా, నరేన్ కుమార్ ఈ వెబ్ సిరీస్ను నిర్మించారు. కాకపోతే ఈ సిరీస్ కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది. -
Buried Truth Review In Telugu: ఇంద్రాణి ముఖర్జీ 'బరీడ్ ట్రూత్'.. ఎలా ఉందంటే?
మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ ఆధారంగా వచ్చి డాక్యు సీరిస్ వివాదాలతో పాటు.. చాలా కొత్త విషయాలను తెరమీదకు తెచ్చింది. కూతురు హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఇంద్రాణి చేస్తున్న వాదనకు మద్దతు పలికేలా ఈ సీరిస్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్ విడుదలను అడ్డుకోవాలని సీబీఐ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో… ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్దీప్ సర్దేశాయితో పాటు ఈ కేసును కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరి ఇంటర్వ్యూలు ఈ సిరీస్లో మనం చూడొచ్చు. పోలిస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లూప్హోల్స్ … లీగల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఈ క్రైం కథలో బ్లెండ్ అయ్యాయి. హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసుల అత్యుత్సాహం… మీడియా ట్రయల్లాంటి సున్నితమైన అంశాలను కూడా ఈ సిరీస్ టచ్ చేసింది. బరీడ్ ట్రూత్ సిరీస్లో ఇంద్రాణి స్వయంగా తన వాదనను తానే టీవీ స్క్రీన్పై చెప్పుకోవడం… ఆడియన్స్కు మరింత ఆసక్తిని పెంచింది. 2012లో మాయమైన ఇంద్రాణి కూతురు షీనాబోరా హత్యకు గురైందని మూడేళ్ల తరువాత పోలీసులు గుర్తిస్తారు. అదీ ఓ సాధారణ వెహికిల్ చెకింగ్లో భాగంగా అరెస్టైన వ్యక్తి చెప్పిన సమాచారంతో ఈ మొత్తం కథ బయటకు వస్తుంది. కూతురు మూడేళ్ల పాటు కనిపించకుండా పోయినా ఇంద్రాణి ఎందుకు మాట్లాడలేదనే విషయంపై ఈ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చాలా వరకు నిజమైన క్యారెక్టర్లతోనే స్టోరీ చెప్పే ప్రయత్నం జరిగింది. షీనాబోరాను తన చెల్లెలుగా మూడోభర్త కుటుంబానికి ఎందుకు పరిచయం చేసిందననే విషయంపై ఇంద్రాణి చెప్పిన సీక్రెట్ హైలెట్గా ఉంటుంది. తన తండ్రే తన కూతురికి తండ్రి అన్న విషయాన్ని ఇంద్రాణి ఈ సిరీస్లో రివీల్ చేస్తుంది. తాను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కన్న తండ్రి తనను అత్యాచారం చేసిన విషయాన్ని ఇంద్రాణి చెబుతుంది. ఆ తరువాత మళ్లీ మళ్లీ అత్యాచారానికి గురయ్యానని.. తన తండ్రి ద్వారానే తాను తల్లినయ్యానని ఇంద్రాణి రివీల్ చేస్తుంది. షీనాబోరాను దాదాపు 16 ఏళ్ల పాటు దూరంగా ఉంచిన ఇంద్రాణి.. ఆ తరువాత ఎందుకు తన దగ్గరకు తెచ్చుకుంది. మూడో భర్త కొడుకుతో ఇంద్రాణి కూతురు ప్రేమలో పడటం లాంటి చాలా జుగుప్సాకరమైన విషయాలను ఈ సిరీస్లో చూపించారు. పీటర్ ముఖర్జీయా కుమారుడు రాహుల్, ఇంద్రాణి కూతురు షీనాబోరా ప్రేమ వల్లే ఈ హత్య జరిగిందనే చర్చ ఉంది. అయితే షీనాబోరా మిస్సయ్యాక రాహుల్ ఏవిధంగా ఆమెను వెతికే ప్రయత్నం చేశాడో ఈ సిరీస్ ద్వారా బయటకు వచ్చింది. పీటర్ ముఖర్జీయాకు షీనా హత్య గురించి తెలుసా? లేదా అనే విషయంపై ఈ సిరీస్లో కీలకమైన పాయింట్ రివీల్ చేశారు. షీనాబోరా హత్యకేసుకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే అందరికీ తెలిసినా.. ఈ సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రేక్షకులకు చివరిగా ఒక మాట… కూతురిని హత్య చేసిందనే ఆరోపణలతో 6 ఏళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణి… ఈ సిరీస్లో కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడా భయం.. పశ్చాత్తాపం లాంటివి లేకుండా హీరోయిన్లా ఇంద్రాణి డైలాగ్స్ చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తన అందం చూసి పార్టీల్లో మగవాళ్లు పిచ్చోళ్లై పోతారని… ఆడవాళ్లు ఇబ్బందిగా ఫీలవుతారని ఇంద్రాణి చెప్పే డైలాగులు ఆమెలోని కాన్ఫిడెన్స్ను బయటపెట్టాయి. మూడో పెళ్లి చేసుకున్నా… కన్న పిల్లలను చెల్లెలు, తమ్ముడిగా చెప్పుకున్నా అది తన ఎదుగుదలకే అని ఇంద్రాణి చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. కాని మీ కూతురుని మీరు హత్య చేశారా? అనే ప్రశ్నకు… ఇంద్రాణి చెప్పిన సమాధానం… ఈ సీరిస్లోనే హైలట్గా నిలిచింది. -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
2024లో నెట్ఫ్లిక్స్ నుంచి రానున్న హిట్ సినిమాలు ఇవే..
-
వాళ్లకు అసలు మానవత్వం లేదా: మహేశ్ బాబు
-
వెబ్ సిరీస్గా పీవీ నరసింహారావు బయోపిక్
భారతదేశ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జీవితంతో వెబ్ సిరీస్ రూ΄÷ందనుంది. ఆహా స్టూడియో, అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి ‘హాఫ్ లయన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ నిర్మించనున్నట్లు ప్రకటించాయి. ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి రచించిన ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా ఈ సిరీస్కి దర్శకత్వం వహించ నున్నారు. ‘‘1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు అందించిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం అత్యున్నత ΄ûర పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సిరీస్ను రూ΄÷ందిస్తాం’’ అని మేకర్స్ అన్నారు. -
మూడు వెబ్ సిరీస్లకు శ్రీకారం
‘ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఎన్ . శంకర్ చారిత్రాత్మక కథాంశాలతో మూడు వెబ్ సిరీస్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్ . శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో బ్యానర్లో ఆయన నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్లు రూ΄÷ందనున్నాయి. ఈ సందర్భంగా ఎన్ . శంకర్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సాయిధ ΄ోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మొదటి వెబ్ సిరీస్ నిర్మించనున్నాను. అక్టోబర్లో చిత్రీకరణ మొదలవుతుంది. అలాగే మహాత్మ జ్యోతీరావు ఫూలేగారి స్ఫూర్తితో రెండో వెబ్ సిరీస్ నిర్మిస్తాను. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. జ్యోతీరావు ఫూలేగారి అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు వంటివి ఈ వెబ్ సిరీస్లో ఉంటాయి. అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్గారిపై మూడో వెబ్ సిరీస్ ఉంటుంది. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. అంబేద్కర్గారు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, వ్యక్తి నుండి వ్యవస్థగా మారడానికి మధ్య జరిగిన సంఘర్షణల ఇతివృత్తంగా ఈ సిరీస్ సాగుతుంది. ఈ మూడు వెబ్ సిరీస్లను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను’’ అన్నారు. -
రెండో పెళ్లి చేసుకున్న సైతాన్ నటి.. వరుడు ఎవరంటే?
ప్రముఖ మలయాళ నటి లేనా తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్లో నటించింది. మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ సిరీస్లో లేనా మేరీ జోసెఫ్ పాత్రలో మెప్పించింది. ఆమె ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఆడుజీవితం చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ భామ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ 42 ఏళ్ల నటి జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా పంచుకుంది. నెలన్నర తర్వాత రివీల్.. పెళ్లి చేసుకున్న దాదాపు 40 రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది లేనా. అయితే ఇది ఆమెకు రెండో వివాహం కాగా.. మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల కేరళలో పర్యటించిన మోదీ గగన్యాన్ ప్రాజెక్ట్లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వారిలో పైలట్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. గగన్యాన్లో పాలుపంచుకునే నలుగురి పేర్లను మోదీ ప్రకటించిన వెంటనే లేనా తన పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రశాంత్ నాయర్తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లేనా తన ఇన్స్టాలో రాస్తూ..' ఈరోజు, ఫిబ్రవరి 27, 2024న, మన ప్రధాని మోదీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు మొదటి భారతీయ ఆస్ట్రోనాట్ వింగ్స్ బహుకరించారు. మన దేశం, కేరళ, ముఖ్యంగా నాకు ఇది చాలా గర్వించదగ్గ చారిత్రక సందర్భం. అధికారికంగా నేను ప్రశాంత్ను జనవరి 17, 2024న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నానని మీకు తెలియజేయడానికి ఈ ప్రకటన కోసం వేచి ఉన్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ఫ్లైట్ మిషన్ గగన్యాన్ కోసం శిక్షణ పొందిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వారిలో కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు. ఈ నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. View this post on Instagram A post shared by Lenaa ലെന (@lenaasmagazine) -
వారికి అసలు మానవత్వం లేదా?: మహేశ్ బాబు పోస్ట్ వైరల్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారంతో ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక మహేశ్ బాబు తదుపరి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవలే బాలీవుడ్ భామ నిర్మాతగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈనెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పోచర్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ వీక్షించిన మహేశ్ బాబు ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఎలా ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. వారికి మానవత్వం లేదా? అలాంటి పనులు చేసేటప్పుడు వారి చేతులు వణకవా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోచర్ వెబ్ సిరీస్ చూశాక తన మైండ్లో ఇలాంటి ప్రశ్నలే తిరుగుతున్నాయని తన ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఇలాంటి సున్నితమైన దిగ్గజాలను రక్షించమని కోరుతూ ఈ వెబ్ సిరీస్ ద్వారా పిలుపునిచ్చారని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. కాగా.. ఎమ్మీ అవార్డు విన్నర్, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన మలయాళ ఫారెస్ట్ క్రైమ్ సిరీస్ పోచర్. ఏనుగు దంతాల స్మగ్లింగ్తో పాటు, క్రైమ్ ఎలిమెంట్స్తో ఈ సిరీస్ను తెరకెక్కించారు. కేరళ అడవుల్లో జరిగిన ఒక రియల్ స్టోరీని ఆధారంగా తీసుకోని ఈ చిత్రాన్ని రూపొందించారు. పోచర్లో నిమేషా సజయన్, రోషన్ మాథ్యూ కీలకపాత్రలు పోషించారు. కేరళ అడవుల్లో ఉన్న ఏనుగులను చంపి వాటి దంతాలతో కొందరు నేరస్థులు వ్యాపారం చేస్తుంటారు. అలాంటి నేరస్థుల ముఠాని పట్టుకోవడానికి కేరళ పోలీసులు, కొందరు ఎన్జీఓలో చేసిన ప్లానింగ్నే సిరీస్గా రూపొందించారు. ఈ సిరీస్కు అలియా భట్ నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
మద్దాలి శివారెడ్డి గుర్తున్నాడా?.. సరికొత్త వెబ్ సిరీస్తో వచ్చేస్తున్నాడు!
రవి కిషన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా ప్రేక్షకులను అలరించాడు. తనదైన నటనతో, కామెడీతో టాలీవుడ్ అభిమానులను మెప్పించారు. ఆ తర్వాత కిక్-2, సుప్రీమ్, 90 ఎంఎల్, లై చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్లో చిత్రాలతో బిజీగా ఉన్న రవికిషన్.. గతేడాది మిషన్ రాణిగంజ్ చిత్రంలో నటించారు. తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రవి కిషన్, నైలా గ్రేవాల్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రల్లో మామ్లా లీగల్ హై అనే కామెడీ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోర్టు రూమ్ నేపథ్యంలో వస్తోన్న ఈ సిరీస్ను ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ను రాహుల్ పాండే దర్శకత్వంలో రూపొందించారు. కాగా.. ఈ సిరీస్ మార్చి 1న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
సూపర్ హిట్ వెబ్ సిరీస్లకు సీక్వెల్స్.. ఆ ఓటీటీలోనే!
సినీ ప్రియులు సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్లకూ ఓటేస్తున్నారు. కొత్త కంటెంట్తో రిలీజయ్యే సిరీస్లను ఆదరిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సిరీస్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే అలా వచ్చినవాటిలో ఎన్నో హిట్టయ్యాయి కూడా! ఈ క్రమంలో కొన్ని సూపర్ హిట్ సిరీస్లకు సీక్వెల్స్ ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్స్టార్. అవేంటో చూసేద్దాం.. సేవ్ ది టైగర్స్ హాట్స్టార్లో గతేడాది వచ్చిన తెలుగు వెబ్ సిరీస్లలో సేవ్ ది టైగర్స్ ఒకటి. కడుపుబ్బా నవ్వించిన ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. తేజ కాకుమాను దర్శకత్వం వహించగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. వీరి భార్యల పాత్రల్లో సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి నటించారు. హీరోలు ముగ్గురూ ఒక్కో రంగానికి సంబంధించినవారు. కానీ ఈ ముగ్గురూ భార్యా బాధితులే. భార్యల నస వల్ల ఫ్రస్టేషన్కు గురవతుంటారు. ఈ క్రమంలో వారి కాపురాలు ప్రమాదంలో పడతాయి. అలాంటి పరిస్థితుల్లో వీరు ఏం చేశారు? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది రెండో సీజన్లో చూపించనున్నారు. ఈ ముగ్గురు హీరోలు జైల్లో ఉన్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది హాట్స్టార్. త్వరలోనే రెండో సీజన్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. Can anyone save the tigers this time around?! #HotstarSpecials #SavetheTigers S2 coming soon. pic.twitter.com/Yb1rtpoZao — Disney+ Hotstar (@DisneyPlusHS) February 14, 2024 కేరళ క్రైమ్ ఫైల్స్ 2 ఇది పూర్తిగా క్రైమ్ సిరీస్. గతేడాది కేరళ క్రైమ్ ఫైల్స్ రిలీజైంది. ఆషిఖ్ ఐమర్ అందించిన కథకు అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించాడు. ఒక లాడ్జిలో వేశ్య హత్యకు గురవుతుంది. తనను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతూ హంతకుడి కోసం వెతుకులాట మొదలుపెడతారు. ఒక ఫేక్ అడ్రస్ను పట్టుకుని వారు దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఈ మలయాళ సిరీస్లో అజు వర్గీస్, లాల్, షింజ్ షాన్, సంజు సనిచెన్, అశ్వతి మనోహర్, నవాస్ వల్లికున్ను, దేవకి తదితరులు నటించారు. ఓటీటీలో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హిట్ సిరీస్కు సీక్వెల్ ప్రకటించారు. త్వరలోనే కొత్త కేసుతో కేరళ క్రైమ్ ఫైల్స్ 2 రానున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) గూస్బంప్స్ ఇది ఒక హారర్ సిరీస్. ఆర్.ఎల్. స్టీన్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ అమెరికన్ సిరీస్ రూపొందించారు. ఇందులో జాక్ మారిస్, ఇసా బ్రియోన్స్, మైల్స్ మెకెన్నా, అనయి పుయిగ్, విల్ ప్రైస్, రాచెల్ హారిస్ ప్రధాన పాత్రలు పోషించారు. రాబ్ లాటెర్మాన్, నికోలర్ స్టోలర్ దర్శకత్వం వహించారు. పది ఎపిసోడ్లతో హాట్స్టార్లో అందుబాటులో ఉంది. కథేంటంటే.. హైస్కూల్ విద్యార్థులు ఓ రోజు పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తారు. అక్కడ 30 ఏళ్ల క్రితం ఓ పిల్లవాడు చచ్చిపోతాడు. ఆ బంగ్లాకు వెళ్లినప్పటినుంచి విద్యార్థుల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ఆ బంగ్లాలో ఎన్ని ఆత్మలున్నాయి? వాటితో వీళ్లు ఎలా పోరాడారు? ఎవరు విజయం సాధించారన్నదే గూస్బంప్స్ స్టోరీ. తాజాగా దీనికి కూడా సీక్వెల్ ప్రకటించారు.. త్వరలోనే రెండో సీజన్ రానున్నట్లు ప్రకటించింది హాట్స్టార్. ఇలా ఫన్, క్రైమ్, హారర్ సిరీస్లు త్వరలో అందుబాటులోకి వస్తున్నాయని తెలిసి ఖుషీ అవుతున్నారు ఓటీటీ లవర్స్! Season 2 of #GoosebumpsSeries is coming. pic.twitter.com/M1WgMzijg5 — Disney+ Hotstar (@DisneyPlusHS) February 12, 2024 చదవండి: విజయ్కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నాకూ రాజకీయాల్లోకి.. -
సినిమానే అనుకుంటే.. అంతకుమించి.. ఆ వెబ్ సిరీస్ రికార్డ్!
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా రోజు రోజుకు సినిమా బడ్జెట్ పెరుగుతూనే వస్తోంది. ఇక ఓటీటీ యుగం రావడంతో వెబ్ సిరీస్లు సైతం పోటీపడుతున్నాయి. సినిమాలే ఎక్కువ బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు వెబ్ సిరీస్లు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలంటే మనకు గుర్తుచ్చే పేరు రాజమౌళినే. బాహుబాలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యధిక బడ్జెట్తో చేసిన సినిమాలే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్ను మించిపోయేలా ఓవెబ్ సిరీస్ వస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. గతంలో అలియాభట్తో తీసిన గంగూభాయి కతియావాడి బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ బడ్జెట్కు సంబంధించిన నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. యానిమల్, బాహుబలి, డంకీ సినిమాల బడ్జెట్ను మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్గా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం హీరామండి వెబ్ సిరీస్ను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రుద్రను వెనక్కి నెట్టి.. ఇప్పవరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ నటించిన వెబ్ సిరీస్ రుద్ర:ఎడ్జ్ ఆప్ డార్క్నెస్ అత్యంత భారీ బడ్జెట్గా రూపొందించిన వెబ్ సిరీస్గా నిలిచింది. ఈ సిరీస్ను దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. తాజాగా హీరామండి వెబ్ సిరీస్ బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బడ్జెట్లో ఎక్కువశాతం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. పారితోషికం విషయాకొనిస్తే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. వీరికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పేరుతో టీజర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. దేశానికి స్వతంత్రం రాకముందు ప్రస్తుతం పాకిస్థాన్లోని లాహోర్లో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
'ఆ విషయంలో కాస్త ఓపిక పట్టండి'.. ఫ్యాన్స్కు సీరియల్ బ్యూటీ రిక్వెస్ట్!
'గుప్పెడంత మనసు' సీరియల్తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన భామ జ్యోతిరాజ్. ఈ సీరియల్లో జగతి మేడమ్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ 'బందె బరాటవ కాలా' సీరియల్తో నటిగా కెరీర్ ప్రారంభించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ బుల్లితెరపై మెరిసింది. అయితే భర్తతో విడాకులు తీసుకున్న ముద్దుగుమ్మ యంగ్ డైరెక్టర్ పూర్వజ్తో పీకల్లోతు ప్రేమలో ఉంది. అంతే కాదు జ్యోతిరాయ్ పేరును కాస్తా జ్యోతి పూర్వాజ్గా మార్చేసింది. కాగా.. జ్యోతిరాయ్ ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉన్న భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన పోస్టర్ను తన ఇన్స్టాలో పంచుకుంది. ఈ పోస్టర్లో మరింత బోల్డ్ లుక్తో కనిపించింది. ఇప్పటికే హాట్ పెంచేసిన సీరియల్ బ్యూటీ కాస్తా ఇప్పుడు మరింత బోల్డ్గా కనిపించడంతో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జ్యోతి తన ఇన్స్టాలో రాస్తూ..'అతి త్వరలో భయంకరమైన, విచిత్రమైన, కఠినమైన, గ్లామర్ డోస్ బ్లడ్ బాత్ థ్రిల్లర్తో వస్తున్నా. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. ఇంకా 3 షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి. త్వరలోనే ఈ సిరీస్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం. దయచేసి ఆ విషయంలో ఓపిక పట్టండి. ఈ అద్భుతమైన మల్టీ క్యారెక్టరైజేషన్ ఇచ్చిన నా టీమ్కి ధన్యవాదాలు. నన్ను నేను డిఫరెంట్గా చూపించుకోవడాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా. మీరు త్వరలోనే దీన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్టర్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) -
ఓటీటీలో టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రాచీ టకర్, నేహా దేశ్పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ ఎల్ఎస్డీ. ఈ సీరీస్కు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ మోదుగ , శివ కోన సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్ను సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఎల్ఎస్డీ ట్రైలర్కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, ఫారెస్ట్ ట్రిప్ ఆడియన్స్లో ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో ఆద్యంతం సస్పెన్స్ ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్కు ప్రవీణ్ మని, శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నారు. -
దేశాన్ని కుదిపేసిన సంఘటన.. ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్గా
నిజ జీవిత కథలతో సినిమాలు రావడం ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు మాత్రం వాటిని వెబ్ సిరీస్ లేదా డాక్యుమెంటరీస్ తరహాలో తీస్తున్నారు. ఇక దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ అయితే ప్రధానంగా ఇలాంటి వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి దేశంలోనే చర్చనీయాంశంగా మారిన కేసులపై సిరీస్లు తీస్తోంది. ఇప్పుడు కూడా అలానే అప్పట్లో సంచలనం సృష్టించిన 'షీనా బోరా కేసు' నేపథ్యంగా తీసిన సిరీస్ని స్ట్రీమింగ్కి రెడీ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) ఏంటీ 'షీనా బోరా' కేసు? 2012లో షీనా బోరాని హత్య జరిగింది. అయితే ఇది మూడేళ్ల తర్వాత బయటపడింది. ఇంద్రాణీ ముఖార్జియా అనే మహిళ కారు డ్రైవర్.. ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా షీనా బోరా హత్య గురించి సంచలన నిజాల్ని ఇతడు వెల్లడించాడు. కూతురు షీనాని.. సొంత తల్లి ఇంద్రాణీనే గొంతు నులిమి చంపేసిందని చెప్పాడు. దీంతో ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. దర్యాప్తులో బయటపడిన వివారల ప్రకారం.. తన భర్త నుంచి ఇంద్రాణీ విడిపోయిన తర్వాత కూతురు షీనా, కొడుకు మైకేల్ని గౌహతిలో ఉన్న తన తల్లిదండ్రుల దగ్గర ఉంచేసింది. కొన్నాళ్ల తర్వాత సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని ఇంద్రాణీ పెళ్లి చేసుకుంది. ఇతడితో కూడా ఇంద్రాణీ ఎక్కువ రోజులు సంసారం చేయలేక విడిపోయింది. ఆ తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖార్జియాని ఇంద్రాణీ వివాహమాడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే పీటర్- అతడి తొలి భార్యకు పుట్టిన కొడుకుని షీనా ప్రేమించింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) ఇక తల్లి పీటర్ ని పెళ్లి చేసుకోవడంతో ఆ కుర్రాడు.. షీనాకు అన్న వరస అవుతాడు. ఈ విషయమై ఇంద్రాణీ-షీనా మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. సొంత కూతురినే చంపాలని ప్లాన్ చేసింది. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో కూతురిని హతమార్చింది. మృతదేహాన్ని చత్తీస్ఘడ్లోని అటవీ ప్రాంతంలో కాల్చేసింది. 2012లో హత్య జరగ్గా 2015లో పోలీసులకు విషయం తెలిసి ఇంద్రాణీతో పాటు రెండో భర్త సంజీవ్, మూడో భర్త పీటర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. జైల్లో ఉన్న టైంలోనే అంటే 2019లో ఇంద్రాణీ తన భర్త మూడో భర్త పీటర్కి కూడా విడాకులు ఇచ్చేసింది. ఇదే స్టోరీతో 'ద ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్' పేరుతో డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ తీశారు. ఫిబ్రవరి 23 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి సిరీస్లో తెలిసిన విషయాలతో పాటు కొత్తవి ఏమేనా ఉంటాయా? లేదా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: 9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) A sensational scandal that rocked the entire nation, with one family's darkest secrets at the center of it all.#TheIndraniMukerjeaStoryBuriedTruth, coming on 23 February only on Netflix! pic.twitter.com/PIFyDWowIP — Netflix India (@NetflixIndia) January 29, 2024 -
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ గురించి లావణ్య త్రిపాఠి మరియు అభిజీత్
-
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఏ హీరోయిన్ పెళ్లి చేసుకున్నా సరే.. చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్.. ఇకపై నటిస్తారా? లేదంటా ఇండస్ట్రీ టాటా చెప్పేస్తారా? అని చాలామంది అడుగుతారు. ఇప్పుడు ఇదే ప్రశ్న.. మెగా కోడలు లావణ్య త్రిపాఠికి కూడా ఎదురైంది. ప్రస్తుతం ఈమె 'మిస్ ఫెర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ చేసింది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా లావణ్యకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే కెరీర్, అత్తారింట్లో కండీషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగా కోడలు ట్యాగ్ అలాంటిది మెగా కోడలు ట్యాగ్ అనేది నటిగా తనకు బాధ్యత పెంచిందని.. లావణ్య త్రిపాఠి అనే పేరు తాను కష్టపడి సాధించుకున్నానని, మెగా కోడలు అనే పేరు మాత్రం వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిందని.. ఈ పిలుపు చాలా స్పెషల్గా భావిస్తున్నట్లు లావణ్య చెప్పుకొచ్చింది. అలానే ఓటీటీ, సినిమాలు అనే భేదం తనకు లేదని.. నచ్చిన కథల్లో నటిస్తూ కెరీర్ పరంగా ముందుకు సాగుతున్నానని లావణ్య క్లారిటీ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) నేను ఫెర్ఫెక్ట్ కాదు వెబ్ సిరీస్ టైటిల్లానే మీరు కూడా ఫెర్ఫెక్టేనా అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన లావణ్య.. ఫెర్ఫెక్షన్ కూడా ఓ సమస్య అని, దీని వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుందని చెప్పింది. తాను మాత్రం నిజజీవితంలో ఫెర్ఫెక్షనిస్ట్ కాదని స్పష్టం చేసింది. తన భర్త వరుణ్ తేజ్ మాత్రం ఫెర్ఫెక్షనిస్ట్ అని, అతడికి ఓసీడీ ఉందని ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టింది. కండీషన్స్ ఏం లేవు సినిమాలు-కెరీర్ విషయంలో పెళ్లి తర్వాత అత్తారింట్లో కండీషన్స్ ఏమైనా పెట్టారా? అనే ప్రశ్నకు కూడా లావణ్య సమాధానమిచ్చేసింది. పాత్రల ఎంచుకునే విషయమై వరుణ్ కుటుంబుం తనకు ఎలాంటి కండీషన్స్, ఆంక్షలు పెట్టలేదని.. ఇలాంటి పాత్రలు చేయొద్దు లాంటి మాటలు కూడా తనతో అనలేదని చెప్పింది. కెరీర్ విషయంలో అత్తారింట్లో తనకు ఫుల్ సపోర్ట్ ఉందని చెప్పింది. అలానే మంచి కథతో దొరికితే వరుణ్తో నటించడానికి తాను రెడీ అనే హింట్ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) -
‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
నటి వాసుకి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాని తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలు బుజ్జి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఆ సినిమాలో వాసుకి నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పవన్-వాసుకిల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతలా ప్రేక్షకుల మదిలోకి వెళ్లిపోయిన వాసుకి.. వన్ ఫిల్మ్ వండర్లా ఒక్క సినిమాకే పరిమితమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి.. అటు వెండితెరపై ఇటు వెబ్స్క్రీన్పై సందడి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవల రిలీజై సూపర్ హిట్ అయిన ’#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్లో మిడిల్ క్లాస్ అమ్మగా అదరగొట్టేసింది. వాసుకి పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. ‘రమణి వర్సెస్ రమణి’, ‘మర్మదేశం’ అనే సీరియల్స్తో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. ‘తొలిప్రేమ’ సూపర్ హిట్ కావడంతో తర్వాత సినీ అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కానీ ఆమె నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కుటుంబ జీవితంపై దృష్టి పెట్టింది. ‘తొలిప్రేమ’లో పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రేమాభినాలను చూరగొంది. ఆ సమయంలోనే ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమ వివాహం చేసుకుంది. మళ్లీ రెండు దశాబ్దాల విరామం తర్వాత ’అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోన్న ’#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్సిరీస్తో మిడిల్ క్లాస్ అమ్మగా ఆకట్టుకుంటోంది. ఇందులో కనిపించే వస్తువులు, చిన్నచిన్న ఆనందాలు, విషయాలు, పరిస్థితులు.. నైంటీస్ కిడ్స్కి బాగా రిలేట్ అవుతున్నాయి. ఇరవై మూడేళ్ళు సినిమాల్లో నటించనప్పటికీ ఆనంద్ వలన ఏదో ఒక సినిమా గురించి ఇంట్లో చర్చ జరుగుతూనే ఉండేది. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాననే ఫీలింగ్ కలగలేదెప్పుడూ! – వాసుకి ఆనంద్ సాయి. View this post on Instagram A post shared by Sai Madhav Battula (@saimadhavbattula) -
ఓటీటీలో టాప్ లేపిన వెబ్ సిరీస్.. మూడో సీజన్ రిలీజ్ డేట్ ఫిక్స్?
క్రేజీ వెబ్ సిరీస్ నుంచి కేక పుట్టించే అప్డేట్ వినిపిస్తుంది. ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని వెబ్ సిరీసులు.. జనాల్ని ఓ రేంజులో ఊపేశాయి. అలాంటి వాటిలో ఒకటి 'మీర్జాపూర్'. క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ నాటు సిరీస్.. మిగతా వాళ్లకేమో గానీ తెలుగు ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. ఇప్పుడు దీని మూడో సీజన్ నుంచి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) ఓటీటీలో రికార్డులు సృష్టించిన వెబ్ సిరీసుల లిస్టు తీస్తే అందులో కచ్చితంగా 'మీర్జాపూర్' ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రాంతమైన మీర్జాపూర్ నేపథ్యంగా కల్పిత పాత్రలతో ఈ సిరీస్ తీశారు. ఊరమాస్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ సిరీస్లో అద్భుతమైన డ్రామాతో పాటు బూతులు కూడా గట్టిగానే ఉంటాయి. అలా 2018 నవంబరు 16న రిలీజైన తొలి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2020 అక్టోబరు 23న వచ్చిన రెండో సీజన్ అంతకు మించి హిట్గా నిలిచింది. ఇక మూడో సీజన్కి సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాది క్రితమే పూర్తయిపోయినప్పటికీ.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మూడో సీజన్.. ఈ మార్చి చివరి వారంలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మున్నాభయ్యా ఫ్యాన్స్కి పండగే. ఇకపోతే తొలి సీజన్లో గుడ్డూ భయ్యా, అతడి కుటుంబాన్ని మున్నా ఇబ్బంది పెట్టడం చూపించారు. రెండో సీజన్లో గుడ్డు భయ్యా.. మున్నా భయ్యాపై ప్రతీకారం తీర్చుకోవడం చూపించారు. మూడో సీజన్లో ఏం చూపించబోతున్నారో? (ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
ఓటీటీలోకి కూడా వచ్చేసిన ఆ 'హనుమాన్'.. కాకపోతే అదే ట్విస్ట్
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'హను-మాన్' మేనియా నడుస్తోంది. మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచినప్పటికీ.. ప్రేక్షకాదరణ దక్కించుకుని హిట్ కొట్టేసింది. ఈ క్రమంలోనే అందరూ 'హనుమాన్'ని చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇదే టైంలో మరో 'హనుమాన్'.. ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసింది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) తెలుగు నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలిసి తీసిన సినిమా 'హను-మాన్'. చాలా తక్కువ బడ్జెట్తో తీసి పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేశారు. కంటెంట్పై ఉన్న నమ్మకంతో ప్రీమియర్స్ వేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంచనాల్ని అందుకుని పాజిటిక్ టాక్ సంపాదించేసుకుంది. ఇదే టైంలో 'గుంటూరు కారం'కి మిక్స్డ్ టాక్ వస్తోంది. దీంతో 'హనుమాన్' వైపు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే థియేటర్కి వెళ్లి ఆంజనేయుడిని చూడటం వీలుకాకపోతే ఇంట్లో కూర్చుని కూడా ఆయన్ని చూసేయొచ్చు. ఎందుకంటే 'ద లెజండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3' కూడా శుక్రవారం రిలీజైంది. కాకపోతే ఇది యానిమేటెడ్ సిరీస్. దీనికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇలా ఒకేరోజు అటు థియేటర్లో ఓ హనుమంతుడు వస్తే.. ఓటీటీలో మరో ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. సినీ ప్రేమికుడిని 'హనుమన్' మేనియాలో మైమరచిపోయేలా చేశారు. హనుమాన్ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ) -
పెళ్లి తర్వాత తొలిసారి.. లావణ్య త్రిపాఠి టీజర్ చూశారా?
గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మెగా హీరో వరుణ్ తేజ్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ తాజాగా వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా అభిజిత్, లావణ్య లీడ్ రోల్స్లో నటించిన మిస్ ఫర్పెక్ట్ అనే సిరీస్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్లో లావణ్య త్రిపాఠి.. ఓవర్ క్లీన్నెస్ (ఓసీడీ) కలిగిన పాత్రని పోషిస్తున్నారు. ఈ సిరీస్లో అభిజ్ఞ, ఝాన్సీ, హర్ష వర్ధన్, మహేష్ విట్టా, హర్ష రోషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే రిలీజ్ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. -
Avika Gor: ‘చిన్నారి పెళ్లికూతురు’ గురించి ఈ విషయాలు తెలుసా?
అవికా గోర్..‘చిన్నారి పెళ్లికూతురు’ ఆనందిగా ఫేమస్. ఇటు స్మాల్ స్క్రీన్.. అటు సిల్వర్ స్క్రీన్ రెండిట్లోనూ చిన్నప్పటి నుంచే నటించడం మొదలుపెట్టింది. నటిగా ఎన్నో విజయాలందుకున్న ఆమె.. ప్రస్తుతం వెబ్స్క్రీన్ మీదా అలరిస్తోంది. ► ముంబైలో పుట్టిపెరిగిన అవికా గోర్.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. స్కూల్లో కంటే షూటింగ్ సెట్స్లోనే ఎక్కువ సమయం గడిపింది. ► ‘బాలికా వధు’ సీరియల్ అవికా జీవితాన్నే మార్చేసింది. ఆ సీరియల్తో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకుంది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ► ‘రాజ్కుమార్ ఆర్యన్’, ‘ససురాల్ సిమర్ కా’ అనే సీరియల్స్లోనూ నటించింది. తర్వాత సినీ అవకాశాలు రావడంతో పూర్తిగా వెండితెర మీదే దృష్టి పెట్టింది. ► హిందీలో వరుసగా ‘తేజ్’, ‘పాఠ్శాలా’ సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెరపై వచ్చిన గుర్తింపు వెండితెరపై రాలేదు. తొలిసారి ‘ఉయ్యాల జంపాల’ అనే తెలుగు చిత్రంతో ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ► ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాల్లో నటించింది. కానీ, తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ► లాక్డౌన్లో.. జీ5లో డైరెక్ట్గా రిలీజ్ అయిన ‘నెట్’ సినిమా అవికాను డిజిటల్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. అక్కడ మంచి ఆదరణ లభించడంతో, మళ్లీ అవికా కెరీర్ పుంజుకుంది. ► ప్రస్తుతం అవికా.. డిస్నీఫ్లస్ హాట్స్టార్లో హిట్టాక్తో స్ట్రీమింగ్లో ఉన్న ‘వధువు’ అనే థ్రిల్లర్ సిరీస్తో అలరిస్తోంది . ఒకసారి ముంబైలోని ఒక థియేటర్లో సినిమా చూడ్డానికి నేను మేజర్ని కాదని నన్ను అనుమతించలేదు. నా ఐడీ చూపించి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ చాలామంది నన్ను చిన్నపిల్లలాగే చూస్తుంటారు. చెప్పొద్దూ.. అలా ట్రీట్ చేస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది. – అవికా గోర్ -
ఓటీటీలోకి మరో డిఫరెంట్ సిరీస్.. స్టార్ దర్శకుడికి ఇదే తొలిసారి
మరో స్టార్ డైరెక్టర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈయన తీసిన తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, సిరీస్ విశేషాలను పంచుకున్నారు. ఇంతకీ ఈ సిరీస్ ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది? సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!) రవితేజ కెరీర్లో 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. దీన్ని తీసింది దర్శకుడు చేరన్. స్వతహాగా తమిళంలో సినిమాలు తీసే ఇతడు.. ఈ మధ్యే హీరోగానూ మారాడు. ఇప్పుడు ఓటీటీల్లోకి కూడా అడుగుపెట్టేశాడు. 'చేరన్స్ జర్నీ' పేరుతో తీసిన సిరీస్.. ఈ జనవరి 12 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. చూస్తుంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. 9 ఎపిసోడ్స్తో తీసిన ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఓ పెద్ద కంపెనీకి బాస్ (శరత్ కుమార్), ఓ ఉద్యోగం కోసం ఐదుగురిని ఇంటర్వ్యూ చేస్తాడు. ఇందులో నలుగురు అబ్బాయిలు- ఓ అమ్మాయి ఉంటుంది. వీళ్లకు రకరకాల పరీక్షలు పెట్టి చివరకు ఒక్కరిని ఎంపిక చేస్తారు? ఈ క్రమంలోనే వీళ్లు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? అసలేంటి ఉద్యోగం? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఓటీటీనే కాబట్టి తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసే అవకాశముంది. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) -
ఓటీటీలో నెంబర్వన్ సిరీస్.. కానీ దారుణమైన ట్రోల్స్: నటి
బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్, సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్. 2018లో ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్ అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఐఎండీబీ ప్రకటించిన ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సిరీస్ తర్వాతే మీర్జాపూర్, స్కామ్, ద ఫ్యామిలీ మ్యాన్, ఆస్పిరంట్ టాప్-5లో నిలిచాయి. అయితే ఈ సిరీస్లో నటించిన మరో నటి రాజశ్రీ దేశ్పాండే. 'సేక్రెడ్ గేమ్స్'లో సుభద్ర పాత్రకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్లో భార్యగా నటించింది. అయితే ఈ సిరీస్లో చాలా ఇంటిమేట్ సీన్స్లో నటించడంతో విమర్శలకు గురైంది. గతేడాది ట్రయల్ బై ఫైర్ అనే వెబ్ సిరీస్తోనూ అభిమానులను అలరించింది. అయితే తాజాగా ఆమె నటించిన మరాఠీ చిత్రం సత్యశోధక్ జనవరి 5న థియేటర్లలో రిలీజైంది. నీలేష్ జలంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె సావిత్రి జ్యోతిబాయి పూలే పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాజశ్రీ.. సేక్రెడ్ గేమ్స్ రిలీజయ్యాక వచ్చిన అసభ్యకరమైన కామెంట్స్పై స్పందించారు. రాజశ్రీ దేశ్పాండే మాట్లాడుతూ..''సేక్రెడ్ గేమ్స్లో నా సీన్స్ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతే కాకుండా మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేశారు. ఆ సిరీస్ తర్వాత నాపై వీడియోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలయ్యాయి. నన్ను పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ చేశారు. నేను రైతులు, సామాజిక సమస్యల గురించి చాలాసార్లు మాట్లాడా. కానీ వాటి గురించి ఎవరూ రాయలేదు. ఇలాంటి వాటికే మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఈ విషయం నాకు చాలా బాధేసింది' అని తెలిపింది. Victory!🌟#RajshriDeshpande shares some beautiful words after winning big at the #FilmfareOTTAwards2023, co-powered by Hyundai Motor India, Ajio and Film Bandhu - Government of Uttar Pradesh, in association with Fura Gems and ITC Fiama.@AJIOLife @FiamaIndia pic.twitter.com/lhwmUSWpo9 — Filmfare (@filmfare) November 27, 2023 View this post on Instagram A post shared by Rajshri (@rajshri_deshpande) -
లావణ్య మిస్ పర్ఫెక్ట్
లావణ్యా త్రిపాఠి, అభిజీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘‘న్యూ ఇయర్ను పర్ఫెక్ట్గా మొదలు పెట్టబోతున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు లావణ్యా త్రిపాఠి. ‘‘ప్రతి పనిని పర్ఫెక్ట్గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్ల గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ మిస్ పర్ఫెక్ట్గా ఓ అమ్మాయి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది? ఎలా పని చేయిస్తుంది? అనే అంశాలను హిలేరియస్గా ఈ వెబ్ సిరీస్లో చూపించబోతున్నాం’’ అన్నారు విశ్వక్ ఖండేరావ్. ‘‘అనుకోకుండా ఏర్పరచుకునే కొన్ని అనుబంధాలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే ప్రేమకథతో ‘మిస్ పర్ఫెక్ట్’ని రూపొందించాం’’ అన్నారు సుప్రియ యార్లగడ్డ. ఈ సిరీస్కు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: ఆదిత్య జవ్వాదా. -
ఓటీటీలో దూసుకెళ్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. మీరు చూశారా?
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే ఒకరకంగా ఓటీటీల యుగమనే చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిస్తోన్న చిత్రాలు సైతం ఇంట్లో కూర్చోనే చూసేస్తున్నాం. ఇక వెబ్ సిరీస్ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. గంటల తరబడి ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీలు సైతం ఆసక్తికరమైన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ఎక్కువ మంది యువత ఆసక్తిగా చూసిన సిరీస్లలో మనీ హైస్ట్ ఒకటి. స్పానిష్లో రూపొందిన ఈ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ దక్కించుకుంది. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ సిరీస్ పలు స్థానిక భాషల్లోనూ అలరించింది. ఈ సిరీస్ మొదటి రెండు పార్టుల్లో కనిపించే కీలక పాత్ర బెర్లిన్. అయితే మనీ హైస్ట్కు ముందు అతడు చేసిన మరో దోపిడీతో తాజాగా బెర్లిన్ అనే వెబ్ సిరీస్ను రూపొందించారు. అయితే తాజాగా ఈ సిరీస్కు ప్రీక్వెల్గా తెరకెక్కించిన బెర్లిన్ అనే వెబ్ సిరీస్ ఇటీవలే రిలీజైంది. ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వస్తోంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇలాంటి సిరీస్లు ఇష్టపడే ప్రేక్షకులకు మంచి కిక్ను అందిస్తాయి. మరీ ముఖ్యంగా మనీహైస్ట్ అభిమానులు ఇలాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతారు. మీలో ఎవరైనా మనీ హైస్ట్ లాంటి సిరీస్లు నచ్చేవారుంటే తప్పకుండా బెర్లిన్ సిరీస్ ఓసారి ట్రై చేయండి. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా.. సిరీస్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అసలేంటి బెర్లిన్ స్టోరీ.. మనీ హెయిస్ట్ సిరీసులో చూపించే దొంగతనాల వెనుక ఫ్రొఫెసర్, అతని సోదరుడు బెర్లిన్ ఇద్దరూ మాస్టర్ మైండ్స్ ఉంటారు. వీరిలో ఇద్దరికి సూపర్ క్రేజ్ వచ్చింది. వీరిలో ఒకరైన బెర్లిన్ మనీ హైస్ట్ కన్నా ముందు చేసిన దోపిడీ ఏంటి? అనే విషయాన్ని ఈ సిరీస్లో తెరకెక్కించారు. కాగా బెర్లిన్ పాత్రలో పెడ్రో అలోన్సో అద్భుతంగా నటించాడు. ఆయనతో పాటు సమంత సిక్వోరోస్, ట్విస్టన్ ఉల్లోవా, మిచెల్ జెన్నర్, బెగోనా వర్గాస్, జూలియో పెనా ఫెర్నోండోజ్, జోయెల్ శాంఛైజ్ కీలక పాత్రలు పోషించారు. -
మెగా కోడలు కొత్త వెబ్సిరీస్.. హీరోగా 'బిగ్బాస్' విన్నర్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. మళ్లీ రంగంలోకి దూకేసింది. నవంబరులో మెగాహీరో వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. హనీమూన్, భర్తతో టైమ్ స్పెండ్ చేయడం కోసం కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్తో అలరించేందుకు సిద్ధమైపోయింది. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ఇతర డీటైల్స్ త్వరలో వెల్లడించబోతున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఏ సిరీస్? 'అందాల రాక్షసి' మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. మిడ్ రేంజ్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అయితే 2016లో 'మిస్టర్' షూటింగ్ టైంలో మెగాహీరో వరుణ్ తేజ్తో ప్రేమలో పడింది. అప్పటినుంచి 2023 జూన్ వరకు తమ బంధాన్ని రహస్యంగా ఉంచారు. ఎంగేజ్మెంట్తో తమ రిలేషన్ని అఫీషియల్ చేశారు. నవంబరు 1న ఇటలీలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) ఇదే చివరి సిరీస్? 2022లో 'హ్యాపీ బర్త్ డే' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసిన లావణ్య త్రిపాఠి.. గతేడాది ఒక్క మూవీలో నటించలేదు. కాకపోతే 'పులిమేక' అనే వెబ్ సిరీస్లో నటించింది. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు 'మిస్ ఫెర్ఫెక్ట్' సిరీస్లో ఈమెదే మెయిన్ లీడ్ అని తెలిసింది. తాజాగా ఫస్ట్ లుక్ బట్టి చూస్తే బిగ్బాస్ విన్నర్ అభిజిత్.. లావణ్యకు జోడీగా నటించనున్నాడు. అయితే లావణ్య త్రిపాఠి చేతిలో ప్రస్తుతం 'మిస్ ఫెర్ఫెక్ట్' సిరీస్తో పాటు 'తనల్' అనే తమిళ మూవీ మాత్రమే ఉంది. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవట్లేదు. అంటే ఈ రెండు చేసిన తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేస్తుందా అని డౌట్ వస్తుంది. లావణ్య కొత్త సినిమాలు చేసిన దానిబట్టి దీనిపై క్లారిటీ వచ్చేస్తుంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?) Starting this new year on a perfect note! Miss Perfect sir, Miss Perfect anthe 👌#MissPerfectonHotstar Coming Soon only on #DisneyPlusHotstar@Abijeet @abhignya_v #VishvakKhanderao @AnnapurnaStdios #SupriyaYarlagadda @adityajavvadi @prashanthvihari @disneyplushstel pic.twitter.com/An6XjCbWuk — LAVANYA (@Itslavanya) January 3, 2024 -
హీరోయిన్ కీర్తి సురేశ్ షాకింగ్ డెసిషన్.. దానికి గ్రీన్ సిగ్నల్
ఒకప్పుడంటే సినిమాల హవా నడిచేది గానీ ఇప్పుడు వెబ్ సిరీస్లు రాజ్యమేలుతున్నాయి. మూవీస్కి దీటుగా వీటిని తీస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలామంది యాక్టర్స్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నవి వెబ్ సిరీస్లే. అందుకే స్టార్ హీరోహీరోయిన్స్ కూడా ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) 23 ఏళ్ల క్రితమే మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేశ్.. 2013లో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళంలో దాదాపు పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్లోనూ పాగా వేయడానికి రెడీ అవుతోంది. 'తెరి' రీమేక్లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇది రిలీజ్ కావడానికి ముందే ఓ వెబ్ సిరీస్తో అలరించనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ దీన్ని తీస్తోంది. కీర్తి సురేశ్తో పాటు రాధికా ఆప్టే మరో ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్కు 'అక్కా' టైటిల్ను ఖరారు చేశారు. త్వరలో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. హీరోయిన్గా ఓ మాదిరి గ్లామర్ చూపిస్తూ వచ్చిన కీర్తి.. సెన్సార్ పరిధులు లేని ఈ సిరీస్లో ఎలా కనిపిస్తుందనేది ఇంట్రెస్టింగ్ విషయం. (ఇదీ చదవండి: మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్కాంత్.. అదే కారణం?) -
ఓటీటీలోకి రానున్న వ్యూహం.. స్ట్రీమింగ్ అప్పుడే!
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా టైటిల్తో ఓ తెలుగు వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. సాయి సుశాంత్ రెడ్డి, చైతన్యకృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ వ్యూహం. సాయి సుశాంత్ పోలీసాఫీసర్గా నటించాడు. శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న వ్యూహం డిసెంబర్ 14న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒక పోలీసాఫీసర్ తనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా పరిష్కరించాడన్నదే కథ. Telugu series #Vyooham premieres Dec 14th on @PrimeVideoIN. Directed by #SashikanthSrivaishnavPeesapati, ft. @SaiSushanthR @99_chaitu @pavaniogili @RavindraVijay1 & #ShashankSiddamsetty.#SupriyaYarlagadda @AnnapurnaStdios pic.twitter.com/R2W48UVTvJ — CinemaRare (@CinemaRareIN) December 11, 2023 చదవండి: దుర్గమ్మను దర్శించుకుని బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసిన వెంకీ మామ -
అనుమానాస్పదంగా ‘వధువు’
అవికా గోర్ ప్రధాన పాత్రలో, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మాణంలో పోలూరు కృష్ణ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 8 నుంచి హాట్స్టార్ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ– ‘‘ఓ కుటుంబంలోని సభ్యులందరూ ఎందుకు అనుమానాస్పదంగా కనిపిస్తారు? అనే అంశం ‘వధువు’లో కొత్తగా ఉంటుంది. అవికా, నేను బెక్కెం వేణుగోపాల్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సిరీస్లో నా పాత్ర చాలా సెటిల్డ్గా ఉంటుంది’’ అన్నారు అలీ రెజా. ‘‘బెంగాలీ సిరీస్ ‘ఇందు’ను ‘వధువు’గా రీమేక్ చేశాం. అయితే నేను సోల్ను మాత్రమే తీసుకున్నాను. మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశాం. ఫస్ట్ ఎపిసోడ్ లో అవికా పెళ్లై అత్తవారింటికి వస్తుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. అవికా అత్తవారింటికి ప్రేక్షకుల్ని కూడా తీసుకెళ్తాం. అంత గ్రిప్పింగ్ గా సిరీస్ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ నుంచి 7వ ఎపిసోడ్ వరకు అంతే క్యూరియస్ గా కథ సాగుతుంది. 7వ ఎపిసోడ్ కిక్ ఇచ్చేలా ఉంటుంది’ అన్నారు దర్శకుడు పోలూరు కృష్ణ. -
ఇరవై సార్లు పెళ్లి చేసుకున్నా: అవికా గోర్
‘‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ మొదలుకొని ఇప్పటివరకూ నేను ఆన్ స్క్రీన్పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా ముస్తాబవడం నాకు చాలా ఇష్టం. మరోసారి ‘వధువు’లో పెళ్లి కూతురిగా నటించాను. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సిరీస్ ఆసక్తిగా సాగుతుంది’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. నందు, అలీ రెజా, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మించిన ‘వధువు’ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘బెంగాలీ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇందు’ను తెలుగులోకి ‘వధువు’గా తీసుకొస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నాకు టీవీ సీరియల్స్ చేసిన అనుభవం ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఇష్టమో.. అది ‘వధువు’లో ఉంటుంది. ఇక చిన్నప్పుడే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్కు టైమ్ కోల్పోయినా... నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను.. ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నాను. నిర్మాతగా ‘పాప్ కార్న్’ సినిమా తీయడం గర్వంగా ఉంది. ఎలాంటి హంగామా లేకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నా పెళ్లి చేసుకోవాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమా చేస్తున్నా. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్లో నటిస్తున్నాను’’ అన్నారు. -
చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన చైతూ ఫస్ట్ వెబ్ సిరీస్
స్టార్ హీరోలు ఓటీటీల్లో సినిమాలు, సిరీస్లు బాలీవుడ్లో కామన్ ఏమో గానీ తెలుగులో అస్సలు లేదు. యువహీరో నాగచైతన్య దానికి శ్రీకారం చుట్టాడు. 'దూత' అనే వెబ్ సిరీస్లో నటించాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ పూర్తయినప్పటికీ.. ఓటీటీలో రిలీజ్ చేయడం ఎందుకో లేట్ చేశారు. ఫైనల్గా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. కానీ చెప్పిన టైమ్ కంటే ముందే అందుబాటులోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్.. కారణం అదేనా?) నాగచైతన్య-విక్రమ్ కుమార్ కాంబోలో తీసిన వెబ్ సిరీస్ 'దూత'. డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిన దాన్ని.. డిసెంబరు 1 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు చెప్పిన టైమ్ కంటే కొన్ని గంటల ముందే అంటే గురవారం (నవంబరు 30) సాయంత్రం 8 గంటల నుంచే అందుబాటులోకి వచ్చేసింది. ఈ సిరీస్ లో మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. సరాసరి ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సాగర్ అనే జర్నలిస్ట్ పాత్రలో నాగచైతన్య నటించాడు. మలయాళ బ్యూటీ పార్వతి, తమిళ బ్యూటీ ప్రియా భవాని శంకర్.. ఈ సిరీస్లో హీరోయిన్లుగా నటించారు. ఇందులో చాలావరకు వర్షం సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయని.. ఇప్పటికే ప్రీమియర్ చూసిన కొందరు చెబుతున్నారు. థ్రిల్లర్ తరహా సిరీస్ చూద్దామనుకుంటే దీనిపై మీరు ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ) -
దూత ఓ కొత్త అనుభూతి
‘‘థ్యాంక్యూ’ సినిమా తర్వాత ‘దూత’ వెబ్ సిరీస్ గురించి నాగచైతన్యతో చెప్పాను. హారర్, థ్రిల్లర్ నేపథ్యం అంటే నాకు భయం అన్నాడు. కథ వినమన్నాను. ఆ తర్వాత కథ నచ్చడంతో చేస్తానని చెప్పాడు. సూపర్ నేచురల్, ఊహాతీతమైన అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. హీరో నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీశంకర్, ్రపాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్ డిసెంబరు 1 నుంచి అమేజాన్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎనిమిది ఎపిసోడ్స్గా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ కె. కుమార్ చెప్పిన విశేషాలు. ► ‘దూత’ పూర్తిగా కల్పిత కథ. ‘దూత’ అంటే ఏదైనా సమాచారాన్ని చేరవేసేవాడు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగచైతన్య అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటేనే సవాల్తో కూడుకున్నది. సంచలనం సృష్టించిన ఓ ఘటన తాలూకు వాస్తవాలను సాగర్ ఎలా పాఠకుల ముందు ఉంచాడు? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? అనేది ప్రేక్షకులు అంచనా వేయలేరు. తన కంఫర్ట్ జోన్ నుండి బయటకి వచ్చి, ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రని సవాల్గా తీసుకుని చేశాడు నాగచైతన్య. ►‘దూత’లో మూడు సినిమాలు తీసేంత కథ ఉంది. అందుకే వెబ్ సిరీస్గా తీశాం. పైగా సినిమాగా తీస్తే మన ప్రేక్షకులకు మాత్రమే చేరువ అవుతుంది. ఓటీటీలో ప్రసారం చేయడం ద్వారా ఇతర దేశాల్లోని వారు కూడా మన ఇండియన్ వెబ్ సిరీస్లు చూసే అవకాశం ఉంటుంది. ►షార్ట్ ఫిలిం, వెబ్ ఫిల్మ్, సినిమా.. దేని కష్టం దానికి ఉంటుంది. అయితే సినిమా తీయడం సులభమే.. కానీ, మంచి మూవీ తీయడం చాలా కష్టం. -
ఓటీటీకి వీరప్పన్ జీవితం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబంతో కలిసి ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు చూసేస్తున్నారు. ఆడియన్స్ పల్స్కు తగినట్టుగానే ప్రతివారం కొత్త కంటెంట్తో ఓటీటీలు దూసుకెళ్తున్నాయి. కొత్త కొత్త సిరీస్లు, సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రతివారం ఆసక్తికరమైన వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన కోలీవుడ్ వెబ్ సిరీస్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం. తమిళనాడులో సంచలనంగా మారిన వీరప్పన్ గురించి అందరికీ తెలుసు. ఆయన జీవిత కథనే వెబ్ సిరీస్(డాక్యుమెంటరీ) రూపంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అడవుల్లోకి పారిపోయి దాచుకుని దాదాపు మూడు దశాబ్దాల పాటు స్థానికి ప్రభుత్వాలకు దొరకకుండా తప్పించుకున్న వ్యక్తి వీరప్పన్. ఆయన జీవిత కథ ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కూసే మునిస్వామి వీరప్పన్. ఈ సిరీస్ తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో జీ5లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) టీమ్ చేసిన ఎన్కౌంటర్లో వీరప్పన్ మరణించారు. -
వెబ్ ఎంట్రీ
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్ రివేంజ్ థ్రిల్లర్గా ‘అక్క’ వెబ్సిరీస్ రూపొందుతోంది. ధర్మరాజ్ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్సిరీస్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్ సమాచారం. ‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుంది’’ అనియూనిట్ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘అక్క’. వరుణ్ధావ¯Œ హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. -
హీరోయిన్తో డేటింగ్ రూమర్స్పై స్పందించిన నాగ చైతన్య
‘‘నటుడిగా ఇంకా చాలాపాత్రలు చేయాలి.. నటనపరంగా ఇంకా ఎదగడానికి కృషి చేస్తూనే ఉంటాను. ఇన్నేళ్ల కెరీర్లో జయాపజయాలు చూశాను. అన్నింటినుంచీ ఏదో ఒకటి నేర్చుకున్నాను. అయితే నటుడిగా సంతృప్తి దక్కలేదు. ఇంకా చాలా సాధించాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నేడు (నవంబర్ 23) ఈ హీరో బర్త్డే. నాగచైతన్య హీరో అయి పద్నాలుగేళ్లు అవుతోంది. ఇక ఈ పుట్టినరోజు స్పెషల్ ఏంటంటే.. ‘దూత్’ సిరీస్తో తొలిసారి వెబ్ వరల్డ్లోకి అడుగుపెడుతున్నారు. ఆ విశేషాలు, ఇంకా ఇతర విశేషాలను నాగచైతన్య ఈ విధంగా పంచుకున్నారు. ► ముందుగా బర్త్డే స్పెషల్ గురించి.. బర్త్డే గ్రాండ్గా జరుపుకోవడం ఉండదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో స్పెండ్ చేద్దామనుకుంటున్నా. నేను చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ విడుదలవుతోంది. అలాగే చందు మొండేటి డైరెక్షన్లో చేసే సినిమాకి ‘తండేల్’ టైటిల్ ఫిక్స్ చేసి, లుక్ రిలీజ్ చేశాం. నా బర్త్డే స్పెషల్స్ ఇవే. ► ‘దూత’ సిరీస్ గురించి.. డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. అందుకే మంచి వెబ్ సిరీస్ చేయాలనుకున్నాను. నాకు విక్రమ్ కె. కుమార్ చేసిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘13 బి, 24’, కొంతవరకూ ఆ తరహాలో ఉన్న ‘మనం’ వంటివి చాలా ఇష్టం. ‘24’ సినిమా లాంటి కాన్సెప్ట్ అయితే సిరీస్ చేద్దామనుకున్నాను. విక్రమ్ ఆ తరహాలో ‘దూత’ లాంటి యూనిక్ కాన్సెప్ట్తో వచ్చారు. అయితే వెబ్ సిరీస్ అని చెప్పలేదు. కానీ ఈ కాన్సెప్ట్ని రెండున్నర గంటల్లో చెప్పలేం. అందుకే సిరీస్గా చేశాం. సినిమాకీ, సిరీస్కీ నటనపరంగా వ్యత్యాసం లేదు. కానీ టెక్నికల్గా నాకో కొత్త అనుభవం. ‘దూత’కి సీజన్ 2, సీజన్ 3 ఐడియాలు ఉన్నాయి. ► చందు మొండేటి డైరెక్షన్లో చేసే ‘తండేల్’ సినిమా కోసం ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు... మా టీమ్ మొత్తానికి ఇది స్పెషల్ప్రాజెక్ట్. రెగ్యులర్ షూటింగ్ని డిసెంబర్లో ఆరంభిస్తాం. కానీ ఆరేడు నెలలుగా ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతున్నా. ఈ చిత్రంలో నేను మత్స్యకారుడిపాత్ర చేస్తున్నాను. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ కాబట్టి అవగాహన కోసం శ్రీకాకుళంలోని ఓ గ్రామానికి వెళ్లాం. శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకుంటున్నా. ఫిషర్మేన్గా కనిపించడం కోసం ఫిజికల్గా మేకోవర్ అయ్యాను. అలాగే ఫిషర్మేన్ బాడీ లాంగ్వేజ్ కోసం మూడు నెలలు కృషి చేశాను. ఎప్పుడెప్పుడుషూటింగ్కి వెళదామా అని వేచి చేస్తున్నా. ► ఇంతకుముందు ఏ సినిమాకీ ఇంత వర్కవుట్ చేయలేదు కదా.. ‘తండేల్’ పెద్ద స్పాన్ ఉన్న కథ. అందుకే షూటింగ్ ఆరంభించక ముందే ఎక్కువ టైమ్ కేటాయించాను. చందుతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్గారు, ‘బన్నీ’ వాసుగారు ఈ కథను చాలా నమ్మారు. నా కెరీర్లో పెద్ద బడ్జెట్ మూవీ అవుతుంది. కథ కొంత భాగం ఇండియా, కొంతపాకిస్తాన్లో జరుగుతుంది. ► ఓ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని చందు మీ క్యారెక్టర్ని క్రియేట్ చేశారట... అవును. నేనా వ్యక్తిని కలిసి, మాట్లాడాను. ఓ ఫిషర్మేన్ లైఫ్లో జరిగిన కొన్ని ఘటనలను సినిమాటిక్గా చూపించనున్నాం. ► అక్కినేని ఫ్యామిలీకి ప్రేమకథలు లక్కీ.. ‘తండేల్’ ప్రధానంగా ప్రేమకథా చిత్రం కదా.. అవును. ఈ చిత్రంలో అద్భుతమైన ప్రేమకథ ఉంది. ఈ మధ్యకాలంలో నేను చేసిన చిత్రాల్లో ప్రేమపార్ట్ అంతగా లేదు. ఆ విషయాన్ని ఫీలయ్యాను. అందుకే ఈసారి ప్యూర్ లవ్స్టోరీ చేద్దామనుకున్నాను. ‘తండేలా’ అలాంటి చిత్రమే. ఇక ఈ మధ్య ఓ హీరోయిన్తో మిమ్మల్ని లింక్ అప్ చేసి వార్తలు వస్తున్నాయి.. ఏమంటారు? రానివ్వండి... నోప్రాబ్లమ్ (నవ్వుతూ). ఇలాంటి వాటి గురించి ఏం చెప్పినా.. ఎంత చెప్పినా ఆగవు. ఇక పర్సనల్ స్పేస్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏదైనా చెప్పాల్సినది జరిగితే నేనే చెబుతాను. -
నాగ చైతన్య తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు
-
Vadhuvu OTT Web Series: అప్పుడు చిన్నారి పెళ్లి కూతురు.. ఇప్పుడేమో వధువుగా!
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో ఫేమ్ తెచ్చుకున్న నటి అవికా గోర్. ఆ తర్వాత తెలుగులో ఉయ్యాలా జంపాలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది పాప్ కార్న్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా మరో ఆసక్తికర వెబ్ సిరీస్లో ఓటీటీ అభిమానులను అలరించేందుకు వస్తోంది. హోయ్చాయ్ ఓటీటీలో ఇందు పేరుతో స్ట్రీమింగ్ అయిన బెంగాలీ సిరీస్ను తెలుగులో రీమేక్ చేశారు. వధువు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సిరీస్లో అవికా గోర్, అలీ రెజా, నందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే జేడీ చక్రవర్తి నటించిన దయా థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ థ్రిల్లర్గా వస్తోన్న వధువు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎలాంటి రహస్యాలు ఉంటాయి? అవి బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకవేళ బయటకు వస్తే జరిగే పరిణామాలేంటి? వంటి ఆసక్తికర అంశాలతో వధువు వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)