కొత్త ప్రపంచాన్ని చూస్తారు.. బన్నీ-తివిక్రమ్‌ మూవీపై నిర్మాత కామెంట్‌ | Producer Naga Vamsi Interesting Comments On Allu Arjun Trivikram Fourth Film | Sakshi
Sakshi News home page

బన్నీ-తివిక్రమ్‌ మూవీ: రాజమౌళి కూడా టచ్‌ చేయలేదు.. కొత్త ప్రపంచం సృష్టించబోతున్నాం

Oct 26 2024 11:06 AM | Updated on Oct 26 2024 11:20 AM

Producer Naga Vamsi Interesting Comments On Allu Arjun Trivikram Fourth Film

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప 2 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత మూడేళ్లుగా ఈ సినిమాపైనే బన్నీ ఫోకస్‌ చేశాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజుల కిందటే ప్రకటించారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ లాంటి హ్యాట్రిక్‌ హిట్ల తర్వాత బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రమిది. 

ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నిర్మాత నాగవంశీ తన మాటలతో ఆ అంచనాలను మరింత పెంచేశాడు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూస్తారని ఆయన చెప్పారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్ని-త్రివిక్రమ్‌ మూవీపై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘ప్రస్తుతం త్రివిక్రమ్‌ తన ఫోకస్‌ అంతా ఈ సినిమాపైనే పెట్టాడు. స్క్రిప్ట్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జనవరిలో ఓ స్పెషల్‌ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తాం. మార్చి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఓ కొత్త కథతో రాబోతున్నాం. 

రాజమౌళి సైతం ఇలాంటి జానర్‌ని టచ్‌ చేయలేదు. మంచి విజువల్స్‌ ఉంటాయి. దేశంలో ఎవరూ చూడని సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా సినిమా ఉంటుంది’అని చెప్పారు. నాగవంశీ మాటలతో బన్నీ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా రాబోతుందని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement