Trivikram Srinivas
-
త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
-
అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రకటనలో సడెన్గా కీలక మార్పులు..?
పుష్ప2 విజయంతో అల్లు అర్జున్ ఇమేజ్ భారీగా పెరిగింది. ఈ సినిమా తర్వాత బన్నీ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి..? అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. అయితే, ఈ ప్రాజెక్ట్ తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ విషయంలో సడెన్గా బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కాకుండా అట్లీతో సినిమా చేసేందుకు బన్నీ ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.పుష్ప2 సమయంలోనే అల్లు అర్జున్కు అట్లీ కథ చెప్పాడట. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాశారని తెలిసింది. ఆ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో సినిమా చేసేందుకు అట్లీ డీల్ సెట్ చేసుకున్నాడు.. ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ కావడంతో అట్లీ టీమ్ కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ను మరోసారి కలిసినట్లు టాక్ వస్తుంది. దీంతో అల్లు అర్జున్, అట్లీ సినిమా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అట్లీతో చేసే చిత్రం దాదాపు యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని నెట్టింట వైరల్ అవుతుంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట. సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ నెలలోనే బన్నీ కొత్త సినిమా ప్రకటనపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.అట్లీతో సినిమా కోసం సాయి అభ్యంకర్ అనే కొత్త సంగీత దర్శకుడికి ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్లో ఉన్నారట. స్టార్ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి అభ్యంకర్.. తన టాలెంట్తో ప్రత్యేక గుర్తింపు పొందాడు. దర్శకుడు ఆర్జే బాలాజీ- సూర్య సినిమాకు అభయ్నే సంగీత దర్శకుడు కావడం విశేషం. హీరోయిన్ మీనాక్షి చౌదరితో ఆయన చేసిన ఒక సాంగ్ మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. లోకేశ్ కనగరాజ్ స్టోరీతో వస్తున్న బెంజ్ సినిమాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ మూవీలో ఛాన్స్ దక్కితే మరో కొత్త సంగీత దర్శకుడి పేరు సెన్సేషనల్ కానుంది. -
గెట్ రెడీ.. రంగం సిద్ధం?
-
హిస్టారికల్ స్టోరీలో అల్లు అర్జున్
-
నా హృదయంలో ప్రత్యేక స్థానం ఆ సినిమాకే: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మూవీ విడుదలైన ఐదేళ్లు పూర్తి కావడంతో అల్లు అర్జున్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని పోస్ట్ చేశారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన నటీనటులు, సిబ్బందితో పాటు మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ మూవీ సమయంలో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం బన్నీ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 5 years of #AlaVaikunthapurramuloo! This film will always hold a special sweet place in my heart. A heartfelt thank you to #Trivikram Garu, Chinna Babu Garu, Allu Aravind Garu, brother @MusicThaman, @vamsi84 garu and the entire cast and crew for bringing this magical film to… pic.twitter.com/N0w7lsR8Lq— Allu Arjun (@alluarjun) January 12, 2025 AVPL DAYS 💛 THROWBACK MEMORIES 💛 pic.twitter.com/7Nz904BaH2— Allu Arjun (@alluarjun) January 12, 2025 -
బన్నీ అప్పుడే మొదలు పెట్టేశాడుగా..! త్రివిక్రమ్ సినిమా పనులు మొదలు..!
-
త్రివిక్రమ్పై పూనమ్ మరోసారి సంచలన ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు, సినీ నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని,కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు మాత్రం నిజంగానే పూనమ్కి అన్యాయం జరిగిందంటారు. మరికొంత మంది ఏమో ఫేమ్ కోసమే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారని విమర్శిస్తారు. అయితే పూనమ్ మాత్రం తన పోరాటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని డిమాండ్ చేస్తునే ఉంది. కానీ ‘మా’ మాత్రం పట్టించుకోవట్లేదని పూనమ్ ఫైర్ అవోతుంది.తాజాగా మరోసారి ‘మా’పై తన అసంతృప్తిని వెల్లడిస్తూ పూనమ్ సంచలన ట్వీట్ చేసింది.(చదవండి: డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)‘త్రివిక్రమ్(Trivikram Srinivas)పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. ఇప్పటి వరకు ‘మా’ దానిపై స్పందించలేదు. త్రివిక్రమ్ని ప్రశ్నించడం కానీ అతనిపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తుంది’ అని పూనమ్ ట్వీట్ చేసింది. గతంలో కూడా పూనమ్ ఇలాంటి ట్వీట్స్ చాలానే చేసింది. త్రివిక్రమ్పై ‘మా’లో ఫిర్యాదు చేస్తే సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన త్రివిక్రమ్ని ప్రశ్నించాలని పూనమ్ డిమాండ్ చేసింది.పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025 -
వేసవిలో షురూ
‘పుష్ప 2: ది రూల్’ సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు అల్లు అర్జున్ . అయితే ఆయన నటించనున్న తర్వాతి చిత్రంపై ఫిల్మ్నగర్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేసేందుకు పచ్చజెండా ఊపారు. అయితే ప్రస్తుతం ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి.దీంతో అల్లు అర్జున్ తర్వాతి మూవీ త్రివిక్రమ్తోనే ఉండబోతుందనే విషయం స్పష్టం అవుతోంది. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో...’ వంటి సూపర్హిట్ ఫిల్మ్స్ తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హారిక హాసినీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమాని గత ఏడాది జూలైలో ప్రకటించారు. ఈ సినిమా గురించి సంక్రాంతి సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్నగర్ భోగట్టా. అంతేకాదు.. ఈ మూవీని వచ్చే వేసవిలో సెట్స్పైకి తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారట అల్లు అర్జున్ , త్రివిక్రమ్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
Trivikram: అప్పట్లో నాకు ముప్పై రూపాయలు మాత్రమే వుండే
-
యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్.. మాటల మాంత్రికుడు ఎలా అయ్యాడు? (ఫొటోలు)
-
కొత్త ప్రపంచాన్ని చూస్తారు.. బన్నీ-తివిక్రమ్ మూవీపై నిర్మాత కామెంట్
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత మూడేళ్లుగా ఈ సినిమాపైనే బన్నీ ఫోకస్ చేశాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్తో ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజుల కిందటే ప్రకటించారు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ లాంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రమిది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నిర్మాత నాగవంశీ తన మాటలతో ఆ అంచనాలను మరింత పెంచేశాడు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూస్తారని ఆయన చెప్పారు.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్ని-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ‘ప్రస్తుతం త్రివిక్రమ్ తన ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టాడు. స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జనవరిలో ఓ స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తాం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఓ కొత్త కథతో రాబోతున్నాం. రాజమౌళి సైతం ఇలాంటి జానర్ని టచ్ చేయలేదు. మంచి విజువల్స్ ఉంటాయి. దేశంలో ఎవరూ చూడని సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా సినిమా ఉంటుంది’అని చెప్పారు. నాగవంశీ మాటలతో బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
టాలీవుడ్ దర్శకుడిదే తప్పు.. మానభంగం చేశాడు: పూనమ్ కౌర్
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. ఇప్పుడు మరో షాకింగ్ ట్వీట్ చేసింది. ఓ తెలుగు దర్శకుడు.. ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్నే నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: మరో వివాదంలో నయనతార.. నిర్మాతలు ఎందుకు డబ్బులివ్వాలి?)'ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి, ఆమె కెరీర్ నాశనం చేశాడు. మా(మూవీ ఆర్టిస్ట్ అసియేషన్) జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికింది. అతడు లీడర్గా మారిన నటుడు కాదు. అయితే ఈ విషయంలోకి తనను ఓ నటుడు/రాజకీయ నాయకుడు అనవసరంగా లాగారు' అని పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ పెట్టింది.పూనమ్ ట్వీట్ పెట్టింది కానీ ఒక్కరి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇకపోతే గతంలో దర్శకుడు త్రివిక్రమ్పై తాను మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్లో ఫిర్యాదు చేశానని, కానీ అప్పుడు సరిగా పట్టించుకోలేదనే నిజాన్ని బయటపెట్టింది. తాజా ట్వీట్ చూస్తే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్నే పరోక్షంగా టార్గెట్ చేసిందా అనిపించింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' గేమ్ కాదు ట్రామా?) -
సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ సమంత రీసెంట్ టైంలో సినిమాలు చేయనప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నీమధ్య తెలంగాణ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా సామ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అదలా ఉంచితే చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చింది. ఆలియా భట్ 'జిగ్రా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. దీనికి హాజరైన సామ్పై త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా)సమంత ఏం చెప్పింది?సినిమా టీమ్కి విషెస్ చెప్పింది. అలానే హీరోయిన్లుగా తమకు ఎంతో బాధ్యతగా ఉంటుందని, ప్రతి అమ్మాయి కథలో వాళ్లే హీరోలని చెప్పింది. చాలారోజుల తర్వాత మీ ముందుకు వచ్చానని అభిమానులని ఉద్దేశించి చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులు తన కుటుంబమని క్లారిటీ ఇచ్చింది.త్రివిక్రమ్ టీజింగ్ఇదే ఈవెంట్కి హాజరైన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ఏ మాయ చేశావే' సినిమా నుంచే సమంత హీరో అని, ఆమెకు వేరే ఏం అక్కర్లేదని, ఆమెనే ఓ శక్తిని ఆకాశానికెత్తేశాడు. ముంబైలోనే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా రండి, మీరు చేయడం లేదని మేం రాయడం లేదు, మీరు నటిస్తానంటే మేం కథలు రాస్తామని అన్నారు. 'అత్తారింటికి దారేది' లాగా సమంత కోసం హైదరాబాద్ రావడానికి దారేది అని అనలేమో అని త్రివిక్రమ్ చెప్పారు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్) -
త్రివిక్రమ్ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సినీ నటి పూనమ్ కౌర్ గొడవ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా అటు త్రివిక్రమ్, ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఆమె వరుస ట్వీట్స్ చేస్తారు. వారిద్దరు కలిసి తనకు చేసిన అన్యాయం గురించి బహిరంగానే వెల్లడిస్తారు. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని, వారి కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ. అయితే ఆమె ట్వీట్స్పై అటు త్రివిక్రమ్ కాని, ఇటు పవన్ కాని స్పందించలేదు కానీ, ఇండస్ట్రీ ప్రముఖుల్లో కొంతమంది పూనమ్కి నిజంగానే అన్యాయం జరిగిందని అంటారు. మరికొంతమంది ఏమో ఫేమ్ కోసమే వారిపై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అంటున్నారు. సినీ నిర్మాత చిట్టి బాబు కూడా పూనమ్ ట్వీట్స్పై స్పందించాడు. (చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందంటూ మాల్వీ మల్హోత్రా)తాజాగా ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..‘పూనమ్ ఫిర్యాదు ఇవ్వమని పిలిస్తే రాదు కానీ.. పిచ్చి పిచ్చిగా ట్వీట్స్ వేస్తారని’అన్నారు ఏం జరిగిందో కమిటికీ ఫిర్యాదు చేస్తే తెలుస్తుంది కానీ..ఇలా ట్వీట్స్ చేస్తే ఏం లాభం’అని చిట్టి బాబు అన్నారు. నిర్మాత వ్యాఖ్యలపై పూనమ్ కౌర్ మండి పడింది. మీకు త్రివిక్రమ్ను ప్రశ్నించే దమ్ముందా? అని నిలదీసింది.‘మీరు త్రివిక్రమ్ను ప్రశ్నించరు.. ప్రశ్నించలేరు.. నేను మీలా వెన్నుమొక లేని దాన్ని అయితే కాను. నా మీద కామెంట్ చేయడం కాకుండా.. త్రివిక్రమ్ను అడిగే దమ్ముందా? అంటూ నిర్మాతను ప్రశ్నించింది. దీనిపై చిట్టి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. It’s trivikram Srinivas who doesn’t and will not be questioned- I am not spineless like these men who run their show to project their fake masculinity- I dare him to question the director rather than commenting on me .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2024 -
త్రివిక్రమ్ పై పిర్యాదు చేశా.. పరిష్కారం ఏది ..?
-
KSR Live Show: దర్శకుడు త్రివిక్రమ్ పూనమ్ కౌర్ ట్వీట్
-
పూనమ్ కౌర్ ట్వీట్ పై కొమ్మినేని కామెంట్స్..
-
ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్తో హీరోయిన్ పూనమ్ కౌర్ గొడవ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి ఉన్నదే. వీలు చిక్కినప్పుడల్లా గురూజీపై పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.హైదరాబాద్లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్.. తెలుగులో పలు సినిమాలు చేసింది. అయితే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్తో ఈమెకు ఏం గొడవ ఉందో తెలీదు గానీ ఎప్పటికప్పుడు వీళ్లని విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవొద్దు అని ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?)ఇది పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.మరి పూనమ్ కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్.. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్లో ఫిర్యాదు చేసేంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో?(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో కొడుకులు అరెస్ట్)Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
జూ. ఎన్టీఆర్ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిన స్టార్స్ వీరే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి విపత్తు సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు టాలీవుడ్ చిత్రపరిశ్రమ నుంచి పలువురు ముందుకొస్తున్నారు. మొదట జూనియర్ ఎన్టీఆర్ రూ. 1 కోటి సాయం ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.సిద్దూ జొన్నలగడ్డ సాయంటాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా సాయం ప్రకటించారు. వరద బాధితులకు తన వంతుగా రూ. 30 లక్షలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు రూ. 15లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అందిస్తున్న డబ్బు కొంతమందికైనా ఏదో ఒకవిధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల వల్ల తెలుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని ఆయన కోరారు.త్రివిక్రమ్, నాగవంశీ సాయంభారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు. తెలంగాణకు రూ. 25లక్షలు, ఏపీకి రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు తమను ఎంతగానో కలచి వేశాయని వారు చెప్పుకొచ్చారు. బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక నోట్ విడుదల చేశారు.ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ప్రకటించారు. ఆపై యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.దర్శకుడు వెంకీ అట్లూరి కూడా'సార్', 'తొలిప్రేమ' సిినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు వెెంకీ అట్లూరి కూడా తన వంతు సాయం అందజేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.5 లక్షలు విరాళమిచ్చినట్లు ప్రకటించాడు.మహేశ్ బాబు కోటి రూపాయల విరాళం..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరద బాధితుల సాయం అందించేందుకు ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆపదలో ఉన్న వారిని అదుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మహేశ్ బాబు కోరారు.In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024హీరోయిన్ విరాళం.. టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించారు. తన వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.2.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు ట్వీట్ చేశారు. త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి…— Ananya Nagalla (@AnanyaNagalla) September 3, 2024 హీరో నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదల వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.50 లక్షలు విరాళం అందించారు. రెండు రాష్ట్రాల్లో అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
తారక్ కథతో వస్తున్న బన్నీ.. మైథాలజీ మూవీతో మాంత్రికుడు...
-
Trivikram : అల్లు అర్జున్ తో అదిరిపోయే మూవీ పిక్స్..|
-
తిరుమలకు కాలినడకన చేరుకున్న టాలీవుడ్ డైరెక్టర్..!
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తన భార్య సౌజన్యతో కలిసి తిరుమల కొండపైకి చేరుకున్నారు. రేపు ఉదయం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. -
ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటున్న త్రివిక్రమ్.. కారణాలు ఇవే...
-
నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టాలు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే అంతకు మించిన ఇబ్బందులు ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది మోసపోతుంటారు కూడా. ఇప్పుడు అలాంటి ఓ అనుభవాన్నే తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా బయటపెట్టింది. ఎన్టీఆర్ 'అరవింద సమేత' విషయంలో తనని ఎలాంటి పరిస్థితి ఎదురైందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈషా చెప్పుకొచ్చింది.'త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో మీరు ఒకరు అని అన్నారు. అయితే నేను మెయిన్ లీడ్గా మాత్రమే చేద్దామనుకుంటున్నానని, తొలుత నో చెప్పేశాను. కానీ త్రివిక్రమ్ కథ మొత్తం చెప్పి లీడ్స్లో ఓ క్యారెక్టర్ అని అన్నారు. సరే చూద్దాములే అని ఓకే చెప్పేశా. షూటింగ్కి వెళ్లే ఒక్క రోజు ముందు ఓకే చెప్పాను. మొదటిసారి నేను పెద్ద సినిమా చేశా. దాంతో అంతా కొత్తగా అనిపించింది. షూటింగ్ జరిగినన్నీ రోజులు హ్యాపీగానే ఉంది.'(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్.. జీవితంలోకి స్పెషల్ పర్సన్)'అలానే సినిమా విడుదలకు ముందు నన్ను సెకండ్ లీడ్గా అనౌన్స్ చేస్తానని అన్నారు. కానీ అలా చేయలేదు. ఒకవేళ చేసుంటే నాకు హెల్ప్ అయ్యేది. అయితే ఈ విషయం మా మేనేజర్ని కూడా అడిగా. కనుక్కోమన్నాను. షూట్ అయిపోయింది. రిలీజ్ అయిపోయింది. కానీ నేను హ్యాపీగా లేను. సినిమా విషయంలో కొంచెం బాధపడ్డాను. కొన్ని సీన్స్ ఎడిటింగ్లో తీసేశారు. ఎన్టీఆర్తో సాంగ్ అన్నారు. అది కూడా క్యాన్సిల్ అయింది. ఆ సినిమాకు నాకున్న హ్యాపీనెస్ ఒకటే తారక్, త్రివిక్రమ్తో కలిసి పనిచేయడం' అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈ ఇంటర్వ్యూలో ఎవరి గురించి నెగిటివ్గా చెప్పలేదు గానీ హీరోయిన్ ఛాన్స్ అని తనని మోసం చేసిన విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది. చాలా సినిమాల విషయంలో ఎలాంటివి జరుగుతున్నాయో బయటపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గుంటూరు కారం'లో కూడా ఇలానే మీనాక్షి చౌదరికి రెండే సీన్లలో చూపించారు. బహుశా ఈమెకి కూడా ఈషా లాంటి అనుభవమే ఎదురై ఉంటుంది.(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ) -
పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఫిక్సయిపోయిందా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం 'పుష్ప 2'తో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మంచి హై ఇచ్చే విజువల్స్.. అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. ఇప్పుడు బన్నీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ 'పుష్ప' మూవీని 2021 చివర్లో కేవలం తెలుగు వరకే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పెద్దగా ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఉత్తరాదిలో మాత్రం ప్రేక్షకులు 'పుష్ప' దెబ్బకు మెంటలెక్కిపోయారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. (ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్) దీంతో 'పుష్ప 2' కాస్త లేట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉండిపోయింది. త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి శ్రీను.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడనిపిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే పుకార్లకు చెక్ పడినట్లయింది. ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన త్రివిక్రమ్ ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా ఏం చేస్తాడోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) Wishing an amazing actor with great perseverance & dedication to achieve anything on and off screen, the stylish Icon Star of Indian cinema and National Award winner, Our @alluarjun garu a very Happy Birthday ❤️#HappyBirthdayAlluArjun 🌟 Can't wait to work with you again, sir.… pic.twitter.com/BhLfbaynwB — Haarika & Hassine Creations (@haarikahassine) April 8, 2024