ఆన్‌లైన్‌ క్లాసులు: 40 గ్రామాల పేద విద్యార్థినిలకు సోనూ సాయం | Sonu Sood Distributes Smartphones To Lucknow 40 Villages Female Students | Sakshi
Sakshi News home page

40 గ్రామాల విద్యార్థినిలకు సోనూసూద్‌ స్మార్ట్‌ఫోన్లు పంపిణీ

Apr 2 2021 7:32 PM | Updated on Apr 2 2021 8:45 PM

Sonu Sood Distributes Smartphones To Lucknow 40 Villages Female Students - Sakshi

సోనూసూద్‌ పేరు వింటే చాలు ఎక్కడ ఆపదలో ఉన్నావారిని ఆదుకుంటున్నారో అనేలా అయిపోయింది. కరోనా కాలం నుంచి కష్టాల్లో ఉన్నావారికి సాయం చేస్తూ జనం గుండెల్లో రియల్‌ హీరోగా నిలిచిపోయారు. తాజాగా ఆయన

సోనూసూద్‌ పేరు వింటే చాలు ఎక్కడ ఆపదలో ఉన్నావారిని ఆదుకుంటున్నారో అనేలా అయిపోయింది. కరోనా కాలం నుంచి కష్టాల్లో ఉన్నావారికి సాయం చేస్తూ జనం గుండెల్లో రియల్‌ హీరోగా నిలిచిపోయారు. తాజాగా ఆయన సాయంలో మరో ముందడుగు వేశారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాస్‌లకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్లు లేక పాఠాలకు దూరమవుతున్నారు. అలాంటిని వారి గురించి ఏ రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 

విద్యార్థులేమో పాఠాలు వినడానికి ఎలాంటి దారి దొరకగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సోను నేనున్నా చేయుత అందించారు. ఆయన ఉదారతను చాటుకుంటు లక్నోలో సమీప గ్రామాల్లోని పేద విద్యార్థినిలకు స్మార్ట్‌ ఫోన్లు అందజేశారు. 40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థినులకు ఆయన మొబైల్‌ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఫోన్లు అందుకున్న ఆ విద్యార్థినిలంత సోనూకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement