smart phones
-
స్మార్ట్ఫోన్లు, టీవీల ధరలు ఏ మాత్రం తగ్గుతాయి?
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో కీలకమైన ఎలక్ట్రానిక్ విడి భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రకటించింది. దీంతో స్మార్ట్ఫోన్లు, టీవీల ధరలు తగ్గే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను సమర్పిస్తూ.. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, దిగుమతి పరికరాలపై ధరల భారాన్ని తగ్గించడం లక్ష్యంగా అనేక చర్యలను వివరించారు.ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన బడ్జెట్ నిర్ణయాల్లో మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్ (PCBA)పై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించడం ఒకటి. ఈ చర్య భారతదేశంలో ఇంకా తయారు చేయని కొన్ని హై-ఎండ్ ఐఫోన్ మోడల్లతో సహా దిగుమతి చేసుకునే స్మార్ట్ఫోన్లు, ఉపకరణాల ధరను తగ్గిస్తుంది. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో 2018లో ఈ సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. ఇప్పుడు తాజా తగ్గింపు ఇంపోర్టెడ్ స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఒక అడుగుగా పరిగణించవచ్చు.దేశ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను మెరుగుపరచగలదంటూ పరిశ్రమ నాయకులు ఈ చర్యను స్వాగతించారు. మొబైల్ ఫోన్లు, పీసీబీఏ, ఛార్జర్లపై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని తగ్గించడంతోపాటు స్మార్ట్ఫోన్ తయారీకి అవసరమయ్యే ఇన్పుట్లు, ముడి పదార్థాలపై మినహాయింపులను ఇస్తే దేశీయ ఉత్పత్తి వాతావరణం మెరుగుపడుతుందని షావోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ బి పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్లను మరింత చవకగా మార్చడానికి ఇది సానుకూల దశ అని ట్రాన్షన్ ఇండియా సీఈవో అరిజీత్ తలపత్రా ప్రశంసించారు.పెద్ద తగ్గింపు ఉండకపోవచ్చు..కస్టమ్స్ సుంకం తగ్గింపు కచ్చికంగా తయారీదారులకు ఖర్చులను తగ్గించగలదు. అయితే రిటైల్ ధరలపై దాని ప్రత్యక్ష ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధరలో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చని కౌంటర్పాయింట్ రీసెర్చ్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అభిప్రాయపడుతున్నారు. సుంకం తగ్గింపు స్మార్ట్ఫోన్ ధరలలో 1-2 శాతం స్వల్ప తగ్గుదలకు దారితీయవచ్చు అంటున్నారు. అయితే వినియోగదారులకు అందించే ప్రయోజనం ఎంతనేది ఆయా తయారీదారులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పైపెచ్చు తక్కువ ధర స్మార్ట్ఫోన్లపై ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉంటున్నాయని, కాబట్టి ధరలో చెప్పుకోదగ్గ తగ్గింపు కనిపించకపోవచ్చు అంటున్నారు. -
చిన్నపిల్లల చేతికి ఫోన్ ఇవ్వడం నిషేధం!
పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్.. ఈ కాలంలో ఇదొక యూనివర్సల్ సమస్య. నెలల పసికందు నుంచి బడులకు వెళ్లే పిల్లల దాకా సెల్ఫోన్ వ్యసనానికి బానిసలైపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. తల్లీదండ్రుల సమక్షంలోనే పోను పోను ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. అయితే.. ఈ పరిస్థితులను మార్చేందుకు ఇక్కడ ఓ దేశం నడుం బిగించింది.ఎక్కువసేపు స్క్రీన్ టైం(అది సెల్ఫోన్లు, టీవీలు, ఇతరత్రా స్మార్ట్ గాడ్జెట్స్ కావొచ్చు) వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. మరీ చిన్నపిల్లల్లో కంటిచూపు మొదలు.. మాట్లాడడం సహా చాలా అంశాలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. అలాగే బడీడు పిల్లలపైనా ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పిల్లలకు అలవర్చే ఉద్దేశంతో సింగపూర్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.స్కూళ్లలోనే కాదు ఇంటి పట్టున ఉంటున్న పిల్లల స్క్రీన్ టైం విషయంలో కఠినంగా వ్యవహరించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి.దీనిప్రకారం..18 నెలల వయసున్న పిల్లల విషయంలో ఫోన్ వాడకం నిషేధం18 నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు పరిమితంగా స్క్రీన్ టైం ఉండాలిఅది కూడా పాఠాలు బోధించడం, నేర్చుకోవడం మాత్రమే!.తినేటప్పుడు నో సెల్ఫోన్స్, నో టీవీలుఆఖరికి బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ టైంకు కూడా అనుమతి లేదు. అంటే.. ఖాళీగా టీవీని ఆన్ చేసి కూడా వదిలేయకూడదుమూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు రోజులో గరిష్టంగా గంటసేపు మాత్రమే స్క్రీన్ టైం ఉండాలి(స్కూల్వర్క్ మినహాయించి)ఏడు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు గరిష్టంగా రెండు గంటలు ఉండొచ్చు(స్కూల్వర్క్ మినహాయించి)శిక్ష ఉంటుందా?అవును.. ఒకవేళ పరిమిత సమయానికి మించి పిల్లలు ఫోన్లు వాడినట్లు కనిపిస్తే.. అధికారులు వాటిని స్వాధీనపర్చుకుంటారు. పదే పదే అలా జరిగితే ఎక్కువ రోజులు తమ స్వాధీనంలో ఉంచుకుంటారు. అది శ్రుతి మించితే శాశ్వతంగా సీజ్ చేసేస్తారు. కాబట్టి, స్క్రీన్ టైం విషయంలో పిల్లలను అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరం తల్లిదండ్రులకే ఉంది.పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్లు, అందునా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడకాన్ని నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ, సామాజిక & కుటుంబ సంక్షేమాభివృద్ధి శాఖ సంయుక్తంగా ఈ ఆదేశాలను జారీ చేశాయి. Grow Well SG ప్రణాళికలో భాగంగా ఈ ఆలోచన అమలు చేయబోతోంది. చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, కుటుంబ సభ్యులతో ఇంటెరాక్షన్ లాంటి యాక్టివిటీస్ను పెంపొందించేందుకే ఈ ప్లాన్ను తెరపైకి తీసుకొచ్చారు. చిన్నపిల్లలకే కాదు.. ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించే పిల్లలకూ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే.. తరగతి గదులకు ఫోన్లను అనుమతించకూడదు. వాళ్ల ఫోన్లను స్కూల్ నిర్వాహకులు తమ ఆధీనంలో ఉంచుకోవాలి. తద్వారా ఫోన్ల వినియోగాన్ని తగ్గించడంతో పాటు తరగతి గదిలో వాళ్ల దృష్టి కేవలం పాఠాల మీద, నేర్చుకోవడం మీదే ఉంటుంది.ప్రస్తుతానికి 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఈ మార్గదర్శకాలకు ప్రవేశపెడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో టీనేజర్లకు విస్తరించే ఆలోచనలో ఉందట. తద్వారా స్మార్ట్ఫోన్ల అతి వినియోగం వల్ల కలిగే దుషప్రభావాల నుంచి భావితరాలను బయటపడేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
2025లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు.. వివిధ ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది వివరంగా తెలుసుకుందాం.మోటరోలా ఎడ్జ్ 50 నియోమోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo) ధర రూ. 20,000 నుంచి రూ. 23,000 మధ్య ఉంది. ఇది 256 జీబీ స్టోరేజితో ఒకే వేరియంట్ రూపంలో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, లెదర్ బ్యాక్ ప్యానెల్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్ఫోన్ ఐపీ68 రేటింగ్ పొందింది. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంది.వన్ప్లస్ నార్డ్ 4వన్ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4) ధర రూ. 29,999. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3, 120హెచ్జెడ్ అమోలెడ్ డిస్ప్లే, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వంటి వాటితో పాటు 5500 యాంపియర్ బ్యాటరీతో 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.వన్ప్లస్ నార్డ్ సీఈ4వన్ప్లస్ (OnePlus) కంపెనీకి చెందిన నార్డ్ సీఈ4 కూడా రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఓ బెస్ట్ స్మార్ట్ఫోన్. ఇది ఇప్పుడు రూ. 23,000 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ను కలిగి.. 256 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ పొందుతుంది.ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ మొబైల్ బేస్ వేరియంట్ ధర మార్కెట్లో రూ. 28,000 (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్). ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ కలిగి, 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఈ ఫోన్ లెదర్ ఫినిషింగ్ పొందుతుంది. కాబట్టి ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కాబట్టి ఇది ఇతర వేరియంట్ల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో రూ.27,000 వద్ద అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7350 ప్రో చిప్సెట్, డ్యూయెల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. మంచి డిజైన్ కలిగిన ఈ ఫోన్ ట్రాన్స్పరెంట్ బ్యాక్, గ్లిఫ్ లైటింగ్ ఇంటర్ఫేస్ కూడా పొందుతుంది.పైన చెప్పిన ఇది మొబైల్స్ మాత్రమే కాకుండా 30వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 7ఏ, రెడ్మీ నోట్ 14 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, ఐకూ జెడ్9ఎస్ ప్రో 5జీ, హానర్ 200 వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!మొబైల్ ధరలు మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, స్టోరేజ్ ఆప్షన్ వంటి వాటిమీద మాత్రమే కాకుండా.. కొనుగోలు చేసే ప్లాట్ఫామ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం గమనించవచ్చు. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీకు మరింత తగ్గింపులను కూడా పొందే అవకాశం ఉంటుంది. -
బెస్ట్ గేమింగ్ ఫోన్స్: ధర రూ.15000 కంటే తక్కువే..
భారతీయ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే వీటి కోసం భారీ మొత్తంలో వెచ్చించాలంటే కొందరు తప్పకుండా వెనుకడుగు వేస్తారు. అయితే ఈ కథనంలో రూ. 15,000లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ ఫోన్లను గురించి వివరంగా తెలుసుకుందాం.సీఎంఎఫ్ ఫోన్ 1: సీఎంఎఫ్ అనేది నథింగ్ సబ్ బ్రాండ్. రూ.14,999 వద్ద లభించే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో 6జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం గేమ్ ఆదుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మోటో జీ64: మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో గేమింగ్ ఫోన్ మోటో జీ64. దీని ధర కూడా రూ.14,999 మాత్రమే. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025తో పాటు 8జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 6000 mAh కలిగిన ఈ ఫోన్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. తక్కువ ధరలో గేమింగ్ ఫోన్ కోసం ఎదురు చూసేవారికి దీనిని పరిశీలించవచ్చు.పోకో ఎక్స్6 నియో: రూ.12,999 వద్ద లభిస్తున్న.. పోకో ఎక్స్6 నియో ఫోన్ కూడా తక్కువ ధరలో లభించే ఉత్తమ గేమింగ్ ఫోన్. ఇది 8 జీబీ రామ్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ పొందుతుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. సుదీర్ఘ గేమింగ్ సెషన్ల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్ను ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది.రెడ్మీ 13 5జీ: రెడ్మీ 13 5జీ ధర రూ.14,999. ఇది వినియోగదారులకు లేటెస్ట్ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి పెద్ద డిస్ప్లే పొందుతుంది. ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో 6 జీబీ రామ్ పొందుతుంది. అత్యుత్తమ పనితీరును అందించే ఈ ఫోన్ 5030 యాంపియర్ బ్యాటరీతో వస్తుంది.ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్: రూ. 15వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే గేమింగ్ ఫోన్లలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఒకటి. దీని ధర రూ. 13999. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో 8జీబీ రామ్ పొందుతుంది. శక్తివంతమైన ఈ స్మార్ట్ఫోన్.. మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. -
రూ.6000 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ఇక్కడ చూడండి
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్ఫోన్ల దగ్గర నుంచి రూ. 6వేలు ధర వద్ద లభించే ఫోన్ల వరకు ఉన్నాయి. ఈ కథనంలో ఆరువేల రూపాయల ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8)మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8' ధర కేవలం రూ.6,699 మాత్రమే. బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే. ఇది రూ. 6వేలకు లభిస్తుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, రెండు కెమెరాలు మొదలైనవి ఉంటాయి. ఇది ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్ పొందుతుంది.ఐటెల్ ఆరా 05ఐ (Itel Aura 05i)రూ.6000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఐటెల్ ఆరా 05ఐ ఒకటి. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. దీని ధర రూ. 5749 మాత్రమే. మల్టిపుల్ కెమెరా ఆప్షన్స్ ఇందులో చూడవచ్చు.రెడ్మీ ఏ2 (Redmi A2)రూ.5669 వద్ద లభించే రెడ్మీ ఏ2 కూడా ఆరు వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్ఫోన్లో లభిస్తుంది. -
వ్యవసాయ కుటుంబాలు వెరీ స్మార్ట్!
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాలతో పోలిస్తే వ్యవసాయ కుటుంబాలకే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లున్నాయని నాబార్డు సర్వే వెల్లడించింది. గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, ఆయా కుటుంబాలకు గల గృహాపకరణాలు, వారి జీవన ప్రమాణాల స్థాయిని తెలియజేసేందుకు నాబార్డు 2021–2022 వ్యవసాయ సంవత్సరంలో సర్వే నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కుటుంబాల్లో 98.3 శాతం వ్యవసాయ కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లుండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 96.8 శాతమే స్మార్ట్ ఫోన్లున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో టెలివిజన్ సౌకర్యం కూడా వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉండటం గమనార్హం. స్కూటర్, మోటార్ సైకిళ్లు కూడా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉన్నాయి. కార్లు మాత్రం వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకు తక్కువగా ఉన్నాయని సర్వే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఉన్న గృహోపకరణాలు వారి జీవన శైలిని మార్చేందుకు దోహదపడుతు న్నాయని సర్వే వెల్లడించింది. – సాక్షి, అమరావతి -
పాపం కంటిపాపలు
తల్లిదండ్రులకు కంటిపాపలైన చిన్నారుల్లో కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. సగటున ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు హ్రస్వదృష్టి (దూరంలోని వస్తువులు సరిగా కని్పంచని) సమస్యతో బాధపడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషణ ఒకటి హెచ్చరించింది. ఆసియాలోనైతే సమస్య మరీ దారుణంగా ఉంది. జపాన్లో ఏకంగా 85 శాతం, కొరియాలో 73 శాతం మంది బాలలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీలో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల పరిధిలోని 50కి పైగా దేశాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచి్చనట్టు పేర్కొంది. అధ్యయనంలో భాగంగా 50 లక్షలమందికి పైగా బాలలు, టీనేజర్లను పరీక్షించారు. స్కూలు పుస్తకాలతో కుస్తీకి తోడు స్క్రీన్ సమయం విపరీతంగా పెరగడం, ఆరుబయట గడిపే సమయం తగ్గడం పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోట్లాది మంది పిల్లల కంటిచూపు బాగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. హ్రస్వదృష్టి సాధారణంగా స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టే దశలోనే మొదలవుతుంది. కళ్ల ఎదుగుదల ఆగిపోయేదాకా, అంటే 20 ఏళ్లొచ్చేదాకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. సగం యువతకు సమస్యే → ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మంది బాలలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. → 1990 నుంచి 2023 మధ్యకాలంలోనే సమస్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. → పిల్లల్లో హ్రస్వదృష్టి ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఏకంగా ఏడు రెట్లు తక్కువగా ఉండటం విశేషం. → ఉగాండాలో అతి తక్కువగా కేవలం ఒక్క శాతం మంది పిల్లల్లో మాత్రమే హ్రస్వదృష్టి నమోదైంది. → ఆఫ్రికా దేశాల్లో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయస్సులో ప్రారంభమ తుంది. పైగా పిల్లలు ఆరుబయట ఎక్కువగా గడుపుతున్నారు. దాంతో అక్క డ బాలలు, యువకుల్లో సమస్య తక్కువగా ఉంది. → జపాన్లో ఏకంగా 85%, దక్షిణ కొరియాలో 73% పిల్లలకు హ్రస్వదృష్టి ఉంది. → చైనా, రష్యాల్లో 40 % కంటే ఎక్కువగా, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో 15 శాతానికి పైగా పిల్లల్లో సమస్య ఉంది. → మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో 2050 నాటికి ఏకంగా 69 శాతం మంది హ్రస్వదృష్టి బారిన పడతారు. → అప్పటికి ప్రపంచ యువతలో కనీసం సగానికి సగం ఈ సమస్యను ఎదుర్కొంటారు. → వర్ధమాన దేశాల్లో 2050 నాటికి 40% మంది దీని బారిన పడే అవకాశముంది. → పిల్లలను రెండేళ్ల వయసులోనే బడిబాట పట్టించే సింగపూర్, హాంకాంగ్ వంటిచోట్ల సమస్య విస్తరిస్తోంది. → కోవిడ్ లాక్డౌన్ సమయంలో బాలల్లో హ్రస్వదృష్టి సమస్య బాగా పెరిగింది. → కోట్లాది మంది ఇళ్లకే పరిమితమై స్మార్ట్ ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడటం దీనికి ప్రధాన కారణం. అమ్మాయిల్లోనే ఎక్కువ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే హ్రస్వదృష్టి ఎక్కువగా కని్పస్తున్నట్టు అధ్యయనం తేలి్చంది. ‘‘అబ్బాయిలతో పోలిస్తే ఎదిగేక్రమంలో వాళ్లు ఇంట్లో గానీ, స్కూల్లో గానీ ఆటలపై, ఆరుబయట, గడిపే సమయం తక్కువ. వీటికితోడు ఆహారపు అలవాట్లు తదితరాల వల్ల చాలా చిన్నవయసులోనే రజస్వల అవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారిలో చాలావరకు టీనేజ్లోనే హ్రస్వదృష్టి బారిన పడుతున్నారు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ కెపాసిటీ అదుర్స్! (ఫొటోలు)
-
‘స్మార్ట్’గా దోపిడీ
దేశంలో సైబర్ మోసాలు వణుకు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్వహించే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఏకంగా 7.40 లక్షల ఫిర్యాదులు నమోదవడం సైబర్ ముప్పు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఫిర్యాదుల ప్రకారం రూ.1,750 కోట్లు సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురయ్యాయి.ఆన్లైన్ పెట్టుబడి మోసం, గేమింగ్ యాప్లు, అల్గారిథమ్ మానిప్యులేషన్లు, అక్రమ రుణ యాప్లు, అశ్లీల వీడియోలతో బెదిరింపులు, ఓటీపీ స్కామ్లలో అమాయకులు చిక్కుకుని ఆరి్థకంగా నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్, ప్రభుత్వ, బ్యాంకు అధికారులుగా నటిస్తూ ఆర్థిక లావాదేవీల వివరాల సేకరణ, ఆన్లైన్ టాస్క్ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఫలితంగా 2019 నుంచి 2024 వరకు సైబర్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. –సాక్షి, అమరావతిమే నెలలో రోజుకు 7 వేల ఫిర్యాదులు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నివేదిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో రోజుకు సగటున 7 వేల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది 2021–2023 మధ్య కాలంతో పోలిస్తే 113.7 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫిర్యాదుల్లో 85 శాతం ఆర్థిక ఆన్లైన్ మోసానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఒక్క 2023లోనే ఐ4సీ డేటా ప్రకారం.. లక్షకుపైగా ఆన్లైన్లో పెట్టుబడి మోసాలను గుర్తించారు.ఇక డిజిటల్ అరెస్ట్ల (వీడియో కాల్స్ స్కామ్లు) ఫలితంగా 2024 తొలి నాలుగు నెలల్లోనే 4,599 కేసులు నమోదవగా.. బాధితులు రూ.120 కోట్ల మేర నష్టపోయారు. 20 వేలకు పైగా ట్రేడింగ్ స్కామ్లు నమోదవగా.. సైబర్ నేరగాళ్లు రూ.1,420 కోట్లు కాజేశారు. ఇక 62,687 ఆన్లైన్ పెట్టుబడి మోసాల కేసుల్లో రూ.222 కోట్లు, డేటింగ్ యాప్ల వలలో 1,725 కేసుల్లో రూ.13.23 కోట్లు సైబర్ మోసాలకు పాల్పడ్డారు.సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం ⇒ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న చాలామంది సైబర్ నేరగాళ్లు ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. పుర్సాట్, కోహ్కాంగ్, కంబోడియాలోని సిహనౌక్విల్లే, మయన్మార్లోని మైవాడ్డీ, థాయ్లాండ్ వంటి ప్రాంతాల నుంచి ఈ ముఠాలు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ⇒ సైబర్ మోసాల కట్టడికి ఐ4సీ.. నాలుగు నెలల్లో దాదాపు 3.25 లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. 5.30 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ⇒అదనంగా సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ 3,401 సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపులను డీయాక్టివేట్ చేసింది. ⇒గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను నమ్మొద్దు. సులభంగా డబ్బు సంపాదన, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ ఇచ్చే అవకాశాలను విశ్వసించవద్దు. ⇒ అధికారిక చానల్స్ ద్వారా ఉద్యోగ ఆఫర్లు ప్రామాణికతలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి ⇒అవసరమైతే తప్ప సురక్షితమైన వెబ్సైట్లో మాత్రమే సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలి. ⇒ ఏదైనా అనుమానిత సైబర్ స్కామ్ గుర్తిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్కు నివేదించాలి. తక్షణ సహాయం కోసం 1930కి కాల్ చేయాలి.సైబర్ ఫిర్యాదుల్లో పెరుగుదల ఇలా.. 2019 26,049 2020 2,57,777 2021 4,52,414 2022 9,66,790 2023 15,56,218 2024 7,40,957 (తొలి నాలుగు నెలల్లోనే) -
పబ్లిక్ ప్రాంతాల్లో చార్జింగ్ పోర్టులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ప్రయాణాల సమయంలో మొబైల్ చార్జింగ్ అయిపోయినా.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. వంటి బహిరంగ ప్రాంతాల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి, డేటా తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్యూస్ జాకింగ్కు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా www.cybercrime. gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏమిటీ జ్యూస్ జాకింగ్..? చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్లను యూజర్కు తెలియకుండా ఇన్స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడే వారికి డేటా తస్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ♦ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. ♦ చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. ♦అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమం. ♦ మొబైల్ ఫోన్లకు స్క్రీన్లాక్ తప్పకుండా పెట్టుకోవాలి. ♦ వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. -
షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్లెన్నో ఊహించగలరా?
‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్ అంటే ఫ్యాన్స్కు పూనకాలే. బ్లాక్ బస్టర్మూవీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, ఖరీదైన బంగ్గాలు, లగ్జరీ కార్లు..అబ్బో.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ పెద్దదే. 1980లలో తన కెరీర్ను ప్రారంభించింది మొదలు అత్యంత ప్రజాదరణతో వెండితెరను ఏలుతున్న స్టార్ హీరో. . పఠాన్, జవాన్ , డంకీ మూవీలతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలి బ్లాక్ బస్టర్మూవీ జవాన్లో షారుఖ్ ఖాన్ పట్టుకున్న ఫోను మొదలు తమ అభిమాన హీరోకున్న ఫోన్లు ఎన్ని అనేది చర్చకు దారితీసింది. షారుఖ్ ఖాన్ వద్ద 17 ఫోన్లు షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్ల సంఖ్యను మీరు ఊహించగలరా? అక్షరాల 17 ఫోన్లు అట. షారూఖ్ కరీర్లో ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన , వివేక్ వాస్వాని స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. సిద్ధార్థ్ కన్నన్తో ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో తప్ప మళ్లీ తనని కలవలేకపోయాయని వివేక్ తెలిపారు. ‘‘ఎస్ఆర్కే దగ్గర 17ఫోన్లు, ఉన్నాయి. నా దగ్గర ఒకటే నంబరు ఉంది.. నేను ఫోన్ చేసినపుడు ఆయన దొరకడు. ఆయన ఫోన్ చేసినపుడు నేను మిస్ అవుతా.. ఆయనకు బాధ్యతలు ఎక్కువ. నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాడు. వెండితెర సామ్రాజ్యాన్ని ఏలుతున్న అద్భుతమైన వ్యక్తి’’ అంటూ గుర్తు చేసుకున్నారు. కాగా రియల్మీ, ఒప్పో లాంటి బ్రాండ్లకు షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. అంతేకాదు బాలీవుడ్ హ్యాపియస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు షారుఖ్, గౌరీ ఖాన్ జంట . వీరి వివాహ బంధం మొదలై మూడు దశాబ్దాలుదాటింది. ఈ క్రమంలో తన భార్యకు రోజుకు 8-10 సార్లు ఫోన్ చేస్తాననీ, ఒక్కోసారి ఐదు నిమిషాలకోసారి ఫోన్ చేస్తానని చెప్పడం వైరల్ అయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె గుర్తొచ్చినప్పుడల్లా కాల్ చేస్తా, నా భార్యతోనే కదా మాట్లాడేదని అని ఫన్నీగా చెప్పిన సంగతి తెలిసిందే. -
ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా?
కొత్త ఏడాదిలో యాపిల్ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16), ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లుక్, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్ లీక్ అయింది. యాపిల్ అంతర్గత డిజైన్ల ఆధారంగా మ్యాక్రూమర్స్ (MacRumors) అనే వెబ్సైట్ ఐఫోన్ 16, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్అప్లను రూపొందించింది. వీటి ప్రకారం.. యాపిల్ తదుపరి తరం వేరియంట్లు పెద్ద డిస్ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఫోన్ 16 వేరియంట్ డిస్ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్లలో టెలిఫోటో లెన్స్లను చూడొచ్చని భావిస్తున్నారు. డిజైన్ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్మెంట్ ఉంటుంది కానీ యాడెడ్ బటన్తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం. -
బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై రూ.10,000 తగ్గింపు!
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ తమ ఇయర్ ఎండ్ యాపిల్ సేల్ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్తో సహా కొన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 15ప్రో 1టీబీ వేరియంట్ను డిస్కౌంట్పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ వేరియంట్ను బ్యాంక్ ఆఫర్లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్ 14 మోడల్లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. కేవలం ఐఫోన్లే కాకుండా మ్యాక్బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్బుక్ ఎయిర్ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 5th Gen) ఆఫర్ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది. -
పిల్లలు స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్నారా? హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్?
ప్రస్తుత కాలంలో ఎవరింట చూసినా పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఐపాడ్లు ఉండవలసిందే! స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్న పిల్లలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉంటారు. దీనివల్ల వారు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు ఫోన్ లేదా టీవీ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువే తినేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటి బారిన పడే ప్రమాదం పెరిగిపోతుంది. వీటన్నింటి నుంచి రక్షించాలంటే పిల్లలు స్మార్ట్ఫోన్ వాడకుండా చేయాలి. అదెలాగో చూద్దాం. పిల్లల మనసు అద్దం లాంటిది. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఇతర పెద్దలు ఏం చేస్తున్నారో చూసి అదే అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు, ఇతర పెద్దలూ స్మార్ట్ఫోన్, లాప్టాప్ వంటివి చూడకూడదని గుర్తుంచుకోండి. పిల్లలకు ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉంటే, వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అల్లరి చేయరు. మొబైల్ గురించి ఆలోచించరు. తిండిపైనే ధ్యాస పెడతారు. మొబైల్ లేకుండా ఐదు నిమిషాల పాటు వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. పేచీ పెట్టకుండా సరిగ్గా తింటే, ఈ సమయాన్ని పెంచవచ్చు. పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వంటకాలు ఎలా ఉన్నాయో అడగండి. నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ, సరదాగా గడిపితే మొబైల్ ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటినుంచి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. ముందు బొమ్మల పుస్తకాలతో మొదలు పెట్టండి. ఆ తర్వాత పజిల్స్ పూర్తి చేయడం, కథల పుస్తకాలు, వార్తా పత్రికలలో పిల్లలకోసం కేటాయించే కథనాలను చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్ఫోన్ పైకి మళ్లదు. పిల్లలకు బాల్యం నుంచి చుట్టుపక్కల పిల్లలతో ఆటలు ఆడటం అలవాటు చేయాలి. వారి వయసు పిల్లలు లేకపోతే మీరే వారితో ఆడుకోండి. కాసేపు ఔట్డోర్ ఆటలు, కాసేపు చెస్, క్యారమ్స్ వంటివి ఆడటం అలవాటు చేస్తే స్మార్ట్ఫోన్ బారిన పడకుండా స్మార్ట్గా తయారవుతారు. -
గ్రహాంతరవాసులతో ఆ ఊరి వాళ్లకి సంబంధం ఏంటి? అడుగుపెట్టగానే..
ఈరోజుల్లో స్మార్ట్ఫోన్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపూట భోజనం అయినా మానేస్తాం గానీ ఫోన్ లేకుండా ఉండలేం అనేంతగా అడిక్ట్ అయిపోతున్నాం. అయితే ఓ ఊళ్లో నివసించే ప్రజలు మాత్రం మొబైల్, టీవీ , రేడియో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. వినడానికి వింతగా ఉన్నా ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే నియమాన్ని పాటిస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ ఊరు ఎక్కడుంది? సెల్ఫోన్స్ లేకుండా అక్కడివాళ్లు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా వెస్ట్ వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్పై ఇక్కడ నిషేధం ఉండటంతో ఎవరూ స్మార్ట్ఫోన్స్, వైఫై వంటివేవీ ఉపయోగించడానికి వీల్లేదు. ఈ ఊళ్లు సెల్ఫోన్స్, వాటి సిగ్నల్ టవర్స్ ఎక్కడా కనిపించవు. గత యాభై ఏళ్లుగా ఇదే నిబంధన అమల్లో ఉంది. ఈ రూల్స్ పాటించేవాళ్లు ఊళ్లో ఉంటారు. అందుకు తగ్గట్లుగా ముందే రెంటల్ అగ్రిమెంట్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేకపోతే ఊరు ఖాళీ చేయొచ్చు కానీ రూల్స్ మాత్రం మార్చరు. నో సిగ్నల్స్.. కారణమిదే 2010 గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 150 మంది కంటే తక్కువే.(ఆ తర్వాత అధికారులు డాటాను వెల్లడించలేదు) సోలార్ పవర్, పాడిపరిశ్రమే అక్కడి వారి జీవనాధారం. వారంతంలో పర్యాటకులు అక్కడికి వచ్చినా సెల్ఫోన్లు పనిచేయకుండా ప్రత్యేకంగా జామర్లు కూడా ఏర్పాటు చేశారు. గ్రీన్బ్యాంక్ సిటీలోని ప్రజలు టెక్నాలజీకి దూరంగా ఉండటానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియా టెలిస్కోప్ ఉంది. ఖగోళంలోని రహస్యాలను చేధించేందుకు సుమారు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం పరిశోధనులు కొనసాగుతున్నాయి. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. అందుకే రేడియా టెలిస్కోప్కి ఎలాంటి డ్యామేజీ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పని చేసే ఎలక్ట్రానిక్ డివైజ్లను అనుమతించరు.అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్ డివైజ్లపై ఇక్కడ నిషేధం ఉంది.మరి కమ్యూనికేషన్ ఎలా అంటారా?.. ఊరికి దూరంగా ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్ బూత్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. -
బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు!
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో 5జీ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు ఫోన్లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే వీటికి ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రూ. 11,967కి అందుబాటులో ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ.11,490 ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. పోకో ఎం6 ప్రో 5జీ రూ. 10 వేల లోపు సెగ్మెంట్లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్ కోసం స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ను ఆశించవచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది. -
స్మార్ట్ఫోన్లో వేల కొద్ది బాక్టీరియా.. ఇలా క్లీన్ చేసుకోండి
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి. ఫోన్ నీట్గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్లెస్ మెషిన్లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ! -
చిన్నపిల్లలకు స్మార్ట్ఫోన్ ఇస్తున్నారా? టీనేజ్లో డిప్రెషన్తో..
ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తికాదు. లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సగం పనులు దీనితోనే అవున్నాయంటే మాటలు కాదు. ఒక వైపు స్మార్ట్ ఫోన్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతకుమించి సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఫోన్ పెను ప్రభావం చూపుతోంది. జీవనశైలే మారిపోయింది ప్రస్తుతం 99 శాతం మంది చేతుల్లో స్మార్ట్ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ ఫోన్ల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 1995 తర్వాత పుట్టిన పిల్లలు తమ కౌమారమంతా స్మార్ట్ఫోన్తోనే గడుపుతున్న మొదటి తరమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్లు వచ్చాక మనిషి జీవన శైలే మారియిందని పేర్కొంటున్నాయి. 1995 తర్వాత పుట్టిన పిల్లలు ఎక్కువ సమయం ఆన్లైన్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం, శారీరక ఆటలకు కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. ఈ జీవన శైలి వలన పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. ముందు తరాలవారితో పోల్చుకుంటే జీవన నైపుణ్యాల్లో ఇప్పటి పిల్లలు వెనకబడిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. వీటికి అదనంగా ఒంటరితనంతోపాటు ఇతర మానసిక సమస్యలూ ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ జీన్ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరిచి చెప్పింది. టీనేజర్లు తీవ్ర నిరాశలోకి.. టీనేజర్ల ఆరోగ్యం, ప్రవనర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్ కన్సెల్టింగ్ వైద్యురాలు జీన్ త్వెంగే అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలిసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పది లక్షలకుపైగా పిల్లపై పరిశోధనలు చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతన్నారనేది మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. ఆమె 2011 నుంచి ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు బాగా పెరగడం గుర్తించినట్టు చెప్పారు. జీవితం వృథా అనే భావనకు చాలామంది వస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని, ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేర పెరిగాయని వివరించారు. తమను తాము గాయపరుచుకునేంతగా అవి విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ ప్రమాదకర ధరోణి రెండు మూడింతలు పెరిగిందని పేర్కొన్నారు. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని జీన్ తన అధ్యయనంలో వివరించారు. ఫోన్ వ్యసనంలా.. మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లుకుపైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారట. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే భావనలో ఉంటున్నారట. ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ► రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడుతుంది. ► అయితే డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుంది. ► మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ► స్నేహితులతో టచ్లో ఉండేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ చాలా అవసరమని భావిస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫోన్ మాత్రమే ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదలతోపాటు మెదడుపై ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా అవసరానికి మించి స్మార్ట్ఫోన్లు వాడకూడదు. దీనివల్ల మతిమరుపు నిద్రలేమి సమస్యలకు లోనవుతారు. మీపిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. -
ఆన్లైన్లో ‘అగ్రి’ సెన్సెస్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రైతుల జీవన స్థితిగతులు..సాగు కమతాల స్వరూప స్వభావాన్ని తేల్చే వ్యవసాయగణన (అగ్రికల్చర్ సెన్సెస్) ఇటీవల దేశవ్యాప్తంగా మొదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. భూకమతాల వారీగా రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం పది అంశాలపై మూడు దశల్లో వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా కాగిత రహితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు వినియోగించి ప్రత్యేక యాప్ ద్వారా డిజిటల్ విధానంలో ఏఈఓలు సర్వే చేస్తుండగా, మిగతా రాష్ట్రాల్లో మాన్యువల్గానే చేపడుతున్నారు. 2021–22 ప్రామాణికంగా 11వసారి దేశంలో వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి ప్రణాళిక, సామాజిక ఆర్థిక విధాన రూపకల్పనకు కేంద్రం ఐదేళ్లకు ఒకసారి వ్యవసాయ గణన నిర్వహిస్తోంది. 1979లో వ్యవసాయగణన మొదలుకాగా, చివరగా పదోసారి 2015–16లో చేపట్టారు. 11వ వ్యవసాయ గణన 2021–22లో జరగాల్సి ఉండగా, కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 2021–22 ప్రామాణిక సంవత్సరంగా ఈ నెల నుంచి వ్యవసాయానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. మూడు దశల్లో... వానాకాలం, యాసంగిలో ఆయా రైతుల వారీగా ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలో ఏటా వ్యవసాయశాఖ సర్వే చేస్తోంది. అయితే కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మూడు విడతల్లో వ్యవసాయ గణన చేపట్టారు. ♦ మొదటి విడతలో రైతు పేరు, సామాజికస్థితి, సాగు విస్తీర్ణం, భూమి వినియోగం, పురుషులు, మహిళలు ఇలా అన్ని సేకరించి రెవెన్యూ గ్రామం వారీగా నమోదు చేస్తున్నారు. ♦ రెండో విడతలో ఎంపిక చేసిన 20 శాతం గ్రామాల్లో ప్రణాళిక శాఖ నిర్దేశించిన టీఆర్ఏఎస్ (ట్రైమ్ లీ రిపోర్టెడ్ అగ్రి స్టాటిస్టిక్స్)తో పాటు అదనంగా మరికొంత సమాచారం సేకరిస్తారు. ♦ మూడో దశలో ఏడు శాతం గ్రామాల్లో సాగు ఖర్చులు, యంత్రాల వినియోగం, ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ రాయితీలు తదితర వివరాలు సేకరిస్తారు. సాంకేతికతతో సర్వే... తాజాగా రాష్ట్రంలో చేపట్టిన వ్యవసాయ గణనలో అధికారులు వందశాతం సాంకేతికతను సది్వనియోగం చేసుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ల ద్వారా డిజిటల్ విధానంలో వ్యవసాయ కమతాలు, రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రైతుబంధు పథకానికి రైతుల నుంచి ఆధార్ కార్డులు, వ్యవసాయ భూముల విస్తీర్ణం, పంటల సాగు తదితర వివరాలు ఆన్లైన్లో పొందుపరచగా, వాటి ఆధారంగా వ్యవసాయగణనలో అదనపు సమాచారం తీసుకుంటున్నారు. ప్రణాళికకు వ్యవసాయ గణన కీలకం వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు ఆర్థిక విధాన రూపకల్పనకు వ్యవసాయ గణన ఎంతో ఉపయోగకరం. నిరీ్ణత లక్ష్యం మేరకు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ, ప్రణాళిక శాఖ అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. – దశరథ్, మహబూబ్నగర్ జిల్లా ప్రణాళికశాఖ అధికారి ఈ నెల 31లోగా పూర్తి చేస్తాం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వ్యవసాయ గణన చేయిస్తున్నాం. దీని వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న పథకాలకు అనుగుణంగా ఈ పంటల వివరాల లెక్కల సేకరణ జరుగుతోంది. ఈ నెలాఖరులోపు సర్వే పూర్తి చేస్తాం. – బి.వెంకటేష్, మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ అధికారి -
మనవాళ్లు వారానికి 22గంటలు సోషల్ మీడియాలోనే.. ఆశ్చర్యపరుస్తున్న నిజాలు!
ఇండియా టెక్నాలజీ రంగంలో పరుగులు పెడుతున్న తరుణంలో భారతీయులు సగటున ప్రతి రోజు 194 నిముషాలు.. అంటే మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో గడుపుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సగటున భారతీయులు 46 నిమిషాలు ఆన్లైన్ గేమ్లలోనూ, ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్ఫామ్లపై 44 నిమిషాలు ఇలా సమయం గడుపుతున్నట్లు తెలిసింది. ఈ డేటా 2.06 మిలియన్ల వినియోగదారుల నుంచి యాప్లోని డేటా ఆధారంగా విడుదల చేయడం జరిగింది. మొత్తం 100 శాతం సోషల్ మీడియా వినియోగం స్మార్ట్ఫోన్లు లేదా టాబ్లెట్ల ద్వారా జరిగినట్లు స్పష్టమైంది. OTT కంటెంట్ కోసం 68 శాతం మంది స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను, 4 శాతం మంది ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లను ఉపయోగించారు. ఇక 28 శాతం మంది టీవీ లేదా హోమ్ థియేటర్లను ఉపయోగించారు. ఇదీ చదవండి: వారికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి - అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! ఇలా చేస్తే తగ్గే అవకాశం.. ఇంటర్నెట్లో సర్ఫింగ్ ఖర్చు విషయానికి వస్తే, సోషల్ మీడియా వినియోగదారులకు చాలా వరకు ఉచితం అని నివేదిక పేర్కొంది. కానీ వారు OTT కంటెంట్పై నెలకు రూ. 201 నుంచి రూ. 400, అదే విధంగా ఆన్లైన్ గేమింగ్పై నెలకు రూ. 100 కంటే తక్కువ చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్లాట్ఫామ్ ధరలను 30 శాతం పెంచినట్లయితే.. 71 శాతం మంది గేమర్లు, 17 శాతం OTT ప్రేక్షకులు సమయాన్ని తగ్గించే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడించాయి. -
Best Camera Phones: ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ కెమెరా మొబైల్ ఫోన్స్
-
అత్యంత తేలికైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
‘స్కూళ్లలో స్మార్ట్ఫోన్లు నిషేధించండి!’
ప్యారిస్: ప్రపంచవ్యాప్తంగా.. పాఠశాలల్లో, పాఠశాల దశలో విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియోగించడంపై నిషేధించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అధిక స్థాయి స్క్రీన్ సమయం పిల్లల భావోద్వేగాలపై ప్రభావం పడుతోందని.. వీటికి శాస్త్రీయంగానూ రుజువులు ఉన్నాయని విషయాన్ని సైతం తన నివేదికలో యునెస్కో పొందుపరిచింది. ‘‘డిజిటల్ విప్లవం శక్తివంతమైందే కావొచ్చు. కానీ, ముఖాముఖి బోధన అనేది పిల్లలకు చాలా అవసరం. ఆ అవసరాన్ని స్మార్ట్ఫోన్.. డిజిటల్ టెక్నాలజీ.. చివరకు ఏఐ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అని యునెస్కో సూచించింది. కరోనా టైంలో కోట్ల మంది డిజిటల్ ఎడ్యుకేషన్కి పరిమితం అయ్యారని తెలిసిందే. కానీ, అదే సమయంలో ఇంటర్నెట్కు దూరంగా ఉన్న లక్షల మంది పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని యునెస్కో గుర్తు చేస్తోంది. అలాగే.. ఇప్పటికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించడాన్ని యునెస్కో తీవ్రంగా తప్పుబట్టింది. విద్యాసంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. డిజిటల్ పరికరాలను బోధనా సాధనాలుగా ఉపయోగించడానికి చైనా సరిహద్దులను నిర్దేశించింది. మొత్తం బోధనా సమయంలో 30%కి పరిమితం చేసిందిని తెలిపింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్లైన్ విద్యను ప్రొత్సహించిందని.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక తిరిగి విద్యాసంస్థలకే రప్పించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా యునెస్కో ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి..
స్మార్ట్ఫోన్లు మన దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. కస్టమర్లు తమ బడ్జెట్కు అనుగుణంగా ప్రీమియం, మిడ్-రేంజ్ లేదా లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. హార్డ్వేర్, ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరచడంతో ఈ రోజుల్లో ఫోన్లు చాలా బరువుగా మారాయి. ప్రీమియమ్ బిల్డ్, పెద్ద బ్యాటరీలు ఉండటం మంచిదే అయినప్పటికీ కొంతమంది ఫోన్లు తేలికగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని తేలికపాటి ఫోన్ల గురించి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. రియల్ మీ నార్జో ఎన్ 53 (Realme Narzo N53) బరువు 182 గ్రాములు. 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ Unisoc T612 SoC ప్రాసెసర్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB వరకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ LED ఫ్లాష్తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా 4GB + 64GB వెర్షన్ ధర రూ. 8,999, 6GB + 128GB మోడల్ ధర రూ. 10,999. మోటో జీ13 (Moto G13) బరువు 184.25 గ్రా 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ 4GB LPDDR4X ర్యామ్ 64GB/128GB స్టోరేజీ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డ్యూయల్ లెన్స్లు, 8MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 4GB + 64GB మోడల్ రేటు రూ. 9,499, 4GB + 128GB వెర్షన్ ధర రూ. 9,999. వివో వై 02 (Vivo Y02) బరువు 186 గ్రాములు. 6.51-అంగుళాల HD+ డిస్ప్లే మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3GB ర్యామ్, 32GB స్టోరేజీ, 1TB వరకు విస్తరించవచ్చు Funtouch OS 12తో Android 12 Go ఎడిషన్ 8MP రియర్ కెమెరా 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 2GB + 32GB మోడల్ ధర రూ. 8,999. రెడ్మీ 10ఎ (Redmi 10A) బరువు 194 గ్రాములు 6.53-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G25 ప్రాసెసర్ 3GB/4GB LPDDR4x ర్యామ్, 32GB/ 64GB eMMC 5.1 స్టోరేజ్. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ 3GB + 32GB మోడల్ ధర రూ. 8,499, 4GB + 64GB వెర్షన్ ధర రూ. 9,499. -
రియల్మీ నుంచి కొత్త సిరీస్.. ఫీచర్స్ అదుర్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ 11 ప్రో సిరీస్ ప్రవేశపెట్టింది. వీటిలో 11 ప్రో ప్లస్ 5జీ, 11 ప్రో 5జీ ఉన్నాయి. ధర రూ.23,999 నుంచి ప్రారంభం. 8, 12 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 120 హెట్జ్ కర్వ్డ్ విజన్ డిస్ప్లే ఏర్పాటు ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో 4గీ లాస్లెస్ జూమ్ 200 ఎంపీ కెమెరా, 100 వాట్స్ సూపర్వూక్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో ప్లస్ 5జీ వేరియంట్ తయారైంది. 100 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రోలైట్ కెమెరా, 67 వాట్ సూపర్వూక్ చార్జ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో 5జీ రూపుదిద్దుకుంది. ఇదీ చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ: లాంచింగ్ ఆఫర్ ముగుస్తోంది! -
ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు.. తాజాగా హైదరాబాద్లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ శామ్సంగ్ ప్రీమియం ఎక్స్పీరియెన్స్ స్టోర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఇనార్బిట్ మాల్లో 3,500 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఇది నెలకొంది. ఇప్పటికే కంపెనీకి ఢిల్లీ, బెంగళూరులో ఇటువంటివి ఒక్కో కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్కల్లా మొత్తం 15 ప్రీమియం ఎక్స్పీరియెన్స్ స్టోర్లను నెలకొల్పాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ ఔట్లెట్లలో స్మార్ట్థింగ్స్, స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, ఆడియో, గేమింగ్, లైఫ్స్టైల్ టెలివిజన్స్ ప్రదర్శిస్తారు. -
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈవో..
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని పలువురు నిపుణులు, వైద్యులు చెప్పడం విన్నాం. కానీ సాక్షాత్తు ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ మాజీ సీఈవోనే తల్లిదండ్రులను పిల్లలకు పోన్లు ఇవ్వొద్దని కోరుతున్నారు. చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లు ఇస్తే అది వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందువల్ల స్మార్ట్ ఫోన్ల విషయలో తల్లిదండ్రులను జాగ్రత్త వహించమని సూచిస్తున్నారు ప్రముఖ షియోమీ ఇండియా కంపెనీ మాజీ సీఈవో కుమార్ జైన్. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతాయో వివరించారు. ఈ మేరకు ఆయన దీనికి సంబంధించి.. యూఎస్కు చెందిన ప్రముఖ లాభప్రేక్షలేని సంస్థ సపియన్ ల్యాబ్ అధ్యయనం చేసిందని చెప్పారు. ఆ ల్యాబ్ నుంచి ఒక స్నేహితుడు అందుకు సంబంధించిన విషయాలను తనతో షేర్ చేసుకున్నట్లు లింక్డ్ఇన్లో వెల్లడించారు. ఆ నివేదికలో.. చిన్నప్పుడే స్మార్ట్ఫోన్లకు అలవాటు పడే చిన్నారులు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు. ఆ అధ్యయన ప్రకారం పదేళ్ల వయసులో స్మార్ట్ఫోన్లకు అలవాటు పడితే పెద్దయ్యాకు మహళలైతే 60%-70% మంది దాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని, అదే పురుషులైతే 45%-50% మంది దాక ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదిక వెల్లడించిందని కుమార్ జైన్ వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది కావున దయచేసి వారిని వేరే యాక్టివిటీస్లో నిమగ్నమయ్యేలా చూడండని తల్లిదండ్రులకు విజ్ఞిప్తి చేశారు. అది ఏదైనా అభ్యాసం లేదా వారి అభిరుచికి సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే గనుక మనం వారికి ఆరోగ్యకరమైన సమతుల్య వాతావరణాన్ని అందించగలిగిన వారమవుతాం అని చెప్పారు. చిన్న వయసులోనే ఎక్కువ సమయం స్క్రీన్పై గడిపితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడి పలు దుష్ప్రరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బాల్యం చాల విలువైనదని, ఆ సమయాన్ని వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాల్లో కేంద్రీకరించేలా చేసి వారి భవిష్యత్తుకు మంచి పునాదిని ఏర్పరుచుకనేలా ప్రోత్సహించాల్సిన భాద్యత మనమిదే ఉందని చెప్పారు. అదేసమయంలో తాను స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లకి వ్యతిరేకిని కాదని, ఐతే చిన్న పిల్లలను మాత్రం స్మార్ట్ ఫోన్లకు సాధ్యమైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులని కోరుతున్నట్లు లింక్డ్ఇన్లో చెప్పుకొచ్చారు. (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..) -
గూగుల్ కి షాకిస్తున్నసెల్ ఫోన్ కంపెనీస్..
-
ఫ్లిప్కార్ట్లో మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి మళ్లీ సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart). మార్చి 11 నుంచి మార్చి 15 వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ను నిర్వహించనుంది. ప్లస్ మెంబర్స్కు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఒక రోజు ముందుగా అంటే మార్చి 10నే అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ఫోన్లపై కొన్ని డిస్కాంట్ ఆఫర్లను ఫ్లిప్కార్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, నథింగ్ ఫోన్, గూగుల్ పిక్సెల్ తదితర ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వీటికి అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉంటాయి. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్పై హైజీనిక్ పానీపూరి వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లపై అత్యధిక డిస్కౌంట్లు ఉండనున్నాయి. కంపెనీ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం.. ఐఫోన్ 14ను రూ.60,009 నుంచి 69,999 లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 14 ప్లస్ కూడా రూ.80 వేల లోపు లభిస్తుంది. రూ.79,999 ధర ఉన్న ఐఫోన్ 14ను ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే రూ.71,999 అందిస్తుండగా బిగ్ సేవింగ్ డేస్ సేల్లో మరింత తగ్గుతుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లను కూడా కలుపుకుంటే మీకు ఆ ఫోన్ రూ.60 వేల కంటే తక్కువకే వచ్చేస్తుంది. ఇక ఈ మధ్యనే లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.59,999. అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో దీన్ని రూ.50 వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో కూడా తక్కువ ధరకు లభించనుంది. అయితే కచ్చితంగా ఎంత అన్నది ఇప్పుడే తెలియదు. ఇదీ చదవండి: Campa Cola: రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్ అలాగే నథంగ్ ఫోన్(1)పై కూడా పెద్ద తగ్గింపే ఉండనుంది. ప్రస్తుతం రూ.27,999 ఉన్న 128 జీబీ వేయియంట్ ఈ సేల్లో బ్యాంకు ఆఫర్లు కూడా కలిపి రూ. 25 వేలకే లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్పై కచ్చితమైన డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించలేదు. ఇంకా మరికొన్ని ఖరీదైన ఫోన్లపై భారీ తగ్గింపులు పొందాలంటే మార్చి 11 వరకూ ఆగాల్సిందే. -
సిమ్కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!
స్మార్ట్ఫోన్లలో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. సాధారణ సిమ్కార్డులకు కాలం చెల్లి వాటి స్థానంలో డిజిటల్ సిమ్లు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 14, 14ప్రో మోడల్లలో ఇప్పటికే ఈ-సిమ్ టెక్నాలజీ ఉంది. అంటే ఈ ఫోన్లలో ప్రత్యేకంగా సిమ్ ట్రేలు ఉండవు. ఇదే క్రమంలో మరో కొత్త టెక్నాలజీ రాబోతోంది. క్వాల్కామ్ (Qualcomm), థేల్స్ (Thales) సంయుక్తంగా మొదటిసారి ఇంటిగ్రేటెడ్ సిమ్(ఐ-సిమ్) సర్టిఫికేషన్ను ప్రకటించాయి. దీంతో ఫోన్లలో సాధారణ సిమ్ కార్డులతో పని ఉండదు. Snapdragon 8 Gen 2తో ప్రారంభమయ్యే అన్ని ఫోన్ల ప్రధాన ప్రాసెసర్లో ఈ ఐ-సిమ్ను పొందుపరుస్తారు. దీంతో ఇక ప్రత్యేకమైన చిప్ అవసరం ఉండదు. ఈ ఐ-సిమ్ టెక్నాలజీ.. ప్రస్తుతం ఉన్న ఈ-సిమ్ల మాదిరిగానే డిజిటల్ సైనప్లు, సేఫ్టీ ఫీచర్స్ను అందిస్తుంది. కానీ దీంతో మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఐ-సిమ్ కూడా ఈ-సిమ్ లాగా రిమోట్ ప్రొవిజనింగ్ స్టాండర్డ్ను సపోర్ట్ చేస్తుంది. అంటే మొబైల్ ఆపరేటర్లు ఈ-సిమ్ టెక్నాలజీ సపోర్ట్ కోసం ఫోన్లను ప్రత్యేకంగా అప్గ్రేడ్ చేయనవసరం లేదు. ఫోన్లలో సిమ్ స్లాట్ ఉండదు కాబట్టి ఆ స్థలాన్ని పెద్ద బ్యాటరీలు, ఇతర ముఖ్యమైన భాగాలను చేర్చడానికి ఉపయోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: ట్విటర్కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) జీఎస్ఎం అసోసియేషన్ ఆమోదించిన ఈ ఐ-సిమ్ టెక్నాలజీ అభివృద్ధిపై క్వాల్కాం టెక్నాలజీస్, థేల్స్ సంస్థలు చాలా ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతున్న ఈ-సిమ్తో పాటు థేల్స్ 5జీ ఐ-సిమ్ టెక్నాలజీ.. తమ కస్టమర్లకు మెరుగైన ఎయిర్-ది-ఎయిర్ కనెక్టివిటీ, ఉత్సాహకరమైన ఉత్పత్తులను అందించేందుకు మొబైల్ తయారీదారులు, ఆపరేటర్లకు మరింత అవకాశాన్ని ఇస్తుందని థేల్స్ మొబైల్ ఉత్పత్తుల విభాగం వైస్ ప్రెసిడింట్ గుయిలామ్ లాఫయిక్స్ పేర్కొన్నారు. -
లిథియం బ్యాటరీలకు భారీ డిమాండ్.. ఏకంగా 5 రెట్లు!
ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీలకు డిమాండ్ బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్ల నుంచి ల్యాప్టాప్ల వరకు, వైద్య పరికరాల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నింటినిలోనూ లిథియం-అయాన్ బ్యాటరీలు వినియోగం ఎక్కువైంది. అందుకే వాటి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే దీన్ని ‘వైట్ గోల్డ్’ అని పిలుస్తున్నారు. గ్లోబల్ లిథియం మార్కెట్ పరిమాణం 2021లో 6.83 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం... 2022 నుంచి 2030 నాటికి దీని సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 శాతం పెరగనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ అదే స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తుండటం లిథియం బ్యాటరీ మార్కెట్ వృద్ధికి అదనపు బూస్టర్గా పనిచేస్తోంది. 2030 నాటికి 5రెట్లకు పైగా.. పబ్లిక్-ప్రైవేట్ అలయన్స్ లీ-బ్రిడ్జ్ ప్రకారం... లిథియం బ్యాటరీలకు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఐదు రెట్ల కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా లిథియం ఉత్పత్తి లక్ష టన్నులు (90.7 మిలియన్ కిలోలు), ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 మిలియన్ టన్నుల (20 బిలియన్ కిలోలు) లిథియం నిల్వలు ఉన్నాయి. 2022లో చిలీలో అత్యధికంగా 9.3 మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు, ఆస్ట్రేలియాలో 6.2 మిలియన్ మెట్రిక్ టన్నులు, అమెరికా వద్ద ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు ఉంటాయని అంచనా తాజాగా జమ్ము కశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం కనుగొనడంతో భారత్ కూడా లిథియం సూపర్ పవర్ క్లబ్లో చేరింది. (ఇదీ చదవండి: Thomas Lee: ప్రముఖ బిలియనీర్, ఫైనాన్షియర్ ఆత్మహత్య) 2025 నాటికి లిథియం కొరత లిథియం వినియోగంలో అత్యధిక వాటా బ్యాటరీలదే. రీచార్జబుల్ లిథియం బ్యాటరీల ఆధారితమైన ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వృద్ధి కారణంగా గ్లోబల్ లిథియం డిమాండ్ 2025 నాటికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులకు, 2030 నాటికి రెండు మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇదే క్రమంలో 2025 నాటికి ప్రపంచం లిథియం కొరతను ఎదుర్కొంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంటోంది. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) -
ఆఫ్లైన్లోనే ప్రీమియం ఎలక్ట్రానిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022లో 15–16 కోట్ల స్మార్ట్ఫోన్స్ అమ్ముడయ్యాయి. ఇందులో ఆన్లైన్ వాటా ఏకంగా 53 శాతం కైవసం చేసుకుంది. ఆఫ్లైన్ను మించి ఆన్లైన్ విభాగం దూసుకెళ్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 2023లో ఎక్స్పీరియెన్స్ జోన్స్, స్టోర్ల ఏర్పాటుపై ఫోకస్ చేశాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంతో తయారీ సంస్థలు ప్రీమియం ఉపకరణాలపై దృష్టిసారించాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక సామర్థ్యం, వినూత్న సాంకేతికతతో తయారైన ప్రొడక్ట్స్కు డిమాండ్ పెరిగిందని ఎల్జీ చెబుతోంది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు వినియోగదారులు ఇలాంటి ప్రీమియం ఉత్పత్తులను స్వయంగా పరీక్షించి, అనుభూతి చెందాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్పీరియెన్స్ జోన్స్, ఔట్లెట్స్ ఏర్పాటు తప్పనిసరి అని కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. స్మార్ట్ఫోన్స్, స్మార్ట్ ఉపకరణాల తయారీతోపాటు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న సంస్థలు ఆఫ్లైన్లో విస్తరణకు వరుస కట్టాయి. ఒకదాని వెంట ఒకటి.. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ ప్రీమియం ఉపకరణాలను ప్రదర్శించేందుకు అతిపెద్ద ఎక్స్పీరియెన్స్ కేంద్రాన్ని గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభించింది. అలాగే బెంగళూరులోని శామ్సంగ్ ఓపెరా హౌజ్ స్టోర్లో కొత్త గేమింగ్, స్మార్ట్ హోమ్ ఎక్స్పీరియెన్స్ జోన్ను ఏర్పాటు చేసింది. పర్సనల్ కంప్యూటర్ల తయారీ దిగ్గజం హెచ్పీ ఈ నెలలోనే ఏడు ప్రధాన నగరాల్లో గేమింగ్ స్టోర్స్ను తెరిచింది. పీసీలు, యాక్సెసరీస్ అందుబాటులో ఉంచడమేగాక కస్టమర్లు గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. 2023లో ఇటువంటివి 40 కేంద్రాలు తెరవాలన్నది హెచ్పీ ఆలోచన. వన్ప్లస్, ఆసస్, రియల్మీ సైతం ఔట్లెట్లను స్థాపించాలని భావిస్తున్నాయి. మూడవ ఎక్స్పీరియెన్స్ కేంద్రాన్ని గత నెల ఢిల్లీలో ఆసస్ ప్రారంభించింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్ అమ్మకాలు 2022లో విలువ పరంగా తొమ్మిది రెట్లు మెరుగ్గా నమోదయ్యాయి. ధరలు దూసుకెళ్తున్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాలు ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. విలువ పరంగా గతేడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. రూ.30 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల మొత్తం విక్రయాలు ఏకంగా 94 శాతం వృద్ధి సాధించాయి. టీవీ పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందితే.. 55 అంగుళాలు, ఆపైన సైజులో ఉండే ప్రీమియం టీవీ మోడళ్లు 95 శాతం ఎగశాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రీమియం విభాగంలో ఇవి 45 శాతం అధికం అవడం విశేషం. ప్రీమియం విభాగం పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. (ఇదీ చదవండి: హైడ్రోజన్తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి) -
ఫోన్.. ఆటబొమ్మ కాదండోయ్
స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల్లో మేధోపరమైన ఎదుగుదల దెబ్బతింటోంది. ఫలితంగా విద్యార్థులు చదువుల్లోనూ వెనుకబడిపోతున్నారు. ఈ అలవాటు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తోందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తాజాగా వెలుగు చూస్తున్న సర్వేలలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్ల వినియోగం పాఠశాలలు, కాలేజీ స్థాయి పిల్లల్లో విపరీతమైన మానసిక, శారీరక సమస్యలకు కారణమవుతోందని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విచ్చలవిడిగా మారడం, సరైన పర్యవేక్షణ లేమితో విద్యార్థులలో అత్యధిక శాతం మంది పక్కదారి పట్టే ప్రమాదం ఏర్పడుతోందని సర్వేలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలపై అతి ప్రేమ లేదా ఇవ్వకుంటే ఏమి చేసుకుంటారోనన్న భయంతో స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. ఆటపాటలతో ఇంట్లో సందడి చేయాల్సిన పసి పిల్లలకు సైతం స్మార్ట్ ఫోన్లను అలవాటు చేయడం ఇలాంటి దుష్పరిణామాలు మరింతగా పెరగడానికి కారణమవుతోంది. పిల్లలు మారాం చేస్తున్నారనో.. అల్లరి చేయకుండా ఉంటారనో వారికి ఆట బొమ్మలకు బదులుగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం ఇటీవల పెరిగిపోయింది. చిన్నతనం నుంచే ఇలా చేయడం వల్ల పిల్లల్లో మేధోపరమైన ఎదుగుదల దెబ్బతింటోందని శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క పాఠశాల పిల్లల్లో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, డేటా ప్యాక్లు అందుబాటులోకి వచ్చిన తరువాత వీటి వినియోగం కాస్తా వ్యసనంగా మారిందని ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరుగుతుండటంతో విద్యార్థులు, యువత మానసిక, ఆరోగ్యపరమైన సమస్యలకు లోనవుతున్నారని తేల్చిచెప్పింది. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల పేరుతో స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి ఇది తీవ్రరూపం దాల్చింది. అవసరం లేకున్నా పిల్లల చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలు చేరుతుండటం, పెద్దల పర్యవేక్షణ కరవవటంతో విపరిణామాలకు దారితీస్తోందని సర్వే సందర్భంగా నిపుణులు స్పష్టం చేశారు. టీనేజ్ పిల్లల్లో 71 శాతం ఫోన్లలోనే.. ► 9 నుంచి 13 ఏళ్లలోపు పిల్లలు పాఠశాల సమయం తరువాత ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలో తేలింది. ► 13 నుంచి 17 మధ్య వయసు పిల్లల్లో 71 శాతం మంది పాఠశాలలతోపాటు బయట కూడా ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్లలో చాటింగ్ చేస్తున్నారని వెల్లడైంది. ► 9 నుంచి 13 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియాలో వీడియోలను, ఆన్లైన్ గేమ్లతో గంటలకొద్దీ గడిపేస్తున్నారు. తల్లిదండ్రుల మాట అసలు వినడం లేదు. ► గట్టిగా చెబితే తమపై తిరగబడే పరిస్థితులు ఎదురవుతున్నాయని 47 శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించారు. ► 13 ఏళ్లలోపు వారు కూడా సోషల్ మీడియా ఖాతాలు తెరిచి చాటింగ్, ఇతర వ్యవహారాల్లో మునిగిపోతున్నారు. ► కేంద్ర ప్రభుత్వం 2017లో మెంటల్ హెల్త్ కేర్ చట్టాన్ని తెచ్చినా.. ఇంటర్నెట్ వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు నిర్దిష్ట రక్షణ చర్యలు పొందుపర్చకపోవడంతో పరిస్థితి చేయి దాటుతోందని సర్వేలో వివరించారు. ► ఐటీ చట్టంలోనూ అనేక సవరణలు చేయాల్సిన అవసరముందని వారు పేర్కొంటున్నారు. ► పబ్జి వంటి గేమ్స్ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తి కొన్నిసార్లు హింసా ప్రవృత్తికి కారణమవుతోందని పేర్కొంటున్నారు. అవాంఛనీయ సైట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని తెలిసో తెలియకో చూసి అనుసరించే పిల్లలు వాటిలో నిమగ్నమవుతూ మానసిక, శారీరక సమస్యలకు లోనవుతున్నారని వివరించారు. ► స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు వినియోగిస్తూ గేమ్స్ వంటి వాటిలో విద్యార్థులు నిమగ్నం అవుతున్నందున పాఠ్యాంశాలపై దృష్టి పెట్టలేకపోతున్నారని సర్వే పేర్కొంది. దీనివల్ల చదువుల్లో వెనుకబడిపోతున్నారని వివరించింది. ► స్మార్ట్ ఫోన్ల వల్ల సామాజిక సంబంధాలకు దూరంగా ఉండిపోతున్నారని, ఇది మెదడులో జన్యుపరమైన సమస్యలకు దారితీస్తోందని వైద్య నిపుణులు పేర్కొన్నారని సర్వే తెలిపింది. ఇది పిల్లల్లో ‘నో మొబైల్’ ఫోబియా అనే కొత్త రుగ్మతను తెచ్చిపెట్టిందన్నారు. ► ఫలితంగా పిల్లలు ఆందోళన, నిరాశ, చిరాకు, ఒంటరితనం ఎక్కువై మానసిక వైకల్యంలో పడుతున్నట్టు స్పష్టం చేశారు. ► స్మార్ట్ ఫోన్ల వినియోగం వల్ల 8–18 ఏళ్లలోపు పిల్లలు నిద్ర లేమికి గురవుతున్నారని.. ఫలితంగా వారిలో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతోందని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
భారత్లోనూ ‘ఈ–సిమ్’ సేవలు.. స్పెషల్ ఏంటో తెలుసా?
సాక్షి, అమరావతి: సెల్ఫోన్లలో ఉపయోగించే సిమ్(సబ్స్రై్కబర్ ఐడెంటిటీ మాడ్యూల్) కార్డు మాయమైపోతోంది. పెద్ద సైజు నుంచి క్రమంగా నానో సైజుకు వచ్చేసిన సిమ్ కార్డు.. ఇప్పుడు కంటికి కనిపించకుండా డిజిటల్ రూపంలోకి మారిపోయింది. అందుబాటులోకి వస్తోన్న అత్యాధునిక సెల్ఫోన్లు, వాచ్లతో పాటే ‘ఈ–సిమ్’లూ విస్తృతంగా వినియోగంలోకి వచ్చేస్తున్నాయి. కొన్నేళ్ల కిందటే ఇది మార్కెట్లోకి వచ్చినా.. అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ప్రస్తుతం సైబర్ మోసాలు భారీగా పెరుగుతుండటంతో అత్యధిక మంది ‘ఈ–సిమ్’పై ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మొబైల్ స్టోర్కు వెళ్లకుండానే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండడం ఇందులో ప్రత్యేకత. సిమ్ కార్డులతో పెరిగిన మోసాలు కొన్నేళ్లుగా ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టెలికాం సంస్థలు, బ్యాంకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో చాలా కేసులు సిమ్ స్వాప్ మోసాలకు సంబంధించినవే. ఇందులో నేరగాళ్లు మొదట ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీల వంటివి సేకరిస్తారు. వివిధ ఆకర్షణీయ ఈ–మెయిల్స్, మెసేజ్లు పంపించి, ఫోన్ కాల్స్ చేసి అవతలి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత.. ఫోన్ పోగొట్టుకున్నామని, లేదా పాత సిమ్ పాడైపోయిందని చెప్పి నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకుంటారు. టెలికాం ఆపరేటర్ కంపెనీకి సమర్పించిన వివరాలు సరైనవే అయితే.. మోసగాడు సులువుగా బాధితుడి నంబర్తో కొత్త సిమ్ తీసుకుంటాడు. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత పూర్తి కంట్రోల్ హ్యాకర్ చేతికి వెళ్లిపోతుంది. ఇక సులువుగా మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బుతో పాటు ఫోన్లోని రహస్య సమాచారమంతా లాగేస్తాడు. ఈ–సిమ్తో అడ్డుకట్ట.. ఈ–సిమ్ అనేది ప్రస్తుతం మనం ఫోన్లలో వినియోగిస్తున్న ఫిజికల్ సిమ్కు డిజిటల్ రూపం. దీన్ని యాక్టివేట్ చేయాలంటే వ్యక్తిగత వివరాలతో పాటు పర్సనల్ ఐడెంటిఫియబుల్ ఇన్ఫర్మేషన్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ–సిమ్ అకౌంట్ను సెక్యూర్గా ఉంచుకోవడానికి ఫేస్ ఐడీ లేదా బయోమెట్రిక్ విధానంలో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఒకరు ఈ–సిమ్ వాడుతున్నప్పుడు మరొకరు సిమ్ పోయిందని లేదా పాడైపోయిందని నెట్వర్క్ ప్రొవైడర్కు ఫిర్యాదు చేయడానికి కుదరదు. అదే నంబర్తో మరో సిమ్ను తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరైనా అలా చేస్తే.. వారు సైబర్ నేరగాళ్లుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం అమెరికాలో వినియోగిస్తున్న ఐఫోన్–14 మోడల్స్కు సిమ్ స్లాట్స్ లేవు. ఇవి ఈ–సిమ్ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సులభంగా యాక్టివేషన్.. డీ–యాక్టివేషన్ వీటిని సులభంగా యాక్టివేట్ చేయడంతో పాటు డి–యాక్టివేట్ కూడా చేయవచ్చు. మలి్టపుల్ ఫోన్ నంబర్లు, ప్లాన్లను ఒకే డివైజ్లో వినియోగించుకోవచ్చు. అంటే సింగిల్ సిమ్ మాత్రమే సపోర్టు చేసే లేటెస్ట్ ఫోన్లలో అదనంగా ఈ–సిమ్ కూడా వినియోగించుకోవచ్చన్నమాట. వీటిని పోగొట్టుకోవడం, పాడవడం లేదా దొంగిలించడం వంటివి సాధ్యం కాదు. వివిధ నెట్వర్క్లకు, ప్లాన్లకు సులువుగా మారవచ్చు. పైగా నెట్వర్క్ ప్రొవైడర్ స్టోర్కు వెళ్లే అవసరం కూడా ఉండదు. అన్నీ రిమోట్ విధానంలోనే ఎస్ఎమ్ఎస్, ఈ–మెయిల్ ద్వారానే యాక్టివేట్ చేయవచ్చు. అయితే, మనం వాడుతున్న స్మార్ట్ఫోన్ ఈ–సిమ్ను సపోర్ట్ చేస్తుందా.. టెలికాం ఆపరేటర్ ఈ తరహా సదుపాయాలు అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి. మనదేశంలో ఐఫోన్, శామ్సంగ్, హానర్, గూగుల్ ఫ్లిక్స్, సోనీ, షావోమీ, నోకియా, మొటొరోలా తదితర కంపెనీలకు చెందిన కొన్ని స్మార్ట్ఫోన్లకు మాత్రమే ఈ–సిమ్ను సపోర్టు చేస్తున్నాయి. మొదటిసారిగా శామ్సంగ్లో.. ప్రపంచంలో మొట్టమొదట ఈ–సిమ్ను 2016లో శామ్సంగ్ గేర్ ఎస్2 3జీ స్మార్ట్వాచ్ కోసం అందుబాటులోకి తెచ్చారు. అనంతరం 2017లో యాపిల్ స్మార్ట్ వాచ్లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. అతి తక్కువ కాలంలోనే పలు స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు తమ ఫోన్లలో ఈ–సిమ్ సపోర్టును ఏర్పాటు చేయగా.. పలు టెలికాం సంస్థలు ఈ–సిమ్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలో భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్–ఐడియా ఈ–సిమ్ సేవలను అందిస్తున్నాయి. -
మనోళ్లు ‘స్మార్ట్’గా అడిక్ట్!.. ఫోన్, యాప్స్కు బానిసలుగా..
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్మార్ట్ ఫోన్లు, మొబైల్ యాప్స్ (అప్లికేషన్స్) వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఫోన్ వినియోగం అడిక్షన్ స్థాయికి చేరుతోంది. 2022 ఏడాదిలో భారత యూజర్లు రోజుకు సగటున ఐదు గంటల పాటు మొబైల్స్తోనే కాలక్షేపం చేశారు. ఆ ఏడాదికాలంలో ఏకంగా 28.8 బిలియన్ల యాప్ డౌన్లోడ్లు చేసి.. ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచారు. 111 బిలియన్ల డౌన్లోడ్లతో చైనా టాప్ ప్లేస్లో నిలిచింది. వివిధ మొబైల్ యాప్స్లో సమయం గడుపుతున్న విషయంలోనూ భారత్ రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా అందరూ కలిపి గతేడాది మొత్తం 0.74 ట్రిలియన్ గంటలు (74 వేల కోట్ల గంటలు) మొబైల్స్లోనే కాలం గడిపారు. ‘యాప్ ఆనీ (ఇటీవలే డేటా.ఏఐగా పేరు మారింది)’ ఇటీవల విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ద మొబైల్ రిపోర్ట్–2023’ నివేదికలో ఈ ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ కొనుగోళ్లలోనూ బిజీగా.. షాపింగ్కు సంబంధించి ఆన్లైన్ కొనుగోళ్లలోనూ భారతీయులు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు మొత్తంగా 110 బిలియన్ల గంటలు ఆన్లైన్ కొనుగోళ్లలో గడపగా.. అందులో భారతీయులు గడిపిన సమయం 8.7 బిలియన్లు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్లోడ్ చేసిన పది ఫైనాన్స్ యాప్లలో ఐదు (పేటీఎమ్, గూగుల్పే, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ యోనో యాప్) మన దేశంలోనే ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. 2022లో ఇండియన్ల ఫ్రెండ్షిప్, డేటింగ్ యాప్ల వినియోగం రెండింతలు పెరిగిందని నివేదిక పేర్కొంది. గతేడాది ఈ యాప్స్పై 9.9 మిలియన్ డాలర్ల (2021లో 4.5 మిలియన్ డాలర్లు) మేర ఖర్చు చేసినట్టు అంచనా. కల్పిత రిలేషన్షిప్లు.. మోసాలు.. మొబైల్స్, యాప్స్ వినియోగానికి అలవాటుపడ్డవారు తమకు అంతగా పరిచయం లేనివారి నుంచి కూడా పరోక్ష సాంత్వన కోరుకుంటున్నారు. యాప్స్తో పరిచయమయ్యేవారు నిజ స్వరూపాన్ని దాచి, కల్పిత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు ఎక్కువ. అమాయకత్వం నుంచి క్రిమినల్ బిహేవియర్ ఉన్న వారిదాకా తమ పద్ధతుల్లో ఈ యాప్స్ను ఉపయోగించడమో, దుర్వినియోగం చేయడమో జరుగుతోంది. ఈ దుష్ప్రభావాలను గుర్తెరిగి ప్రవర్తించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ నిశాంత్ వేమన, సైకియాట్రిస్ట్, సన్షైన్, చేతన హాస్పిటల్స్ జనంలో బద్ధకం పెరిగిపోతోంది విపరీతంగా మొబైల్, యాప్స్ వినియోగంతో జనంలో బద్ధకం పెరిగిపోతోంది. బంధువులు, స్నే హితులు, సన్నిహితులను కలుసుకునేందుకు కూడా ఉత్సాహం చూ పడం లేదు. ఊబకాయులు, మధుమేహ పీడితులు, ఇతర అనారోగ్యాల బాధితుల సంఖ్య కూడా ఎగబాకుతోంది. ఇది రాబోయే రోజుల్లో భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. వివిధ యాప్ల వినియోగం విషయంలో ప్రభుత్వపరంగా రెగ్యులేటరీ విధానం ఉండాలి. స్కూళ్లలో ఐదో తరగతి నుంచే ఈ యాప్లపై అవగాహన కల్పించాలి. –సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
లావాకి షాకిచ్చిన సెబీ.. ఐపీవోకు బ్రేక్
న్యూఢిల్లీ: మొబైల్ తయారీ దేశీ కంపెనీ లావా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కంపెనీ దాఖలు చేసిన ప్రాథమిక దరఖాస్తును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెనక్కి పంపించింది. కొన్ని అంశాలలో తాజా సమాచారాన్ని క్రోడికరించి తిరిగి ప్రాస్పెక్టస్ను దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. వెరసి లావా లిస్టింగ్ ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. లావా, జోలో బ్రాండ్లతో మొబైల్ హ్యాండ్ సెట్లు, ట్యాబ్లెట్లు తదితర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను లావా ఇంటర్నేషనల్ రూపొందిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా కంపెనీ 2021 సెప్టెంబర్లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.37 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను బ్రాండుకు ప్రాచుర్యం, ఇతర సంస్థల కొనుగోళ్లు, అనుబంధ సంస్థలలో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. చదవండి: విమాన ప్రయాణం.. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమంటారు, ఎందుకో తెలుసా? -
సంసారంలో స్మార్ట్ఫోన్ చిచ్చు.. గంటల తరబడి అదే పని!
బనశంకరి(బెంగళూరు): స్మార్ట్ ఫోన్ నిత్య జీవితంలో భాగమైపోగా, దానివల్ల సంసార జీవితం సమస్యల్లోనూ పడుతోందని తరచూ జరిగే ఉదంతాలు చాటుతున్నాయి. మొబైల్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, కానీ విపరీతంగా వినియోగంతో భార్యభర్తల బాంధవ్యం బీటలు వారే ప్రమాదముంది. తద్వారా కుటుంబాల్లో సంక్షోభం ఏర్పడుతోందని బెంగళూరుతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఒక సర్వే హెచ్చరించింది. అందులో 88 శాతం సమీక్షలో స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తలెత్తే దుష్పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబానికి తక్కువ సమయం ► సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థతో కలిసి వివో అధ్యయనం సాగించింది. స్మార్ట్ ఫోన్లు, మానవ సంబంధాలపై వాటి పరిణామాలు – 2022 అనే పేరుతో సర్వే చేయగా, ఎక్కువమంది దంపతులు స్మార్ట్ ఫోన్ను మితిమీరి వినియోగిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ► దీని వల్ల కుటుంబంతో తక్కువ సమయం గడుపుతున్నట్లు 89 శాతం మంది తెలిపారు. ► స్మార్ట్ ఫోన్ తమ దృష్టి ఆకర్షిస్తుందని సమీక్షలో పాల్గొన్న 69 శాతం మంది తెలిపారు. అంతేగాక జీవిత భాగస్వామిపై దృష్టి సారించడంలేదని చెప్పారు. ► ఖాళీ సమయం దొరికితే మొబైల్తో గడుపుతున్నామని చెప్పారు. మొబైల్ కారణంగా తమ ప్రవర్తనలో మార్పు వచ్చిందని 88 శాతం మంది అంగీకరించారు. చదవండి: ఘరానా దొంగలు..ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు ! -
స్మార్ట్గా అతుక్కుపోతున్నారు.. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం మనిషి బాహ్య ప్రపంచానికి దూరంగా ఆన్లైన్లో గడుపుతున్నాడు. పక్కవాడిని కూడా చాటింగ్లోనే పలకరిస్తున్నాడు. సుఖదుఃఖాలన్నీ కూర్చున్నచోటునే అనుభవిస్తున్నాడు. గంటల కొద్దీ స్మార్ట్ఫోన్, టీవీ, ఇంటర్నెట్ స్క్రీనింగ్లో మునిగిపోతున్నాడు. దైనందిన జీవితంలో చాలామంది మేల్కొని ఉండే సమయంలో ఏకంగా 44 శాతం సమయాన్ని స్క్రీనింగ్ కోసమే కేటాయిస్తుండటం (40 శాతం ఇంటర్నెట్లో) ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటు స్క్రీనింగ్ రేటు 6.58 గంటలుగా ఉంది. ఇది 2013తో పోలిస్తే 49 నిమిషాలు పెరగడం గమనార్హం. అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 10.46 గంటలు, అమెరికాలో అయితే 7.04 గంటలు, భారత్లో అయితే 7.18 గంటలుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులతో కలిసి 0–2 ఏళ్లలోపు పిల్లలు 49 శాతం మంది సెల్ఫోన్లలో ఉంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019లో సగటున 2.56 గంటల పాటు మొబైల్ స్క్రీన్ చూసిన వాళ్లు ఇప్పుడు 4.12 గంటలు చూస్తున్నారు. దేశంలో టీనేజర్లు అయితే ఏకంగా 8 గంటలకు పైగా ఆన్లైన్లోనే బతికేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సగటు స్క్రీనింగ్ సమయం కంటే ఎక్కువ. కళ్లు పొడారిపోతాయి ఎక్కువసేపు మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు చూడటంవల్ల కళ్లు పొడారిపోతాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి దురదలు, మంటలు వస్తుంటాయి. క్రమేణా నల్లగుడ్డు సమస్యలకు దారితీస్తాయి. వీటితో పాటు నిద్రలేమి, మానసిక సమస్యలకు దారితీస్తాయి. విద్యార్థులైతే చదువుపై దృష్టి సారించలేక పోవడం, చదివినవి మర్చిపోవడం వంటి సమస్యలకు గురవుతారు. అవసరమైన మేరకే టీవీలు, కంప్యూటర్, మొబైల్స్ను చూడాలి. – ఈఎస్ఎన్ మూర్తి, నేత్ర వైద్య నిపుణులు, జీజీహెచ్, విజయవాడ చిన్నారుల కోసం నిర్ణీత సమయం.. అమెరికన్ టీనేజర్లు అయితే కేవలం 3 గంటలు మాత్రమే టీవీ, వీడియోలు చూడటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. చైనాలో వారానికి మూడు గంటలు మాత్రమే చిన్నారులకు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రోజుకు 26 నిమిషాలు మాత్రమే నచ్చిన పరికరంలో నచ్చిన అంశాలను వీక్షించవచ్చు. ఇదే దారిలో జపాన్, రష్యా కూడా 30 నిమిషాలు, ఇజ్రాయెల్ 19 నిమిషాలు చాలంటూ పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. ఆరోగ్యానికి హానికరం గంటల కొద్దీ తదేకంగా టీవీలు, ఫోన్లు, ఇంటర్నెట్కు అతుక్కుపోతే తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, యుక్త వయస్కులకు స్మార్ట్ఫోన్ వ్యసనంగా మారింది. దీనిని నోమోఫోబియాగా పిలుస్తారు. ఫోన్ లేకుండా వారు ఉండలేరు. చిన్నారుల్లో మానసికంగా, భావోద్వేగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎలిమెంటరీ స్కూల్ స్థాయి పిల్లలు రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు స్క్రీనింగ్లో ఉంటే వారికి మెల్లగా స్థిరత్వాన్ని, నిర్ణయించుకునే శక్తి కోల్పోతారు. పలు దేశాల్లో 5–17 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో ఊబకాయం పెరిగింది. 9–10 ఏళ్ల వయసు పిల్లల్లో 3 గంటలకు పైగా స్క్రీన్ను చూస్తే టైప్–2 డయాబెటిస్ వచ్చినట్లు, గ్రహణశక్తిలో వెనుబడినట్లు గుర్తించారు. పెద్దల్లో అయితే నిద్రలేమికి దారితీస్తుంది. కంటి చూపును తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరం పనితీరులో మార్పులొస్తాయి. వీటిని అరికట్టేందుకు సోషల్ మీడియా వాడకాన్ని ప్రతిఒక్కరూ రోజుకు 30 నిమిషాలకు పరిమితం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, స్మార్ట్టీవీలు.. స్క్రీనింగ్కు ఎక్కువగా కారణమవుతున్నాయి. అయితే, వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వాళ్లే ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్లో ఎక్కువసేపు లీనమవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో 97.2 శాతం మంది టీవీ, 92 శాతం మంది వీడియో గేములు ఆడుతున్నట్లు సర్వేల్లో తేలింది. ఇక్కడ 74 శాతం తల్లిదండ్రులు ఏడేళ్ల వయసు పిల్లలతో కలిసి ఎక్కువగా టీవీలు చూస్తున్నారు. -
మోసపూరిత, వేధింపు కాల్స్కు అడ్డుకట్ట.. త్వరలో అమల్లోకి కొత్త రూల్!
న్యూఢిల్లీ: మోసపూరిత, వేధింపు కాల్స్కు అడ్డుకట్ట వేసే దిశగా తలపెట్టిన కాలర్ ఐడెంటిటీ (సీఎన్ఏపీ) అంశంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. దీనిపై ప్రజలు డిసెంబర్ 27లోగా తమ అభిప్రాయాలు తెలపాలి. కౌంటర్ కామెంట్ల దాఖలుకు 2023 జనవరి 10 ఆఖరు తేదీ. సీఎన్ఏపీ అమల్లోకి వస్తే కాల్ చేసే వారి పేరు మొబైల్ ఫోన్లలో డిస్ప్లే అవుతుంది. తద్వారా గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ను స్వీకరించాలా వద్దా అనే విషయంలో తగు నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ట్రూకాలర్, భారత్ కాలర్ ఐడీ అండ్ యాంటీ స్పామ్ వంటి యాప్లు ఈ తరహా సర్వీసులు అందిస్తున్నాయి. అయితే, ఈ యాప్లలోని సమాచార విశ్వసనీయతపై సందేహాలు నెలకొన్నాయి. ప్రతి టెలిఫోన్ యూజరు పేరు ధృవీకరించే డేటాబేస్ .. టెలికం సంస్థలకు అందుబాటులో ఉంటే కచ్చితత్వాన్ని పాటించేందుకు అవకాశం ఉంటుంది. దీనిపైనే సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించేందుకు ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. చదవండి: డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే! -
‘స్మార్ట్’ గైడ్.. ఒక్క క్లిక్తో ఎక్కడెక్కడికో.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ‘స్మార్ట్ ట్రావెలింగ్’ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ను ట్రావెల్ టూల్గా ఉపయోగిస్తూ దేశ, విదేశాలను చుట్టేస్తున్నారు. మధ్యవర్తులు, టూర్ ఆపరేటర్లు లేకుండానే ఒక్క క్లిక్తో అరచేతిలో సమాచారాన్ని వీక్షిస్తూ ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా 18 నుంచి 64 ఏళ్ల వయసు గల ప్రయాణికుల్లో 71% మంది తమ పర్యటనల కోసం స్మార్ట్ ఫోన్లపై ఆధారపడుతున్నారు. భారతదేశంలో అత్యధికంగా 87% మంది ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ సాయంతోనే తమ ప్రయాణాలు చేస్తున్నట్లు గూగుల్, ఫోకస్ రైట్ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. ఫోన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లోని వాయిస్ మోడ్లో సూచనలు, టికెట్ బుకింగ్లో డిజిటల్ అసిస్టెంట్ సేవలు సులభంగా లభిస్తున్నాయి. పర్యాటకులు ఎంపిక చేసుకున్న ప్రదేశాలకు నావిగేషన్ సాయంతో తేలికగా చేరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రావెల్ కంపెనీలు కూడా కస్టమర్ జర్నీకి అనుగుణంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సేవలను ప్రవేశపెడుతున్నాయి. పర్యాటక రంగానికి ఊతం... భారతదేశం నుంచి 2024 నాటికి సుమారు 8 కోట్ల మంది విదేశీ పర్యటనలు చేస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసియా పసిఫిక్ డెస్టినేషన్ ఫోర్కాస్ట్–2022–24 రిపోర్టు ప్రకారం రానున్న రెండేళ్లలో 1.34 కోట్ల మంది విదేశీయులు భారతదేశాన్ని సందర్శిస్తారని అంచనా. దీనివల్ల కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రచారంలో డిజిటల్ పోటీ... కేరళ, మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఆన్లైన్ వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం వర్చువల్ ట్రావెల్ గైడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా టూరిజం లొకేషన్లను సులభంగా తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో వాటిని విరివిగా ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) కూడా సాంకేతిక వ్యవస్థను మెరుగుపరుస్తోంది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా పర్యాటకులు కచ్చితత్వంతో తమ ప్రయాణాలను ఎంపిక చేసుకునేలా సేవలు అందించనుంది. స్థానిక కళలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా పర్యాటక రంగానికి అనుసంధానిస్తూ జీఐఎస్ వెబ్సైట్ను రూపొందిస్తున్నారు. -
హమ్మయా!.. తిరిగొచ్చిన సెల్ఫోన్లు
కొరాపుట్(భువనేశ్వర్): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన సెల్ఫోన్లు.. తిరిగి యజమానుల చేతికందాయి. వీటిని నవరంగపూర్ ఎస్పీ కార్యాలయంలో బాధితులకు అందించారు. నవరంగ్పూర్ జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎస్.సుశ్రీ సమక్షంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న, అపహరణకు గురైన సెల్ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు..రూ.5 లక్షల విలువైన 49 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బాధితులకు సమాచారం అందించి, ఎస్పీ స్వయంగా సెల్ఫోన్లు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్ఎం ప్రధాన్, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: వామ్మో ఈ ఫైటింగ్ ఏంది..? కోర్టులోనే రెచ్చిపోయిన మహిళా లాయర్లు.. జుట్లు పట్టుకొని.. -
అంగన్వాడీల్లో ఇక స్మార్ట్ సేవలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు సెల్ఫోన్లను అందిస్తున్నారు. అయితే త్వరలో అధికారికంగా స్మార్ట్ ఫోన్ల సేవల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్ సేవలతో అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకంగా సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. 1.57 లక్షల మందికి పౌష్టికాహారం జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా అందులో అంగన్వాడీ కేంద్రాలు, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 2212, మినీ అంగన్వాడీ కేంద్రాలు 177 కలిసి మొత్తం 2389 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,57,015 లక్షల మందికి పైగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంతోపాటు కోడిగుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి పేద, మధ్య తరగతి చిన్నారులు, మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రతి బడ్జెట్లో కోట్లాది రూపాయలు కూడా కేటాయిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఫోన్ల పంపిణీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలు అరికట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లకు శ్రీకారం చుడుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు, వారిని పర్యవేక్షించే సూపర్వైజర్లకు కూడా కొత్తగా స్మార్ట్ ఫోన్లను మంజూరు చేశారు. జిల్లాకు 2445 సెల్ఫోన్లు మంజూరయ్యాయి. వీటిని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. 2445 స్మార్ట్ఫోన్లు జిల్లాలోని 11 ప్రాజెక్టులలో 2389 మంది కార్యకర్తలకు, 56 మంది సూపర్వైజర్లకు రాష్ట్ర ప్రభుత్వం విధుల నిర్వహణ నిమిత్తం 2445 స్మార్ట్ ఫోన్లను మంజూరు చేసింది. వీటి ద్వారా ఆయా సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ సమాచారాన్ని ఫీడ్ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. పక్కాగా పౌష్టికాహారం పంపిణీ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిరోజు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని వైఎస్సార్ సంపూర్ణ పోషణ ట్రాక్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంతోపాటు అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా అవగాహన కల్పించాలి. అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా అంగన్వాడీ కేంద్రాలు అందించే ప్రతి కార్యక్రమాన్ని ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టడంతోపాటు పారదర్శకమైన సేవలు అందించేందుకు మార్గం సుగమమవుతోంది. అంతేకాకుండా రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. పారదర్శకమైన సేవలు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. ఈ స్మార్ట్ సేవలతో అక్రమాలకు చెక్ పెట్టినట్లవుతుంది. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టికాహారంతోపాటు అనేక సేవా కార్యక్రమాలను పొందుపరచాల్సి ఉంటుంది. -ఎంఎన్ రాణి, ప్రాజెక్టు డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కడప -
5G సేవలు వచ్చేశాయ్.. మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవో తెలుసా!
దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సేవలు ఉపయోగించాలంటే వినియోగదారుల ఫోన్ 5జీ టెక్నాలజీకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్గా ఉంటోంది. ఒకవేళ మీ మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ లో ఎక్కడా కూడా మీకు 5జీ అనేది కనిపించకపోతే, మీ ఫోన్ దీనికి సపోర్ట్ చేయదనే అర్థం. అలాంటప్పుడు మాత్రం మీరు 5జీని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో 5G స్మార్ట్ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022లో 5జీ స్మార్ట్ఫోన్లకు డిస్కౌంట్లు, ఆఫర్స్ ఇస్తూ చవకైన ధరలకే సేల్ నిర్వహిస్తోంది. రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G) Redmi 11 Prime 5G .. 4GB RAM + 64GB స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 13,999 గా ఉంది. దసరా సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 లో ఇది తగ్గింపుతో రూ. 12,999 వస్తోంది. దీంతో పాటు అదనంగా, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ 12,150 కే లభిస్తోంది. ఈఎంఐ( EMI) ఆఫర్ కూడా ఉందండోయ్, నెలకు రూ.621తో ఈ ఫోన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. Amazon Pay ఆధారంగా అదనపు డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. రియల్మి నార్జో 50 5జీ (Realme Narzo 50 5G) రియల్మి నుంచి వచ్చిన మరో 5జి స్మార్ట్ ఫోన్లలో రియల్ మి నార్జో 50 5Gనే చవకైన ఫోన్ అని చెప్పాలి. మార్కెట్లోకి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 15,999 గా ఉంది. ఇదే ఫోన్ ప్రస్తుతం అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా రూ. 12,249 గా లభిస్తోంది. వీటితో మీ వద్ద పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈఎంఐ చెల్లింపులో ఫోన్ ని కొనుగోలు చేస్తే.. రూ 750 కే ఈ ఫోన్ లభిస్తుంది. ఐకూ z6 లైట్ 5G (iQoo Z6 Lite 5G) iQoo Z6 Lite 5G బేస్ మోడల్ ధర రూ. 13,999గా ఉంది. స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా భారీగానే ఇస్తున్నారు. SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు రూ. ఫ్లాట్-రేట్పై అదనపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం13 5G (Samsung Galaxy M13 5G) Samsung Galaxy M13 5G ప్రస్తుతం అమెజాన్లో దీని ధర రూ.11,999. ప్రారంభంలో ఈ మోడల్ ధర రూ. 13,999గా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్లకి ప్రత్యేక డిస్కౌంట్లు లభించనుంది. చదవండి: 5G Network FAQs In Telugu: 5జి వచ్చేస్తోంది.. మీ ఫోన్లో ఈ ఆప్షన్ ఉంటే సపోర్ట్ చేసినట్లే! -
స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి!
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల అమ్మకానికి ముందే ఐఎంఈఐ నంబర్ నమోదు తప్పనిసరి చేస్తూ టెలికం శాఖ ఆదేశాలు వెలువరించింది. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. దేశీయంగా తయారైన లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్కూ ఈ నిబంధన వర్తిస్తుంది. అమ్మకానికి ముందే టెలికం శాఖకు చెందిన ఇండియన్ కౌంటర్ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ పోర్టల్ నుంచి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ ధ్రువీకరణ పొందాల్సిందే. ప్రతి మొబైల్కూ 15 అంకెల ఐఎంఈఐ సంఖ్య ఉంటుంది. మొబైల్ పరికరాల గుర్తింపు సంఖ్యను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెలికం నెట్వర్క్లో ఒకే ఐఎంఈఐతో నకిలీ పరికరాలు ఉండటం వల్ల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం సాధ్యం కావడం లేదు. కోల్పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ట్రేస్ చేయడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రాజెక్ట్ను ప్రభుత్వం ప్రారంభించింది. అలాంటి హ్యాండ్సెట్ల విస్తరణను అరికట్టడానికి నకిలీ పరికరాల నియంత్రణకై ఇండియన్ కౌంటర్ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ వ్యవస్థను జోడించింది. దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్స్ను నిరోధించే సౌకర్యం మాత్రమే ప్రస్తుతం పోర్టల్లో అందుబాటులో ఉంది. చదవండి: బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు! -
5జి వచ్చేస్తోంది.. మీ ఫోన్లో ఈ ఆప్షన్ ఉంటే సపోర్ట్ చేసినట్లే!
ఈ అక్టోబర్లో భారతదేశం ఎట్టకేలకు 5జి మార్కెట్ కానుంది. మరి కొద్ది వారాల్లో మీ స్మార్ట్ ఫోన్ స్టేటస్ బార్ లో మీరు 5జి ఐకాన్ చూడడం సాధ్యపడే అవకాశం ఉంది. జులైలో స్పెక్ట్రమ్ విజయవంతంగా ముగిసిన తరువాత, భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు 5జి ని వినియోగించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీ లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 5జి సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి ఇటీవలే ప్రకటించారు. జియో, ఎయిర్ టెల్ ఈ సేవలను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా (వి) కి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మెట్రో నగరాలు మొదటగా 5జి సేవలను పొందనున్నాయి. తాము 5జి సేవలను అందించే విషయంలో కంపెనీలు ఎంతో విశ్వాసంతో ఉన్నాయి. అదే సమయంలో 5జి అనుభూతిని పొందేందుకు కస్ట మర్లు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. 5జి కి సంబంధించి కస్టమర్లు సమాధానాలు తెలుసు కోవాలనుకుంటున్న ప్రశ్నలు కూడా ఎన్నో ఉన్నాయి. 5జి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? దాన్ని నేను ఎలా పొందగలుగుతాను? నాకు కొత్త ఫోన్ అవసరమవుతుందా? నేను ఏ ఫోన్ తీసుకోవాలి? కొత్త సిమ్ కార్డ్ అవసరమవుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటిలో కొన్ని మాత్రం ముఖ్యమైనవే. నాకు 5జి అవసరమా? జీవనశైలిని అప్ గ్రేడ్ చేసుకోవాలనే భావనను పక్కనపెడితే, అసలు ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి మీరు ఏం పొందాలనుకుంటున్నారు అనే దానిపై ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన ఇంట ర్నెట్ అనేది ఎలాంటి బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేస్తుంది. అతి తక్కువ లాటెన్సీ (స్పందించే సమయం) తో హై - గ్రాఫిక్స్ గేమ్స్ ను ప్లే చేస్తుంది. మీ కనెక్షన్ స్లో అవుతుందేమో అన్న బాధ లేకుండా పలు ఉప కరణాలను ఉపయోగించవచ్చు. 5జి కనెక్షన్ పొందడం అనేది టెంప్టింగ్ గా ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. అది క్యూరియాసిటీ వల్ల కావచ్చు లేదా తోటి వారంతా దాని గురించి ముచ్చటించుకోవడం నుంచైనా కావచ్చు. హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సేవలకు అంతరాయం లేని యా క్సెస్ ను పొందేందుకు అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సీని 5జి అందిస్తుంది. భారతీయ స్మార్ట్ ఫోన్ విని యోగదారులకు సంబంధించి ఒక కన్జ్యూమర్ సర్వే ప్రకారం వేగవంతమైన నెట్ వర్క్ వేగాలు తమ మొబైల్ సేవలను మెరుగుపరుస్తాయని 42 శాతం మంది భావిస్తున్నారు. మరింత విశ్వసనీయమైన కనెక్షన్, మెరుగైన్ ఇన్ డోర్ కనెక్షన్ ఉంటాయని భావిస్తున్న వారి శాతం కూడా అధికంగానే ఉంది. భారతీయ ఆపరేటర్లు వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ సి-బ్యాండ్, సబ్-1GHz లలో అధిక సామర్థ్యాన్ని, కవరేజీని అందించనుంది. టాప్ లైన్ స్పీడ్స్ పరంగా చెప్పాలంటే, 5జి మార్కెట్లలో చేసిన ఈ అధ్యయనం ప్రకారం, ప్రస్తుత 4జి కంటే కూడా 5జి వేగం 7 నుంచి 10 రెట్లు అధికంగా ఉండనుంది అని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. మీరు గనుక అప్ గ్రేడ్ కావాలనుకుంటే, భారతదేశంలో 4జి ప్రవేశపెట్టబడినట్లుగానే, 5జి మీకు అందించే ప్రోత్సాహకాలు ఏమిటో తెలుసుకోండి. అప్పట్లో టారిఫ్ లలో అగ్రెసివ్ ప్రైసింగ్ (ధరలు బాగా తక్కువగా ఉండడం) వెనుక పోటీ కూడా ఒక కారణంగా ఉండింది. ఈ రెండు అంశాలతో పాటుగా 5జికి గల డిమాండ్, దేశంలో 5జి సేవల ప్రోత్సా హకాలను ప్రభావితం చేయనున్నాయి. 2016లో జియో మొదలైనప్పుడు అది మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు, మార్కెట్ వాటా పొందేం దుకు తన నూతన 4జి నెట్ వర్క్ పై సుమారుగా 6 నెలల పాటు వాయిస్, డేటాను ఉచితంగా అందించింది. దీంతో 4జి మార్కెట్ లో జియో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 5జి సేవలను అందించడంలో పోటీలో ముందు ఉండాలని భారతీయ ఆపరేటర్లు తహతహలాడుతున్న తరుణంలో ఆకర్షణీయ 5జి అప్ గ్రేడ్ ఆఫర్లు మార్కెట్ ను ముంచెత్తే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జియో 'ట్రూ 5జి' సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే ప్రకటించారు. నా ఫోన్ 5జికి సిద్ధంగా ఉందా? మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు సులభమార్గం ఉంది. 2019లోనే దేశంలో మొదటి 5జి ఫోన్ రావడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మీరు మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్స్ ను లేదా మీ సిమ్ కార్డ్ కు సంబంధించి ప్రిఫర్డ్ నెట్ వర్క్ ను పరిశీలించండి అది గనుక 5జి ని కూడా సూచిస్తే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. ఓక్లా నిర్వహించిన ఒక మార్కెట్ సర్వే ప్రకారం చూస్తే, భారతీయులు 5జి ఫోన్ ఉపయోగిస్తూ తమ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ను పరీక్షించుకుంటున్నారు. ఎంతో మంది భారతీయులు ఇప్పటికే 5జి సామర్థ్యం కలిగిన ఉపకరణాలు ఉపయోగిస్తూ స్పీడ్ టెస్ట్ యాప్ ను రన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే, 5జి అప్ గ్రేడేషన్ అనేది ఖరీదైన హ్యాండ్ సెట్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే, ఒక నూతన మొబైల్ రీచార్జ్ ప్లాన్ ను కొనుగోలు చేసినంత సులభం కానుందని ఈ సర్వే తెలుపుతోంది. 5జి అనేది ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్ గా ఉంటోంది. మీ మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ లో ఎక్కడా కూడా మీకు 5జి అనేది కనిపించకపోతే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేయదనే అర్థం. అలాంటప్పుడు మాత్రం మీరు 5జిని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కొత్త 5జి ఫోన్ అవసరమా? అక్టోబర్ మొదలుకొని వచ్చే ఏడాది నాటికి వివిధ భారతీయ నగరాల్లో 5జి అందుబాటు లోకి రానుంది. ప్రస్తుతానికి మాత్రం అది మెట్రో నగరాల్లోనే లభ్యం కానుంది. మీరు గనుక ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరులలో నివసిస్తున్నట్లయితే, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అనుభూతి పొందేందుకు మీ వద్ద 5జి ఫోన్ ఉండాల్సిందే. 5జి ఫోన్ ను కొనడం ఎంతో ప్రయోజనదాయకం అవుతుంది. అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, గురుగ్రామ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ఇతర నగరాల్లో 5జి కనెక్టివిటీ మరికొన్ని రోజుల తరువాత రానుంది. దేశంలో 5జి మొదటగా ఆవిష్కరించబడే 13 నగ రాల పేర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. మొదట పెద్ద పెద్ద నగరాల్లో ఈ కవరేజీ అందుబాటులోకి రానుంది. తమ పెట్టుబడులపై ప్రతిఫలాలు రావచ్చు అన్న అంచనాతో టార్గెట్లపై ఆపరేటర్లు పని చేస్తున్నారు. టాప్ 100 భారతీయ నగరాల్లో 5జి కవరేజ్ ప్లానింగ్ ను ఇప్పటికే పూర్తి చేసి నట్లుగా జియో ప్రకటించింది. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని నగరాల్లోనూ కవర్ చేయాలన్న సంకల్పంతో ఎయిర్ టెల్ ఉంది. నా ముందున్న ఆప్షన్లు ఏంటి? వివిధ ధరల శ్రేణుల్లో యాపిల్ ఐఫోన్లు, సామ్ సంగ్, షావోమి, పోకో, రియల్ మి, వివో వంటి బ్రాండ్లు 5జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్నాయి. 5జి చిప్ సెట్ తయారీ సంస్థలైన మీడియా టెక్, క్వాల్ కమ్ వంటి వాటితో వ్యూహా త్మక ఒప్పందాలతో ఓఈఎంలు చాలా తక్కువ ధరకే అంటే రూ. 15,000లకే 5జి స్మార్ట్ ఫోన్లను అందించ గలుగుతున్నాయి. ఇది 5జి సేవల కోసం మరింత మంది ముందుకు వచ్చేలా చేస్తుంది. రియల్ మి వంటి బ్రాండ్లు రూ.10,000 లోపుగానే 5జి ఫోన్లను అందించేందుకు వాగ్దానం చేశాయి. 5జి స్మార్ట్ ఫోన్లను కొనాలనుకునే వినియోగదారులు అనుకూలతలు, ప్రతికూలతలు అన్ని ఒకసారి బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. తమకు సరిపోయే ఫీచర్లు గల ఫోన్ కోసం చూడాలి. 5జీ ఫోన్ కొనేటప్పుడు ఏయే అంశాలను చూడాలి? కొత్త ఫోన్ కొనేటప్పుడు 5జి తో పాటు మరెన్నో ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 5జి అనేది నేడు ఫోన్లకు ఒక తప్పనిసరి ఆవశ్యకతగా మారింది. రిటైల్ బాక్స్ లపై ‘‘5జి’’ అని ముద్రించబడి ఉంటుంది. అది ఒక్కటి మాత్రమే సరిపోదు. మరే ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలో చూద్దాం. 5-జి రెడీ ఫోన్ ఒక్కటే సరిపోదు. ఏ విధమైన 5జి బ్యాండ్స్ ను మీ ఫోన్ సపోర్ట్ చేస్తుందో కూడా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమాచారం ఫోన్ రిటైల్ బాక్స్ పై సులభంగా అందుబాటులో ఉంటుంది. 5జి స్పెక్ట్రమ్ లో మూడు బ్యాండ్స్ ఉంటాయి, వీటినే టెలికాం కంపెనీలు పొందాయి. లో – బ్యాండ్, మిడ్ -బ్యాండ్, హై- బ్యాండ్. లో-బ్యాండ్ అనేది 700MHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది. దీన్నే n28గా కూడా వ్యవహరిస్తారు. మిడ్ బ్యాండ్ అనేది 3500MHz ను కలిగి ఉంటుంది. దీన్నే n78 అని వ్యవహరిస్తారు. దాదాపుగా ప్రతీ 5జి ఫోన్ కూడా n78 ను సపోర్ట్ చేస్తుంది. కానీ బాగా ఖరీదైన ఫోన్లలోనే n28ను మీరు గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే 700MHz అనేది స్టాండ్ అలోన్ 5జి సేవలకు ఉద్దేశించింది. రిలయన్స్ జియో ఒక్కటి మాత్రమే దీన్ని అందించగలదు. హై-బ్యాండ్ అనేది 26GHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది. దీన్ని mmWave గా, n258గా వ్యవహరిస్తారు. చాలా కొద్ది ఫోన్లు మాత్రమే n258ను సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే, ఇది mmWave కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ 5జి ఆరంభంలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. 5జి ఎంత వేగంగా ఉండవచ్చు? ప్రపంచవ్యాప్తంగా 5జి నెట్వర్క్ లు వినియోగదారులకు 1జీబీపీఎస్ కు మించిన వేగాన్ని అందించగలుగు తున్నాయి. భారతీయ టెల్కోలు 4జి కన్నా అధికంగా డౌన్ లోడ్, అప్ లోడ్ వేగాలను అందించేందుకు వాగ్దానం చేశాయి. అయితే, 5జి స్పీడ్ అనేది ఆపరేటర్ పైనే గాకుండా, లొకేషన్ పై కూడా ఆధారపడి ఉంటుంది. 5జి ఫోన్లో 4జి సిమ్ కార్డ్ పని చేస్తుందా? మీ ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ కొత్త 5జి ఫోన్లోనూ ఖచ్చితంగా పని చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, SMS మరియు వాయిస్ కాలింగ్ వంటి 4జి మరియు 5జి సేవలను పొందొచ్చు. భారతీయ టెలికాంలు NSA 5జి సాంకేతికతను అవలంబించడంతో, వారి ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ Rel 99+ ప్రమాణానికి మద్దతు ఇస్తుంది. ఈ ప్రమాణం 2జి, 3జి, 4జి, మరియు 5జి సేవలు అందించేందుకు అనుకూలంగా ఉంటుంది. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
బాబోయ్, నకిలీ బ్రాండెడ్ ఉత్పత్తులు.. ఆందోళనలో పెద్ద కంపెనీలు
పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్కు దేశంలో బలమైన డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు బ్రాండెడ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. బ్రాండెడ్ ఉత్పత్తులతో సమాంతరంగా నకిలీలు, దొంగిలించిన, చట్ట విరుద్ధంగా దిగుమతి చేసుకున్న ప్రొడక్ట్స్తో ఆఫ్లైన్, ఆన్లైన్ మార్కెట్ వృద్ధి చెందడం ఇందుకు కారణం. నకిలీలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోకపోవడం, చైనా నుండి తక్కువ ధరలకు పెద్దమొత్తంలో ఉత్పత్తులు వెల్లువెత్తుతుండడం కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. ఒకవైపు తమ ఉత్పత్తుల మార్కెటింగ్పై దృష్టిసారిస్తూనే మరోవైపు నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆహోరాత్రులూ శ్రమించాల్సిన పరిస్థితి బ్రాండెడ్ కంపెనీలది. 2019 సెప్టెంబర్లో ఫిక్కీ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్తోసహా అయిదు రంగాల్లో నకిలీ ఉత్పత్తులు, అక్రమ రవాణా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏటా రూ.1.17 లక్షల కోట్లు నష్టపోతోంది. పట్టుపడుతూనే ఉన్నాయి.. ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో ఇయర్ఫోన్స్, చార్జర్స్, అడాప్టర్స్, యూఎస్బీ కేబుల్స్ వంటి రూ.73.8 లక్షల విలువైన 9 వేల పైచిలుకు నకిలీ ఉత్పత్తులను సీజ్ చేసినట్టు షావొమీ ప్రకటించింది. 2020లో కంపెనీ రూ.33.3 లక్షల విలువైన సుమారు 3 వేల ఉత్పత్తులను సీజ్ చేసింది. దీనినిబట్టి చూస్తే నకిలీలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్లో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఈ నకిలీ ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయని షావొమీ అంటోంది. కోవిడ్ రాకతో ఈ ఉత్పత్తులను ఏకంగా ఆన్లైన్ వేదిక ద్వారా విక్రయిస్తున్నారని వెల్లడించింది. జేబీఎల్, ఇన్ఫినిటీ బ్రాండ్ నకిలీ ఉత్పత్తులను ఢిల్లీలో ఇటీవలే స్వాధీనం చేసుకున్నట్టు శామ్సంగ్ అనుబంధ కంపెనీ హర్మాన్ తెలిపింది. కాగా, ఐడీసీ గణాంకాల ప్రకారం భారత మార్కెట్లో 2022 జనవరి–జూన్ కాలంలో 3.8 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. నియంత్రణ లేక.. చిన్న గ్యాడ్జెట్స్లో నకిలీలను సులువుగా తయారు చేయవచ్చని, వీటిని చైనా నుంచి సులభంగా తీసుకు రావొచ్చని టెక్ఆర్క్ ఫౌండర్ ఫైజల్ కవూసా తెలిపారు. ‘ఆఫ్లైన్ మార్కెట్లు ప్రధాన విక్రయ కేంద్రంగా ఉన్నప్పటికీ.. ఆన్లైన్ మార్కెట్ప్లేస్లో కఠినమైన తనిఖీలు లేకపోవడం వల్ల నకిలీ ఉత్పత్తుల చెలామణి పెరిగింది. ఆన్లైన్లో ఎవరైనా ఉత్పత్తులను నమోదు (లిస్ట్) చేసి విక్రయించవచ్చు. ఇది నకిలీలను విక్రయించడాన్ని సులభతరం చేసింది’ అని వివరించారు. ఐఎంఈఐ నంబర్తో స్మార్ట్ఫోన్లను ట్రాక్ చేయడానికి, గుర్తింపునకు ఆస్కారం ఉంది. యాక్సెసరీస్కు ఇటువంటి సౌకర్యం లేదు. యాపిల్ఎయిర్పాడ్స్ను ఫోన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
కేంద్రం వార్నింగ్.. భారత్లోకి కొత్త రకం బ్యాంకింగ్ వైరస్ ఎంట్రీ!
బనశంకరి: నేరాలు దాని స్వరూపాన్ని మార్చుకుంటోంది. క్రెడిట్ కార్డులు బకాయిలు చెల్లించలేదని, ఏటీఎం కార్డు గడువు ముగిసిందని ఫోన్ చేసి ఓటీపీలు అడిగి డబ్బులు కాజేసేవారు. ఇప్పుడు కస్టమర్ల బ్యాంకు అకౌంట్లకు కన్నం వేసేందుకు సోవా అనే మొబైల్ బ్యాంకింగ్ ట్రోజన్ వైరస్ అడుగు పెట్టింది. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్, స్మార్ట్ఫోన్లలో మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్లను టార్గెట్గా చేసుకుని ఈ వైరస్ దాడి చేస్తుంది. అమెరికా, రష్యా, స్పెయిన్ అనంతరం భారత్ బ్యాంకింగ్ వినియోగదారులను టార్గెట్గా చేసుకుంది. జూలైలో ఈ వైరస్ భారత్లో కనబడగా ప్రస్తుతం మరింత అప్డేట్ కాబడి తన హవా కొనసాగిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ వినియోగదారులను టార్గెట్గా చేసుకుని దాడి చేస్తుంది. మొబైల్లో ప్రవేశించే ఈ వైరస్ను తొలగించడం (అన్ ఇన్స్టాల్) చాలాకష్టం. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ యాప్ల్లో దాగి ఉంటుంది. వివిధ రూపాల్లో.. పేమెంట్ యాప్ రూపంలో సోవా మీ మొబైల్లో చేరవచ్చు. బ్యాంకింగ్ ఇ–కామర్స్ యాప్లు రూపంలో కనబడవచ్చు. వాటిని వినియోగించినప్పుడు కస్టమర్లు వ్యక్తిగత వివరాలు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురి అవుతుందని జాతీయ కంప్యూటర్ భద్రతా అత్యవసర బృందం (సర్ట్స్ ఇన్) హెచ్చరించింది. గూగుల్క్రోమ్, అమెజాన్, ఎఫ్ఎఫ్టీ రూపంలో స్మార్ట్స్ ఫోన్లోనికి దొంగలా వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. అనంతరం వినియోగదారులకు తెలియకుండా పాస్వర్డ్ లాగిన్ వివరాలు చోరీ చేస్తుంది. ఇది ప్రమాదకరం సోవా–0.5 సోవా కానీ లేదా మరో వైరస్ కానీ సైబర్స్పేస్లో కస్టమర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలి సోవా అనేది కొత్తది కాదు. విదేశాల్లో ఇది చాలా వరకు దెబ్బతీసింది. ప్రస్తుతం భారత్లో ప్రవేశించిన సోవా 5.0 మరింత ప్రమాదకారి అని సైబర్ నిపుణుడు జీ.అనంతప్రభు తెలిపారు. మొబైల్ లేదా కంప్యూటర్లో రారయండ్ సమ్వేర్లో చేరుకుని మీ అకౌంట్ను లాక్ చేస్తుంది. అన్లాక్ చేయడానికి సైబర్ వంచకులు డబ్బు అడుగుతారు. ఈ ఫ్యూచర్ సైతం సోవాకు చేరుతుంది. కస్టమర్లు జాగ్రత్త వహించాలి. గూగుల్, ఫేస్బుక్, జీ మెయిల్ వినియోగదారులను టార్గెట్గా చేసుకుని దాడి చేస్తుంది. బ్యాకింగ్ వ్యవహారాలకు కన్నం వేస్తుంది. 200కు పైగా యాప్లు బ్యాంకింగ్ అప్లికేషన్లు, క్రిప్టో ఎక్సేంజీలు, వ్యాలెట్లతో పాటు 200కు పైగా మొబైల్ అప్లికేషన్లను కొత్త వైరస్ టార్గెట్ చేసుకుంటుందని భద్రతా సంస్థ తెలిపింది. వినియోగదారులు తమ నెట్బ్యాకింగ్ అప్లికేషన్లకు లాక్ ఇన్ చేయగా, బ్యాంక్ అకౌంట్లలో ప్రవేశించినప్పుడు ఈ సోవా మాల్వేర్ డేటాను కాజేస్తుంది. సైబర్ సాక్షరత సమస్యకు పరిహారమని ఐటీ నిపుణుడు వినాయక్ పీఎస్, తెలిపారు. ఇలా జాగ్రత పడాలి : - మొబైల్ బ్యాంకింగ్ వ్యవహారాలు చేసేవారు తమ అకౌంట్ను రెండు దశల్లో ధ్రువీకరణ (ఐడెంటీఫికేషన్) వ్యవస్థ వినియోగించాలి. - బ్యాంకింగ్ యాప్లను నిత్యం అప్డేట్ చేయాలి - కచ్చితంగా ఉత్తమమైన యాంటీ వైరస్ మొబైల్ వినియోగించాలి - మొబైల్స్కు వచ్చే ఎలాంటి లింక్లను క్లిక్ చేయరాదు - యాప్లు, ఓపెన్, బ్రౌజర్లు నిత్యం అప్డేట్ చేసి అధికారిక యాప్ స్టోర్ నుచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్లును మాత్రమే వినియోగించాలి. - పబ్లిక్ వైఫైను వినియోగించడం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. -
మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సాంకేతికత
‘‘కర్నూలు సిటీలోని గణేశ్నగర్ వాసి మహ్మద్ రిజ్వాన్ వెన్నునొప్పితో గాయత్రి ఎస్టేట్లోని ఓ న్యూరోఫిజిషియన్ వద్దకు వెళ్లారు. డాక్టర్ ఆరాతీస్తే రోజూ అర్ధరాత్రి ఒంటిగంట వరకూ మేల్కొని సెల్ఫోన్ చూస్తుంటారని తేలింది. ఇతనికి ఇదొక్కటే సమస్య కాదు కంటిచూపు తగ్గడం, విపరీతమైన తలనొప్పి కూడా ఉన్నాయి.’’ ‘‘మనస్విని అనే ఐదోతరగతి చదువుతోన్న చిన్నారి ఏక్యాంపులో నివాసం ఉంటోంది. ఈ వయస్సుకే దృష్టిలోపం వచ్చింది. ఆస్పత్రికి వెళితే కంటిచూపు ‘మైనస్ వన్’ ఉందని అద్దాలు ఇచ్చారు. స్కూలు నుంచి రాగానే సెల్ఫోన్, టీవీకి అతుక్కుపోతుందని, గట్టిగా మందలిస్తే భోజనం చేయకుండా మారం చేస్తుందని, తాము ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు’’ సాక్షిప్రతినిధి, కర్నూలు: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. 30 ఏళ్ల కిందటతో పోలిస్తే టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా జనజీవనానికి జరిగిన మేలు ఊహలకందనిది. చావు కబురు పంపాలంటే గతంలో టెలిగ్రాం చేయాల్సి వచ్చేది. బంధువులను పండుగల్లోనే, వేసవి కాలం సెలవుల్లోనూ చూడాల్సి వచ్చేది. మధ్యలో మంచిచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలు దిక్కయ్యేవి. ఈ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటోంది! ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్తో ఇంటి నుంచే ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాం. ఏ సమాచారం కావాలన్నా గూగుల్లో దొరుకుతోంది. కావాల్సిన బ్రాండ్ దుస్తులు, వస్తువులు ఏది కావాలన్నా ఆన్లైన్లో షాపింప్ చేస్తున్నాం. వ్యాపార రంగంలో ఆన్లైన్ బిజినెస్ వాటా ఏకంగా 37 శాతం ఉందంటే టెక్నాలజీ ప్రభావం ఏవిధంగా ఉందో స్పష్టమవుతోంది. ఇదే రకంగా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ లేకుంటే రోజువారీ జీవితం నడవని పరిస్థితి నెలకొంది. మనకు తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే అడ్రస్ కోసం ‘గూగుల్’ మ్యాప్పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. మరోవైపు నిశితంగా పరిశీలిస్తే టెక్నాలజీని అతిగా వినియోగిస్తూ ఆరోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో 15–32 ఏళ్ల వయస్సున్న యువతీ, యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. పెరుగుతున్న ఒత్తిడి టెక్నాలజీలో ఎక్కువ సమస్యలు వస్తోంది స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్తోనే అని ‘యూరోపియన్ స్పైన్ జర్నల్’ ప్రచురించింది. చిన్న పిల్లలు, టీనేజర్ల మానసిక వికాసంపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వయస్సు వారిలోనే మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటైనవారిలో సాధారణ కంటే ఐదు రెట్లు ఒత్తిడి ఉంటోంది. మొబైల్ఫోన్లను తక్కువగా వాడేవారు సానుకూల ఆలోచనా ధోరణితో ఒత్తిడికి దూరంగా ఉంటే, ఎక్కువగా ఆధారపడే వారు నెగిటివ్ ఆలోచనలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లపై ఎక్కువ సమయం గడిపేవారు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందికి తలనొప్పి, మెడ, భుజాల నొప్పి వస్తున్నాయి. ఈ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లేవారు గత నాలుగేళ్లలో ఏకంగా ఐదురెట్లు పెరిగారు. దీంతో ‘అమెరికా ఆప్తాల్మజీ అసోసియేషన్’ ఓ రూల్ ప్రవేశపెట్టింది. కంప్యూటర్లు, సెల్ఫోన్లు వాడేవారు ప్రతీ 20 నిమిషాలకొకసారి కనీసం 20 సెకండ్లు దృష్టి మరల్చాలి. 20 అడుగుల దూరం నడక సాగించాలి. డేంజర్ జోన్లో చిన్నపిల్లలు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ చేసిన ఓ సర్వేలో చిన్నపిల్లలపై టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తేలింది. స్కూలు నుంచి ఇంటికి రాగానే ఫోన్, టీవీకి అతుక్కుపోతున్నారు. దీంతో చదువులో వెనుకబడటం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా సరైన ఫోకస్ లేకపోవడం, వ్యక్తులతో మాట్లాడటం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోయి ఊబకాయం పెరగడం, నిద్రలేమి సమస్య, అగ్రెసివ్ బిహేవియర్కు గురవుతున్నారు. ఇవి చిన్న సమస్యలు కాదని, అత్యంత ప్రమాదకరమైనవని ఆ అకాడమీ తల్లిదండ్రులను హెచ్చరించింది. అందుకే 18 నెలల వయస్సు పిల్లలకు టీవీ, ఫోన్ చూపించకూడదు. 2–5 ఏళ్ల పిల్లలు గంటకు మించి టీవీ చూడకూడదు. మరిన్ని అనారోగ్య సమస్యలు.. పరిష్కారాలు ► ఒకే ప్రదేశంలో కూర్చుని కంప్యూటర్ చూస్తూ గడిపేవారికి వెన్ను సమస్యలు అధికమవుతున్నాయి.ఈ నొప్పితో మనిషి ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. చురుకుదనం తగ్గిపోయి పురోగతి సాధించలేకపోతున్నారు. వీరు కనీసం గంటకోసారి లేచి నడవాలి. ► ఫోన్లతో జ్ఞాపకశక్తి క్లీణించింది. గతంలో పదుల సంఖ్యలో ఫోన్ నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ల నంబర్లు కూడా గుర్తులేని పరిస్థితి. లావాదేవీల్లో గతంలో ‘నోటిలెక్కల’తో తేల్చేసేవారు. ఇప్పుడు ఫోన్లో ‘కాలిక్యులేటర్’పై ఆధారపడాల్సిందే! ► మొబైల్ఫోన్ ఎక్కువగా వాడటం, సరిగా కూర్చోకుండా టీవీలు చూడటంతో మెడ వెనుక అప్పర్ బ్యాక్పెయిన్ వస్తోంది. ► 2019 నుంచి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా పెరిగాయి. రోజూ అర్ధరాత్రి 12 గంటలు, ఒంటిగంట వరకూ నిద్ర మేల్కొని ఉంటున్నారు. జనాభాలో 32 శాతం మంది అర్ధరాత్రి వరకూ ఫోన్లలో గడుపుతున్నారు. ► అనవసర సోషల్ మీడియా యాప్స్ మొబైల్స్లో పెట్టుకోకూడదు. ► సెల్ఫోన్, టీవీలు ఎక్కువ సమయం, ఎక్కువ లైటింగ్లో చూడటం, అతిదగ్గరగా, అతి దూరంగా చూడటం, సరిగా కూర్చోకుండా చూడటం చాలా ప్రమాదకరం. ► నిద్రకు కనీసం గంట ముందు టీవీ, ఫోన్ చూడటం ఆపేయాలి. ► పుస్తకాలు, న్యూస్పేపర్ చదవడం తగ్గింది. దీన్ని అలవాటు చేయాలి. బంధువులు, స్నేహితులతో ఎక్కువగా గడపాలి, మాట్లాడాలి. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండేలా ఆటలు ఆడాలి. వ్యాయామాలు చేయాలి. సోమరితనం పెరుగుతోంది ‘టెక్నాలజీ’ అవసరం కోసమే. కానీ బానిసలవుతున్నాం. దీంతో వెన్ను, మెడ నొప్పితో పాటు ‘నిద్ర’ టైంటేబుల్ మారిపోయింది. గతంలో 9 నుంచి 10 గంటల వరకు నిద్రపోయేవాళ్లు. ఇప్పుడు ఫోన్, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. దీంతో శరీరంలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతోంది. సోమరితనం ఎక్కువగా వస్తోంది. జ్ఞాపకశక్తిని కోల్పోయి మొద డు మొద్దుబారుతోంది. ఫోన్ నంబర్లతో పాటు కొత్తగా పరిచయమయ్యేవారి పేర్లను కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. పిల్లలు ఆహారం తినాలన్నా ఫోన్లు, టీవీలు చూపించే పరిస్థితి. ప్రస్తుతం ‘డిప్రెషన్ ట్రెండ్’ నడుస్తోంది. చాలామందికి వారు డిప్రెషన్లో ఉన్న సంగతే తెలీడం లేదు. – డాక్టర్ కె. హేమంత్కుమార్రెడ్డి, న్యూరోఫిజీషియన్ జాగ్రత్త లేకపోతే భవిష్యత్తు ఛిన్నాభిన్నమే టెక్నాలజీ అతి వినియోగంతో ఎక్కువ మానసిక సమస్యలు వస్తున్నాయి. 15–25 ఏళ్ల వయస్సున్న వారికి లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. చదవడం, నేర్చుకోవడంతో నాలెడ్ట్ వస్తుంది. ఇప్పటి పిల్లలు వినోదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చదువులో క్వాలిటీ ఉండటం లేదు. సొసైటీపై కూడా బాధ్యత ఉండటం లేదు. ఉద్యోగాలు సాధించలేని పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్లి ఆల్కాహాల్, సిగరెట్లు, డ్రగ్స్కు బానిసయ్యే ప్రమాదం ఉంది. చెడు, మంచి రెండూ నేర్చుకునే అవకాశాలు ప్రస్తుత సొసైటీలో ఉన్నాయి. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తతో ఉండాలి. గారాబాలతో ఏమాత్రం అలసత్వం చేసినా భవిష్యత్ను ఛిన్నాభిన్నం చేసినట్లే. డాక్టర్ ఇక్రముల్లా, సైక్రియాట్రిస్ట్, కర్నూలు. -
5G Phones: బడ్జెట్ 5జీ ఫోన్లకు డిమాండ్..
న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీతో కూడిన బడ్జెట్ ఫోన్ల (రూ.10,000–15,000) విభాగంలో కంపెనీల మధ్య పోరు మొదలైంది. మరో ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వినియోగదారులు తమ ఫోన్లను కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకునేందుకు ఆసక్తి చూపించనున్నారు. దీంతో ఈ విభాగం కంపెనీలకు ఆకర్షణీయంగా మారనుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణలు ఇప్పటికే రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అంటే పోటీ ఇప్పటికే మొదలైనట్టు కనిపిస్తోంది. రానున్న పండుగల నేపథ్యంలో మరిన్ని 5జీ ఫోన్ల ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయని.. కంపెనీల మధ్య పోటీ మరింత వేడెక్కుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తయారీ వ్యయాలు (ముడి పదార్థాల వల్ల) పెరిగిపోవడం, బలహీన రూపాయి రూపంలో కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశాల వల్ల కంపెనీలు బ్యాటరీ, డిస్ప్లే, మెమొరీ విషయంలో రాజీపడి, రూ.15,000లోపు ధరకే 5జీ ఫోన్లను విక్రయించే ప్రయత్నం చేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ విభాగమే టార్గెట్.. రూ.10,000–15,000 విభాగాన్ని 5జీ ఫోన్లు శాసిస్తాయని అంచనా వేస్తున్నట్టు రియల్మీ ఇండియా సీఈవో మాధవ్ సేత్ పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది చివరికి ఈ విభాగంలో 5జీ ఫోన్లదే హవా ఉంటుందన్నారు. దీపావళికి చాలా బ్రాండ్లు ఈ విభాగాన్నే లక్ష్యం చేసుకుని ఉత్పత్తులు తీసుకురానున్నట్టు అంచనా వేశారు. ఇదే ధరల శ్రేణిలో ఏకంగా ఆరు 5జీ ఫోన్లు ఒక్క ఆగస్ట్ నెలలోనే విడుదలయ్యాయి. కానీ, క్రితం ఏడాది ఇదే సమయానికి ఈ ధరల శ్రేణిలో ఉన్న 5జీ ఫోన్లు కేవలం మూడే. ‘‘2022 మొదటి ఆరు నెలల్లో రూ.10,000–15,000 ధరల్లోని 5జీ స్మార్ట్ఫోన్ల డిమాండ్, క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే నాలుగు రెట్లు అధికంగా ఉంది’’అని ఫ్లిప్కార్ట్ తెలిపింది. అయితే ఈ ధరల శ్రేణికి సంబంధించి 5జీ ఫోన్ల మార్కెట్ వాటా మొత్తం స్మార్ట్ఫోన్లలో చాలా తక్కువే ఉందని చెప్పుకోవాలి. 2022 ద్వితీయ మూడు నెలల్లో 6 శాతంగా ఉంది. 2021 చివరి నుంచి చూస్తే మార్కెట్ వాటా రెట్టింపైందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఈ ఏడాది చివరికి 5జీ స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా 10 శాతానికి చేరుకోవచ్చని అంచనాలున్నాయి. తక్కువ ధరల్లో అందించేందుకు కంపెనీలు డిస్ప్లే, ఫాస్ట్ చార్జింగ్లో రాజీపడటం ఒక్కటే ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్ వాటా.. కౌంటర్పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం.. 5జీ ఫోన్లలో షావోమీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పోకో బ్రాండ్తో కలిపి ఈ విభాగంలో 70 శాతం మార్కెట్ వాటా షావోమీ చేతుల్లోనే ఉంది. రియల్మీ మార్కెట్ వాటా 25 శాతంగా ఉంది. ఇక మోటరోలా 5 శాతం వాటా కలిగి ఉంది. -
ట్రెండ్ మారింది! సోషల్ మీడియా స్నేహాలు.. అలాంటివి ఇకపై కనిపించవ్ బ్రదర్
తోకలేని పిట్ట తొంభై ఊళ్లు దాటి వెళ్లిపోయినట్టుంది. అభిమానం నిండిన అక్షరాలతో ఆత్మీయంగా పలకరించే ఉత్తరం కాలగర్భంలో కలిసిపోయింది. మారుతున్న కాలం ఒకనాటి జ్ఞాపకాలను సమూలంగా తుడిచిపెట్టేస్తోంది. ఆ జాబితాలోకి ఉత్తరం కూడా చేరిపోయింది. ఇప్పుడు అంతా హాయ్, బాయ్ సంస్కృతే కనిపిస్తోంది. నాడు ఉత్తరాలు పంపుకున్న కాలంలో కనిపించిన ఆత్మీయత, అనుబంధం రెండూ ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఉత్తరమే ఉత్తమ సమాచార సాధనం. ఆ రోజుల్లో ఉత్తరం వచ్చిందంటే ఆ ఇంట్లో ఎంతో ఆనందం. మా అబ్బాయి ఉత్తరం రాశాడనో, మా అమ్మాయి ఉత్తరం రాసిందనో, బంధువుల నుంచి ఉత్తరం వచ్చిందనో ఇరుగుపొరుగు వారితో సంతోషంగా చెప్పుకునేవారు. చదువు రాని వారయితే ఎవరినో పిలిపించుకుని ‘గౌరవనీయులైన నాన్నకు’, ‘ప్రియమైన అమ్మకు’ అన్న పదాలను ఒకటికి రెండు సార్లు ఇష్టంగా చదివించుకునేవారు. ఉత్తరం సాంతం సావధానంగా విని కళ్లు తుడుచుకునే వారు. ఆ లేఖను జాగ్రత్తగా పొదివిపెట్టుకునేవారు. ఉత్తరంలో ఉండే సంబోధన, రాసే తీరు ఆత్మీయతను, అనురాగాన్ని పంచేవి. అందరి బంధువు.. ఉత్తరాలే కాదు అవి మోసుకువచ్చే పోస్టుమ్యాన్లు కూడా ఒకప్పుడు అందరి బంధువులే. అందరి మంచి చెడ్డల్లో ఆయనకూ భాగం ఉండేది. పోస్ట్మ్యాన్ వచ్చే సమయానికి ఇంటి బయట నిలబడి ‘మాకేమైనా ఉత్తరం వచ్చిందా’ అని ఆత్రంగా అడిగే రోజులు ఎంతో బాగుండేవి. ఉత్తరం వచ్చిందంటే ఆనందపడేవారు. రాలేదంటే ఎందుకు రాలేదో అని ఆరా తీసి నిరాశ చెందేవారు. ఆలస్యంగా ఉత్తరం రాసినందుకు వేసే నిష్టూరాలు, నిందలు కూడా ఆత్మీయతను పెంచేవే. ఆలస్యంగా రాస్తున్నందుకు క్షమించమనే వేడుకోలు చాలా లేఖలను ప్రత్యేకంగా ఉంచేవి. పోస్టాఫీసుకు వెళ్లి ఉత్తరాల కోసం ఆరా తీయడం, ఉత్తరం రాశాక పోస్టు డబ్బాలో వేయడానికి సరదా పడడం, చిన్న పిల్లలతో ఉత్తరాలు చదివించుకోవడం.. వంటి ఆనందాలు ముందు తరాల వారు ఆసాంతం ఆస్వాదించారు. ఉత్తరంలో ఉన్న అక్షరాల్లో తమ వారు కనిపిస్తుంటే పరవశించిపోయేవారు. ఏదీ ఆ అనుబంధం.. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతోఇపుడంతా సెల్ మయమైపోయింది. ఇంటిలో అందరికీ సెల్ఫోన్లు ఉండడంతో షార్ట్ మెసేజీ సర్వీస్ అలవా టైంది. సందేశాలతో పాటు అనుబంధాలు కూడా తగ్గిపోయాయి. వాట్సాప్లు, ఫేస్బుక్, ట్విట్టర్లు వచ్చాక సమాచారం పంపించడం సులభమైంది. కానీ సొంత దస్తూరితో అమ్మకు రాసిన ఉత్తరం ముందు ఏ సాధనమైనా బలాదూరే. దూరంగా ఉన్న భర్త కోసం భార్య పంపించిన ప్రేమలేఖతో పోల్చితే ఈనాటి టెక్ట్స్ మేసేజీలు ఎందుకూ పనికిరావు. పక్కింటి పిల్లాడితో కొడుకు రాసుకున్న ఉత్తరం చదివించుకున్న రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే నేటి డిజిటల్ యుగం ఎందుకో అంత ఆనందకరం అనిపించదు. ఉత్తరం రాయడం అందరికీ తె లిసిన ఓ కళ. అందరూ అందులో నిష్ణాతులే. కానీ నేడు ఆ కళ కలగా మారిపోయింది. పిల్లలకు ఉత్తరం అంటే ఏంటో తెలీదు ప్రస్తుత తరం చిన్నారులకు ఉత్తరం అంటే ఏమి టో తెలియదు. ఇప్పుడు ఉత్తరాల సంఖ్య బాగా తగ్గిపోయింది. పోస్ట్బాక్స్లలో సైతం ఉత్తరాలు రావడం తగ్గాయి. ఇపుడు ప్రపంచమంతా సెల్ఫోన్ మయమైపోయింది. – ఎ.కాంతారావు, పోస్టల్ సూపరింటెండెంట్ ఉత్తరమే ఉత్తమ సాధనం గతంలో ఉత్తరమే సమాచార సాధనం. బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకునేందుకు ఉత్తరం ఎంతగానో తోడ్పడేది. ఉత్తరం వచ్చిందంటే చాలు. ఆ ఆనందమే వేరు. ఇపుడు సెల్ఫోన్ వచ్చి ఆ ఆనుబంధాన్ని, ఆత్మీయతను వేరు చేసింది. ఇపుడు చూద్దామన్నా ఉత్తరం కనిపించడం లేదు. – డీపీ దేవ్, విశ్రాంత తహసీల్దార్ -
టపా టప్!.. పేలుతున్న స్మార్ట్ ఫోన్లు
దేశంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా పెరుగుతోంది. మరీ యువత ఫోన్లు లేకుండా ఒక వారం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కొన్ని కంపెనీల స్మార్ట ఫోన్లు చార్జింగ్ పెడుతున్న సమయంలోనూ, లేదా జేబులు ఉండగానో పేలుతున్నాయి. ఈ తరహా వరుస ప్రమాదాలు మొబైల్ వినియోగదారులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఇటువంటి ఘటనలు పలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో స్మార్ట్ ఫోన్ పేలడంతో కస్టమర్ల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా పాములపాడులో బుధవారం ఓ వ్యక్తి తన స్మార్ట్ఫోన్ని ఇంట్లో చార్జింగ్కు ఉంచిన సమయంలో పేలిపోయింది. వివరాల ప్రకారం.. షేక్ముర్తుజా ఈ ఏడాది జూలై 13న నందికొట్కూరులో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఇంట్లో చార్జింగ్ పెట్టి బయటకు రాగా.. శబ్దంతో పేలిందని ఆయన తెలిపారు. ఫోన్ వద్ద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని షేక్ముర్తుజా కోరారు. మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్లో మనం ఉపయోగిస్తున్న ల్యాప్ట్యాప్లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్ పాయింట్స్. లిడ్ యాసిడ్లతో పోల్చితే.. లిథియం ఆయాన్ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. అలాగే ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని నిపుణులు చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. చదవండి: గుడ్ న్యూస్: ఐఫోన్ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో -
5జీ హుజూర్.. 4జీ ఫోన్లు 5జీ నెట్వర్క్కు ఉపయోగపడతాయా?
మనిషి జీవితంలోకి వేగం ప్రవేశించి చాలా కాలమే అయింది. మానవుడి జీవన గమనాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మేలి మలుపులు తిప్పింది. సెల్యులార్ టెక్నాలజీ విప్లవంతో అందరి చేతుల్లోకి సెల్ఫోన్లు వచ్చాయి. సాధారణ వాయిస్ కాల్స్కే జనం మురిసిపోగా.. అసాధారణ అవసరాలు సైతం సెల్ఫోన్లో చేరుతున్నాయి. 1990లలో 2జీ నెట్వర్క్తో మొదలైన మనిషి సెల్ఫోన్ ప్రయాణం.. 3జీ, 4జీని దాటుకొని ఇప్పుడు 5జీ మెరుపు వేగాన్ని అందుకొంటోంది. మనిషి జీవనాన్ని మరో మేలి మలుపు తిప్పడానికి ఇది దోహదం చేయనుంది. 5జీ అంటే..: సెల్యులార్ టెక్నాలజీలో ఐదో జనరేషన్ను సింపుల్గా 5జీ అంటున్నారు. 1జీ: 1980లో తొలి తరం(1జీ) మొబైల్ సేవలు మొదలయ్యాయి. బ్రీఫ్కేస్ సైజ్ ఉన్న ఫోన్లు, అది కూడా పరిమిత సంఖ్యలో ఉన్న గ్రూపు సభ్యుల మధ్య కమ్యూనికేషన్కు మాత్రమే ఉపయోగపడేవి. 2జీ: 1990లో రెండో తరం సాంకేతిక పరిజ్ఞానం ప్రారంభమైంది. పర్సనల్ హ్యాండ్ సెట్లు వచ్చాయి. ఇవే సెల్ఫోన్లు. వీటితో వాయిస్ కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడం సాధ్యమైంది. క్రమేణా ఎస్ఎంఎస్లు కూడా వచ్చాయి. 2జీ కాలంలో మొదలయిన సెల్ఫోన్.. మనిషి జీవితంలో భాగమైంది. 3జీ: 2000 సంవత్సరానికి సెల్ఫోన్ జేబులో ఇమిడిపోయింది. ఇంటర్నెట్ యాక్సెస్ సాధ్యమైంది. సెల్ఫోను లేనిదే అడుగు వేయలేని స్థితికి వచ్చింది. 4జీ: 2010కి సెల్ఫోన్ స్మార్ట్ఫోన్గా మారిపోయింది. డేటా స్పీడ్ అనూహ్యంగా పెరిగింది. ఫోన్లో యాప్ స్టోర్లు చేరాయి. సోషల్ మీడియా ఉవ్వెత్తున ఎగిసింది. 5జీ ఉపయోగాలను ఊహించలేం - 2జీ వచ్చినప్పుడు డిజిటల్ వాయిస్ కాలింగ్ 1990 దశాబ్దంలో అత్యంత ఉపయోగకరమైన అంశంగా అందరూ భావించారు. ఎస్ఎంఎస్ అప్పుడు ఓ అద్భుతం. 3జీ ప్రవేశంతో ‘ఇంటర్నెట్ యాక్సెస్’ అద్భుతమైన అంశంగా నిలుస్తుందని అనుకున్నారు. అయితే సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్ యాప్ల దశాబ్దంగా మారింది. 4జీతో రైడ్, షేరింగ్, ఫుడ్ డెలివరీ లాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు వస్తాయని భావించారు. వాటితో పాటు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ లాంటి వీడియో స్ట్రీమింగ్ సౌకర్యాలు, వీడియో కాలింగ్ వచ్చి అంతులేని వినోదాన్ని పంచుతున్నాయి. 5జీ ఇంకేమి సౌకర్యాలను తెస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ మెరుపువేగంతో డేటా ట్రాన్స్ఫర్ మానవ జీవితాన్ని మరింతగా మారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 4జీ కంటే 5జీలో డేటా ట్రాన్స్ఫర్ వేగం 20 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సాధారణ నెట్ 100 ఎంబీపీఎస్. 5జీలో సాధారణ వేగం 4–5 జీబీపీఎస్కు చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గంట పాటు డౌన్లోడ్ చేస్తున్న గేమ్స్ లాంటి వాటిని సెకన్ల వ్యవధిలో చేయచ్చు. ఏ రంగాల్లో మార్పులు వస్తాయి? - వినోద రంగంలో వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) సౌకర్యాలు మొబైల్ ఫోన్లలోకి వస్తాయి. - విద్యా రంగంలో అనూహ్య మార్పులు వస్తాయి. ఆన్లైన్ టీచింగ్లో విద్యార్థులకు క్లాస్రూమ్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. కంటెంట్ సులభంగా అర్థమయ్యేలా బోధించడానికి సహాయపడుతుంది. - వైద్య రంగంలోనూ అనూహ్య మార్పులు వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి 108 (అంబులెన్స్)కు కాల్ చేసిన వెంటనే అంబులెన్స్తో పాటు సమీపంలోని ఆసుపత్రికి కూడా సమాచారం వెళుతుంది. డాక్టర్ను అలెర్ట్ చేస్తుంది. వేగంగా ఆసుపత్రికి చేరే మార్గాన్ని సూచించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఆసుపత్రుల వివరాలను తెలియజేస్తుంది. - టెలి మెడిసిన్లో ఆంధ్రప్రదేశ్లాంటి రాష్ట్రాలు ఇప్పటికే దూసుకెళుతున్నాయి. 5జీ అందుబాటులోకి వస్తే డాక్టర్, రోగి ఒక దగ్గర లేకుండా కేవలం మొబైల్లో రియల్టైమ్ వీడియో ద్వారా చికిత్స లభిస్తుంది. - రోబోటిక్ సర్జరీల్లో మరిన్ని సంచలనాలకు దోహదం చేస్తుంది. ఆఫీసులో ఎదురుబొదురు కూర్చొన్నట్లుగా ఉండే వర్చువల్ మీటింగ్స్కు అవకాశం కల్పిస్తుంది. ఫలితంగా సిబ్బంది మొత్తం ఆఫీసుకే వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండదు. ‘రిమోట్ టీమ్ ప్రొడక్టి్టవిటీ’ని పెంచుతుంది. - వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో వినూత్న మార్పులు వస్తాయి. ఫ్లెక్సిబుల్, నమ్మకమైన, సమర్థవంతమైన వ్యాపారానికి భూమికగా నిలుస్తుంది. డిమాండ్, సప్లైని బట్టి ఉత్పత్తి సం స్థలు ఆటోమేటిక్గా స్పందించే రోజు వస్తుంది. - పరిశ్రమల్లో సమస్యలను ‘డిజిటల్ నమూనా’ల్లో ముందుగానే గుర్తించొచ్చు. ఫలితంగా సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి, ఒకవేళ సమస్య తలెత్తినా వేగంగా పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. - వస్తు రవాణాను రియల్ టైమ్లో పరిశీలించొచ్చు. గోదాములు, పోర్టుల్లో ప్రతి వస్తువును ట్రాక్ చేయొచ్చు. - డ్రైవర్ లేని కార్ల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుంది. - ‘స్మార్ట్ గ్రిడ్’ కాన్సెప్ట్ మరింత బలోపేతం అవుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది. - వ్యవసాయంలోనూ సూపర్ ఫాస్ట్ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. మోటార్లను ఆన్/ఆఫ్ చేయడానికే కాకుండా, పొలం తడిసిన వెంటనే అలర్ట్ చేసే రియల్టైం మెకానిజం చౌకగా లభిస్తుంది. - డ్రోన్ల వినియోగం అత్యంత వేగంగా పెరుగుతుంది. వ్యవసాయం మొదలు అన్ని రంగాల్లో డ్రోన్ల వాడకం సులభం, చౌక అవుతుంది. 4జీ ఫోన్లు 5జీ నెట్వర్క్కు ఉపయోగపడతాయా? 4జీ ఫోన్లలోని ప్రాసెసర్ 5జీ నెట్వర్క్కు ఉపయోగపడదు.. ప్రాసెసర్ అప్గ్రెడేషన్కు కంపెనీలు అవకాశం ఇస్తే, ఇప్పుడున్న ఫోన్లను చౌకగా మార్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ కూడా మార్చుకోవాలి. లేదంటే 5జీ ఫోన్లు కొనుక్కోవాలి. సిమ్ కార్డు కూడా 5జీకి మార్చాలి. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలో చైనా తొలి స్థానంలో ఉంటే, మనం రెండో స్థానంలో ఉన్నాం. ఈ డిమాండ్ మరింత పెరుగుతుంది. 2025 నాటికి గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోనూ మన దేశం రెండోస్థానంలో కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
అలర్ట్: మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు, 75శాతం డిస్కౌంట్..
కస్టమర్లకు బంపరాఫర్లను ప్రకటించాయి ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్లు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రెండు సంస్థలు పోటీ పడి మరి కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. అమెజాన్ ఆగస్ట్ 6న నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తుండగా.. ఫ్లిప్కార్ట్ ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు డిస్కౌంట్ల కోసం వెయిట్ చేస్తున్న షాపింగ్ ప్రియులు, గ్యాడ్జెట్ లవర్స్ త్వరపడాల్సి సమయం ఇది, ఎందుకంటే ఈ ఆఫర్లు బుధవారమే ఆఖరి రోజు ( ఆగస్టు 10) ముగియనుంది. మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.... ఫ్లిప్కార్ట్ సేల్ ఈవెంట్లో కోటక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్లపై 10 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. ఈ ఆఫర్ను శాంసంగ్ (Samsung), రియల్మీ (Realme), షావోమీ (Xiaomi) తో పాటు ఇతర బ్రాండ్ల టీవీలలో కూడా చూడవచ్చు. అంతేనా ఎయిర్ కండీషనర్లపై 55 శాతం వరకు తగ్గింపు, మైక్రోవేవ్లపై 45 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. మీరు స్మార్ట్వాచ్ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా! అయితే ఇదే మంచి సమయమని ఫ్లిప్కార్ట్ చెబుతోంది. వాటిపై 10 నుంచి 70 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు కాకుండా, అదే సమయంలో యాపిల్, వివో,ఒప్పో, మోటరోలాతో పాటు ఇతర బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చని తెలపింది. ఎప్పటిలాగే, ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు "క్రేజీ డీల్స్" కూడా ఉండనుంది. చదవండి: ఆ లోన్ తీసుకున్నవారికి భారీ షాక్.. .. ప్చ్, ఈఎంఐ మళ్లీ పెరిగింది! -
రెడీగా ఉండండి.. అదిరిపోయే ఫీచర్లతో వన్ప్లస్ 10టీ.. గ్రాండ్ లాంచ్ అప్పుడే!
OnePlus 10T 5G Launch: వన్ప్లస్ మొబైల్ లవర్స్కి గుడ్ న్యూస్. ఈ సంస్ధ మార్కెట్లోకి త్వరలో తీసుకురానున్న వన్ప్లస్ 10టీ 5జీ (OnePlus 10T 5G) విడుదల తేదీ ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీన న్యూయార్క్ నగరంలో వన్ప్లస్ 10Tని గ్రాండ్గా లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. అమెజాన్లో ఈ ఫోన్ లిస్ట్ అయింది. ఆగస్టు 3 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్ కోసం ఈ స్టైలిష్ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుందని తన ల్యాండింగ్ పేజ్లో వెల్లడించింది. ఈ ఫోన్కి సంబంధించి తాజాగా విడుదలైన ఫొటోని చూస్తే.. ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్ టెక్స్చర్ డిజైన్ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 360 డిగ్రీ యాంటినా సిస్టమ్ను ఆ కంపెనీ హైలైట్ చేస్తోంది. ఈవెంట్లో వన్ప్లస్ సరికొత్త ఆక్సిజన్ఓఎస్ 13ని కూడా ఆవిష్కరించనుంది. భారత్: OnePlus 10T ధర (అంచనా) నివేదిక ప్రకారం OnePlus 10T 5G ధర CNY3,000 (చైనా యువాన్లు) (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 35,500), CNY 4,000 (దాదాపు భారత కరెన్సీ ప్రకారం రూ. 47,400) మధ్య ఉండవచ్చని అంచనా. మరొక నివేదిక ప్రకారం, స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 49,999(భారత్లో) ఉంటుందని సమాచారం. ఈ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ ఇంకా ఈ స్మార్ట్ఫోన్ ధర, ఇతర ప్రత్యేకతల విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. OnePlus 10T ఫీచర్లు (అంచనా) అమెజాన్ లిస్టింగ్ పేజ్ ద్వారా వన్ప్లస్ 10టీ 5జీకి చెందిన ప్రాసెసర్ వివరాలు బయటికి వచ్చాయి. ♦ OnePlus 10T: Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ఫీచర్తో రానుంది. ♦ హ్యాండ్సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ ♦ పూర్తి-HD+ రిజల్యూషన్తో 6.7-అంగుళాల AMOLED డిస్ప్లే ♦ 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 2-మెగాపిక్సెల్ షూటర్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ♦ 50W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 4,800mAh బ్యాటరీ సపోర్ట్ ♦ 16GB LPDDR5 RAMతో పాటు 512GB UFS 3.1 ఇంబిల్ట్ స్టోరేజ్ ♦ కలర్స్: బ్లాక్, గ్రీన్ చదవండి: Vedanta Share Price: లాభాల్లో షేర్ మార్కెట్.. ఆ షేర్లు కొన్నవారికి బంఫర్ ఆఫర్! -
ఒప్పో, వన్ప్లస్కు భారీ షాక్.. ఇకపై ఆ కంపెనీ ఫోన్లు బ్యాన్!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్ప్లస్కి జర్మనీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పేటెంటెడ్ టెక్నాలజీకి సంబంధించి నోకియా ఈ రెండు కంపెనీలపై జర్మనీలోని మాన్హీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన అనంతరం కోర్టు నోకియా సంస్థకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆ దేశంలో ఒప్పో, వన్ప్లస్ ఫోన్లను బ్యాన్ చేయాలని తీర్పునిచ్చింది. ఏంటి ఆ వివాదం.. వివరాల్లోకి వెళితే.. నోకియా సంస్థ 5జీ నెట్వర్క్లోని పలు టెక్నాలజీలపై పేటెంట్ కలిగి ఉంది. అందులోని ఓ టెక్నాలజీని నోకియా అనుమతులు లేకుండానే ఒప్పో, వన్ప్లస్లు ఉపయోగించాయి. ఓ వార్తా సంస్థ ప్రకారం.. 4G (LTE), 5G టెక్నాలజీలోని పేటెంట్లపై నోకియా, ఒప్పో, వన్ప్లస్ల మధ్య జరిగిన చర్చల విఫలం కావడంతో వారిపై న్యాయపరమైన చర్యలకు నోకియా సిద్ధమైంది. అనంతరం పలు దేశాలలో ఆ కంపెనీలపై కోర్టులో దావా కూడా వేసింది. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం జర్మనీ కోర్టు ఇచ్చిన తీర్పు మొదటిది. నోకియా మూడు ప్రాంతీయ జర్మన్ కోర్టులలో తొమ్మిది స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు (SEP), ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్ల విషయంలో ఒప్పోపై దావా వేసింది. సుమారు $130.3 బిలియన్ల భారీ పెట్టుబడులతో 5G స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు(SEP) విభాగంలో నోకియా నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్లను నోకియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వివాదానికి కారణం నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్ప్లస్ కంపెనీలపై దావా వేసింది. అయితే ఈ తీర్పుపై ఒప్పో, వన్ప్లస్లు ఎలా ముందుకు వెళ్లనున్నాయో చూడాలి. చదవండి: మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా! -
ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: భారీ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ ఏడాది కూడా బిగ్ బచత్ ధమాల్ సేల్ను ప్రారంభించింది. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ ధమాకా సేల్ కొనసాగనుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు ఫోన్ ఉపకరణాలు, ల్యాప్టాప్లు, గాడ్జెట్లు, దుస్తులు, గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరల్లో అందిస్తోంది. భారీ తగ్గింపులతో పాటు, తన కస్టమర్లకు నోకాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ కూడా ఉంది. అలాగే వినియోగదారుల షాపింగ్ సౌలభ్యం కోసం, ఫ్లిప్కార్ట్ కొత్త పేజీని సృష్టించింది. ఈజీగా ఇక్కడ పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. వివో ఎక్స్ 70 ప్రో: 8జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వేరియంట్ రూ.46,990. అందమైన ఫోటోలకు కేరాఫ్ ఎడ్రస్ ఈ ఫోన్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఇన్-బిల్ట్ గింబల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అందిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 20 ప్రొ 5జీ: ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో ఈ మొబైల్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999కి అందుబాటులో ఉంది. దీనివాస్తవ ధర 45,999. స్మార్ట్ఫోన్లో 108+16 +8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఫోటోలంటే ఇష్టపడే వారికి కూడా ఇది మంచి ఆప్షన్. పోకో 5జీ ప్రొ: బడ్జెట్ ధరలో లభించే 5జీ స్మార్ట్ఫోన్. 6 జీబీ వేరియంట్ ధర 14,499లకే లభ్యం. దీని అసలు ధర 16,499. ఐఫోన్ 12 మినీ: ఐఫోన్ 12 మినీ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ఈ సేల్లో రూ. 49,999కి అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర 59,900. ఐఫోన్ 13 లాంటి ఇతర ఆపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. పోకో ఎఫ్4 5జీ: పోకో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ పోకో ఎఫ్4 5జీ ఫ్లిప్కార్ట్ సేల్లో రూ.27,999కి అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, అదనంగా 3 వేల తగ్గింపు లభిస్తుంది. -
వివో నుంచి ఎక్స్80, ఎక్స్ 80ప్రో
హైదరాబాద్: వివో తన ఫ్లాగ్షిప్ ఎక్స్ సిరీస్లో ఎక్స్80, ఎక్స్80 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. జీస్ కంపెనీ సహకారంతో ఈ ఫోన్లలో అత్యాధునిక కెమెరా టెక్నాలజీని వివో అందిస్తోంది. జీస్ జింబెల్ పోట్రయిట్ కెమెరా, 50 మెగా పిక్సల్ అల్ట్రా సెన్సింగ్ ఐఎంఎక్స్ 866 సెన్సార్ వీటిల్లో ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1 చిప్సెట్తో నడిచే ఈ ఫోన్లలో ఎన్నో కొత్త ఫీచర్లను వివో ప్రవేశపెట్టింది. ఎక్స్ 80 ప్రో 12జీబీ, 256జీబీ కాంబినేషన్ ధర ధర రూ.79,999. ఎక్స్ 80 8జీబీ, 128జీబీ ధర రూ.54,999. 12జీబీ, 256జీబీ ధర రూ.59,999. ఈ నెల 25 నుంచి విక్రయాలు మొదలు కానున్నట్టు వివో ప్రకటించింది. -
ఐటీలో మేటి.. రైతుల సేవలో ఘనాపాటి
అనకాపల్లి: ఆధునిక పోకడలకు అనుగుణంగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకొని జిల్లా ఏరువాక కేంద్రం అన్నదాతలకు వినూత్నమైన సేవలందిస్తోంది. రైతులు, వ్యవసాయ విస్తరణ విభాగాలకు మధ్య వారధిగా పనిచేస్తోంది. పంటల సాగులో తీసుకోవాల్సిన మెళకువలతోపాటు అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తోంది. అందరి చేతిలో ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్ఫోన్ను వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ఏరువాక కేంద్రం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) యాప్ను రూపొందించింది. ఏడాది పొడవునా కావలసిన సమాచారాన్ని రైతులు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. యాప్ పనిచేస్తుందిలా.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏఎన్జీఆర్ఏయూఆర్బీకే (ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతు భరోసా కేంద్రం) యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్లో వెబ్ లింకును నొక్కితే ఎఫ్ఏఆర్ఎం ఆర్ఏడీఐవో.ఇన్ కింద ఫార్మ్ రేడియో ఓపెన్ అవుతుంది. ఇందులో నాలుగు స్లాట్లు ఉంటాయి. వ్యవసాయం, కాయగూరలు పండ్లు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం వస్తుంది. దేనిపై ప్రెస్ చేసినా మూడు నిమిషాల నిడివిగల వాయిస్ వినిపిస్తుంది. అదే సమాచారం స్క్రీన్పై కనిపిస్తుంది. ఆ నెలకు సంబంధించిన ఆ సమాచారం ఫార్మ్ రేడియోలో వినిపిస్తుంది. రైతుల ముంగిటకే సమాచారం రైతుల వద్దకే సమాచారాన్ని పంపిస్తున్నాం. ఇంటర్నెట్ సదుపాయమున్న వారు వెబ్లింకు ద్వారా ఫార్మ్ రేడియోలో వ్యవసాయం, కాయగూరలు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను ఆయా నెలల్లో వినవచ్చు. జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ఈ యాప్ను రూపొందించాం. – ప్రదీప్కుమార్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త (చదవండి: -
‘స్మార్ట్’ బెట్టింగ్.. ఐపీఎల్ మ్యాచ్లపై పందేల జోరు
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఐపీఎల్ మ్యాచ్లను చిన్నాపెద్దా తేడా లేకుండా వీక్షిస్తున్నారు. ఫలితం తేలే వరకు టీవీలు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ తరుణంలోనే జిల్లావ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆయాచిత సొమ్ముకు ఆశపడి పందేలు కాస్తున్నారు. బెట్టింగ్ మాఫియా వలలో సులువుగా చిక్కుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలవడం నుంచి బాల్ బై బాల్, ఓవర్ బై ఓవర్ అంటూ తుది విజేత తెలిసే వరకు వివిధ రకాలుగా బెట్టింగ్కు దిగుతున్నారు. దీనికితోడు సెల్ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన క్రికెట్ బెట్టింగ్ యాప్ల ద్వారా మరికొందరు యథేచ్ఛగా జూదాలకు పాల్పడుతున్నారు. సులువైన సంపాదనే లక్ష్యంగా పందేలకు అలవాటు పడి చేతి చమురు వదిలించుకుంటున్నారు. చివరకు తమ కుటుంబాలను వీధిన పడేయడమే కాకుండా, ప్రాణాలు తీసుకునే దుస్థితి చేరుకుంటున్నారు. చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు.. ♦మూడేళ్ల క్రితం బైరెడ్డిపల్లె మండలంలో ఓ యువకుడు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ♦పెద్దపంజాణి మండలంలో ఓ యువకుడు ఆన్లైన్ యాప్ బెట్టింగ్ ద్వారా తీవ్రంగా నష్టపోయి ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ♦పుంగనూరుకు చెందిన ఓ విద్యార్థి బెట్టింగులో డబ్బు పోగొట్టుకుని ఊరు నుంచి పరారై బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్నాడు ♦కుప్పంలో ఓ ఆటోడ్రైవర్ క్రికెట్ బెట్టింగుల్లో ఓడి తనకు జీవనాధారమైన ఆటోను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ♦కాలేజీలో ఫీజు కట్టాలంటూ తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ మోజులో సొమ్ము పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. ♦జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో జరుగుతున్నా పోలీసుల వరకు వచ్చేవి కొన్నే.. పల్లె.. పట్టణం తేడా లేకుండా జనం ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రజల్లో ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని కొన్ని ముఠాలు బెట్టింగ్కు తెరతీశాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి నిముషానికి పందేలు కట్టించుకుంటున్నారు. బెట్టింగ్ ఆట కట్టించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయతిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్కు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. వీరికి తోడు ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలి పనులు చేసుకునేవారు సైతం పందేల మోజులో కొట్టుమిట్టాడుతున్నారు. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ మ్యాచ్లు మే 22 వరకు కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా నిఘా పెట్టినా ఫలితం శూన్యంగా మారుతోంది. పందేల రూపంలో రూ.కోట్లు చేతులు మారుతున్నా చూస్తూ ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. హిడెన్ యాప్లే కీలకం ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో క్రికెట్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. వీటిలో రూ.10వేల నుంచి బెట్టింగ్ చేసే వెసులుబాటు ఉంది. ఇవి చాలా వరకు హిడెన్ మోడ్లోనే ఉంటాయి. పోలీసులు తనిఖీ చేసినా ఈ యాప్లు కనిపించవు. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే బెట్టింగ్ విధానం ఉండేది. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బెట్టింగులు అధికంగా సాగుతున్నట్లు సమాచారం. ఆయా పట్టణాల్లోని శివారు ప్రాంతాలు, పొలాల వద్ద ఫామ్హౌస్లతోపాటు పందెంరాయుళ్లు కొన్ని లాడ్జీల్లో రూములు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు అద్దెకు తీసుకుని యథేచ్ఛగా బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిసింది. హైవేల్లో దాభాల్లో సైతం పందెంరాయుళ్లు మకాం వేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక గ్రామాల్లో అయితే పొలాలు, చెరువు గట్లు, కొందరు ఇళ్లలోనే కాయ్ రాజా కాయ్ అంటున్నట్టు తెలుస్తోంది. కోడ్లతో లావాదేవీలు ఐపీఎల్ మ్యాచ్లు రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంటాయి. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్లు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం నుంచే బెట్టింగ్లు ప్రారంభమవుతుంటాయి. చాలా వరకు పందేలు కోడ్లతోనే నిర్వహిస్తుంటారు. గెలిచే జట్టును ఫ్లయింగ్ , ఓడిన జట్టును ఈటింగ్ , రూ.వెయ్యిని ఫింగర్ , రూ.10 వేలను బోన్, రూ.లక్షను లెగ్ అని పిలుస్తుంటారు. ఫోన్ పే, గూగు ల్ పే ద్వారా నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. కర్ణాటక ముఠాలదే హవా కర్ణాటకలోని శ్రీనివాసపుర, ముళబాగల్, నంగళి, కోలార్, కేజీఎఫ్, హోసకోట్లకు చెందిన కొన్ని బెట్టింగు గ్యాంగుల హవాలే జిల్లాలో నడుస్తోంది. వీరు కేవలం స్మార్ట్ఫోన్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మ్యాచ్కు ముందు బెట్టింగ్ రేట్ నిర్ణయించి ఆన్లైన్లో సొమ్మ జమచేయించుకుంటారు. అనంతరం గెలిచిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఇందులో 10 నుంచి 15శాతం కమీషన్లు వసూలు చేస్తుంటారు. పలమనేరులో పందేల జోరు పలమనేరులోని రొంటకుంట్ల రోడ్డు, డిగ్రీ కళాశాలకు వెనుకవైపు, నీళ్లకుంట, గొబ్బిళ్లకోటూరు చెరువలు, వారపుసంత, నాగమంగళం, రంగాపు రం, మార్కెట్ యార్డు గదులు, ఆర్టీసీ డిపో వెనుక బెట్టింగ్కు అడ్డాలుగా మారినట్లు సమాచారం. ప్రత్యేకంగా నిఘా పెట్టాం పలమనేరు సబ్డివిజన్పరిధిలో బెట్టింగులపై ఇప్పటికే బ్లూకోల్ట్స్ ద్వారా నిఘా పెట్టాం. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం. బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. చిన్న క్లూ దొరికినా ప్రధాన ముఠాను పట్టుకుంటాం. బెట్టింగ్ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాం. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు -
నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు!
మాటల్లేవు... మాట్లాడుకోవడాలు లేవు! ఒక అచ్చట లేదు.. ముచ్చటా లేదు! నట్టింట్లో సందడి, హడావుడి లేనే లేవు... ఉన్నదల్లా భరించలేనంత నిశ్శబ్దం! నలుగురు నాలుగు దిక్కుల్లో మొబైల్ఫోన్ తెరలకు అతుక్కుపోయిన పరిస్థితి. స్మార్ట్ఫోన్ ఇప్పుడు చాలామందిలో వ్యసనమైపోయింది. దీంతోనే నిద్ర... దీంతోనే మేలుకొలుపు. రీల్స్ మత్తులో కొందరు... పబ్జీ ఆడుతూ ఇంకొందరు.. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్స్ట్రాగామ్, స్నాప్చాట్... పేర్లు ఏవైనా.. అన్నింటి అతి వాడకం పుణ్యమా అని సమాజం విచిత్ర మహమ్మారిని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి పీడ ఎలాగోలా వదిలిందని సంబరపడుతున్న ఈ సమయంలో దశాబ్దకాలంగా పట్టిపీడిస్తున్న ఈ స్మార్ట్ఫోన్ మహమ్మారి సంగతులపై ప్రత్యేక కథనం. -కంచర్ల యాదగిరిరెడ్డి సగటున ఏడు గంటలు ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ దేశంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 2021లో సగటు భారతీయులు రోజుకు సుమారు ఏడు గంటలపాటు ఫోన్కు అతుక్కుపోతున్నారు. ‘నేను మొదట్లో గంట మాత్రమే యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలను చూసేదానిని. ఇప్పుడు ఆ ఊబి నుంచి బయటపడేందుకు మానసిక నిపుణుడి సహాయం తీసుకోవాల్సి వచ్చింది’ అని ముంబైకి చెందిన గృహిణి ప్రమీలారాణి వాపోయారు. ‘ముఖ్యంగా టీనేజ్ పిల్లలు స్మార్ట్ఫోన్కు బానిసలవుతున్నారు. వారిని ఆ వ్యస నం నుంచి దూరం చేయకపోతే భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. నా దగ్గరకు రోజు ఇలాంటి కేసులు అరడజను దాకా వస్తున్నాయి. వారిలో పిల్లలతో పాటు సాధారణ గృహిణులు కూడా ఉన్నారు’అని ఢిల్లీకి చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ రాజేంద్రన్ చెప్పారు. హైదరాబాద్కు చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘నిమిషానికి ఒకసారి.. నోటిఫికేషన్లు, మెయిళ్లు, చాట్ మెసేజీలేమైనా వచ్చాయా? అని చెక్ చేసుకోవడం స్మార్ట్ఫోన్ వ్యసన లక్షణాల్లో మొదటిది. ఫోన్ దగ్గర లేకపోతే ఆందోళనలో పడిపోవడం.. నిద్రలేవగానే స్మార్ట్ఫోన్ లాక్ ఓపెన్ చేయడం.. ఇలా అనేక రూపాల్లో మన వ్యవసనం బట్టబయలు అవుతూంటుంది’అని చెప్పారు. భౌతిక, మానసిక సమస్యలు స్మార్ట్ఫోన్ అతి వినియోగం కారణంగా అటు భౌతిక, ఇటు మానసిక సమస్యలు రెండూ తలెత్తుతున్నాయి. మహిళల్లో తలనొప్పి ఎక్కువ అవుతుండగా.. కళ్ల మంటలు, చూపులో అస్పష్టత, మెడ సమస్యలు, జబ్బు పడితే తేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటి దు్రష్పభావాలు కనిపిస్తాయి. విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ వినియోగం కాస్తా ఏకాగ్రత లోపానికి దారితీస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ‘బాలల హక్కుల సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న విద్యార్థుల్లో 37.15 శాతం మంది ఏకా గ్రత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే కనీసం 23.80 శాతం మంది పిల్లలు నిద్రపోయేటప్పుడు కూడా స్మార్ట్ఫోన్ను తమ దగ్గరగా ఉంచుకుంటున్నారు’ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వయంగా గత నెలలో లోక్సభకు వివరించారు. ‘ప్రాథమిక ఫలితాల ప్రకారం సెల్ఫోన్ రేడియేషన్ కాస్తా మగవారిలో వంధ్యత్వానికి దారితీస్తుంది. అలాగే వీర్యకణాల కదలికలు నెమ్మదించేందుకు, సంఖ్య తగ్గేందుకూ మొబైల్ఫోన్ రేడియేషన్ కారణమవుతుంది’ అని ప్రముఖ రేడియోలజిస్ట్ డాక్టర్ కే.గోవర్దన్ రెడ్డి హెచ్చరించారు. ప్రశ్నించుకోండి... సరిచేసుకోండి! స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని గుర్తించేందుకు కొన్ని సర్వేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోని ప్రశ్నలకు నిజాయితీగా జవాబులు చెప్పుకోగలిగితే మీరు స్మార్ట్ఫోన్కు బానిసయ్యారా? లేదా? అన్నది తెలిసిపోతుంది. తదనుగుణంగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలరు కూడా. అతికొద్ది మందికి కొన్ని మందులు వాడాల్సిన అవసరం రావొచ్చు. అయితే స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని తొలగించేందుకు నిర్దిష్టమైన పద్ధతి అంటూ ఏదీ లేదన్నది మాత్రం అందరూ గుర్తించాలి. -
కొత్త టీవీ, స్మార్ట్ఫోన్లను కొనాలనుకుంటున్నారా..అయితే మీకో షాకింగ్ వార్త..!
చైనాలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. కరోనా వైరస్ దెబ్బకి చైనాలో మళ్లీ పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. చైనా టెక్ హబ్ షెన్జెన్లో కూడా కోవిడ్ కేసులు వీపరితంగా పెరిగిపోయాయి. ఇప్పుడిదే సామాన్యుల పాలిట భారంగా మారనుంది. చైనా టెక్ హబ్ షెన్జెన్లో లాక్డౌన్తో విధిస్తే స్మార్ట్ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సరఫరాలో షెన్జెన్ నంబర్ 1 ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ సరఫరా నగరాల్లో షెన్జెన్ ఒకటి. చైనాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో..అక్కడి ప్రభుత్వం తగిన చర్యలను తీసుకొనేందుకు సిద్దమైంది. కాగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో చైనాలోని షెన్జెన్ నుంచి 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు భారత్కు వస్తున్నాయి. ఇలాగే కరోనా కేసులు పెరిగితే లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రీసెర్చ్ డైరెక్టర్ నవ్కేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. షెన్జెన్లో లాక్ డౌన్ మూడు వారాలు దాటితే అప్పుడు మన దేశంలోకి జూన్ త్రైమాసికపు స్మార్ట్ఫోన్స్, పర్సనల్ కంప్యూటర్స్ దిగుమతులపై ప్రభావం పడుతుందని తెలిపారు. అలాగే సెప్టెంబర్ త్రైమాసికంలో కూడా ప్రభావం ఉండొచ్చని పేర్కొన్నారు. లాక్ డౌన్ జరిగితే కష్టమే..! ఇప్పటికే ప్రపంచదేశాలు తీవ్రమైన చిప్ కొరతను ఎదుర్కొన్నాయి. దీంతో స్మార్ట్ఫోన్ కంపెనీల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ప్రస్తుతం చైనాలో కోవిడ్ విజృంభించడంతో స్మార్ట్ఫోన్, స్మార్ట్టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు. సుమారు స్మార్ట్ఫోన్స్ ధరలు 5 నుంచి 7 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేశారు. ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో ఆయా కంపెనీలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఇప్పుడు కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తే మాత్రం కంపెనీలు కచ్చితంగా ఆ భారాన్ని వినియోగదారులకు మోపే అవకాశం లేకపోలేదు. చదవండి: టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్కు సిద్ధమైన యూరప్ కంపెనీ..! -
దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు.. !
జనవరిలో తొలిసారిగా 5జీ స్మార్ట్ఫోన్ గ్లోబల్ అమ్మకాలు 4జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలను అధిగమించినట్లు మార్కెట్ ఎనలిటిక్స్ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. చైనా, ఉత్తర అమెరికా, యూరప్ వంటి దేశాలలో 5జీ స్మార్ట్ఫోన్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు కౌంటర్ పాయింట్ పేర్కొంది. అలాగే, ఈ మొబైల్ మన దేశంలో కూడా ఊపందుకున్నాయి. "5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు 2021(భారతదేశంలో) మొత్తం స్మార్ట్ఫోన్ అమ్మకాలలో 16 శాతంగా ఉన్నాయి. 2020లో 3 శాతంగా ఉన్న అమ్మకాలు 2021 నాటికి 16 శాతానికి పెరిగాయి. 2022లో 5జీ అమ్మకాలు సుమారు 40%కి చేరుకుంటుందని మేము అంచనా వేస్తాము" అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు కర్ణ్ చౌహాన్ చెప్పారు. 5జీ స్మార్ట్ఫోన్ ధరలు ₹12,000కు తగ్గితే 2022 క్యూ4లో 50 శాతానికి చేరే అవకాశం ఉందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. మార్చి 15న ప్రచురితమైన నోకియా ఇండియా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో లేనప్పటికీ 10 మిలియన్ వినియోగదారులు 5జీ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసినట్లు తెలిపింది. 5జి స్మార్ట్ ఫోన్లు జనవరిలో చైనాలో మొత్తం అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు 84% వాటాను కలిగి ఉన్నాయి. క్వాల్ కామ్, మీడియాటెక్ కంపెనీలు తక్కువ ధరకే 5జీ సపోర్ట్ గల చిప్స్ అందుబాటులోకి తీసుకొని రావడంతో అమ్మకాల పెరిగినట్లు కౌంటర్ పాయింట్ తెలిపింది. మొత్తం మొబైల్ ఫోన్ అమ్మకాల్లో పశ్చిమ ఐరోపాలో 76%, ఉత్తర అమెరికాలో 73% 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు వాటాను కలిగి ఉన్నాయి. పశ్చిమ ఐరోపాలో మొత్తం 5జీ అమ్మకాల్లో 30%, ఉత్తర అమెరికాలో 50% వాటా యాపిల్ కంపెనీకే ఉంది. ఇక మన దేశంలో 5జీ నెట్వర్క్ లేకపోవడంతో ఆ మొబైల్స్ అమ్మకాలు తక్కువగానే ఉన్న ఈ ఏడాది నుంచి 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది. దేశీయ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటీ) ఈ ఏడాది ఎప్పుడైనా 5జీ స్పెక్ట్రం కోసం వేలం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని ప్రధాన టెల్కోలు భారతదేశం అంతటా 5జీ ట్రయల్స్ నిర్వహించాయి. (చదవండి: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా..?) -
అమెజాన్ బంపరాఫర్..! టీవీ, స్మార్ట్ఫోన్స్పై 55 శాతం మేర తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్టీవీలు, స్మార్ట్ఫోన్స్పై భారీ తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులకోసం అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేల్ లైవ్లో ఉంది. ఈ సేల్ మార్చి 14తో ముగియనుంది. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ భాగంగా వన్ప్లస్, శాంసంగ్, షావోమీ, రియల్మీ, ఒప్పో, టెక్నో, వంటి స్మార్ట్ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్టీవీ, స్మార్ట్ఫోన్స్ను హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇక స్మార్ట్టీవీలపై ఏకంగా 55 శాతం మేర తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ఇక మొబైల్ యాక్సెసరీస్పై 70 శాతం మేర, వైర్లెస్ హెడ్ఫోన్స్పై 60 శాతం డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఇక ప్రైమ్ మెంబర్స్కు ఏకంగా రూ.20 వేల వరకు బెనిఫిట్స్ రానున్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్: స్మార్ట్ఫోన్స్పై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus 9R(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్ఫోన్పై 15 శాతం తగ్గింపుతో రూ.33,999కు రానుంది. OnePlus 9 Pro(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్ఫోన్పై 12 శాతం తగ్గింపుతో రూ. 56,999 కోనుగోలుచేయవచ్చును. ► OnePlus 9(8GB ర్యామ్ + 128GB ఇంటర్నల్ స్టోరేజ్) స్మార్ట్ఫోన్పై 14 శాతం తగ్గింపుతో రూ.42,999. అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ఫోన్పై ఎలాంటి తగ్గింపు లేనప్పటికీ, స్మార్ట్ఫోన్స్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 16,550 రానుంది. దీంతో ఈ హ్యాండ్సెట్ను రూ. 26,449కే కోనుగోలు చేయవచ్చును. ► Realme Narzo 50A (4GB ర్యామ్ + 64GB ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ రూ. 1500 తగ్గింపుతో రూ.11,499కు రానుంది. ► Samsung Galaxy M52 5G 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్పై రూ. 10 వేల తగ్గింపుతో 24,999కు రానుంది. ► Redmi 9A Sport స్మార్ట్ఫోన్పై రూ. 1500 తగ్గింపుతో రూ. 6,999కు రానుంది. Redmi Note 11 స్మార్ట్ఫోన్పై 25శాతం తగ్గింపుతో రూ. 13,499కు రానుంది. ► Tecno Spark 8 Pro స్మార్ట్ఫోన్పై రూ.3500 తగ్గింపుతో రూ. 9999కు రానుంది. Tecno Camon 17 స్మార్ట్ఫోన్పై రూ . 2,000 తగ్గింపుతో రూ. 13,999కు అందుబాటులో ఉంది . అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్: టీవీ మోడళ్లపై బెస్ట్ ఆఫర్స్ ► OnePlus (32-అంగుళాల) Y-సిరీస్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీను రూ.15,999.కి కొనుగోలు చేయవచ్చు. ► Redmi TV (32-అంగుళాల నుంచి 55-అంగుళాల) స్మార్ట్టీవీలు తగ్గింపు ధరలలో రానున్నాయి. ► Samsung 43-అంగుళాల క్రిస్టల్ 4K సిరీస్ అల్ట్రా HD స్మార్ట్ LED TV రూ. 36,990 లభించనుంది. చదవండి: అమెజాన్ బంపరాఫర్..! ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! -
పెను ప్రమాదంలో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్..!
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! తాజాగా వెలుగులోకి వచ్చిన బగ్తో పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ పెను ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదం ఎక్కువగా ఆండ్రాయిడ్ 12తో నడుస్తోన్న స్మార్ట్ఫోన్స్లో ఉండనుంది. డర్టీ పైప్ డర్టీ పైప్ అనే బగ్ ఆండ్రాయిడ్ 12తో నడుస్తున్న పలు స్మార్ట్ఫోన్స్ను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బగ్తో హ్యాకర్లు స్మార్ట్ఫోన్స్పై యాక్సెస్ను సులువుగా పొందుతారు. అంతేకాకుండా రీడ్-ఓన్లీ ఫైల్స్లో డేటాను ఓవర్రైట్ చేసే అవకాశం ఉంది. జర్మన్ వెబ్ డెవలప్మెంట్ కంపెనీ CM4కి చెందిన భద్రతా పరిశోధకుడు మాక్స్ కెల్లర్మాన్ 'డర్టీ పైప్' దుర్బలత్వాన్ని గుర్తించారు. దీనిని మొదటగా లైనక్స్ (Linux) కెర్నల్లో గుర్తించారు. ఈ వారం ప్రారంభంలో CVE-2022-0847గా నమోదు చేయబడిన సెక్యూరిటీ బ్రీచ్ను కెల్లర్మాన్ బహిరంగంగా వెల్లడించారు. చదవండి: శాంసంగ్కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్ఫోన్ యూజర్లు.! కెల్లర్మాన్ ప్రకారం...ఈ సమస్య Linux 5.16.11, 5.15.25 , 5.10.102లో పరిష్కరించనప్పటికీ, వెర్షన్ 5.8 లైనక్స్ కెర్నల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 2018లో వచ్చిన డర్టీ కౌ(Dirty CoW)ను పోలీ ఉందని పరిశోధకులు తెలిపారు. అప్పట్లో పలు ఆండ్రాయిడ్ యూజర్లను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ సమయంలో గూగుల్ సెక్యూరిటీ ప్యాచ్ను విడుదల చేయడంతో ఈ లోపాన్ని వెంటనే పరిష్కరించగల్గింది. ఎన్క్రిప్డెడ్ సందేశాలను సులువుగా..! డర్టీ పైప్ బగ్ సహయంతో హ్యాకర్లు సులువుగా ఆయా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా స్మార్ట్ఫోన్ సిస్టంలోని రీడ్-ఓన్లీ ఫైల్లలో డేటాను ఓవర్రైట్ చేయడానికి యాక్సెస్ను హ్యాకర్లు పొందుతారు. ఆండ్రాయిడ్ సిస్టంకు లైనక్స్ కెర్నల్ను కోర్గా ఉపయోగిస్తుంది దీంతో ఆయా స్మార్ట్ఫోన్ యూజర్లపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ సందేశాలను చదవడానికి, మార్చడానికి, ఓటీపీ సందేశాలను క్యాప్చర్ చేయడానికి ఈ బగ్ హ్యకర్లకు ఉపయోగపడనుంది. అంతేకాకుండా స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసిన బ్యాంకింగ్ యాప్స్ను రిమోట్గా నియంత్రించేందుకు వారికి అనుమతి లభిస్తోంది. వీటిపై ప్రభావం ఎక్కువగా..! ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్లో ఆండ్రాయిడ్ వెర్షన్ 12 కి ముందు వెర్షన్స్ అస్సలు ప్రభావితం కావు. అయితే ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఉన్న పలు స్మార్ట్ఫోన్స్ ప్రభావితమవుతాయని కెల్లర్మాన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 6, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 స్మార్ట్ఫోన్స్ బగ్తో ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఈ బగ్ గురించి గూగుల్ ఇప్పటికే తెలుసు కానీ దాని పరిష్కారాన్ని ఇంకా చూపలేదు. కాగా ఈ బగ్ నుంచి తప్పించుకోవడం కోసం ఆండ్రాయిడ్ యూజర్లు ఎలాంటి థర్డ్-పార్టీ సోర్స్ నుంచి యాప్స్ను ఇన్స్టాల్ చేయకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. చదవండి: నోకియా సంచలన నిర్ణయం..! -
ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
కవాడిగూడ: ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందించడం గర్వకారణమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం కవాడిగూడ డివిజన్ దోమలగూడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 19 మంది ఆశావర్కర్లకు ఎమ్మెల్యే స్మాట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్లు అందించడంతో ప్రతి వ్యక్తి ఆరోగ్యం గురించి ఆశావర్కర్లు అందులో ఎంటర్ చేస్తారన్నారు. టీకాలు, జ్వర పరీక్షలు, మందుల పంపిణీ వంటి సమాచారం ఎంట్రీ అవుతుందన్నారు. కరోనా సమయంలో ఆశావర్కర్లు ఇంటింటికి తిరిగి సమగ్ర విచారణ చేపట్టి కరోనా సోకిన వ్యక్తులను గుర్తించి మందుల కిట్లను పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ నెల 27న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో 'లోకల్' స్కెచ్!! వేలకోట్లలో పెట్టుబడులు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వివో రానున్న రెండేళ్లలో దేశీయంగా రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా ఈ కేలండర్ ఏడాది(2022)లో దేశీయంగా తయారైన మొబైల్ ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేసే యోచనలో ఉంది. దేశీయంగా మొత్తం రూ. 7,500 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు వివో ఇండియా (వ్యాపార వ్యూహాల) డైరెక్టర్ పాయిగమ్ డానిష్ తాజాగా తెలియజేశారు. తద్వారా దేశీయంగా తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే(2021 వరకూ) రూ.1,900కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.రానున్న రెండేళ్లలో మరో రూ.3,500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. పెట్టుబడులన్నీ తయారీకే వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. లోకల్ డిమాండ్ స్థానికంగా మొబైల్ ఫోన్లకున్న డిమాండుకు అనుగుణంగా గ్రేటర్ నోయిడా ప్లాంట్ల నుంచి సరఫరాలు చేస్తున్నట్లు డానిష్ పేర్కొన్నారు. ఇకపై హ్యాండ్సెట్లను ఎగుమతి చేయడంపై దృష్టిసారించనున్నట్లు వెల్లడించారు. వెరసి ఈ ఏడాది నుంచే ఎగుమతులను చేపట్టనున్నట్లు తెలియజేశారు. దేశీ అవసరాలకు అనుగుణంగా గత ఏడేళ్లలో తామెంత బలపడిందీ ఈ అంశాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీ మార్కెట్లో వివో 10 కోట్లకుపైగా వినియోగదారులను చేరుకున్నట్లు తెలియజేశారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ ప్రకారం 2021లో షియోమీ, శామ్సంగ్ తదుపరి 15.6 శాతం మార్కెట్ వాటాతో దేశీయంగా మూడో ర్యాంకులో నిలిచినట్లు వెల్లడించారు. మరో 5000 మందికి ఉపాధి ప్రస్తుతమున్న 6 కోట్ల స్మార్ట్ఫోన్ తయారీ సామర్థ్యాన్ని 12 కోట్లకు పెంచుకునే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు డానిష్ తెలియజేశారు. ఇందుకు వెచ్చిస్తున్న రూ. 7,500 కోట్ల పెట్టుబడులతో ఉద్యోగుల సంఖ్య 40,000కు చేరనున్నట్లు తెలియజేశారు. తయారీ యూనిట్లలో ప్రస్తుతం 10,000 మంది విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2023లో అదనంగా 5,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో కొనుగోలు చేసిన మరో 169 ఎకరాలలో కొత్త ప్లాంటును నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక వస్తువులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం బ్యాటరీలను 90 శాతం, చార్జర్లను 60 శాతంవరకూ దేశీయంగానే సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. 2023కల్లా 65 శాతం డిస్ప్లేలను స్థానికంగా రూపొందించనున్నట్లు వెల్లడించారు. -
రూపాయికే బ్లూటూత్..!! దేశీయ మార్కెట్లో అదిరిపోయే ఫీచర్లతో మరో 5జీ ఫోన్!
న్యూఢిల్లీ: ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్ల హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇన్ఫినిక్స్ తొలి 5జీ ఫోన్ను ‘జీరో 5జీ’ పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫీచర్లు, ధరలు ►మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్పై ఇది పనిచేస్తుంది. ►13 5జీ బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది. ►అత్యధిక 5జీ బ్యాండ్లు కలిగిన ఫోన్ ఇదే ►8జీబీ ర్యామ్ (5జీ ర్యామ్ ఎక్స్పాండబుల్), 128జీబీతో వచ్చే దీని ధర రూ.19,999. ►ఫ్లిప్కార్ట్పై ఈ నెల 18 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి. ►ఈ ఫోన్ను కొనుగోలు చేసే వారికి రూ.999 విలువ చేసే ఇన్ఫినిక్స్ స్నాకర్ (ఐరాకర్)ను కేవలం రూ.1కే అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ►ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 11పై పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో ఉంటుంది. -
వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
కాప్రా: ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావడంలో ఆశ వర్కర్లది కీలక పాత్ర అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కొనియాడారు. ఏఎస్రావునగర్ డివిజన్ జమ్మిగడ్డలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు ఆవ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఆశవర్కర్లు టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకు మరిన్ని మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో వేతనాలు సరిగా అందక, ఎప్పుడు వస్తుందో తెలియక ఆశ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వారి వేతనాలు పెంచి ప్రతి నెల సమయానికి అందేలా చొరవ చూపుతోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆశ వర్కర్లకు వేతనాలు అందిస్తున్న ఘనత ఒక్క కేసీఆర్దే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషరెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసం మహిపాల్రెడ్డి, కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గం నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి వైద్యులు సంపత్కుమార్, స్వప్న పాల్గొన్నారు. దుప్పట్ల పంపిణీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం జమ్మిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఏఎస్రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్రెడ్డి హాజరై వృద్ధులు, పేదలకు దుప్పట్లు, దుస్తులు, పండ్లు అందించారు. -
టీవీ, స్మార్ట్ఫోన్స్పై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..! ఏకంగా రూ. 10 వేలకు పైగా..
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ టీవీ, స్మార్ట్ఫోన్స్పై భారీ తగ్గింపును ప్రకటించింది. కొనుగోలుదారులకోసం అమెజాన్ మొబైల్ అండ్ టీవీ సేవింగ్ డేస్ సేల్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సేల్ లైవ్లో ఉంది. ఈ సేల్ ఫిబ్రవరి 15తో ముగియనుంది. వన్ప్లస్, శాంసంగ్, షావోమీ, రియల్మీ, ఒప్పో, టెక్నో, వంటి స్మార్ట్ఫోన్స్పై 10 శాతం తగ్గింపుతో పాటు పలు బ్యాంకు కార్డులపై కూడా తగ్గింపును అందిస్తోంది అమెజాన్. ఇక స్మార్ట్టీవీలపై ఏకంగా 40 శాతం మేర తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ఇక మొబైల్ యాక్సెసరీస్పై కూడా డిస్కౌంట్ రేట్లకే అందిస్తోంది. మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డేస్లో అమెజాన్ అందిస్తోన్న కొన్ని ఆఫర్స్ ఇవే..! ► Redmi Note 11T 5G ధర రూ. 19,999 కాగా అసలు ధర రూ. 22,999 ► Mi 11X స్మార్ట్ఫోన్ రూ. 25,999 తగ్గింపుతో రానుంది. ఈ స్మార్ట్ఫోన్పై రూ. 6,000 డిస్కౌంట్తో పాటుగా అదనంగా మొబైల్ ఎక్సేఛేంజ్పై రూ. 3,000 తగ్గింపు. ► Samsung Galaxy M52 5G స్మార్ట్ఫోన్ రూ. 22,999కు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ.34,999. ► Samsung Galaxy M32 5G స్మార్ట్ఫోన్ రూ. 20,999కు అందుబాటులో ఉండనుంది. దీని లిస్టెడ్ ధర రూ. 23,999. ► Iqoo Z5 ధర రూ. 21,990 తగ్గింది. దీని లిస్టెట్ ధర రూ. 29,990. Iqoo 7 ధర రూ. 27,990. ► Realme Narzo 50A ధర ప్రస్తుతం రూ. 10,349 తగ్గింది, దీని అసలు ధర రూ. 12,999. ► ఇక Oppo, Realme, Tecno ఈ స్మార్ట్ఫోన్స్ను ఫెడరల్ బ్యాంక్ కార్డ్లతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చును. ► 32-అంగుళాల Redmi TV ప్రస్తుతం రూ. 14,998, ఈ స్మార్ట్టీవీపై ఏకంగా రూ. 10,001 తగ్గింపు. ► 50-అంగుళాల Redmi TV ఆఫర్ ప్రైజ్ రూ. 34,998. దీని అసలు ధర రూ.44,999. ► 32-అంగుళాల Mi Horizon ఫుల్- HD TV ధర రూ. 16,499కు రానుంది. ► 43-అంగుళాల Samsung క్రిస్టల్ 4K ప్రో UHD TV అసలు ధర రూ. 52,900 కాగా ప్రస్తుతం రూ. 36,990 కు అందుబాటులో ఉండనుంది. ► OnePlus స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ. 16,499 తక్కువ ధరకే రానుంది. ► 50-అంగుళాల AmazonBasics 4K TV పై 40 శాతం వరకు తగ్గింపుతో రూ. 23,001కు అందుబాటులో ఉండనుంది. చదవండి: అమెజాన్ బంపరాఫర్..! ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు..! -
స్క్రీన్ కష్టాలు.. చెక్ పెట్టండిలా!
కంప్యూటర్ ముందు పని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. ఎక్కువ సమయం తదేకంగా స్క్రీన్ను చూడడం ఆరోగ్యానికి హానికరం. కన్ను, మెడ సమస్యలు ఎదురవుతాయి. అందుకే త్రీ ట్వంటీస్ (20–20–20) రూల్ ఒక మంచి ఆలోచన. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పనిలో బ్రేక్ తీసుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద నుంచి దృష్టి మరల్చి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్ల పాటు చూడాలి. ఇదే 20–20–20 రూల్. పక్కన ఉన్న ఫొటోను గమనించండి. ∙కంప్యూటర్ బాధితులకు మరో సూచన... కంప్యూటర్ స్క్రీన్ నుండి వచ్చే లైట్ వలన కంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించాలి. అలాగే మరో సంగతి... కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి కంప్యూటర్ నుంచి వెలువడే కాంతి కంటే ఎక్కువ కాంతిలో ఉండాలి. అప్పుడు కంప్యూటర్ నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావం తీవ్రత తగ్గుతుంది. ఈ స్క్రీన్ కష్టాల్లో కొన్ని ఉద్యోగ, వృత్తుల రీత్యా తప్పని సరి అవుతుంటే మరికొన్ని మనకు మనంగా తెచ్చుకుంటున్న కష్టాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి స్మార్ట్ ఫోన్తో కొనితెచ్చుకునే ఇక్కట్లు. ∙నిద్రపోయే ముందు గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ చూస్తుంటారు. నిద్ర వచ్చే వరకు మాత్రమే అనుకుంటూ చాటింగ్, గేమ్స్, వీడియోలు చూడడం మొదలుపెడతారు. అది అరగంటకు పైగా సాగుతూనే ఉంటుంది. గేమ్ ఆడుతున్నంత సేపూ మెదడు చురుగ్గా ఉంటుంది. ఇక నిద్ర ఎలా వస్తుంది? -
శాంసంగ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ సేవలు పూర్తిగా బంద్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ మొబైల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్లలో, స్మార్ట్టీవీల్లో టైజెన్ (Tizen) యాప్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టైజెన్ యాప్ స్టోర్ను 2021 డిసెంబర్ 31నే పూర్తిగా మూసివేసినట్లు శాంసంగ్ తెలిపింది. ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్కు..! పాత యూజర్లతో పాటుగా, కొత్త యూజర్లు కూడా టైజెన్ యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని శాంసంగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. GSMArena ప్రకారం..టైజెన్ యాప్ సేవల రిజిస్ట్రేషన్ శాంసంగ్ పూర్తిగా మూసివేసింది. ఈ యాప్ స్టోర్ కేవలం పాత కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అందులో కూడా పాత యూజర్లు గతంలో డౌన్లోడ్ చేసిన యాప్స్ను మాత్రమే పొందగలరని శాంసంగ్ వెల్లడించింది. శాంసంగ్ జెడ్ సిరీస్ స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్కు మారాలని శాంసంగ్ సూచించింది. స్మార్ట్టీవీల్లో, వాచ్ల్లో..! శాంసంగ్ టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఆండ్రాయిడ్కు గతంలోనే మారింది. ఆండ్రాయిడ్కు ముందుగా స్మార్ట్వాచ్, స్మార్ట్ఫోన్లలో టైజెన్ ఒఎస్ను శాంసంగ్ వాడింది. కాగా ఇటీవల కాలంలో కొత్త స్మార్ట్టీవీలను టైజెన్ ఒఎస్తో శాంసంగ్ ఆవిష్కరించింది. ఆయా స్మార్ట్టీవీల్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తోంది. అసలు ఏంటి టైజెన్..! టైజెన్ స్టోర్ అనేది శాంసంగ్ స్మార్ట్ఫోన్లలో ముందే ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ స్టోర్. ఇది టైజెన్ ప్లాట్ఫారమ్ ఆధారిత అప్లికేషన్లను సపోర్ట్ చేస్తోంది. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ప్లే స్టోర్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్టోర్లో యూజర్లు అప్లికేషన్లను బ్రౌజ్ చేయడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ ఆయా స్మార్ట్టీవీలో కూడా ఉంది. ఈ యాప్ అన్ని ప్రముఖ ఆడియో , వీడియో స్ట్రీమింగ్ సేవలను అందిస్తోంది. ఇది శాంసంగ్ హెల్త్, స్మార్ట్ థింగ్స్, శాంసంగ్ టీవీ ప్లస్ తోపాటుగా అనేక ఇతర గేమింగ్ ఫీచర్లను కూడా అనుసంధానిస్తుంది. చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న ఇయర్ఫోన్స్, సోలార్పవర్తో ఛార్జ్..! -
త్వరపడండి..! మొబైల్, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ జనవరి 7న ప్రారంభమవ్వగా...జనవరి 10 తో ముగియనుంది. సేల్లో భాగంగా పలు స్మార్ట్ఫోన్, టీవీ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్టీవీలపై 48 శాతం వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై 10 శాతం తగ్గింపుతో గరిష్టంగా రూ. 1,000 వరకు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అదనంగా ఆర్నెల్ల స్క్రీన్ రిప్లేస్మెంట్, మూడు నెలల నోకాస్ట్ ఈఎంఐతో పాటుగా రూ. 20 వేల వరకు క్యాష్ బెనిషిట్స్ను పొందవచ్చును. ఈ సేల్ ముగిసిన వెంటనే అమెజాన్ ప్రీమియం ఫోన్ పార్టీ ఈవెంట్ జనవరి 12 మొదలుపెట్టనుంది. ఈ సమయంలో కస్టమర్లు తక్కువ ధరకే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రూ.5వేల వరకు కూపన్ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..! మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డే సేల్లో అమెజాన్ అందిస్తోన్న పలు ఆఫర్స్..! ► Mi 11X స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 23,499కు లభించనుంది. Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ఫోన్ను రూ. 19,999కు రానుంది. వీటిపై క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. ► Redmi 9A స్మార్ట్ఫోన్ 7,199 రూపాయలకు అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. దీనిపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా రానుంది. ► Samsung Galaxy S20 FE 5G స్మార్ట్ఫోన్ను 46 శాతం తగ్గింపుతో రూ. 39,990కి కొనుగోలు చేయవచ్చు. ► OnePlus 9R స్మార్ట్ఫోన్ రూ. 33,999, వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ 36,999 మరియు వన్ప్లస్ 9 ప్రో స్మార్ట్ఫోన్ రూ. 54,999 కు రానుంది. ► iQOO Z5ని రూ.21,990కి మరియు iQOO 7 స్మార్ట్ఫోన్ను రూ.27,990కి కొనుగోలు చేయవచ్చు. ► Realme Narzo 50A, Samsung Galaxy M52 5G, OnePlus Nord 2 5G స్మార్ట్ఫోన్లపై రూ. 5,000 వరకు డిస్కౌంట్ కూపన్స్ను అమెజాన్ అందిస్తోంది. ► AmazonBasics 50-అంగుళాల 4K TV 40 శాతం డిస్కౌంట్తో రూ. 32,999కు రానుంది. ► Sony 50-inch 4K UHD Google స్మార్ట్టీవీ 30 శాతం డిస్కౌంట్తో రూ. 77, 990కు లభించనుంది. ► iFFalcon 43-inch 4K UHD స్మార్ట్టీవీ ఏకంగా 48 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. ► Redmi TV 32 అంగుళాల HD Smart TVని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. ► Mi 40inch Horizon FHD TVని రూ.6000 తగ్గింపుతో రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు. చదవండి: బంపరాఫర్..! మహీంద్రా కార్లపై రూ. 82 వేల వరకు భారీ తగ్గింపు.! -
స్మార్ట్ఫోన్లకు ఎండ్కార్డ్...! వాటి స్థానంలో పవర్ఫుల్..!
స్మార్ట్ఫోన్..మన జీవితంలో ఒక భాగమైపోయింది. స్మార్ట్ఫోన్ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేము. కాగా ప్రస్తుతం టెక్ దిగ్గజం యాపిల్ పనిచేస్తోన్న సరికొత్త టెక్నాలజీతో రాబోయే రోజుల్లో స్మార్ట్ఫోన్లకు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఐఫోన్ల స్థానంలో ఏఆర్ హెడ్సెట్..! ఐఫోన్ 12 ప్రొతో లైడర్ టెక్నాలజీను యాపిల్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో అగ్యుమెంటేగ్ రియాల్టీలో యాపిల్ ఒక అడుగు ముందుకేసింది. కాగా వచ్చే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లను పవర్ఫుల్ అగ్యుమెంటేడ్ రియాల్టీ హెడ్సెట్స్ రిప్లేస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పవర్ఫుల్ హెడ్సెట్లను యాపిల్ 2022 చివరలో రిలీజ్ చేయనుంది. మ్యాక్ బుక్ వలె శక్తివంతమైనవిగా ఏఆర్ హెడ్సెట్ నిలిచే అవకాశం ఉందని యాపిల్ విశ్లేషకుడు మింగ్ చి కువో అభిప్రాయపడ్డారు. మ్యాక్ బుక్స్లోని ‘ఎమ్1’ పవర్ఫుల్ ప్రాసెసర్లను ఏఆర్ హెడ్సెట్లలో వినియోగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యంత శక్తివంతమైన గాడ్జెట్స్గా ఏఆర్ హెడ్సెట్స్ నిలవనున్నాయి. స్మార్ట్ఫోన్లకు ది ఎండ్..! యాపిల్ లాంచ్ చేయనున్న హెడ్సెట్స్ అగ్యుమెంటెడ్, వర్చువల్ రియాల్టీలను సపోర్ట్ చేయనున్నాయి. ఈ ఏఆర్ హెడ్సెట్స్ అత్యంత శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ టెక్నాలజీతో రానున్న రోజుల్లో ఐఫోన్లనే కాకుండా స్మార్ట్ఫోన్లను రిప్లేస్ చేసే అవకాశం లేకపోలేదని మింగ్ చి కువో అభిప్రాయపడ్డారు. యాపిల్తో పాటుగా ఇతర స్మార్ట్ఫోన్ కంపెనీలు కూడా ఏఆర్ హెడ్సెట్స్ను రూపొందించే అవకాశం ఉందని మింగ్ పేర్కొన్నారు. చదవండి: బిజీ సీజన్లో 97 కోట్ల నష్టం.. అయినా చిరునవ్వు, నువ్వు సూపర్ బాసు -
మీరు ఈ స్మార్ట్ఫోన్లను వాడుతున్నారా...! అయితే మీ కాల్ డేటా హ్యకర్ల చేతిలోకి..!
ప్రపంచవ్యాప్తంగా క్వాలకమ్, మీడియాటెక్, హెలియో ప్రాసెసర్లను పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు ఎక్కువగా వాడుతున్నాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా 37 శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉపయోగించిన మీడియాటెక్ ప్రాసెసర్లో భద్రతా లోపాలు ఉన్నట్లు ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ రీసెర్చ్ సంచలన విషయాలను వెల్లడించింది. చదవండి: మెటావర్స్తో ముప్పు! అంతకు మించి.. మీ కాల్స్ను మూడో వ్యక్తి వినగలరు..! మీడియాటెక్ ప్రాసెసర్స్తో నడిచే స్మార్ట్ఫోన్లను వాడుతున్న యూజర్ల కాల్స్ను మూడో వ్యక్తి వినే అవకాశం ఉన్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదించింది. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రచురించిన నివేదిక ప్రకారం.... మీడియాటెక్ చిప్ ఆడియో ప్రాసెసర్లో అనేక దుర్బలత్వాలు ఉన్నట్లు గుర్తించింది. ఒకవేళ వీటిని రెక్టిఫై చేయకుండా వదిలేస్తే హ్యాకర్లు సులభంగా వారి సంభాషణలు వినే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాటెక్ ప్రాసెసర్లను ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలు షావోమీ, ఒప్పో, రియల్మీ,వివో లాంటి కంపెనీలు వాడుతున్నాయి. పరిష్కరించిన మీడియాటెక్..! చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదించిన లోపాలపై మీడియాటెక్ స్పందించింది. పలు ప్రాసెసర్లలో లోపాలు ఉన్నది వాస్తవమైనప్పటికీ, ఈ లోపాల సహాయంతో ఇప్పటివరకు ఎలాంటి డేటా చౌర్యం జరిగిందనే రుజువులేదని మీడియా టెక్ భద్రత అధికారి టైగర్ హుజ్ వెల్లడించారు. ఆయా లోపాలను కంపెనీ వెంటనే గుర్తించి, పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ముందు జాగ్రత్తగా ఆయా స్మార్ట్ఫోన్ల యూజర్లు కొత్త సెక్యూరిటీ ప్యాచ్కి అప్డేట్ చేయాలని పేర్కొంది. వాటితో పాటుగా గూగుల్ ప్లే స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. CVE-2021-0661, CVE-2021-0662, CVE-2021-0663గా గుర్తించబడిన లోపాలను కంపెనీ పరిష్కరించిందని మీడియాటెక్ తన సెక్యూరిటీ బులెటిన్లో ప్రచురించింది. చదవండి: ప్రపంచంలోనే తొలిసారిగా...! మీడియాటెక్ నుంచి పవర్ఫుల్ ప్రాసెసర్..! -
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. ‘స్మార్ట్’ బిల్లు నెలకు 194 కోట్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నెలకు రూ.194 కోట్లు.. ఏడాదికి రూ. 2,328 కోట్లు.. మన రాష్ట్రంలో మొబైల్ ఫోన్ వినియోగదారులు చెల్లిస్తున్న బిల్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దైనందిన జీవితంలో విడదీయరానిదిగా మారిన మొబైల్ ఫోన్ల బిల్లులకు ఇంతమొత్తం వెచ్చిస్తున్నాం. సాక్షాత్తు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) లెక్కలే ఇవి. రాష్ట్రంలో ఎంతమంది స్మార్ట్ ఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారోనని ట్రాయ్ లెక్కలు వేసింది. అక్టోబర్ 30 నాటికి 96,96,152 మొబైల్ (సాధారణ, స్మార్ట్) ఫోన్లు ఉన్నట్టు తేలింది. ఇవన్నీ మన రాష్ట్రంలోని చిరునామాలతో ఉన్న సిమ్కార్డులే. ఇతర రాష్ట్రాల్లో సిమ్కార్డులు తీసుకుని వినియోగిస్తున్నవారు కూడా పెద్దసంఖ్యలోనే ఉంటారు. మొత్తం మీద రాష్ట్రంలో 97 లక్షల మొబైల్ ఫోన్లు వాడకంలో ఉన్నాయని అంచనా. ఒక్కొక్కరు నెలకు రూ.200 వంతున వ్యయం చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.194 కోట్ల బిల్లు కడుతున్నారు. సంవత్సరానికి రూ.2,328 కోట్లు చెల్లిస్తున్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. చాలామంది రూ.500 నుంచి రూ.వెయ్యికిపైగానే చెల్లించేవారున్నారు. 30 శాతం ఫోన్లు 25 ఏళ్లలోపు వారి దగ్గరే రాష్ట్రంలో ఉన్న మొబైల్ ఫోన్లలో 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు వారి చేతుల్లోనే 30 శాతం వరకు ఉన్నట్టు తేలింది. సగటున ఈ వయసు వాళ్లు రోజుకు 3 గంటలకుపైగా సెల్ఫోన్ వాడుతున్నారు. 30 ఏళ్లు, ఆపైన వయసు వారు 2 గంటల లెక్కన వాడుతున్నారు. యువకులు ఎక్కువగా టాక్ టైమ్ (మాట్లాడటం) కంటే సామాజిక మాధ్యమాలు అంటే వాట్సాప్, ఫేస్బుక్ తదితరాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. చాలామందికి సెల్ఫోన్ వినియోగం వ్యసనంగా మారినట్టు కూడా తేలింది. పనిగంటలకు తీవ్ర అంతరాయం కలగడమేగాక.. అనేకమంది విద్యార్థులు చదువుల్లో వెనకబడిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏటా స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య 10 నుంచి 15 శాతం పెరుగుతున్నట్టు తేలింది. -
రియల్మీ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనంజా సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో భాగంగా పలు రియల్మీ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది ఫ్లిప్కార్ట్. రియల్మీ జీటీ నియో2 స్మార్ట్ఫోన్పై సుమారు రూ. 4000 వరకు డిస్కౌంట్ను ప్రకటించింది. దీంతో రియల్మీ జీటీ నియో 2 స్మార్ట్ఫోన్ రూ. 27,999కే లభించనుంది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 31,999. చదవండి: మీరు ఉద్యోగస్తులా..! ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే భారీగా ట్యాక్స్ బెన్ఫిట్స్ రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్ఫోన్పై కూడా రూ. 4 వేల వరకు తగ్గింపును ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు రూ.21999కే లభించనుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్గా నిలుస్తోన్న రియల్మీ సీ20 స్మార్ట్ఫోన్పై ఎప్పటిలాగనే రూ. 500 తగ్గింపుతో రూ.6999కు లభించనుంది. రియల్మీ 8ఎస్ 5జీ స్మార్ట్ఫోన్పై రూ. 1500 తగ్గింపుతో రూ. 18499కే కొనుగోలుదారులకు లభించనుంది. రియల్మీ నార్జో 50ఏ స్మార్ట్ఫోన్ రూ.1000 డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. 10499కు రానుంది. చదవండి: టెలికాం కంపెనీలే లక్ష్యంగా..నోకియా బిగ్ స్కెచ్..! -
పవర్ ఫుల్ ఫాస్ట్ చార్జర్తో రానున్న రెడ్మి నోట్11 సిరీస్
ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రెడ్మీ ఈ నెల 28న ఒక ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రెడ్మి నోట్11 సిరీస్ స్మార్ట్ఫోన్ని ఆవిష్కరించనుంది. ఈ లాంచింగ్ ఈవెంట్లో రెడ్మి వాచ్ 2 కూడా విడుదల కానుంది. రెడ్మి నోట్11 సిరీస్ పోస్టర్ నుంచి రాబోయే సిరీస్ డిజైన్ వెల్లడైంది. రెడ్మి నోట్11 సిరీస్లో చాలా ఫోన్లను ప్రారంభించవచ్చని సమాచారం. చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ వీబోలో.. రెడ్మి నోట్11 సిరీస్ 120డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు కంపెనీ దృవీకరించింది. అలాగే, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో రానున్నట్లు పోస్ట్ చేసింది. రెడ్మి నోట్ 11 మొబైల్ మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్, రెడ్మి నోట్ 11 ప్రో మీడియాటెక్ డిమెన్సిటీ 920 ప్రాసెసర్, రెడ్మి నోట్ 11 ప్రో+ మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్ ద్వారా పనిచేయనుంది. రెడ్మి నోట్11 సిరీస్ ఫోన్లు 120హెర్ట్జ్ డిస్ ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో వస్తాయని సమాచారం. వీటిలో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఫీచర్లు ఉన్నట్లు టెక్ బ్లాగ్ సినావిబో పేర్కొంది. (చదవండి: మరో మహత్తర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..!) -
ప్రియాంక దూకుడు: అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, స్కూటీలు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా దూకుడు మీద ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను ఎలాగైనా తిరిగి సొంతం చేసుకోవాలనే వ్యూహంలో శరవేగంగా కదులుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విద్యార్థినులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. యూపీలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 12వ తరగతి అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, గ్రాడ్యుయేట్లకుఎలక్ట్రానిక్ స్కూటీలను అందిస్తామని ప్రియాంక గురువారం ప్రకటించారు. వారి చదువుకు, భద్రతకు స్మార్ట్ఫోన్లు అవసరమని పేర్కొన్నారు. ఇందుకు మ్యానిఫెస్టో కమిటీ అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లను రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.మహిళల ఓట్లను ఆకర్షించేలామహిళలకు 40 శాతం టిక్కెట్లను కేటాయించనున్నట్టు ప్రియాకం ప్రకటించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకునే మహిళలు ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. పోటీ చేయాలనుకునే ఏ స్త్రీ అయినా నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.దీనికి రాహుల్గాంధీ కూడా మద్దతుగా నిలిచారు. కాగా దేశంలో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన, సంక్లిష్టమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. యూపీలో 1989 నుండి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి తన పట్టు సాధించాలని కోరుకుంటోంది. -
రూ.30-40 వేల బడ్జెట్లో ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్ఫోన్ ఇదే!
ఐక్యూ7 సిరీస్(ఐక్యూ7,ఐక్యూ7 లెజెండ్) స్మార్ట్ఫోన్లు ఆగస్టు నెలలో భారతదేశంలో రూ.30,000 నుంచి రూ.40,000 సెగ్మెంట్ లో ఎక్కువగా అమ్ముడైన 5జీ స్మార్ట్ఫోన్లుగా నిలిచాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ సిరీస్ దేశంలోని మొబైల్ గేమింగ్ కమ్యూనిటీలో విజయవంతమైంది. ఆగస్టు నెలకు భారతదేశంలో స్మార్ట్ఫోన్ షిప్ మెంట్ వివరాలను వెల్లడిస్తూ ఇటీవల కౌంటర్ పాయింట్ నివేదికలో ఈ గణాంకాలు పంచుకుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఏప్రిల్ లో లాంచ్ చేశారు. ఈ ఐక్యూయూ మొబైల్స్ విమర్శకులు, వినియోగదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ పొందాయి. ఐక్యూ 7 లెజెండ్ రూ.40,000 ధరలో అత్యుత్తమ మొబైల్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. దీనిలో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఐక్యూ 7 విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ అమోల్డ్ స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 66డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఐక్యూ 7 లెజెండ్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,990 ధరకు, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.43,990 ధరకు మార్కెట్లోకి వచ్చాయి. ఇక ఐక్యూ 7 రెండు వేరియెంట్లు 8జీబీ ర్యామ్, విభిన్న స్టోరేజీలతో వచ్చింది. ఇందులో ప్రస్తుతం రిటైల్ ధర రూ.29,990గా ఉంది. (చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!) -
వన్ప్లస్ 9 సిరీస్ నుంచి మరో స్మార్ట్ఫోన్..లాంచ్ ఎప్పుడంటే...!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ త్వరలో 9 సిరీస్లో భాగంగా మరో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్ప్లస్ 9ఆర్టీ స్మార్ట్ఫోన్ను కంపెనీ రిలీజ్చేయనుంది. వన్ప్లస్ 9ఆర్కు అప్గ్రేడ్గా వన్ప్లస్ 9ఆర్టీ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. వన్ప్లస్ 9ఆర్టీ స్మార్ట్ఫోన్ అక్టోబర్ 13 న చైనాలో లాంచ్ చేయనుంది. అదే రోజున భారత మార్కెట్లలోకి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్తో పాటు వన్ప్లస్ బడ్స్ జెడ్2 లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ. 23 వేల నుంచి 34 వేల మధ్యలో ఉండనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లేఖలో సంచలన విషయాలు? వన్ప్లస్ 9ఆర్టీ ఫీచర్స్(అంచనా) 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే విత్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ క్వాలకమ్ స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ 50+16+2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 11 బ్యాటరీ 4500ఎమ్ఏహెచ్ ఫ్లాష్ చార్జ్ చదవండి: స్పేస్ఎక్స్ ఓ సంచలనం..! 75 లక్షల కోట్లతో..! -
జస్ట్ ఒక్క మొబైల్ గేమ్తో 75 వేల కోట్లు సొంతం...!
టెన్సెంట్, టీఐఎంఐ స్టూడియోస్ సంయుక్తంగా రూపోందించిన 'హానర్ ఆఫ్ కింగ్స్’ మొబైల్ గేమ్స్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఈ గేమ్ ఆదాయం సుమారు 10 బిలియన్ డాలర్లకు చేరుకున్న తొలి మొబైల్ గేమ్గా హానర్ ఆఫ్ కింగ్స్ నిలిచింది. హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్ను చైనా రూపొందించింది. ఈ గేమ్ కేవలం చైనాలో అందుబాటులో ఉండగా...మిగతా దేశాల గేమింగ్ ప్రియులకు ‘ఆరేనా ఆఫ్ వాలర్’ గేమ్గా అందుబాటులో ఉంది. చదవండి: ట్విటర్లో యూజర్ల గోలాగోలా..! ఇవి చూస్తే నవ్వలేక చచ్చిపోవాల్సిందే..! హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్ చైనాలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా గేమింగ్ మార్కెట్లో చైనా గణనీయమైన అభివృద్దిని సాధించింది.2021లో హానర్ ఆఫ్ కింగ్స్ ఇప్పటివరకు సగటు రెవెన్యూ 14 శాతం మేర పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మల్టీప్లేయర్ ఆన్లైన్ బాటిల్ అరేనా గేమ్స్ విభాగంలో భారీగా పురోగతి కన్పిస్తోంది. కరోనా రాకతో ఆన్లైన్ గేమింగ్ ఆడే వారి సంఖ్య భారీగా పెరిగింది. గేమింగ్ ప్రియులు ఆయా ఆన్లైన్ గేమింగ్లో డబ్బులను వెచ్చించడంతో వెనుకాడడం లేదు. సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం... ఈ ఏడాదిలో హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్స్ సహాయంతో సుమారు రెండు బిలియన్ డాలర్లకు పైగా సంపాదించిన్నట్లు వెల్లడించింది. ఒకానొక సమయంలో ఐఫోన్ యూజర్ల నుంచి 717 మిలియన్డాలర్లను కేవలం 3 నెలల్లోనే ఆర్జించింది. అత్యధికంగా గడించిన గేమింగ్ యాప్స్లో వరుసగా పబ్జీ మొబైల్, జెన్షిన్ ఇంపాక్ట్, రోబ్లోక్స్, త్రీ కింగ్డమ్ టాక్టిక్స్ నిలిచాయి చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. హ్యాకింగ్ కాదు జరిగింది ఇది -
ఛార్జర్ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!!
మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రిక్ డివైజ్ల విషయంలో కామన్ ఛార్జింగ్ పోర్ట్ కోసం యూరోపియన్ యూనియన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో కూడిన చట్టం చేసింది ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్(ఈసీ). ఈ నిబంధన గనుక అమలులోకి వస్తే ఈయూ దేశాల్లో ఫోన్లతో సహా డివైజ్లన్నింటికి ఒకే పోర్ట్.. ఒకే ఛార్జర్ కనిపిస్తాయి. యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటికీ ఉండాలి. అంతేకాదు కొత్త ఫోన్గానీ, డివైజ్గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. కారణం.. డివైజ్ కొన్న ప్రతీసారి కొత్త ఛార్జర్లు ఇస్తుంటాయి తయారీ కంపెనీలు. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించాలన్నది, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై పదేళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తున్నాయి అక్కడ. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ యూరోపియన్ కమిషన్ నిర్ణయం గనుక అమలు అయితే యూజర్లు ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయల) ఖర్చు పెట్టడం తగ్గుతుంది. 2009లో.. ముప్ఫై రకాల ఛార్జర్లు మార్కెట్లో ఉండేవి. ప్రస్తుతం యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ మైక్రో బీ, లైట్నింగ్ ఛార్జ్లను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. యాపిల్కు ఎదురుదెబ్బ ఆండ్రాయిడ్ ఫోన్లను మినహాయిస్తే.. యాపిల్ తన ఐఫోన్ల కోసం లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ పోర్ట్లను, ఛార్జర్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే మొదటి నుంచి ఈయూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈయూ నిబంధనలు కొత్త ఆవిష్కరణలను దెబ్బతీస్తాయని, యూరప్తో పాటు వరల్డ్ డివైజ్ మార్కెట్పై ప్రభావం చూపెడుతుందని చెబుతోంది. అంతేకాదు 2030 నాటికి కార్బన్ రహిత యాపిల్ డివైజ్ల దిశగా అడుగు వేస్తున్న తరుణంలో.. యాపిల్కు ఈసీ తీసుకున్న నిర్ణయం అడ్డుతగులుతుందని అంటోంది. అయినప్పటికీ ఈయూ ప్రత్యేక చట్టం ద్వారా ముందుకెళ్తుండడం విశేషం. యాపిల్లో సీ ఉందిగా! ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న యాపిల్.. లైట్నింగ్ కనెక్టర్ అందించాలనే లైన్ మీద నిల్చుంటోంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే.. ఐప్యాడ్ ప్రో, మ్యాక్బుక్లు మాత్రం యూఎస్బీ-సీ స్టాండర్డ్ మోడర్న్తో వస్తున్నాయి. ఇక ఫ్లగ్కు కనెక్ట్ అయ్యే వైపు మాత్రం యూఎస్బీ-సీ, యూఎస్బీ-ఏ ఉపయోగిస్తున్నారు. వేటి వేటి కంటే.. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్స్, కెమెరాలు, హెడ్ఫోన్స్, పోర్టబుల్ స్పీకర్లు, వీడియో గేమ్ కన్సోల్స్.. మొదలైనవి. అయితే ఇయర్బడ్స్, స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ ట్రాకర్లను ఉపయోగించే విధానం, సైజు కారణాల వల్ల టైప్ సీ తప్పనిసరి నిబంధనల్లో చేర్చట్లేదు. డిజిటల్ అండ్ గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఈయూ సభ్య దేశాల్లో ఈ చట్టం(డైరెక్టివ్) మీద విస్తృత చర్చ నడిచింది. ఈ చర్చ ఆధారంగా సభ్య దేశాల చట్టసభ్యులు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక.. యూరోపియన్ కమిషన్ ఆమోదం చెప్పగానే ఈ నిబంధనను అమలులోకి వస్తుంది. బహుశా వచ్చే ఏడాది చివర్లో ఈ చట్టం అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఛార్జర్ల పోర్టులు మార్చుకునేందుకు వీలుగా కంపెనీలకు రెండు సంవత్సరాల గడువునిచ్చే ప్రతిపాదన చేస్తోంది యూరోపియన్ కమిషన్. - సాక్షి, వెబ్స్ఫెషల్ చదవండి: ఆవులించినా చర్యలు తీసుకునే కెమెరాలు ఇవి! -
చైనాలో ఆంక్షలు.. పాత ఫోన్లకు భలే గిరాకీ!
న్యూఢిల్లీ: సరఫరాల్లో సమస్యల కారణంగా కొత్త స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల తయారీ తగ్గింది. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల విచక్షణారహిత వినియోగానికి ప్రజలు వెనుకాడుతున్నారు. ఫలితంగా రీఫర్బిష్డ్ ఫోన్లకు (నవీకరించినవి) గిరాకీ ఏర్పడింది. 2019తో పోలిస్తే రీఫర్బిష్డ్ ఫోన్ల విక్రయాలు 2020లో రెట్టింపునకు పైగా పెరిగాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. యంత్రా అన్నది మొబైల్ రిపేర్, రీఫర్బిష్డ్ సేవల్లోని కంపెనీ. ఈ సంస్థ సీఈవో జయంత్జా మాట్లాడుతూ.. రూ.4,000–6,000 ధరల శ్రేణిలోని రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్ల నిల్వలు కేవలం 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్టు చెప్పారు. ల్యాప్టాప్లతో పోలిస్తే నవీకరించిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు గడిచిన ఏడాది కాలంలో అధికంగా ఉన్నాయని చెప్పారు. హ్యాండ్సెట్లపై ఆధారపడడం ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. వచ్చే 12–18 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 750 పట్టణాలకు తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ కార్యకలాపాలు 450 పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. యంత్ర ప్లాట్ఫామ్ వినియోగించిన ఫోన్లను ఆన్లైన్ వేదికగా కొనుగోలు చేస్తుంటుంది. వాటిని నిపుణులతో తనిఖీ చేయించి తిరిగి మంచి స్థితిలోకి తీసుకొచ్చి (రీఫర్బిష్డ్) విక్రయిస్తుంటుంది. కొత్త ఫోన్ల మాదిరే రీఫర్బిష్డ్ ఫోన్లపైనా ఆరు నెలల వరకు వారంటీ లభిస్తుంది. కరోనా రాకతో ఆన్లైన్ వినియోగం పెరగడం తెలిసిందే. ఎన్నో సేవలను ఫోన్లలోని యాప్ల సాయంతో పొందుతున్నారు. విద్యార్థులు సైతం ఆన్లైన్ పాఠాలకు మళ్లడం చూశాం. ఈ పరిస్థితులు ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఫోన్లకు డిమాండ్ను పెంచేశాయి. 4.8 కోట్ల విక్రయాలు.. గతేడాది కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్లు ప్రకటించడం తెలిసిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో కరోనాతో చైనాలోని విమానాశ్రయలు, ఓడరేవుల్లో కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించాల్సి వచ్చింది. దీంతో చైనా నుంచి మన దేశానికి వచ్చే విడిభాగాలకు సమస్యలు ఏర్పడ్డాయి. ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో డిమాండ్ పెరగడం వంటి పరిస్థితులు పాత ఫోన్లకు డిమాండ్ను తెచ్చిపెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారులు ఇప్పుడు రూ.30వేల ల్యాప్టాప్లు, రూ.10,000–15,000 ధరల శ్రేణిలోని స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు మొగ్గు చూపడం లేదని పరిశోధనా సంస్థ ఐడీసీ అంటోంది. 2019లో 2–3 కోట్ల రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్లు అమ్ముడుపోగా.. 2021లో 4.8 కోట్ల రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకాలు నమోదు కావచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
Smartphone: స్మార్ట్ఫోన్లు పేలుతున్నాయ్.. జాగ్రత్తలు మన చేతుల్లో కూడా!
పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు పనుల్ని చక్కబెట్టడంలో స్మార్ట్ఫోన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ఫోన్ వల్ల తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండడం చూస్తున్నాం.. వింటున్నాం. మొన్నీమధ్యే ఓ అడ్వొకేట్ గౌన్లో ఫోన్ పేలిందన్న వార్త, దీనికి ముందు విమానంలో ఫోన్ పేలిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ కావడం, అంతకు ముందు ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడిన యువతి దుర్మరణం.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఫోన్ వాడకంలో కొన్ని కనీస జాగ్రత్తలు పాటిస్తే.. ఇలాంటి ఘటనలు నివారించిన వాళ్లం అవుతామంటున్నారు నిపుణులు. చాలామంది స్క్రీన్ పగిలిన ఫోన్లను అలాగే వాడేస్తుంటారు. రిపేరింగ్కు బద్ధకిస్తుంటారు. ఇలా ఫోన్లను ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు. కారణం.. అలా పగిలిన చోటు నుంచి నీరు లేదంటే చెమట ఫోన్ లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా బ్యాటరీ, లోపలి భాగాలు పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు ఫోన్పై ఒత్తిడి పెరిగి మంటలు చెలరేగి.. పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్ పాడైన వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి. అంతేకాదు స్క్రీన్ గార్డ్కు క్రాక్స్ వచ్చినా వెంటనే మార్చేయడం ఉత్తమం. కరోనా వల్ల ఈమధ్య శానిటైజర్లను ఫోన్లకు సైతం వాడేస్తున్నారు కొందరు. అయితే ఛార్జింగ్ సాకెట్ల ద్వారా లిక్విడ్ లోపలికి వెళ్లి.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టిష్యూస్తో అదీ జాగ్రత్తగా తుడవడం బెటర్ అని సూచిస్తున్నారు. డుప్లికేట్ ఛార్జర్లు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. ఫోన్లలో చాలా వరకూ వీటితోనే నడుస్తున్నాయి. బ్యాటరీలు, ఛార్జింగ్ వైర్లు, అడాప్టర్లను స్పెషల్ టెక్నాలజీతో తయారు చేస్తున్నాయి కంపెనీలు. కాబట్టి, తక్కువ ధరలో దొరికే డుప్లికేట్ ఛార్జర్లు, బ్యాటరీలు ఉపయోగించకపోవడం ఉత్తమం. ఇక ఇతరుల ఫోన్ల ఛార్జర్లను(వేరే కంపెనీలవి) సైతం అత్యవసర సమయంలోనే ఉపయోగించాలని నిపుణులు చెప్తున్నారు. డుప్లికేట్ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే ఫోన్లో బ్యాటరీ ఛేంజ్ చేసేప్పుడు కంపెనీ సూచించిన బ్యాటరీనే ఉపయోగించడం మేలు. ఇలా చేయకపోవడం బెటర్ ► సూర్యరశ్మి తగిలే చోటులో ఫోన్ వేడెక్కడం సహజం. అలా సూర్యరశ్మి పడే చోట ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదు. ► ఫోన్పై అదనంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఛార్జ్ చేసేప్పుడు ఫోన్పై ఎలాంటి వస్తువులు ఉంచకపోవడం ఉత్తమం. ► ఛార్జింగ్ టైంలో ఫోన్ వేడెక్కుతున్నట్లు గమనిస్తే వెంటనే అన్ఫ్లగ్ చేయాలి. ► వర్షాలు పడుతున్న టైంలో ఛార్జింగ్ పెట్టి ఫోన్లు ఉపయోగించడం అస్సలు మంచిది కాదు. ► ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే.. సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి చెక్ చేయించాలి. ► వంద శాతం ఛార్జింగ్.. చాలామందికి ఇదొక ఆనందం. కొన్నిసార్లు రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తారు. అలాంటప్పుడు వేడెక్కి పేలిపోవచ్చు. వెహికిల్స్లో ఛార్జింగ్ పెట్టేందుకు ఉపయోగించే పవర్ కేబుల్స్, పవర్ బ్యాంక్లను.. ఇంట్లో పవర్ ప్లగ్ నుంచి ఫోన్ని ఛార్జ్ చేసేందుకు ఉపయోగిస్తుంటారు. కానీ, పవర్ సప్లైలో తేడా ఉంటుందనే విషయం, ఆ కేబుల్స్ను పరిగణనలోకి తీసుకోవాలి. వాటితో ఫోన్లు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. వీటితో పాటు కాస్ట్లీ ఫోన్లలో సమస్య తలెత్తినప్పుడు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలో రిపేర్ చేయించడం బెటర్. పైగా ఫోన్లో కంపెనీ యాక్ససరీలు కాకుండా థర్డ్ పార్టీ యాక్ససరీలు ఉపయోగించడం వల్ల ఫోన్పై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. టెక్నికల్ లోటుపాట్లను పక్కనపెడితే.. మన చేతుల్లో ఉన్న జాగ్రత్తల్ని పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించొచ్చనే చెప్తున్నారు టెక్ ఎక్స్పర్ట్స్. - సాక్షి, వెబ్స్పెషల్ చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేసిన షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. షావోమీ స్మార్ట్ఫోన్లు విక్రయించబడని దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని పలు దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను వాడుతున్న కస్టమర్లకు బ్లాక్ చేస్తున్నట్లు మెసేజ్ను చూపిస్తుంది. యూఎస్తో సహా అనేక దేశాల్లో షావోమీ అధికారికంగా ఉనికి లేదు. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! క్యూబా, ఇరాన్, సిరియా, ఉత్తర కొరియా, సూడాన్ లేదా క్రిమియా దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను వాడుతున్న యూజర్లకు షావోమీ షాక్ నిచ్చింది. గతవారం నుంచి ఈ స్మార్ట్ఫోన్లను షావోమీ బ్లాక్ చేసిందని యూజర్లు సోషల్మీడియాలో హైలైట్ చేస్తున్నారు. షావోమీ బ్లాక్ చేస్తూ సందేశాలను కూడా పంపినట్లు యూజర్లు సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించిన దేశాల్లో స్మార్ట్ఫోన్ సేవలను బ్లాక్ చేస్తుందని కంపెనీ పాలసీలో ఎక్కడలేదు. For the past few weeks, Xiaomi has been proactively blocking users from provisioning their phones if they live in Cuba, Iran, Syria, North Korea, Sudan, or Crimea, in order to comply with export regulations and stop resellers. https://t.co/51AdXIMgnW — Mishaal Rahman (@MishaalRahman) September 9, 2021 చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! -
‘కరోనా’తో ఆన్లైన్ వ్యసనం!..సర్వేలో భయాంకర నిజాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలిగొన్న కరోనా మహమ్మారి గత ఏడాదిన్నర కాలంలో చాలా మందిని ఆన్లైన్ బానిసలుగానూ మార్చిందని తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్... ‘నార్టన్ లైఫ్లాక్’ పేరుతో ఇటీవల వివిధ దేశాల్లో ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా భారతీయుల విభాగంలో సుమారు వెయ్యి మందిపై చేపట్టిన అధ్యయనం ప్రకారం ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆన్లైన్ వ్యసనానికి బానిసలయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఆన్లైన్ ద్వారా ఆఫీసు కార్యకలాపాలు, డిజిటల్ చదు వులు వెచ్చిస్తున్న సమయమే కాకుండా అదనంగా కనీసం నాలుగు గంటలపాటు ఆన్లైన్లో గడుపుతున్నట్లు దాదాపు 82 శాతం మంది తెలిపారు. వాటిల్లోనూ స్మార్ట్ఫోన్లతో గడిపే కాలం ఎక్కువైందని తెలిపిన వారు 84 శాతం వరకూ ఉండటం గమనార్మం. సర్వే చేసిన వాళ్లల్లో సగం మంది భద్రతాపరమైన కారణాల రీత్యా ఇంటికి సరికొత్త స్మార్ట్ పరికరాలను కొనడం లేదని స్పష్టం చేశారు. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్న స్పృహ మూడొంతుల మంది (74%)లో ఉండటం ఇంకో విశేషం. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం ఉంటుందని చెప్పినవారు దాదాపు 55 శాతం. అదే సమయంలో బంధుమిత్రులతో మాట్లాడటం ద్వారా స్క్రీన్కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని 76 శాతం మంది చెప్పడం గమనార్హం. ప్రైవసీ భయాలు ఇళ్లలో ఉండే స్మార్ట్ హోం పరికరాల ద్వారా వ్యక్తిగత సమాచారం బట్టబయలవుతుందన్న ఆందోళన నార్టన్ కంపెనీ సర్వే చేసిన ప్రతి ఐదుగురిలో ఇద్దరు భావిస్తున్నారు. భద్రతపరమైన కారణాలతో స్మార్ట్ హోం పరికరాలను కొనబోమని 48 శాతం మంది చెబితే ప్రైవసీ భయాలను కారణంగా చూపిన వారు 40% మంది. వినియోగదారుల సమాచారాన్ని కం పెనీ ఇతర అవసరాల కోసం వాడుకుంటుందని 35% మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇందుకు తగ్గ ట్టుగానే ఇంట్లో స్మార్ట్ హోం పరికరాలు ఉన్న వారిలో 22% మంది రక్షణ కోసం తామేమీ అదనపు చర్యలు తీసుకోవడం లేదని, పరికరంలో ముందుగానే ఏర్పాటైన సెక్యూరిటీతోనే సరిపుచ్చుకుంటున్నామని చెప్పడం గమనార్హం. పాస్వర్డ్లుగా వ్యక్తిగత సమాచారం పాస్వర్డులుగా వ్యక్తిగత సమాచారం వాడేవారు 82% ఉండగా.. ఇందులోనూ పుట్టిన రోజులను లేదా భార్య, పిల్లల పేర్లను వాడేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. 69 శాతం మంది ఏదో ఒక పేరును వాడుతున్నట్లు చెబితే పుట్టిన రోజును వాడేవాళ్లు 58 శాతం మంది ఉన్నట్లు నార్టన్ లైఫ్లాక్ సర్వే తెలిపింది. వైఫై రౌటర్లు ఉన్న భారతీయుల్లో 72 శాతం మంది తాము రౌటర్ పాస్వర్డ్ను ఏడాదికి ఒకసారి మారుస్తున్నట్లు చెబితే నెలకోసారి మారుస్తామని కేవలం 26 శాతం మంది మాత్రమే తెలిపారు. తాము ఇప్పటివరకూ పాస్వర్డ్ మార్చనేలేదని అంగీకరించిన వారు తొమ్మిది శాతం మంది! పిల్లలకు చెప్పాలి సైబర్ భద్రత గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసు నుంచే నేర్పించాలని సర్వే చేసిన వాళ్లలో 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. కానీ ఆన్లైన్ వ్యవహారాల్లో పిల్లలను కాపాడుకోవడం కష్టమేనని 75 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ‘కోవిడ్ సమయంలో ఆన్లైన్ వ్యవహారాల్లో పెరుగుదల అనివార్యమైంది. కానీ ఆన్స్క్రీన్, ఆఫ్స్క్రీన్ సమయాల మధ్య సమతౌల్యం పాటించడం కూడా ముఖ్యం. లేదంటే ఆరోగ్యం మరీ ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది’ అని నార్టన్ లైఫ్లాక్ డైరెక్టర్ రితేశ్ చోప్రా తెలిపారు. -
వివాదాస్పదంగా గూగుల్ భారీ డీల్
ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్ పోటీలో నిలబడేందుకు గూగుల్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో థర్డ్ పార్టీ యాప్లకు చోటు లేకుండా చేయడం.. తద్వారా ఫోన్ కంపెనీలకు భారీగా ముట్టజెప్పడం చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి కాంట్రాక్ట్ చేయాలనుకునే ప్రయత్నం మరింత వివాదానికి దారితీసింది. 2019లో గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్ను లాంఛ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్ తయారీదారులు గనుక థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించనట్లయితే(ప్రీ ఇన్స్టాల్ టైంలో వేరే ప్లేస్టోర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం).. వల్ల గూగుల్ ఆ కంపెనీలకు కొంత రెవెన్యూను అందజేస్తుంది. ఈ ప్రోగ్రాంతోనే ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్లలో ఓ వెలుగు వెలుగుతోంది గూగుల్. అయితే తాజాగా ఆ డీల్ను మరోసారి తెర మీదకు తెచ్చింది. చదవండి:గూగుల్ ఫొటోస్.. ఇది తెలుసుకోండి ఈసారి థర్డ్ పార్టీ యాప్ స్టోర్లతో పాటు, ఏపీకే ఇన్స్టాల్స్ యాప్స్ను సైతం ఇన్స్టాల్ చేయకూడదని కండిషన్స్ పెట్టింది గూగుల్. అప్పుడు కేవలం ఫోన్ల మార్కెట్ప్లేస్లో గూగుల్ప్లేస్టోర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎపిక్ గేమ్స్తో గూగుల్కు వివాదం మొదలైంది. సీక్రెట్గా ఫోన్ కంపెనీలతో గూగుల్ చేసుకుంటున్న ఒప్పందం నైతిక విలువలకు విరుద్ధమని కోర్టుకు ఎక్కింది ఎపిక్ గేమ్స్. ఇక గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్లో భాగంగా మొత్తం రెవెన్యూ నుంచి 12 శాతం వాటా తీసుకుంటాయి కంపెనీలు. ఇది ఆల్రెడీ అందుకుంటున్న 8 శాతం ఆదాయం కంటే అదనం. original equipment manufacturer (OEM)లో భాగంగా.. ఒప్పో, వీవో, వన్ఫ్లస్ 70 శాతం, సోనీ, జియోమీ 50, 40 శాతం గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్ భాగం అయ్యాయి. -
కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్కు వేదికానున్న హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ సెంటర్కు భాగ్యనగరం వేదిక కానుంది. భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చే ప్రక్రియలో భాగంగా ఒప్పో తన బేస్ను బలోపేతం చేస్తూ హైదరాబాద్లోని కంపెనీ ఆర్ అండ్ డీ సెంటర్లో ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నుట్లు ఒప్పో ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి కెమెరా సోల్యూషన్స్, యూజర్లకు మెరుగైన అనుభవం కోసం ఇమేజింగ్ సాఫ్ట్వేర్ను అభివృద్ధిపై ఒప్పో దృష్టిసారించనుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణాసియా, జపాన్, యూరప్తో సహా ఇతర దేశాల కోసం భారత ఒప్పో టీం ప్రాతినిధ్యం వహించనుంది. కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ వీడియో, స్టిల్ ఫోటోగ్రఫీ ఫుల్ డైమెన్షన్ ఫ్యూజన్ (ఎఫ్డీఎఫ్) పోర్ట్రెయిట్ వీడియో సిస్టమ్ టెక్నాలజీపై పరిశోధన కోసం పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా పని చేయనుంది. ఈ ల్యాబ్తో వివిధ కృత్రిమంగా సెట్ చేయబడిన దృశ్యాలలో ఫోన్ కెమెరాలను పరీక్షించడానికి. ఆ నమూనాల డేటాను విశ్లేషించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒప్పో 2021 జూన్ 30 నాటికి 8,800 ఇమేజ్ పేటెంట్ల కోసం దరఖాస్తు చేయగా అందులో సుమారు 3,500 పేటెంట్లకు హక్కులు వరించాయి. -
రైతులకు ట్యాబ్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: చదువు రాని వారని రైతులను తక్కువ అంచనా వేయొద్దని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్ల రాకతో వారు ఎంతో అవగాహన పెంచుకున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం పెరగాలని, రైతులకు ట్యాబ్లు అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. డ్రోన్లు, ఇతర వ్యవసాయ ఆవిష్కరణల వైపు యువతను ప్రోత్సహించాలని కోరారు. సాగు రంగంపై వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘం మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. ‘ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 50 నుంచి 100 ఎకరాల్లో డెమానిస్ట్రేట్ ఫార్మ్ల ఏర్పాటు చేయాలి. వ్యవసాయ వర్సిటీ కేంద్రంగా కొత్త ఆవిష్కరణలు రావాలి. ప్రొఫెసర్ స్వామినాథన్, జయతీ ఘోష్, పాలగుమ్మి సాయినాథ్, సుభాష్ పాలేకర్ను మంత్రివర్గ ఉపసంఘం సంప్రదించి సలహాలు, సూచనలు స్వీకరించాలి. అమెరికాలోని అయోవాలో ఉన్న అగ్రికల్చర్ మ్యూజియంను అధికారుల బృందం సందర్శించాలి’అని కేటీఆర్ కోరారు. 2021–22 సంవత్సరానికి గాను రైతుబీమా వార్షిక ప్రీమియం కింద రూ.1,450 కోట్ల చెక్కును ఎల్ఐసీకు ఈ కార్యక్రమంలో మంత్రులు అందజేశారు. వేరుశనగ సాగును ప్రోత్సహించాలి... యాసంగిలో వేరుశనగ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. వేరుశనగ వంగడాల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరి ధాన్యం నుంచి ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆలుగడ్డ సాగును పెంచుకోవడానికి స్థానికంగా విత్తన లభ్యతను పెంచాల్సి ఉందన్నారు. రైతుకు మించిన శాస్త్రవేత్త లేడని, అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో 150 సహకార సంఘాలు చురుకుగా పనిచేస్తున్నాయని, మిగతా సంఘాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వరి సాగు తగ్గించి, అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. చెరుకు సాగును ప్రోత్సహించాలన్నారు. గతంలో దిగుబడి సరిగ్గా లేక చెరుకు రైతులు నష్టపోయారని, ఇప్పుడు 60 నుంచి 100 టన్నుల దిగుబడినిచ్చే వంగడాలు మార్కెట్లోకి వచ్చాయన్నారు. చిన్న కమతాల్లో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. డిమాండ్ ఉన్న పంటలను పండించాలని కోరుతున్నా రైతుల్లో పెద్దగా స్పందన రావడం లేదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో పండ్లు, కూరగాయలు, పూల సాగు తగ్గిందని, మార్కెటింగ్ సమస్యలే దీనికి కారణమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆర్గానిక్ సాగు వైపు ప్రోత్సహిస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులను పంట మార్పిడికి ప్రోత్సహించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. మిద్దె తోటలకు ప్రోత్సాహం... వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలి. సాగు పరిశ్రమగా మార్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను బలోపేతం చేయాలి. వేరుశెనగ, టమాటా ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలతో పాటు మిద్దె తోట సాగును ప్రోత్సహించాలి. దుర్భిక్షం నుంచి సుభిక్షం.. రాష్ట్ర వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి సంవృద్ధి సాధించింది. ఇల్లంతకుంట ప్రాంతం ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామాగా ఉండేది. నేడు అక్కడ లక్ష టన్నుల వరకు దిగుబడి వస్తోంది. – కేటీఆర్ -
ఈ ఫోన్లలో జీమెయిల్, యూట్యూబ్ పనిచేయవు..!
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్ఫోన్లపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వర్షన్ను కల్గి ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ అకౌంట్లలోకి సైన్ ఇన్ అవ్వకుండా మద్దతును గూగుల్ ఉపసంహరించుకోనుంది. 2.3.7 వర్షన్ లేదా అంతకంటే తక్కువ వర్షన్తో నడుస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో సైన్ ఇన్లకు గూగుల్ తన సపోర్ట్ను నిలిపివేయనుంది. గూగుల్ తీసుకున్న నిర్ణయం 2021 సెప్టెంబర్ 27 నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా 2.3.7 కంటే తక్కువ వర్షన్ వాడుతున్న యూజర్లకు గూగుల్ సంబంధిత ఈ-మెయిల్ను పంపింది. 2.3.7 వర్షన్ను వాడుతున్న యూజర్లను కనీసం ఆండ్రాయిడ్ 3.0 హనీకోంబ్ వోఎస్కు తమ స్మార్ట్ఫోన్లను ఆప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఒక వేళ అప్డేట్ చేయకపోతే జీమెయిల్, గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, ఇతర గూగుల్ సేవలను యాప్ల ద్వారా పొందలేరని పేర్కొంది. వీటిని ఫోన్ బ్రౌజర్లో యూజర్లు పొందే అవకాశం ఉన్నట్లు గూగుల్ పేర్కొంది. ఈ కాలంలో ఆండ్రాయిడ్ 3.0 వర్షన్ దాని కంటే తక్కువ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వర్షన్ అతి తక్కువ మంది యూజర్లు వాడుతున్నారని గూగుల్ పేర్కొంది. యూజర్ల భద్రత, డేటాను దృష్టిలో ఉంచుకొని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7 ఉన్న స్మార్ట్ఫోన్లలో ఆయా గూగుల్ యాప్స్లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే యూజర్నేమ్, పాస్వర్డ్ ఏర్రర్ వస్తుందని గూగుల్ పేర్కొంది. యూజర్ల సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయమని లేదా ఫోన్లను మార్చమని గూగుల్ ప్రోత్సహిస్తుంది. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆండ్రాయిడ్ వర్షన్ను కల్గి ఉన్న స్మార్ట్ఫోన్లను కొత్త ఫోన్లతో రిప్లేస్ చేయాల్సి వస్తుంది. -
Amazon Prime Day Sale: స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకు ప్రైమ్ డే సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు రెండు రోజలపాటు జరగనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్ భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు ఆపిల్ ఐఫోన్ 11పై సుమారు రూ. 6900 తగ్గింపు ధరతో రూ. 47, 999 అందించనుంది. అసలు ధర. రూ 54,900 వన్ప్లస్ 9పై తొలిసారిగా డిస్కౌంట్ను ప్రకటించింది. కూపన్ల రూపంలో సుమారు రూ. 4000 వరకు తగ్గింపును అందిస్తోంది. వన్ప్లస్ నార్డ్ సీఈ 5జీ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ను ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ. 22, 999 కు లభించనుంది. 6 నెలల నోకాస్ట్ ఈఎమ్ఐ రూపంలో కూడా కోనుగోలు చేయవచ్చును. షావోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్పై సుమారు రూ. 6000 తగ్గింపు ధరతో రూ. 27,999 అందించనుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 33,999. రెడ్మీ నోట్ 10 ఎస్ స్మార్ట్ఫోన్ రూ.1000 తగ్గింపు ధరతో రూ. 13,999 ధరకు అందించనుంది. అంతేకాకుండా అమెజాన్ పేతో కొనుగోలు చేస్తే రూ. 1000 క్యాష్ బ్యాక్ను అందించనుంది. రియల్మీ సి 11 స్మార్ట్ఫోన్ను అమెజాన్ లాంచ్ చేయనుంది. లాంచ్ ధర రూ .6,999 కాగా ఈ సేల్ భాగంగా రూ. 6,699 కు అందించనుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్: స్మార్ట్ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 25 ఆదివారం నుంచి జూలై 29 వరకు కొనసాగుతుంది. బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్,రియల్మి, పోకో, మోటరోలా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా ఈ రోజు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డుపై కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. ప్రస్తుతం సేల్ లైవ్లో కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న డిస్కౌంట్ ధరలు ఆపిల్ ఐఫోన్ 12 మినీ తగ్గింపు ధర రూ. 57,999, అసలు ధర రూ. 69,990 ఆపిల్ ఐఫోన్ 12 తగ్గింపు ధర రూ. 67,999, అసలు ధర రూ. 79,990 మోటోరోలా రేజర్ తగ్గింపు ధర రూ. 54, 999 అసలు ధర రూ. 1,49,999 ఆసుస్ రాగ్ ఫోన్ 3 తగ్గింపు ధర రూ. 39,999 అసలు ధర రూ. 55,999 మోటోరోలా జీ10 పవర్ తగ్గింపు ధర రూ. 9,999 అసలు ధర రూ. 12,999. రియల్ మీ 8 తగ్గింపు ధర రూ. 13,999, అసలు ధర రూ 16, 999. శాంసంగ్ ఎఫ్62 తగ్గింపు ధర రూ. 17,999 అసలు ధర రూ. 29,999. ఎలక్ట్రానిక్స్పై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న డిస్కౌంట్ ధరలు గో ప్రో 9 తగ్గింపు ధర రూ. 37, 499, అసలు ధర రూ. 47,000 శాంసంగ్ గెలాక్సీ వాచ్ ఆక్టివ్ 2 తగ్గింపు ధర రూ. 14, 990 అసలు ధర రూ. 25,990 నోకియా మీడియా స్ట్రీమర్ తగ్గింపు ధర రూ 1,899 అసలు ధర రూ. 4,999 ఆసుస్ వివోబుక్ గేమింగ్ కోర్ ఐ5 ల్యాప్టాప్ తగ్గింపు ధర రూ. 52, 490, అసలు ధర రూ. 76, 990. -
ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ సేల్ పండగ: భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ సేల్ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ ఐదు రోజుల డిస్కౌంట్ అమ్మకాలకు తెరతీసింది. జూలై 25 ఆదివారం నుండి జూలై 29 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్,రియల్మి, పోకో, మోటరోలా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. ఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ మినీ ఫ్లాష్ అమ్మకాలను కూడా నిర్వహించనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై 24 అర్ధరాత్రి ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అందుబాటులోఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపురేట్లను అందించనుంది.ఇంకా ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వైర్లెస్ రౌటర్లు ఇతరఎలక్ట్రానిక్స్పై తగ్గింపును లభించనుంది. దీనికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ ఈఎంఐ కూడా లభ్యం. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఫ్లిప్కార్ట్ తన డిస్కౌంట్ అమ్మకాలను మొదలు పెట్టడం విశేషం. రూ. 1 చెల్లించి ప్రీబుకింగ్ : ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కేవలం ఒక రూపాయితో ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశాన్నిస్తోంది. సేల్ ప్రారంభం తరువాత మిగిలిన ధరను చెల్లించి సంబంధిత వస్తువునుకొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ధరలు ఐఫోన్ 12 రూ. 67,999 (ఎంఆర్పి రూ .79,999) ఐఫోన్ ఎస్ఇ రూ. 28,999 (ఎంఆర్పి రూ .39,900) మోటరోలా రేజర్ రూ. 54,999 (ఎంఆర్పి రూ. 1,49,999) శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రూ. 9,999 రియల్మీ సి 25 రూ. 9,999 (ఎంఆర్పి రూ .10,999) పోకో ఎక్స్ 3 రూ. 15,999 (ఎంఆర్పి రూ .19,999) ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 రూ. 6,499 (ఎంఆర్పి రూ .7,999 ఫ్లిప్కార్ట్ మినీ ఫ్లాష్ సేల్:అతి తక్కువ ధరకే రానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్లో భారీ డిస్కౌంట్తో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 ,సాయంత్రం 4 గంటలకు మినీ ఫ్లాష్ సేల్ను నిర్వహించనుంది. అంటే పలు ప్రొడక్ట్స్ నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. దీంతోపాటు ఎంపిక చేసిన ఉత్పత్తులపై టిక్ టాక్ డీల్స్ ఫ్లాష్ సేల్ను కూడా ప్రకటించింది. ఇందులో ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు అతి తక్కువ ధరలకే పలు ఉత్పత్తులు లభించనున్నాయి. -
స్మార్ట్ఫోన్లపై విరుచుకుపడుతున్న జోకర్ మాల్వేర్
-
ఆన్లైన్ అధ్యయనం.. తిప్పలు తప్పట్లేదు
మూసాపేట: బ్లాక్ బోర్డ్, చాక్పీస్, డస్టర్ అంటూ తరగతి గదుల్లో తోటి విద్యార్థుల మధ్య సరదాగా చదువుకోవాల్సిన విద్యార్థులకు ఆండ్రాయిడ్ మొబైల్, ప్లే స్టోర్, ఇంటర్నెట్ వంటి కొత్త యాప్లతో కుస్తీ పడుతూ చదువుకోవాల్సి వస్తోంది. కరోనా మహమ్మారితో అన్ని రంగాలు కుదేలవటమే కాక విద్యార్థులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించి పై తరగతులకు అనుమతించారు. ఈ సంవత్సరం కూడా కరోనా వ్యాప్తితో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద కుటుంబానికి చెందిన వారే కావటంతో వారి వద్ద ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోవటం, టీవీలు కొంత మందికి లేకపోవటం, మరి కొందరు కేబుల్ బిల్లు చెల్లించక పోవటంతో ప్రతి రోజు తరగతులను వినేందుకు అవకాశం లేకుండా పోయింది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఎదురుగా ఉండి పాఠాలు బోధిస్తేనే అంతంత మాత్రంగా అర్థం చేసుకునే ఈ చదువులు ఆన్లైన్లో టీవీల ముందు, సెల్ఫోన్లో వింటే వారికి అర్థం కావటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ►మూసాపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 435 మంది విద్యార్థులు ఉండగా 10వ తరగతిలో 75 మంది ఉన్నారు. ► ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పేద కుటుంబాల వారు కావటంతో మొబైల్ లేకపోవటం, టీవీల అందరి వద్ద లేకపోవటంతో పాఠాలకు దూరమవుతున్నారు. ► తరగతి గదుల్లో ఉండి చదివే చదువులకు ఆన్లైన్లో చదివే చదువులకు వ్యత్యాసం ఉండటమే కాకుండా విద్యార్థులకు అర్థం కాక సతమతమవుతున్నారు. ► ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థులను పరీక్షిస్తూ మొబైల్లో టిశాట్ యాప్ ద్వారా, టీవీలో డీడీ యాదగిరి చానల్లో పాఠాలు వినాలని అందుకు సంబంధించిన టైం టేబుల్ను కూడా విద్యార్థులకు అందిస్తున్నారు. ► ఇదే విధంగా ఆన్లైన్లో చదివి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరైతే మాత్రం ఉత్తీర్ణత శాతం పడిపోయే అవకాశం ఉంది. అంతే కాక ఉన్నత చదువులకు వెళ్లటానికి అక్కడి పాఠాలు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ► అయితే ఆన్లైన్ పాఠాలు వింటూ తమ ఇంటి సమీపంలో ఉన్నత చదువులు చదివిన వారి వద్ద సందేహాలను నివృత్తి చేసుకుని కష్టపడి చదివితేనే ఉత్తీర్ణత సాధించుకోవచ్చు. ► అలా కాకుండా గతంలో మాదిరి ఇంట్లో వింటూ వదిలేసి ఉంటే మాత్రం అర్థం కాకపోవటమే కాక పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంటుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ► మొబైల్ విద్యార్థుల చేతుల్లో ఉండటంతో ఇంటర్నెట్లో కొత్త కొత్త గేమ్లు, సినిమాలు, వీడియోలకు అలవాటు పడుతున్నారు. చదువు సంగతి పక్కన పెడితే మొబైల్కు అలవాటు పడి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ► అదే విధంగా కళ్లకు సంబంధించి జబ్బులు ప్రబలుతుండటం, మరి కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ పాఠాల పేర్లతో మొబైల్లో గేమ్స్, సినిమాలు చూస్తున్నారని వారి భవిష్యత్ గురించి భయంగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్: మొబైల్ ఆఫర్ల ప్రోమో రిలీజ్ చేసిన అమెజాన్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. మొదట ఈ సేల్ను జూన్ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్ కారణంగా ప్రైమ్ డే సేల్ వాయిదా పడింది. కోవిడ్-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్ డే సేల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో డిస్కౌంట్ వచ్చే స్మార్ట్ఫోన్ల జాబితాను అమెజాన్ విడుదల చేసింది. డిస్కౌంట్ ధరలతో లభించే వన్ప్లస్ నార్డ్ సిఇ 5 జి, రెడ్మి నోట్ 10 ఎస్, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్, ఐఫోన్ 11 వన్ప్లస్ 9 ఆర్ 5 జి, రెడ్మి నోట్ 10 ఫోన్లను అమెజాన్ ప్రకటించింది. ఐఫోన్ 12 ప్రో, శామ్సంగ్ నోట్ 20, ఎంఐ 11 ఎక్స్ 5 జి, ఎంఐ 10 ఐ 5 జి, ఐక్యూ 7 లెజెండ్ వంటి ఫోన్లపై కూడా డిస్కౌంట్లను ప్రకటించనుంది. ఈ మొబైళ్ల ధరలను అమెజాన్ పూర్తిగా వెల్లడించలేదు. ప్రైమ్ డే సేల్లో సుమారు 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొబైళ్లపై డిస్కౌంట్ ఆఫర్లను సేల్కు రెండురోజుల ముందు ప్రైమ్ మెంబర్స్కు అందుబాటులో ఉంచనుంది -
Xiaomi: షాకిచ్చిందిగా! భారీగా ధరల పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం కంపెనీ షావొమీ తన వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సరసమైన ధరలు, అద్భుత ఫీచర్ల స్మార్ట్ఫోన్స్, స్మార్ట్ టీవీలతో వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుని, భారత మార్కెట్లో టాప్ పొజిషన్లోకి దూసుకొచ్చిన షావోమి తన ఉత్పత్తులపై ధరలను 3-6 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. విడిభాగాల కొరత, దిగుమతి వ్యయాల కారణంగా జూలై 1 నుంచి కొత్త ధరలను సవరిస్తున్నట్టు వెల్లడించింది. డిమాండ్-సరఫరా మధ్య అంతరాయం పెరగడంతో విడిభాగాల ధరలు పెరుగుతూ వస్తున్నాయని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో జూలై 1 నుంచి తమ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలను 3-6 శాతం పెంచిన ధరలు అమల్లో ఉంటాయని షావోమి ప్రకటించింది. షిప్పింగ్ చార్జీల భారం, కాంపోనేట్స్ కొరత కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇండియా ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం నుండి భారీ డిమాండ్-సరఫరా అసమతుల్యత నెలకొంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లలో (చిప్సెట్లు, డిస్ప్లే ప్యానెల్లు, డిస్ప్లే డ్రైవర్, బ్యాక్ ప్యానెల్లు, బ్యాటరీ మొదలైనవి) ఉపయోగించే భాగాల ధరలు బాగా పెరిగాయని తెలిపారు. కాగా గ్లోబల్ మార్కెట్లో ప్యానెళ్ల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. సముద్ర సరుకు రవాణా ఛార్జీలూ కూడా పెరిగాయి. ఈ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల దేశీయంగా రవాణా ఖర్చులు ఏప్రిల్లో బాగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఈడీ టీవల విభాగంలో ఇతర సంస్థలు కూడా ఈ నెలలో ధరలను 3-4 శాతం పెంచనున్నాయని అంచనా. చదవండి: Covid Second wave: దేశీయ బ్యాంకుల కష్టాలు Online shopping boost: డిజిటల్ ఎకానమీ జూమ్! -
కేవలం రూ.4 వేలకే ఐటెల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్
ఐటెల్ ఏ23 ప్రో ఎంట్రీ లెవల్ 4జీ స్మార్ట్ఫోన్ భారత్లో విడుదలైంది. ఇది రెండు రంగు కలర్స్ తో లభిస్తుంది. ఐటెల్ ఏ23 ప్రో ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ మీద నడుస్తుంది. ఇది సింగిల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఎంట్రీ లెవల్ ఫోన్ కావడంతో, డిస్ప్లే చుట్టూ మందపాటి బెజెల్స్తో టాప్ బెజెల్ హౌసింగ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఐటెల్ ఏ23 ప్రో రిటైల్ ధర రూ. 4,999, కానీ రిలయన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో జియో ఎక్స్క్లూజివ్ ఆఫర్ కింద రూ.3,899 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐటెల్ ఏ23 ప్రో ఫీచర్స్: 5 అంగుళాల డిస్ ప్లే క్వాడ్-కోర్ యునిసోక్ SC9832E ప్రాసెసర్ 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 0.3 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా డ్యూయల్ సీమ్ 4జీ, వై-ఫై, వోల్టిఈ, జీపీఎస్, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ మైక్రో-యుఎస్బి చార్జర్ ఫేస్ అన్లాక్ ఫీచర్ 2,400 ఎంఏహెచ్ బ్యాటరీ చదవండి: ఉద్యోగుల భద్రత కోసం తగ్గేది లేదు: ఎల్అండ్టీ -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్సేల్: భారీ ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి డిస్కౌంట్ ఆఫర్ల అమ్మకాలను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ పేరుతో టీవీలు, ఏసీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గింపే ధరలకే విక్రయించనుంది. మే 2 న మే 7 వరకు ముగియనున్న ఈ సేల్లో ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం వరకు భారీ ఆఫర్లు అందించనుంది. ఇంకా టీవీల 75 శాతం డిస్కౌంట్ అందించనుంది. అలాగే ఆపిల్ శాంసంగ్, గూగుల్ సంస్థల ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కూడా తగ్గింపు ధరల్లో అందించనుంది. అంతేనా ఏసీలు, స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, కంప్యూటర్ ఉపకరణాల ధరలపై తగ్గింపును ప్రకటించింది. దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుల ఈఎంఐ ట్రాన్సక్షన్లపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లు లభ్యం. (సుజుకి హయాబుసా క్రేజ్: ఆ వేరియంట్ ఔట్ ఆఫ్ స్టాక్!) ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు : ప్రధానంగా ఐఫోన్ 11 ఫోన్ ను ఈ సేల్ లో రూ. 7 వేల తగ్గింపును ప్రకటించింది. తాజా తగ్గింపుతో రూ. 44,999కే లభ్యం. లాంచింగ్ ధర రూ. 51,999. ఆసుస్ ఆర్ఓజి ఫోన్ 3 ధర 46,999 నుంచి ప్రారంభం ఐక్యూ 3 29,990 8 జీబీ +128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,990 ఎంఐ 10 టీ సిరీస్ను ప్రారంభ ధ 27,999 రూపాయలు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ఫోన్ రూ. 17, 999 కే లభించనుంది. గెలాక్సీ ఎఫ్ 41 6 జీబీర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 14,499 6 జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499 శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రూ. 9,999 గూగుల్ పిక్సెల్ 4 ఏ ఫోన్ రూ. 26, 999 కే కొనుగోలు చేయవచ్చు. వీటితో కంప్యూటర్ ఉపకరణాలు రూ. 99 నుంచి లభించనున్నాయి. స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు (70 శాతం వరకు), బ్లూటూత్ స్పీకర్లు (70 శాతం వరకు), ల్యాప్టాప్లు (40 శాతం వరకు) పవర్ బ్యాంకులపై డిస్కౌంట్ అందించనుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 75 శాతం తగ్గింపుతో స్మార్ట్ టీవీలు కూడా లభిస్తాయి. వన్ప్లస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 14,999లకే కొనుగోలు చేయవచ్చు. -
షావోమి అద్భుతమైన స్మార్ట్ఫోన్లు, కళ్లు చెదిరే ఎంఐ టీవీ
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ మరో మూడు స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే భారత మార్కెట్లో రారాజులా వెలుగొందుతున్న షావోమీ తాజాగా అత్యంత సమర్థవంతమైన ఫ్లాగ్షిప్ ఎంఐ 11 సిరీస్లో ఎంఐ 11 అల్ట్రా ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్ని వర్చువల్ ఈవెంట్ ద్వారా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే వీటిని చైనాలో రిలీజ్ చేసింది. వివిధ డెబిట్, క్రెడిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. అంతేకాదు ఎంఐ క్యూఎల్ఇడి టీవీ 75ను కూడా లాంచ్ చేసింది. దీని ధర 119,999 రూపాయలు ( 1,600 డాలర్లు) ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటలకు తొలిసేల్ ఉంటుంది. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో ఎంఐ 11ఎక్స్ను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.29,999. రూ.31,999 గా నిర్ణయించింది. మొదటి సేల్ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది. ఎంఐ 11 అల్ట్రా 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,990 ఎంఐ 11ఎక్స్ ప్రోను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.39,990 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.41,999. అమెజాన్తో పాటు షావోమీ ఇండియా అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. ఏప్రిల్ 24 నుంచి సేల్స్ మొదలు . -
బడ్జెట్ ఫోన్లు.. 108 మెగా పిక్సల్ క్వాడ్ కెమెరా
న్యూఢిల్లీ: మోటరోలా మధ్య శ్రేణి బడ్జెట్లో రెండు జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ల ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. మోటో జీ60: 108 మెగా పిక్సల్ క్వాడ్ కెమెరా వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఫొటోలు మరింత స్పష్టంగా వచ్చేందుకు అల్ట్రా పిక్సల్ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11పై పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో ఒకే రకం ఇందులో అందుబాటులో ఉంటుంది. మోటో జీ40 ఫ్యూజన్ ఇందులోనూ 120 గిగాహెర్జ్ 6.8 అంగుళాల హెచ్డీఆర్ 10 డిస్ప్లేను ఏర్పాటు చేశారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732 జీ ప్రాసెసర్ ఉంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రధాన కమెరాగా క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. జీ40 ఫ్యూజన్ 4జీబీ/64జీబీ రకం ధర రూ.13,999. 6జీబీ/128జీబీ ధర రూ.15,999. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. మోటో జీ60 ధర రూ.17,999. ఫ్లిప్కార్ట్లో ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభ విక్రయాలు ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేసిన వారికి అప్పటికప్పుడే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. -
ఆన్లైన్ క్లాసులు: 40 గ్రామాల పేద విద్యార్థినిలకు సోనూ సాయం
సోనూసూద్ పేరు వింటే చాలు ఎక్కడ ఆపదలో ఉన్నావారిని ఆదుకుంటున్నారో అనేలా అయిపోయింది. కరోనా కాలం నుంచి కష్టాల్లో ఉన్నావారికి సాయం చేస్తూ జనం గుండెల్లో రియల్ హీరోగా నిలిచిపోయారు. తాజాగా ఆయన సాయంలో మరో ముందడుగు వేశారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్లైన్ క్లాస్లకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు లేక పాఠాలకు దూరమవుతున్నారు. అలాంటిని వారి గురించి ఏ రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. విద్యార్థులేమో పాఠాలు వినడానికి ఎలాంటి దారి దొరకగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సోను నేనున్నా చేయుత అందించారు. ఆయన ఉదారతను చాటుకుంటు లక్నోలో సమీప గ్రామాల్లోని పేద విద్యార్థినిలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. 40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థినులకు ఆయన మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఫోన్లు అందుకున్న ఆ విద్యార్థినిలంత సోనూకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. Actor-philanthropist @sonu_sood distributes smart phones to 300 underprivileged girls across 40 villages near Lucknow to help them attend online classes during the on-going pandemic.#sonusood pic.twitter.com/WXo6S1yBdR — BARaju (@baraju_SuperHit) April 2, 2021 -
వన్ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లు : అద్భుత ఫీచర్లు
సాక్షి, ముంబై: ఫ్లాగ్షిప్ స్మార్ట్పోన్ల సంస్థ వన్ప్లస్ 9 సిరీస్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 5జీ సపోర్ట్తో వన్ప్లస్ 9 సిరీస్లో భాగంగా వన్ప్లస్ 9, వన్ప్లస్ 9 ప్రో, వన్ప్లస్ 9 ఆర్లను ఆవిష్కరించింది. సరికొత్త ఫీచర్లతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు వన్ప్లస్ ప్రకటించింది. వన్ప్లస్ 9 ఫీచర్లు 6.70 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 1440x3216 పిక్సెల్స్ రిజల్యూషన్ 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48+ 50+2 ఎంపీ రియర్ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వన్ప్లస్ 9 ప్రో ఫీచర్లు 6.7 అంగుళాల డిస్ప్లే 1440x3216 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 11 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ 48+ 50+8+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్పీకెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ,వైర్లెస్చార్జర్ ధరలు వన్ప్లస్ 9 ధర రూ .39,999 నుంచి ప్రారంభం. 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్తో 43,999 కార్బన్ బ్లాక్ లేక్ బ్లూ రంగులతో వస్తుంది వన్ప్లస్ 9 ప్రో ధర 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్కు రూ .64,999 . హై ఎండ్ మోడల్కు 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .69,999గా ఉంది. పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్ మార్నింగ్ మిస్ట్ రంగులలో వస్తుంది. అమెజాన్ ఇండియా, వన్ప్లస్ ఆన్లైన్ స్టోర్ ద్వారా లభ్యం. ఏప్రిల్ 1 , 15 తేదీల్లో తొలి సేల్ ఉంటుంది. ఆఫర్లు ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే వన్ప్లస్ 9, వన్ప్లస్ 9 ప్రో, వ న్ప్లస్ 9 ఆర్పై వరుసగా రూ .4,000, రూ .3,000 రూ .2,000 తగ్గింపు. దీంతోపాటు పరిచయ ఆఫర్ గా స్మార్ట్వాచ్ ను 14వేల,999 రూపాయలకే అందించనుంది. వన్ప్లస్ స్మార్ట్ వాచ్: ఈ స్మార్ట్ఫోన్లతో పాటు వన్ప్లస్ స్మార్ట్ వాచ్ను కూడా రిలీజ్ చేసింది. 1.39 అంగుళాల అమోలేడ్ డిస్ప్లేతో వస్తున్న స్మార్ట్ వాచ్ ధర రూ. 16,999గా నిర్ణయించింది. హ్యాండ్స్ ఫ్రీ కాల్స్, యాప్ నోటిఫికేషన్లు, ఫోన్ సెట్టింగులను సర్దుబాటు చేయడం, ఫోటో గ్యాలరీని యాక్సెస్ కెమెరా షట్టర్ రెగ్యులేటరీ లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అ లాగే వర్కౌట్ డిటెక్షన్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ మానిటర్, స్ట్రెస్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో పని చేసే ఈ స్మార్ట్ వాచ్ని 20 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే. 7 రోజులు వస్తుందని వన్ప్లస్ తెలిపింది. -
ఈ స్మార్ట్ఫోన్ అభిమానులకు షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: మీరు ఎల్జీ స్మార్ట్ఫోన్ అభిమానులా? అయితే మీకో షాకింగ్ న్యూస్. దక్షిణ కొరియా సంస్థ ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఎల్జీ ఫ్యాన్స్ను నిరాశపర్చే సంచలన నిర్ణయం దిశగా కదులుతోందట. మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయాలని కంపెనీ భావిస్తోందట. స్మార్ట్ఫోన్ విక్రయాలకు సంబంధించిన వ్యూహాలు సఫలం కాకపోవడం వ్యాపార భాగస్వామ్య చర్చలు కార్యరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణమని అంచనా. దక్షిణ కొరియాకు చెందిన డోంగా ఇల్బో నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై ఇప్పటికే జర్మనీకి చెందిన వోక్స్వ్యాగన్ ఏజీ, వియత్నాంకు చెందిన వింగ్రూప్ జేఎస్సి అనే రెండు సంస్థలతో ఎల్జీ చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలమవడంతో మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్నే మూసివేయాలని ఎల్జీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అన్ని కొత్త స్మార్ట్ఫోన్ లాంచింగ్ ప్లాన్లను ఎల్జీ నిలిపివేసింది. రోలబుల్ డిస్ప్లే ఫోన్ల ఉత్పత్తిని కంపెనీ గత నెలలో నిలిపివేసిందని డోంగా తెలిపింది. 'ది రోలబుల్' గా పిలువబడే ఈ ఫోన్ను ఎల్జీ తిరిగి సీఈఎస్ 2021లో ప్రదర్శించింది. అటు మొబైల్ పరికరాలకు గ్లోబల్ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నందున ఎల్జీ మంచి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని. స్మార్ట్ఫోన్ల అమ్మకాలు నిలిపివేసి, ఆ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే వైపు ఆలోచన చేస్తోందని కొరియా హెరాల్డ్ జనవరిలో ఒక ఎల్జీ అధికారిని ఉటంకిస్తూ తెలపింది. కాగా మొబైల్ కమ్యూనికేషన్స్లో కంపెనీ నష్టాలను చవి చూస్తోందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ క్వాన్ బాంగ్ సియోక్ గత జనవరి నెలలో ప్రకటించారు. గత ఐదేళ్లలో కంపెనీ 4.5 బిలియన్ల డాలర్లు (రూ.32,856 కోట్లు) కోల్పోయినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ కమ్యూనికేషన్స్ని విడిచిపెట్టాలని నిర్ణయించి నట్లు బాంగ్ తెలిపారు. దీనిపై విధివిధాలను ఏప్రిల్ తొలివారంలో ప్రకటిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దుమ్ము రేపిన స్మార్ట్ఫోన్ విక్రయాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్మార్ట్ఫోన్ల జోరు నడుస్తోంది. 2020 జూలై-డిసెంబరులో 10 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. ఒక ఆరు నెలల కాలంలో ఈ స్థాయి అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. మొత్తం మొబైల్స్ మార్కెట్లో 19శాతం వాటాతో సామ్సంగ్ లీడర్గా నిలిచిందని సైబర్ మీడియా రిసర్చ్ (సీఎంఆర్) తన నివేదికలో వెల్లడించింది. చైనా కంపెనీ షావొమీ అక్టోబరు-డిసెంబరులో 27 శాతం వాటాతో తొలి స్థానంలో ఉందని తెలిపింది. గతేడాది తొలి అర్దభాగంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు తగ్గాయి. దీంతో మార్కెట్ను తిరిగి గాడిలో పెట్టేందుకు కంపెనీలు బలంగా రంగంలోకి దిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడంతో మొబైల్స్ డిమాండ్ అధికమైంది. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలోనూ మొబైల్స్ పరిశ్రమ 2020లో నిలదొక్కుకోవడం గుర్తిండిపోయే అంశం. వృద్ధి 10 శాతం ఉండొచ్చు.. ప్రస్తుత ఏడాది స్మార్ట్ఫోన్ మార్కెట్ 10 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని సీఎంఆర్ అంచనా వేస్తోంది. 5జీ మోడళ్ల విక్రయాలు 10 రెట్లు అధికమై 3 కోట్ల యూనిట్లకు ఎగుస్తుందని తెలిపింది. బేసిక్ ఫోన్ యూజర్లు స్మార్ట్ఫోన్ల వైపు పెద్ద ఎత్తున మళ్లుతున్నారు. అన్ని ధరల్లోనూ ఆకట్టుకునే ఫీచర్లతో వస్తున్న మోడళ్లు.. రూ.20 వేల లోపు ధరలోనూ 5జీ మోడళ్ల రాక..వెరశి ఈ ఏడాది మార్కెట్ కొత్త పుంతలు తొక్కనుంది. 2020లో స్మార్ట్ఫోన్ సగటు విక్రయ ధర రూ.13,000 నమోదైంది. ప్రస్తుతం ఇది రూ.14,000 లకు చేరిందని బిగ్-సి మొబైల్స్ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ట్రెండ్ను చూస్తుంటే ఈ ఏడాదే స్మార్ట్ఫోన్ సగటు విక్రయ ధర రూ.15,000లను తాకుతుందని అన్నారు. ఒకదానికి ఒకటి పోటీగా.. దేశంలో 5జీ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ విభాగంలో 58% వాటాతో వన్ప్లస్ ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న యాపిల్కు 20% వాటా ఉంది. దేశంలో టాప్-10 బ్రాండ్స్లో యాపిల్ ఆరవ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2020 అక్టోబరు-డిసెంబరులో సామ్సంగ్ 20% వాటా పొందింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో 35% వృద్ధి సాధించింది. వివో 14%, రియల్మీ 11, ఒప్పో 10% వాటాను చేజిక్కించుకున్నాయి. క్యూ 4లో వివో సేల్స్ 25% తగ్గగా, రియల్మీ 50%, ఒప్పో 14% అమ్మకాలను పెంచుకున్నాయి. ఫీచర్ ఫోన్ల విభాగంలో 20% వాటాతో తొలి స్థానంలో ఉన్న ఐటెల్ అమ్మకాలు క్యూ 4లో 2% తగ్గాయి. -
ఆ విషయంలో ప్రపంచంలో మనమే టాప్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ లేకుండా రోజు గడవడం కష్టమే. అంతలా ఈ ఉపకరణం జీవితంతో ముడిపడింది. భారత్లో సగటున ఒక్కో యూజర్ 4.48 గంటలు స్మార్ట్ఫోన్ వాడుతున్నారట. ఈ స్థాయి వినియోగం ప్రపంచంలోనే అత్యధికమని నోకియా తెలిపింది. స్మార్ట్ఫోన్ వినియోగం గతేడాది నాలుగు రెట్లు పెరిగింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ 2021 ప్రకారం.. మొబైల్లో సగటు 3జీ/4జీ డేటా వినియోగం నెలకు 2015లో 0.8 జీబీ నమోదైంది. ఇది అయిదేళ్లలో 17 రెట్లు అధికమై 2020లో 13.5 జీబీకి ఎగసింది. వార్షిక వృద్ధి రేటు 76 శాతముంది. డేటాలో 54 శాతం యూట్యూబ్, సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలకు, 46 శాతం ఫిట్నెస్, ఫిన్టెక్, ఎడ్యుటెక్, ఈటైలింగ్కు వినియోగం అవుతోంది. 5జీ సేవల ప్రారంభానికి ఈ డేటా గణాంకాలు పునాదిగా ఉంటాయని నోకియా తన నివేదికలో వెల్లడించింది. 5జీ అందుబాటులోకి వస్తే డేటా గరిష్ట వేగం 1 జీబీకి చేరుతుందని అంచనా వేస్తోంది. మొబైల్ డేటాలో రెండవ స్థానం.. మొబైల్స్లో ఇంటర్నెట్ వాడకంలో ఫిన్లాండ్ తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. అయిదేళ్లలో 63 రెట్ల డేటా వృద్ధి జరిగింది. ఈ స్థాయి వినియోగంతో ఏ దేశమూ భారత్తో పోటీపడలేదని నోకియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా తెలిపారు. మొబైల్ నెట్వర్క్స్లో 2015 డిసెంబరులో భారత్లో 164 పెటాబైట్స్ డేటా వినియోగం అయింది. 2020 డిసెంబరుకు ఇది 10,000 పెటాబైట్స్ స్థాయికి వచ్చి చేరింది. ఒక పెటా బైట్ 10 లక్షల జీబీకి సమానం. ఇక మొత్తం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లలో.. ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు 2019లో 15 శాతంలోపు ఉన్నాయి. 2025 నాటికి ఇది 48 శాతానికి చేరనుంది. 10 కోట్ల మంది 4జీ మొబైల్స్ ఉన్న కస్టమర్లు ఇప్పటికీ 2జీ లేదా 3జీ సేవలను వినియోగిస్తున్నారు. అధికంగా షార్ట్ వీడియోలే.. షార్ట్ వీడియోలను ప్రతి నెల సగటున 18 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వీక్షిస్తున్నారు. 2016తో పోలిస్తే ఈ సంఖ్య 9 రెట్లు పెరిగింది. ఒక నెలలో 110 బిలియన్ నిముషాలు ఈ షార్ట్ వీడియోలు చూసేందుకు గడిపారు. 2025 నాటికి ఇది నాలుగు రెట్లు అధికం కానుందని అంచనా. షార్ట్ వీడియోల కంటెంట్ అధికంగా ఉండడంతోపాటు యువత వీటివైపే మొగ్గు చూపుతున్నారు. 4జీ డేటా యూజర్లు 70.2 కోట్లున్నారు. డేటా ట్రాఫిక్ నాలుగేళ్లలో 60 రెట్లు పెరిగింది. ప్రపంచంలో ఇదే అధికం. డేటా ట్రాఫిక్లో 4జీ వాటా 99 శాతం, 3జీ ఒక శాతం ఉంది. దేశవ్యాప్తంగా 4జీ డివైస్లు 60.7 కోట్లు. మొత్తం మొబైల్స్లో 4జీ వాటా 77 శాతం. అలాగే 5జీ స్మార్ట్ఫోన్లు 20 లక్షలున్నాయి. 2.2 కోట్ల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్టీటీహెచ్) ఏటా 37 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం ఎఫ్టీటీహెచ్ ద్వారా 40 లక్షల గృహాలు, కార్యాలయాలు కనెక్ట్ అయ్యాయి. స్మార్ట్ డివైసెస్ విస్తృతం కావడంతో డేటా వినియోగం అంతకంతకూ పెరుగుతోందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. -
సోనూ సూద్ నెక్ట్స్ మిషన్ ఇదే!
సాక్షి, ముంబై: నటుడు సోనూ సూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా, లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా నిలిచిన తన మిషన్ను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎంతోమంది ఆపన్నులను ఆదుకోవడంతోపాటు, అనేకమంది పేద విద్యార్థుల చదువులు నిలిచిపోకుండా విశేష కృషి చేశారు. ఈక్రమంలో తాజాగా స్టార్ట్ఫోన్ తయారీదారు షావోమితో జత కలిసారు. ఈ విషయాన్ని సోనూ సూద్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘మనమంతా ఐక్యంగా పోరాడి మార్గం ఎంత కఠినమైనా.. ఓటమిని అంగీకరించేది లేదంటూ కలల సాకారాన్ని నిరూపించి చూపాం. ఈ క్రమంలో మరో మార్గాన్ని చేపట్టాం. మీ అందరి సాయంతో ఈ పరంపరను ఇకపై కూడా కొనసాగిద్దాం..’’ ఈ రోజునుంచి ఏ విద్యార్థి తన ఆన్లైన్ క్లాస్లను మిస్కాకూడదు అంటూ మరోసారి పునరుద్ఘాటించిన ఆయన ఒక కొత్త మిషన్ను ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను కూడా సోనూ షేర్ చేశారు. సౌకర్యాల లేమి ఎంత కృంగదీస్తుందో తెలుసు.. అందుకే షావోమితో జతకలిసానని ఆయన వెల్లడించారు. అందరి సహాకారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేల స్మార్ట్ఫోన్లను విద్యార్థులకు అందిద్దామంటూ పిలుపు ఇచ్చారు. ఇందుకోసం ఎంఐ ఇండియా ఆధ్వర్యంలో తాను చేపట్టిన ‘శిక్షా హర్ హాత్’కోసం ప్రతిజ్ఞ పూనాలని సూచించారు. మీలో ఎవరిదగ్గరైనా, పూర్తిగా పనిచేస్తూ ఉండి.. మీకు ఉపయోగపడకుండా ఉన్న ఏదైనా స్మార్ట్ఫోన్ ఉంటే మాకు తెలపండి..మేం దాన్ని అర్హులైన విద్యార్థులకు అందజేస్తా మంటూ ఆయన తన వీడియో సందేశంలో వెల్లడించారు. ఈ వీడియోలో షావోమి గ్లోబల్ వైస్ప్రెసిడెంట్ మనోజ్కుమార్ జైన్ కూడా ఉన్నారు. పూర్తి కండిషన్లో ఉండి, డొనేట్ చేయాలనుకుంటున్న తమ పాత స్మార్ట్ఫోన్ సమాచారాన్ని యూజర్లు సమీపంలోని ఎంఐ కేంద్రంలో అందించాలని మనుకుమార్ విజ్ఞప్తి చేశారు. Aaj se koi bhi bacha apna online class nahi miss karega. This is our next mission... #ShikshaHarHaath Take the pledge with me here: https://t.co/f4Ev7vMc28@XiaomiIndia, @ManuKumarJain & @PrateikDas pic.twitter.com/w4XlMBqoMX — sonu sood (@SonuSood) January 25, 2021 -
వంద స్మార్ట్ఫోన్లు గిప్ట్ ఇచ్చిన రియల్ హీరో
సాక్షి, హైదరాబాద్: అడిగిన వారికి, అడగని వారికి ఆపన్న హస్తం అందిస్తూ హీరో అనే పదానికే వన్నె తీసుకొచ్చిన నటుడు సోనూ సూద్. తన దాతృత్వంతో ఇప్పటికే అందనంత ఎత్తు ఎదిగిన ఈ రీల్ హీరో మరోసారి రియల్ హీరోగా నిలిచారు. ‘ఆచార్య' సినిమా యూనిట్ సభ్యులకు మొబైల్ ఫోన్స్ గిఫ్ట్గా ఇచ్చి తన చేతికి ఎముక లేదని నిరూపించుకున్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సంక్షోభ కాలంలో వలస కార్మికులు మొదలు, అనేకమందిని అనేక రకాలుగా ఆదుకున్న సోనూ సూద్ తాజాగా తను నటిస్తున్న ఆచార్య సినిమా యూనిట్ సభ్యుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ మూవీకి వర్క్ చేస్తున్న పేద కళాకారులు, టెక్నిషియన్లకు 100 మొబైల్ ఫోన్లు కానుకగా ఇచ్చారు. కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ''ఆచార్య'’ సినిమాలో సోనూ సూద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: ‘ఆచార్య’ టెంపుల్ సెట్పై చిరు ఆసక్తికర ట్వీట్) -
కొత్త కెమెరా ఫీచర్స్తో స్మార్ట్ ఫోన్ల సందడి
ముంబై, సాక్షి: కమ్యూనికేషన్ కోసం ప్రారంభమైన స్మార్ట్ ఫోన్లు తదుపరి కాలంలో ఎన్నెన్నో కొంత ఆవిష్కరణలకు దారి చూపుతున్నాయి. సరికొత్త ఫీచర్స్తో యూజర్ల జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. ఇటీవల కాలంలో ప్రధానంగా కెమెరాల విషయంలో అత్యంత ఆధునికతను సంతరించుకోవడం ద్వారా డిజిటల్ కెమెరాల విక్రయాలకే గండి కొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రూ. 15,000లోపు ధర కలిగిన స్మార్ట్ ఫోన్లు సైతం ఆధునిక కెమెరాలు, ఫీచర్స్తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం.. మెగా పిక్సెల్స్ గతంలో రెండు కెమెరాలతో వచ్చిన స్మార్ట్ ఫోన్లు లగ్జరీ విభాగంలో వెలువడేవి. ప్రస్తుతం ప్రస్తుతం 3-4 కెమెరాలు కలిగిన ఫోన్లు సాధారణమైపోయాయి. గత కొన్నేళ్లలో కెమెరాకు ప్రాధాన్యత భారీగా పెరిగింది. దీంతో ఫోన్లకు వెనుకవైపు కనీసం 3 కెమెరాలుంటేనే ప్రస్తుతం నియోగదారులను ఆకట్టుకోగలుగుతున్నాయి. కొద్ది రోజులుగా నైట్ మోడ్స్ వంటివి సాధారణ అంశాలైపోయినట్లు టెక్ నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో క్వాడ్కామ్ మాడ్యూల్స్ సైతం అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. లెన్స్ల సంఖ్య, మెగాపిక్సెల్స్ సామర్థ్యం, కెమెరా సాంకేతికత వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. (ఇకపై రియల్మీ 5జీ స్మార్ట్ ఫోన్లు) 8కే వీడియోలు గతేడాది(2020)లో 4కే వీడియో చిత్రీకరణకు ఆకర్షణ పెరిగింది. దీంతో ఈ ఏడాది(2021) స్మార్ట్ ఫోన్ కంపెనీలు 8కే వీడియోలపై దృష్టిసారించినట్లు టెక్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. గతేడాది చివర్లోనే ఇందుకు బీజం పడినప్పటికీ ఇవి ఏడాది, రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా 8కే వీడియోలను సపోర్ట్ చేయగల స్ర్కీన్లను సైతం అమర్చవలసి ఉన్నట్లు తెలియజేశారు. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లేదా టీవీ సెట్లలో వీటిని ప్లే చేసేందుకు వీలైన తెరలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని వివరించారు. వెరసి 2022కల్లా 8కే వీడియో చిత్రీకరణ చేయగల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ) గింబల్ సపోర్ట్ కొన్నేళ్లుగా డిజిటల్ కెమెరాల స్థానంలో స్మార్ట్ ఫోన్ కెమెరాల వినియోగం అధికమైంది. అన్నివేళలా ఫోన్లు అందుబాటులో ఉండటంతోపాటు.. చిత్రీకరణ అత్యంత సులభంకావడంతో వినియోగదారులు కెమెరా ఫీచర్స్పై దృష్టి సారించడం ఎక్కువైంది. దీంతో ఇటీవలి కాలంవరకూ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ను స్మార్ట్ ఫోన్ కంపెనీలు సాధారణ ఫీచర్గా జత చేస్తూ వచ్చాయి. అయితే సెల్ఫీ ట్రెండ్ ప్రవేశించాక కెమెరాలు, వీటి ఫీచర్స్కు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీడియో కంటెంట్లకు డిమాండ్ పెరగడంతో వీడియో సాంకేతికతకూ ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫొటోలు లేదా వీడియోల స్టెబిలైజేషన్పై దృష్టితో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కొత్తగా గింబల్ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. వివో కంపెనీ ఎక్స్50 ప్రోలో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సెన్సర్లకూ ప్రాధాన్యం నిజానికి స్మార్ట్ ఫోన్లలో అత్యధిక మెగా పిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, సెన్సర్లకే ప్రాధాన్యం ఉన్నట్లు టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు 4కే వీడియోలను చిత్రీకరించాలంటే కనీసం 8 మెగాపిక్సెల్ కెమెరాలు తప్పనిసరని వెల్లడించారు. వెరసి వీడియోల నాణ్యతకు వీలుగా భారీ సెన్సర్లను వినియోగించవలసి ఉంటుందని తెలియజేశారు. ఇక 8కే వీడియోలను చిత్రీకరించాలంటే 33 మెగాపిక్సెల్ కెమెరాలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని చెబుతున్నారు. కొంతకాలంగా యాపిల్, గూగుల్ తదితర దిగ్గజాలు 12 ఎంపీ కెమెరాలకే కట్టుబడుతూ వస్తున్నాయి. వీటికి జతగా ఇటీవల మరో 12 ఎంపీ కెమెరాలకు సైతం తెరతీశాయి. ఈ కంపెనీలతోపాటు నాణ్యమైన సెన్సర్లను వినియోగించడం ద్వారా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం కెమెరా ఫీచర్స్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. డిస్ప్లేలో కెమెరా సెల్ఫీ ట్రెండ్కు వీలుగా పలు కంపెనీలు డిస్ప్లేలో అంతర్భాగంగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ముందు భాగంలో పాపప్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశాయి. దీనిలో భాగంగానే నాచ్ స్టైల్ సెల్ఫీకెమెరాలు, పంచ్ హోల్ కెమెరాల ట్రెండ్కు తెరలేచింది. గతేడాది ఇన్డిస్ప్లే కెమెరాలకూ ఒప్పో, షియోమీ శ్రీకారం చుట్టాయి. ఇవి కొనసాగేదీ లేనిదీ వేచిచూడవలసి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మూడు విభిన్న కెమెరాల ద్వారా చిత్రీకరించే ఫొటోలు లేదా వీడియోలకు చిప్ సెట్ సైతం సపోర్ట్ చేయవలసి ఉంటుందని, ఈ బాటలోనే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ఎస్వోసీకి కొత్త ఏడాదిలో స్మార్ట్ ఫోన్ కెమెరాలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
త్వరలో పోకో F2 స్మార్ట్ ఫోన్ విడుదల
ముంబై, సాక్షి: దేశీ మార్కెట్లలో ఈ ఏడాది(2021)లో పోకో F2 స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ట్విటర్ ద్వారా తాజాగా పేర్కొంది. 2020లో కంపెనీ సాధించిన మైలురాళ్లపై ఒక వీడియోను పోస్ట్చేస్తూ పోకో ఇండియా పలు అంశాలను ప్రస్తావించింది. 2018లో విడుదల చేసిన పోకో F1 స్మార్ట్ ఫోన్ స్థానే సరికొత్త ఫీచర్స్తో పోకో F2ను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. 10 లక్షల ఫోన్లను విక్రయించడం ద్వారా దేశీయంగా ఆన్లైన్ స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో టాప్-5లో ఒకటిగా నిలుస్తున్నట్లు పోకో వెల్లడించింది. అయితే పోకో F2 స్మార్ట్ ఫోన్ సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోన్ ఫీచర్స్పై టిప్స్టెర్ తదితర టెక్ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయంటే.. చదవండి: (2021లో రియల్మీ కీలక ఫోన్- కేవోఐ ) ఫీచర్స్ ఇలా పోకో F2 స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732జీ ప్రాసెసర్తో విడుదలకానుంది. గతంలో రూ. 16,000 ధరలో విడుదల చేసిన పోకో X3 మోడల్లో వినియోగించిన ఎస్వోసీతో 4,250 ఎంఏహెచ్ బ్యాటరీను కలిగి ఉంటుంది. వెనుకవైపు 64 ఎంపీ సెన్సర్తో క్వాడ్కెమెరాలకు వీలుంది. 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేటుతో అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేయనుంది. ఈ స్పెసిఫికేషన్స్ అంచనాలతో చూస్తే పోకో F2 స్మార్ట్ ఫోన్ ధరలు రూ. 20,000-25,000 మధ్య ఉండవచ్చు. (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) -
పదకొండు వేలకే రెడ్మీ 9 పవర్
న్యూఢిల్లీ: షియోమీ సరికొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్గా రెడ్మీ 9 పవర్ను భారత్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, వాటర్డ్రాప్ డిస్ప్లే నాచ్తో వస్తుంది. రెడ్మి 9 పవర్లో తాజా ఎంఐయుఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, స్టీరియో స్పీకర్లు, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. చైనాలో విడుదల చేసిన రెడ్మి నోట్ 9 4జీ రీబ్రాండ్ గా రెడ్మీ 9 పవర్ మొబైల్ తీసుకొచ్చారు. శామ్సంగ్ గెలాక్సీ ఎం11, వివో వై 20, ఒప్పో ఎ53లకు పోటీగా దీనిని తీసుకొచ్చింది.(చదవండి: ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్) రెడ్మీ 9 పవర్ ఫీచర్స్ డ్యూయల్ సిమ్ (నానో) రెడ్మీ 9 పవర్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12పై నడుస్తుంది. ఇందులో 6.53-అంగుళాల పూర్తి-హెచ్డి ప్లస్ (1,080x2,340) పిక్సెల్ వాటర్డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే ఉంది. ఇది 19.5 : 9 రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో లభిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ కలిగి ఉంది, ఇది అడ్రినో 610 జీపీయు, 4జీబీ ఎల్ పీఢీడీఆర్4ఎక్స్ ర్యామ్ తో జత చేయబడింది. రెడ్మి 9 పవర్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ సెకండరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం రెడ్మి 9 పవర్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.ఈ కెమెరా సెన్సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫేస్ అన్లాక్కు కూడా సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ 9 పవర్ లో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే 4జీ ఓఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, యుఎస్బి టైప్-సి మరియు 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ హై-రెస్ ఆడియో సర్టిఫికేట్ పొందిన స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్ఫ్లిక్స్ సహా ప్లాట్ఫారమ్ల ద్వారా హెచ్ డీ వెబ్ స్ట్రీమింగ్కు సపోర్ట్ కోసం వైడ్విన్ ఎల్ 1 ధృవీకరణ కూడా పొందింది. షియోమీ రెడ్మి 9 పవర్పై సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను అందించింది. ఫోన్లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ కూడా ఉన్నాయి. ఫోన్ లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని బరువు 198 గ్రాముల. రెడ్మీ 9 పవర్ ధర భారతదేశంలో రెడ్మీ 9 పవర్ ధర రూ.4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్కు 10,999 ఉండగా, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.11,999గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ నాలుగు రంగులలో లభిస్తుంది. అవి బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫైరీ రెడ్, మైటీ బ్లాక్. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మొదటి సేల్ డిసెంబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. త్వరలో ఆఫ్ లైన్లో కూడా దీని సేల్ జరగనుంది. -
14వేలకే నోకియా 5.4 మొబైల్
హెచ్ఎండీ గ్లోబల్ త్వరలో నోకియా 5.4 అనే కొత్త ఫోన్ను లాంచ్ చేయనుందని వార్తలు జోరుగా వస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన నోకియా 5.3కి తర్వాతి వెర్షన్గా ఈ ఫోన్ రానుంది. ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. నోకియా మొబైల్ మీడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో నోకియా 5.4ను తీసుకొస్తునట్లు నోకియా అధికారికంగా ప్రకటించింది. దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో, 6జీబీ ర్యామ్ + 64జీబీలో ఈ ఫోన్లు లభించనున్నాయి. నోకియా 5.4ను ఈ నెలాఖరులో(డిసెంబర్ 2020) కింగ్డమ్ అఫ్ సౌదీ అరేబియాలో 699 ఏఈడీ లేదా 190 డాలర్లు(సుమారు 14,000) ప్రారంభ ధరలో తీసుకురానున్నారు. ఇదే ధరలో మిగతా ప్రపంచ వ్యాప్తంగా 2021 జనవరి ప్రారంభంలో తీసుకురానున్నట్లు సమాచారం. (చదవండి: జియోకు వ్యతిరేకంగా విష ప్రచారం!) నోకియా 5.4 ఫీచర్స్: పేరు: నోకియా 5.4 డిస్ప్లే: 6.39 అంగుళాల హెచ్ ఢీ ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ర్యామ్: 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ ప్రధాన కెమెరా: 48ఎంపీ(f1.8) + 2ఎంపీ డెప్త్ + 5ఎంపీ అల్ట్రావైడ్ + 2ఎంపీ మాక్రో కెమెరా సెల్ఫీ కెమెరా: 16ఎంపీ(f2.0) కనెక్టివిటీ: నానో సిమ్, జిఎస్ఎమ్/ఎల్టిఇ, బ్లూటూత్ ® 4.2, జిపిఎస్/ఎజిపిఎస్, గ్లోనాస్, బిడిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్సి బ్యాటరీ: 4000 ఎంఏహెచ్, 10వాట్ ఛార్జర్ ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్™ 10( ఆండ్రాయిడ్ 11 సపోర్ట్) బరువు: 181 గ్రా. కలర్స్: పోలార్ నైట్, డస్క్ -
బడ్జెట్ లో నోకియా సీ1 ప్లస్ మొబైల్
నోకియా సీ1 ప్లస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్ను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనుంది. దింట్లో 4జీ కనెక్టివిటీ కూడా అందించారు. యూరోప్ లో దీని ధర 69 యూరోలు(సుమారు 6,200). ఇది ఎరుపు, నీలం రంగులలో లభించనుంది.(చదవండి: డిసెంబర్ 29న రానున్న ఎంఐ 11) నోకియా సీ1 ప్లస్ ఫీచర్స్ ఆండ్రాయిడ్ 10(గో ఎడిషన్)పై నడుస్తున్న నోకియా సీ1 ప్లస్ స్మార్ట్ఫోన్ 5.45-అంగుళాల హెచ్డి స్క్రీన్ను కలిగి ఉంది. ఇది 18:9 డిస్ప్లే రేషియోతో వస్తుంది. నోకియా C1 ప్లస్ స్మార్ట్ఫోన్ 1.4గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇందులో 1జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 128జీబీ స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు. నోకియా సి 1 ప్లస్ లో సెల్ఫీ, వీడియోల కోసం ముందు, వెనుక భాగంలో 5మెగాపిక్సల్ ఒకే కెమెరాను అందించారు. 2500 ఎంఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ తో వస్తున్న నోకియా సి1 ప్లస్ లో 4జీ, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ను కలిగి ఉంది. 5వాట్ చార్జింగ్కి ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్ (జి-సెన్సార్)ను అందిస్తుంది. ఇందులో ఎఫ్ఎం రేడియోను కూడా అందించారు. -
బీ అలర్ట్; స్మార్ట్ఫోన్లతో నెగెటివ్ ఆలోచనలు
మీరు ప్రతి రోజు స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త దాదాపు నాలుగింట ఒక వంతు యువత తమ స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల అది ఒక వ్యసనంలాగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని మానసిక వైద్యుల పరిశోధనలు సూచిస్తున్నాయి. స్మార్ట్ఫోన్లను రోజువారీగా ఎక్కువ ఉపయోగించడం ద్వారా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం యువత ఫోన్లో ఎక్కువ సమయం గడపడం వల్ల వారు ఫోన్ పై నియంత్రణను కోల్పోతున్నట్లు తెలుస్తుంది.(చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) బీఎంసీ సైకియాట్రీలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే పరిణామాలను తెలుసుకోవడం కోసం దర్యాప్తులో భాగంగా 42,000 మంది యువత మీద పరిశోధనలు జరిపినట్లు తెలిపారు. ఇందులో 23 శాతం మంది మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. వారు ఫోన్ను ఉపయోగించలేకుండా ఉండలేక పోవడం, సమయం విషయంలో నియంత్రణను కోల్పోవడం వంటి విషయాలను గమనించినట్లు తెలిపారు. మొబైల్ ని ఎక్కువగా వాడటం వల్ల ఒత్తిడికి గురిఅవ్వడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించ లేకపోవడం, కుటుంబాన్ని, బంధువులను పట్టించుకోకుండా ఏకాంతంగా ఉండటం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరినీ పట్టించుకోకుండా స్వార్థంగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా నెగెటివ్ ఆలోచనలు భాగా పెరుగుతునట్లు తెలుస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. మానసికంగా కుంగుబాటుకు గురిఅవుతూ ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తునట్లు నివేదికలో తేలాయి. వీటికి అన్నింటికీ మూలం స్మార్ట్ఫోన్ లేక వారు ఉపయోగించే యాప్స్ అనేది తెలియడం లేదు అని డాక్టర్ నికోలా కాల్క్ అన్నారు. అందుకోసమే పిల్లలు, యువకులు స్మార్ట్ఫోన్ వాడకం విషయంలో అవగాహన కల్పించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తమ ఫోన్లలో ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవాలి లేకపోతే వారి మానసిక ఆరోగ్యం, రోజువారీ పనితీరుపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయి అని సహ రచయిత సమంతా సోహ్న్ హెచ్చరించారు. (చదవండి: పబ్జి లవర్స్ జర జాగ్రత్త) -
మోటోరోలా బడ్జెట్ మొబైల్ వచ్చేసింది
మోటోరోలా మొబైల్ వినియోగదారుల కోసం మరో బడ్జెట్ మొబైల్ ని తీసుకొచ్చింది. మోటో జీ9 పవర్ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. మోటో జీ9కి తదుపరి మోడల్ గా మోటో జీ9 పవర్ తీసుకొచ్చింది. మోటో జీ9 పవర్ స్పెసిఫికేషన్స్ గ్లోబల్ వెర్షన్ మాదిరిగానే ఉన్నాయి. ఈ మొబైల్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 ఎంపి ట్రిపుల్ కెమెరాలు మరియు స్నాప్డ్రాగన్ 662 చిప్ సెట్ తో 6.8-అంగుళాల హెచ్డి + డిస్ప్లేను తీసుకొచ్చారు. (చదవండి: ఫ్లిప్కార్ట్లో బొనాంజా సేల్ లో మొబైల్స్ పై భారీ తగ్గింపు) మోటో జీ9 పవర్ ఫీచర్స్ & ధర: మోటో జీ9 పవర్ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మోటో జీ9 పవర్ 6.8-అంగుళాల హెచ్ డీ ప్లస్ (720 x 1,640 పిక్సెల్స్) ఐపిఎస్ డిస్ప్లేను కలిగి ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ ఆన్బోర్డ్తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించడం ద్వారా 512 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జీ 9 పవర్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64 ఎంపి ప్రైమరీ సెన్సార్ కెమెరా ఎఫ్/1.79 లెన్స్, 2 ఎంపి మాక్రో లెన్స్ మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఫోన్ వెనుక-ఫింగర్ ప్రింట్ మౌంటెడ్ స్కానర్ మరియు 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని తీసుకొస్తుంది. కనెక్టివిటీ కోసం మోటో జీ 9 పవర్ 4జీ ఎల్టిఇ, వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, మరియు 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ కలిగి ఉంది. భారతదేశంలో మోటో జీ9 పవర్ 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ .11,999. ఎలక్ట్రిక్ వయొలెట్, మెటాలిక్ సేజ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో డిసెంబర్ 15వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. -
ఫ్లిప్కార్ట్ లో మరో కొత్త సేల్
ఫ్లిప్కార్ట్ పోకో డేస్ పేరుతో కొత్త సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో భాగంగా పోకో ఎక్స్3, పోకో సి3, పోకో ఎం2 మరియు పోకో ఎం2 ప్రోపై డిస్కౌంట్ను ఇస్తుంది. పోకో డేస్ సేల్ అనేది నేటి నుండి డిసెంబర్ 6 వరకు ఉంటుంది. పోకో ఎక్స్3ని ఈ సేల్ లో భాగంగా రూ.15,999కే అందిస్తున్నారు. రెండేళ్లపాటు షియోమితో కలిసి ఉండి ఆ తర్వాత వేరుపడి స్వతంత్ర సంస్థగా అవతరించింది పోకో. ఫ్లిప్కార్ట్లో పోకో డేస్ సేల్లోభాగంగా నాలుగు పోకో ఫోన్లపై డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందిస్తుంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డుపై ఫ్లిప్కార్ట్ రూ.5000 వరకు తగ్గింపు ఇస్తోంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్బ్యాక్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. (చదవండి: ఫ్రీగా నెట్ఫ్లిక్స్ అకౌంట్) పోకో సి3 ఫోన్ యొక్క అసలు ధర 9,999 కాగా ఈ సేల్ భాగంగా 6,999కి అందిస్తున్నారు. ఫోన్ ఆర్కిటిక్ బ్లూ, లైమ్ గ్రీన్ మరియు మాట్టే బ్లాక్ కలర్లో లభిస్తుంది. పోకో ఎం2 6 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర 12999 కాగా.. 9,999కి అందిస్తున్నారు. అలాగే పొకో ఎం2 ప్రో మొబైల్ అసలు ధర రూ. 16,999 నుంచి రూ.12,999కి తగ్గించి విక్రయిస్తున్నారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు. దీనిలో 48 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే పొకో ఎక్స్3 మొబైల్ అసలు ధర రూ. 19,999 కాగా.. రూ.15,999కే ఈ సేల్లో అందిస్తున్నారు. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు. దీనిలో 64 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. -
వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్!
మార్కెట్ లోకి ఏదైనా కొత్త మోడల్ ఫోన్ వస్తే చాలు దానిలో ఎన్ని కెమెరాలు ఉన్నాయి.. ర్యామ్ ఎంత.. డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెడతాం. అయితే తాజాగా ఈ జాబితాలో 5జీ వచ్చి చేరింది. ఇప్పుడు విడుదలయ్యే మొబైల్ లలో ఎక్కువగా 5జీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే నెట్వర్క్ సంస్థలు కూడా 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 2020లో మొబైల్ కంపెనీలు కూడా 5జీ ఫీచర్తో ఫోన్లను తీసుకొస్తున్నాయి. కానీ ప్రస్తుతం 5జీ ఫోన్ల యొక్క ధరలు ఎక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకునే వారి ఆశ నిరాశగానే మిగిలిపోతుంది. (చదవండి: ఓటీటీ యూజర్లకు గుడ్ న్యూస్) 5జీ ఫోన్ల యొక్క ధర ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ప్రాసెసర్ యొక్క ధర ఎక్కువగా ఉండటమే. దీనిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ధరలలో ఫోన్లు తయారు చేసే కంపెనీల కోసం మీడియా టెక్ కంపెనీ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మీడియాటెక్ బడ్జెట్ ఫోన్ల కోసం డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తీసుకొచ్చింది. తాజా ప్రకటనతో బడ్జెట్ ధరలో 5జీ ఫీచర్తో స్మార్ట్ఫోన్ తీసుకొచ్చేందుకు మొబైల్ కంపెనీలకు మార్గం సుగమమైంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ 5జీని సపోర్ట్ చేస్తుంది. దాని వల్ల ఒకే ఫోన్లో రెండు 5జీ నెటవర్క్లను మీరు ఉపయోగించవచ్చు. కొత్త డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 7 ఎన్ఎమ్ తయారుచేశామని, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో దీనిని విడుదల చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఇది రెండు కార్టెక్స్- A76 సిపియు కోర్లతో 2.2జీహెర్ట్జ్ మరియు ఆరు కార్టెక్స్- ఏ55 కోర్లతో క్లాక్ చేయబడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్-ఇంటెన్సివ్ పనులకోసం మాలి- జీ57 ఎమ్ సీ యు జీ పీ యు ఉంది. మునుపటి తరం చిప్సెట్లతో పోలిస్తే మెరుగైన ఆడియో నాణ్యతను అందించే డ్యూయల్ స్టాండ్బై, వాయిస్ ఓవర్ న్యూ రేడియో(VoNR)ను కూడా మీరు పొందుతారు. ఇది గ్లోబల్ 5జి ఎన్ఆర్ బ్యాండ్ సపోర్ట్, మీడియాటెక్ యొక్క “5జీ అల్ట్రాసేవ్” బ్యాటరీ సేవింగ్ టెక్నాలజీతో వస్తుంది. అలానే, ఈ ప్రాసెసర్తో 5జీ డౌన్లింక్ వేగం 2.77 జీబీపీఎస్ ఉంటుందట. ఇంకా ఏఐ-కలర్, ఏఐ-బ్యూటీ, మల్టీ ఫ్రేం నాయిస్ రిడక్షన్ ఫీచర్స్ 48 ఎంపీ, 64 ఎంపీ కెమెరాలతో పాటు 90హెడ్జ్ ప్రీమియం డిస్ప్లేను ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ధర 250 డాలర్లు ఉంటుందని మీడియాటెక్ తెలిపింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.18,000. అయితే ఈ ధర మరింత తగ్గొచ్చనేది మార్కెట్ వర్గాల నిపుణుల అభిప్రాయం. -
15 వేల లోపు కొత్త ఫోన్ కొనాలంటే ఇవే బెస్ట్!
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో పోటీగా మామూలుగా లేదు. తక్కువ ధరకే మంచి స్పెసిఫికేషన్స్ గల స్మార్ట్ ఫోన్స్ ని తీసుకు వస్తున్నాయి. భారతీయ స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రూ .15 వేల లోపు ధర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ ధర అనేది చాలా మందికి అందుబాటులో ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు కూడా ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు రూ. 15,000 లలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జి, మీడియాటెక్ హెలియో జి80, మరియు మీడియాటెక్ హెలియో జి95 వంటి శక్తివంతమైన ప్రాసెసర్లను తీసుకొస్తున్నాయి. మంచి కెమెరా టెక్నాలజీ కూడా ఈ ధరలోనే అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్ లు ఉన్నందున, మీరు ఈ స్మార్ట్ఫోన్ లను ఎంచుకోవడం అంత సులభం కాదు. అలా ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.. రియల్ మీ నార్జో 20.. ఈ మధ్య విడుదలైన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లలో ఇది ఒకటి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో వచ్చింది. రియల్ మీ నార్జో సిరిస్ మొబైల్ ఫొన్లను కొత్తగా మార్కెట్ లొకి తీసుకొచ్చింది. మార్కెట్ లో దీని ధర వచ్చేసి 14,999 రూపాయలుగా ఉంది. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.50-ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ మీడియా టెక్ హిలియో జి95 ర్యామ్ 6జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 4500mAh ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ బ్లాక్ నింజా, వైట్ నైట్ సెన్సర్స్ ఫేస్ అన్లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ రియల్ మీ 7.. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లలో వచ్చిన బెస్ట్ ఫోన్ లలో ఇది ఒకటి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో వచ్చింది. రియల్ మీ 7 రియల్ మీ 6తో పోలిస్తే మూడు ప్రధాన మార్పులు చేసింది. అవి ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీలలో మార్పు చేసింది. మార్కెట్ లో దీని ధర వచ్చేసి 14,999 రూపాయలుగా ఉంది. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.50-ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ మీడియా టెక్ హిలియో జి95 ర్యామ్ 6జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5000mAh ప్రధాన కెమెరా 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ మీస్ట్ బ్లూ, మీస్ట్ వైట్ సెన్సార్స్ ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ పోకో ఎం 2 ప్రో.. పోకో ఎం 2 ప్రో ఆకర్షణీయమైన డిజైన్ను కలిగి ఉండటంతో పాటు రెడ్మి నోట్ 9 ప్రోతో సమానంగా కనిపిస్తుంది. పోకోలో 6.67-అంగుళాల పూర్తి-హెచ్డి + ఎల్సిడి డిస్ప్లేను ఉపయోగించారు. పోకో ఫ్రంట్ మరియు వెనుక కెమెరా మాడ్యూల్లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు. పోకో M2 ప్రో ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 11 పై నడుస్తుంది. దీనిలో క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగన్ 720G SoC చిప్ ని వాడారు. 5,000mAh సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఒక రోజు మొత్తం సులభంగా వాడుకోవచ్చు. దీని ధర వచ్చేసి Rs. 13,999. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.67-ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జి ర్యామ్ 4జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5020ఎంఏహెచ్ ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ బ్లూ, గ్రీన్, బ్లాక్ సెన్సార్స్ ఫేస్ అన్లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ రెడ్మి నోట్ 9 ప్రో గతంలో రెడీమి నోట్ సిరీస్ లో వచ్చిన ఫోన్ ల కంటే రెడ్మి నోట్ 9 ప్రో తక్కువ ప్రారంభ ధరలో ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో 6.67-అంగుళాల ఎల్సిడి స్క్రీన్ను కలిగి ఉండటంతో పాటు పైభాగంలో హోల్-పంచ్ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది. దీనిలో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జి ప్రాసెసర్ ఉపయోగించారు. రెడ్మి నోట్ 9 ప్రో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. దీని ధర వచ్చేసి 12,999 రూపాయలు. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.67- ఇంచ్, 1080x2400 పిక్సల్స్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720జి ర్యామ్ 4జీబీ స్టోరేజ్ 64జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5020ఎంఏహెచ్ ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 5ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ అరోరా బ్లూ, ఛాంపింగ్ గోల్డ్, గ్లేసియర్ వైట్, బ్లాక్ సెన్సార్స్ ఫేస్ అన్లాక్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్, కంపాస్ / మాగ్నెటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ రియల్ మీ నార్జో 10.. రియల్ మీ నార్జో 10 తక్కువ ఖర్చుతో కూడిన ఫోన్, ఇది మీడియాటెక్ హెలియో జి80 SoC ప్రాసెసర్ పై నడుస్తుంది. దీనిలో కూడా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీను వాడారు. ఈ మొబైల్ లో 4 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ పొందవచ్చు. ఇందులో హెలియో జి80 ప్రాసెసర్ ఉపయోగించడం వల్ల గేమింగ్ పనితీరు చాలా బాగుంది. భారత్ లో దీని ధర వచ్చేసి 11,999 రూపాయలు. స్పెసిఫికేషన్స్ డిస్ ప్లే 6.50-ఇంచ్, 720x1600 పిక్సల్స్ ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో జి80 ర్యామ్ 4జీబీ స్టోరేజ్ 128జీబీ బ్యాటరీ సామర్ధ్యం 5000ఎమ్ఏహెచ్ ప్రధాన కెమెరా 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ సెల్ఫీ కెమెరా 16ఎంపీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10 కలర్స్ గ్రీన్, వైట్ -
మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్ మెంట్
సాక్షి, ముంబై: ఒకపుడు దిగ్గజంగా వెలిగిన దేశీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందేందుకు సిద్ధపడుతోంది. దేశంలో చైనా ఉత్పత్తులపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో మైక్రోమాక్స్ సరికొత్త వ్యూహాలతో మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈమేరకు మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మ ఒక వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. పోటీ మార్కెట్ లో చైనా మొబైల్ సంస్థలు వస్తే.. ఒకే కానీ, సరిహద్దులో అనిశ్చితి సరైనది కాదు అంటూ ఆయన చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో, ఒక సామాన్య ఉపాధ్యాయుడి కుమారుడిగా తన వ్యాపార ప్రస్థానాన్నిఈ వీడియోలో వివరించారు. ప్రపంచంలో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచిన మైక్రోమాక్స్ జర్నీని ప్రస్తావించారు. అయితే కొన్ని పొరపాట్లు జరిగినా, తాను ఓడిపోకపోయినా, సాధించిన దానితో సంతృప్తి చెందానని చెప్పుకొచ్చారు. కానీ సరిహద్దు వద్ద ఏమి జరిగిందో అది సరైనది కాదన్నారు. ఏం చేయాలి.. ఎవరికోసం చేయాలి అని చాలా ఆలోంచించాను.. అయితే ఎక్కడినుంచి మొదలు పెట్టానో.. మళ్లీ అక్కడ్నించే మొదలు పెట్టే అవకాశాన్ని జీవితం ఇచ్చింది. కానీ ఈసారి ఏం చేసిన దేశం కోసం మాత్రమే చేస్తానని రాహుల్ ప్రకటించారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిభర్ భారత్ పిలుపులో భాగంగా ఇండియా కోసం మైక్రోమాక్స్ 'ఇన్' అనే కొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్తో తిరిగి వస్తోందని వెల్లడించారు. భారతదేశంలో కొత్త ఇన్-సిరీస్ స్మార్ట్ఫోన్ను విడుదలకు సూచికగా బ్లూ బాక్స్ ను కూడా వీడియోలో షేర్ చేశారు. ఇంతకుమించి వివరాలను ఆయన ప్రకటించపోయినప్పటికీ, 7-15 వేల రూపాయల ధరల మధ్య ఉత్పత్తులను మైక్రోమాక్స్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. నవంబర్ ఆరంభంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను బడ్జెట్ ధరలో ఆవిష్కరించనుందని టెక్ నిపుణుల అంచనా. ఇందుకోసం 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. We're #INForIndia with #INMobiles! What about you? #IndiaKeLiye #BigAnnouncement #MicromaxIsBack #AatmanirbharBharat pic.twitter.com/eridOF5MdQ — Micromax India (@Micromax__India) October 16, 2020 -
5జీ ఫోన్ల హవా : వివో ఎక్స్ 50ఈ
సాక్షి, ముంబై: స్మార్ట్ఫోన్ మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు కూడా వివో కూడా 5 జీ సిరీస్ లో వివో ఎక్స్ 50 , వివో ఎక్స్ 50 ప్రో ఫోన్లతో విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎక్స్ 50 ఈ 5 జీ తైవాన్లో విడుదల చేసింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 జీ సాక్, 6.44-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్తో దీన్ని తీసుకొచ్చింది. వివో ఎక్స్ 50ఈ 5 జీ ధర సుమారు రూ .35600 వివో ఎక్స్ 50ఈ 5జీ ఫీచర్లు 6.44 అంగుళాలు అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 10 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765జీ సాక్ చే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 48+13+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా 4350 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం -
మనసున్న'స్మార్ట్' టీచరమ్మ
తమిళనాడులో గత కొన్నాళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సర్కారు బడులపై ఏర్పడుతున్న నమ్మకం, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారాన్ని తట్టుకోలేని నిస్సహాయత వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీనికి తోడు కరోనా నేపథ్యంలో భోధనాతీరూ మారింది. అయితే మారుమూల ప్రాంతాల్లో, అసలు టీవీలు, సెల్ఫోన్లు లేని కుటుంబాలు కూడా అనేకం. దీంతో వారికి సాయపడేందుకు ఓ అడుగు ముందుకేశారు లెక్కల టీచర్ కె. భార్గవి. ప్రభుత్వ టీవీ చానల్ ‘కల్వి తొలైకచి’ ద్వారా ఆన్లైన్ పాఠాలు చెప్పేవాళ్లు. అయితే ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల గురించి ఆమె మరింత శ్రద్ధ తీసుకుంది. ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా నేరుగా విద్యార్థులతో ముచ్చటించి వారిని గైడ్ చేసేది. (వీధికుక్కలను బతకన్విండి... ప్లీజ్) అయితే చాలా మంది స్టూడెంట్స్ ఆ గ్రూపులో లేరు. అసలు వీళ్లు పాఠాలు వింటున్నారా లేదా అని తెలుసుకోవడానికి టీచరమ్మ 80 కిలోమీటర్లు ప్రయాణించి మరీ విద్యార్థుల వద్దకు చేరుకుంది. వారంతా పేద విద్యార్థులు. పూట గడవడమే కష్టమయ్యే పరిస్థితుల్లో ఇక స్మార్ట్ఫోన్లు కొనగం గగనమే. సమస్య తెలుసుకొని ఎవరో వచ్చి సహాయం చేస్తారులే అని ఊరుకోకుండా టీచరమ్మే సాయం చేయడానికి ముందుకొచ్చింది. తను దాచుకున్న లక్ష రూపాయలతో 16 మంది పేద విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు కొనిచ్చింది. అంతేనా వాటికి సిమ్కార్డులు, రీచార్జ్ బాధ్యతలను కూడా తనే తీసుకుంది. స్కూళ్లు తిరిగి తెరిచి, విద్యార్ధులు వచ్చేవరకు వాటికి పూర్తి రీచార్జ్ తానే చేస్తానని హామీ ఇచ్చింది. నా పిల్లలు పాఠాలు వినాలి, పరీక్షలు పాసవ్వాలి. అందుకే నావంతు చిన్న ప్రయత్నం అంటూ వెల్లడించింది. టీచరమ్మ మంచి మనస్సుకు మనమూ చెబుతామా హ్యాట్సాఫ్.. (సూపర్ మష్రూమ్స్.. అద్భుతః!) -
ఆన్లైన్ చదువులు సాగేనా !
సాక్షి, ఆదిలాబాద్: కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు జరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఎంతమందికి ఈ విద్య చేరువ అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. అక్షరాస్యతతో పాటు ఆర్థికంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకంజలో ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడెలు, తండాల్లో నివసించే చాలా మందికి స్మార్ట్ ఫోన్లు, టీవీలు లేకపోవడంతో వీరికి ఆన్లైన్ బోధన ఎలా సాగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అందరికి ఆన్లైన్ విద్య అందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో.. జిల్లాలో మొత్తం 1420 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 139 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. డీఈవో పరిధిలో 677 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా 17 కేజీబీవీలు, 6 మోడల్ స్కూళ్లు, ఒక యూఆర్ఎస్ పాఠశాల ఉంది. దాదాపు 65వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో 54 ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 12వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు విద్యను చేరువ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈనెల 27న విధుల్లో చేరిన ఉపాధ్యాయులు ఆన్లైన్ తరగతులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భిన్న పరిస్థితి.. ఐటీడీఏ పరిధి ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో 54 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. 12వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే 1397 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అదేవిధంగా 3 నుంచి 4వేల మంది విద్యార్థుల ఇళ్లలో మాత్రమే టీవీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివే విద్యార్థుల నివాసాలు గూడాలు, తండాల్లో ఉండటం, వారి వద్ద అండ్రాయిడ్ఫోన్లు, టీవీలు లేకపోవడం సమస్యగా మారింది. కొన్ని గ్రామాలకు కనీసం విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన పూర్తిస్థాయిలో అందకుండా పోతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఐటీడీఏ అధికారులు వారికోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల సర్వే.. ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో పాటు ఐటీడీఏ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు సర్వే చేపడుతున్నారు. డీఈవో పరిధిలోని పాఠశాలలకు సంబంధించి 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 43,371 మంది ఉన్నారు. టీవీ, డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నవారు 13,321 మంది, టీవీతో పాటు కేబుల్ కనెక్షన్ ఉన్నవారు 20,734 మంది, ఆండ్రైడ్ ఫోన్లు ఉన్నవారు 906 మంది, కంప్యూటర్లు, ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నవారు 153 మంది ఉన్నారు. అయితే జిల్లాలో అండ్రాయిడ్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు లేనివారు 5,818 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐటీడీఏ పరిధిలో సుమారు 4వేల విద్యార్థులకు పైగా ఇళ్లలో టీవీలు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే టీవీలు ఉన్న విద్యార్థుల ఇంట్లో కాని, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాని వీరికి ఆన్లైన్ పాఠాలు వీక్షించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆన్లైన్ విద్య అందేలా చర్యలు ప్రతీ విద్యార్థికి ఆన్లైన్ బోధన అందే విధంగా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో 5,818 మందికి టీవీలు, కేబుల్ కనెక్షన్, అండ్రాయిడ్ ఫోన్లు లేవు. వీరికి పక్కన ఉన్న విద్యార్థుల ఇంటి వద్ద ఆన్లైన్ తరగతులు అందేలా చూస్తాం. వీరిపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా లోకల్ ఛానల్ ద్వారా లైవ్ పాఠాలను విషయ నిపుణులతో బోధించడం జరుగుతుంది. – రవీందర్రెడ్డి, డీఈవో సర్వే కొనసాగుతోంది జిల్లాలో 54 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఆన్లైన్ తరగతులకు సంబంధించి సర్వే కొనసాగుతోంది. దాదాపు 4వేల మంది విద్యార్థులకు టీవీలు లేవు. 1397 మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీరికి మే నుంచే బోధన జరుగుతుంది. టీవీలు లేని వారికి ఇతర ఏర్పాట్లు చేస్తాం. – చందన, డీడీ, ఐటీడీఏ -
నోకియా దూకుడు : నాలుగు స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: హెచ్ఎండీ గ్లోబల్ భారత మార్కెట్లో నాలుగు కొత్త నోకియా స్మార్ట్ఫోన్లు విడుదల చేసింది బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3, రెండు ఫీచర్ ఫోన్లు నోకియా 125, నోకియా 150 లను ఆవిష్కరించింది. 5.1కి కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది. నోకియా 5.3 ఫీచర్లు 6.55-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 5.3 స్నాప్డ్రాగన్ 665 చిప్సెట్ 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 6 జీబీ ర్యామ్ , 64 జీబీ స్టోరేజ్ 13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ధర 4 జీబీ ర్యామ్ బేస్ వేరియంట్కు రూ .13,999 6 జీబీ ర్యామ్ మోడల్కు రూ .15,499. సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లు రూ .349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్పై రిలయన్స్ జియో నుంచి రూ .4 వేల విలువైన ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో 2,000 రూపాయల క్యాష్బ్యాక్ , 2,000 రూపాయల విలువైన వోచర్లు ఉన్నాయి. నోకియా సీ 3 ఫీచర్లు 5.99అంగుళాల డిస్ప్లే 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 10 2 జీబీ/3 జీబీ ర్యామ్, 16 జీబీ/32 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు ఎక్స్పాండబుల్ మెమరీ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3.5 మిమీ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో 3040 ఎంఏహెచ్ బ్యాటరీ ధర సెప్టెంబర్ 17 నుండి నోకియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ చెయిన్ ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉంటుంది. 2 జీబీ / 16 జీబీ వేరియంట్ ధర 7,499 రూపాయలు 3 జీబీ / 32 జీబీ వేరియంట్ 8,999 రూపాయలు ఒక సంవత్సరం రీప్లేస్ మెంట్ గ్యారంటీ అందిస్తోంది. -
కొత్త కస్టమర్లకు ఆచితూచి రుణాలు
సాక్షి, హైదరాబాద్ : స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రుణ సంస్థలు పోటీపడుతుంటాయి. ఇందుకోసం వడ్డీ లేని రుణాలను జీరో డౌన్పేమెంట్తో ఆఫర్ చేయడం చూశాం. కోవిడ్–19 పుణ్యమాని ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఇబ్బడిముబ్బడిగా రుణాలను అందించిన ఈ సంస్థలు పాత బకాయిల వసూళ్లపై ప్రధానంగా దృష్టిసారించాయి. దీంతో నూతన వినియోగదార్లకు రుణం దొరకడం కష్టంగా మారింది. వీరి విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కస్టమర్ ట్రాక్ రికార్డు ఆధారంగానే తాజాగా రుణాలను జారీ చేస్తున్నాయి. కీలకంగా సిబిల్ స్కోరు.. వినియోగదారులకు రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు సిబిల్ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. సిబిల్ స్కోరు కనీసం 750 ఉంటే లోన్ మంజూరు చేసేవి. నూతన మార్పుల ప్రకారం లోన్ కోసం వచ్చే కొత్త కస్టమర్కు ఇప్పుడీ స్కోరు కనీసం 775 ఉండాల్సిందే. లేదంటే సింపుల్గా నో అని చెప్పేస్తున్నాయి. పాత కస్టమర్ల విషయంలో సిబిల్ స్కోరు కనీసం 750 ఉంటేచాలని ఓ ప్రముఖ సంస్థ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గతంలో వారు తీసుకున్న రుణాల తాలూకు చెల్లింపులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్లలో 35 శాతంగా ఉన్న ఈఎంఐల వాటా ఇప్పుడు 10 శాతానికి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కస్టమర్లకు సౌకర్యంగా.. బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం 18 నెలల వరకు రుణాన్ని చెల్లించే సౌకర్యాన్ని ఆఫర్ చేస్తున్నాయి. గతంలో ఇది 6–10 నెలల వరకే ఉండేదని ఓ సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించా రు. ‘కోవిడ్–19 తర్వాత వినియోగదార్ల కొనుగోలు శక్తి తగ్గింది. ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. అందుకే వారి సౌలభ్యం కోసం వాయిదాల సంఖ్యను పెంచాం’ అని ఆయన అన్నారు. అయితే గతంలో జీరో డౌన్పేమెంట్ ఉండేది. ఇప్పుడు కనీసం 30–35 శాతం ముందుగా చెల్లించాల్సిందే. బ్రాండ్, రుణ సంస్థనుబట్టి కస్టమర్ల నుంచి స్వల్ప వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. కొన్ని రుణ సంస్థలు ప్రాసెసింగ్ ఫీజు చార్జీ చేస్తున్నాయని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. -
స్మార్ట్ఫోన్ : శాంసంగ్ భారీ ప్రణాళికలు
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఇండియాలలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా కొత్త వ్యూహాలు రచిస్తోంది. తన పెట్టుబడులను ఇతర దేశాలనుంచి ఇండియాకు తరలించేందుకు యోచిస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ)పథకం కింద స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని మరింత విస్తృతం చేయనుంది.ఈ మేరకు ఒక అంచనాను కూడా ప్రభుత్వానికి సమర్పించిందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. (షావోమికి షాకిచ్చిన శాంసంగ్) స్మార్ట్ ఫోన్ ఉత్పత్తికి సంబంధించి వియత్నాం, సహా ఇతర దేశాల నుండి తన పెట్టుబడులు ఇటువైపు మళ్ళించనుంది. దేశంలో 40 బిలియన్ డాలర్లు లేదా 3 లక్షల కోట్ల రూపాయల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయాలని ప్రణాళికలను రచిస్తోంది. ముఖ్యంగా రానున్న అయిదేళ్లలో15వేల రూపాయల కంటే తక్కువ ధర ఉంటే ఫోన్లను ఉత్పత్తి చేయనుంది. వీటి 25 బిలియన్ డాలర్లకు పైగా ఉండనుంది ఈ కేటగిరీలోని చాలా ఫోన్లను ఎగుమతి చేయనుంది. పీఎల్ఐ పథకానికి దేశీయ, అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీదారుల భారీ ఆదరణ లభించిందనీ కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ప్రకటించారు. మొత్తం 22 కంపెనీలు ముందుకువచ్చాయని వెల్లడించారు.అంతర్జాతీయతయారీ సంస్థలు ఆపిల్,శాంసంగ్ తోపాటు, దేశీయంగా లావా, మైక్రోమాక్స్, ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, సోజో కంపెనీలు ముందుకురావడం సంతోష దాయకమని వెల్లడించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ స్మార్ట్ఫోన్ ఎగుమతి మార్కెట్ 270 బిలియన్ డాలర్లుగా అంచనా. వీటిలో ఆపిల్ 38 శాతం మార్కెట్ వాటా, శాంసంగ్ వాటా 22 శాతం. వాల్యూమ్ విషయానికి వస్తే, శాంసంగ్ 20 శాతం సొంతం చేసుకోగా, ఆపిల్ వాటా 14 శాతం. కాగా శాంసంగ్ తన ఫోన్లలో దాదాపు50 శాతం వియత్నాంలో ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ కొరియాలో కార్మిక ఖర్చులు భారీగా ఉండంటంతో దేశంలో తయారీని దాదాపు మూసివేసే ప్రక్రియలో ఉంది. వియత్నాంతోపాటు, బ్రెజిల్ ఇండోనేషియాలో కూడా శాంసంగ్ ఉత్సత్తి యూనిట్లు ఉన్నాయి. -
విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు
చండీగఢ్ : రాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. రేపు (ఆగస్టు 12) యువత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్లోనే పాఠాలు నిర్వహిస్తున్నందున, పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రాష్ర్టంలోని వివిధ పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో విద్యార్థులకు పోన్లను పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని సీఎం అన్నారు.గతంలోనే రాష్ర్టంలోని యువతకు ఉచితంగా స్మార్ట్ఫోన్లను ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో సీఎం అమరీందర్ సింగ్ పథకాన్ని ప్రారంభించనున్నారు. మొదటిదశలో సుమారు 1.75 లక్షల ఫోన్లను ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. (ప్రణబ్కు బ్రెయిన్ సర్జరీ) -
ఫ్లిప్కార్ట్ సేల్ : బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. నేడు (ఆగస్టు 6) నుంచి ఈ సేల్ 5 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 10న ముగుస్తుంది. స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్స్ , ఫ్యాషన్ ఉత్పత్తులపై అతిపెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది. సిటీ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. (అమెజాన్ ప్రైమ్ డే సేల్ : భారీ డిస్కౌంట్లు) అమేజింగ్ డీల్స్ ఐఫోన్ ఎస్ఈ 2020 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 5,501 రూపాయల ధర తగ్గింపుతో 36,999 రూపాయలకు కొనుగోలుచేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా సిటీబ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 1,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ ఎస్ఈ 128జీబీ స్టోరేజ్ మోడల్ 41,999 కు లభ్యం. అసలు 47,800 రూపాయలు 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ను 51,999 రూపాయలకు అందిస్తోంది. అసలు ధర రూ. 58.300. ఈ రెండు మోడళ్లపై క్రెడిట్ / డెబిట్ కార్డు ద్వారా రూ .1,500 డిస్కౌంట్ అదనం. ఐఫోన్ ఎక్స్ ఆర్ 44,999 రూపాయలకే లభ్యం. ఎంఆర్పీ 52,500 రూపాయలు. ఎల్జీ వీ 30 ప్లస్ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 19,999 రూపాయలకే అందిస్తోంది. ఎంఆర్పీ రూ .60,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరో 13,650 రూపాయలు తగ్గింపు. -
స్మార్ట్ ఫోన్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: ‘‘బాబూ.. నేను గురుకుల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా స్మార్ట్ఫోన్ ఉందా? ఇంటర్నెట్ ప్యాకేజీ వాడుతున్నారా? వాళ్లు ఏ సమయంలో ఇంట్లో ఉంటారు? వెంటనే కనుక్కుని చెప్పు..’’ ఇదీ గురుకుల పాఠశాలల విద్యార్థుల నుంచి బోధన, బోధనేతర సిబ్బంది సేకరిస్తున్న సమాచారం. అన్లాక్ 3.0 ప్రక్రియ లోనూ విద్యాసంస్థల్ని తెరిచేందుకు మోక్షం కలగలేదు. కరోనా విజృంభణతో ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించట్లేదు. దీంతో విద్యార్థులు దారిమళ్లకుండా ఉండేందుకు బోధన, అభ్యసన కార్యక్రమాలను కొనసాగించాలని గురుకుల విద్యాసంస్థల సొసైటీలు భావిస్తున్నాయి. ఇం దులో భాగంగా ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్లైన్ బోధన సాగుతోంది. ఈ క్రమంలో గురుకుల విద్యార్థులు చదువులో వెనుకబడకుండా వారికీ ఆన్లైన్ తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఇందుకు అవసరమైన స్మార్ట్ఫోన్లు పిల్లల వద్ద ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని భావిస్తున్న సొసైటీలు.. క్షేత్రస్థాయిలో ప్రిన్సిపాల్, టీచర్లకు బాధ్యతలు అప్పగించాయి. తమకందని మౌఖిక ఆదేశాల మేరకు వీరంతా సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. టెన్త్, ఇంటర్ సెకండియర్ వాళ్లకు.. ప్రస్తుతం గురుకుల సొసైటీలు పదోతరగతి, ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఇప్పటికే మహాత్మాజ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. టెన్త్, ఇంటర్ సెకండియర్ వాళ్లకు గత పక్షం రోజులుగా జూమ్, గూగుల్ మీటింగ్ యాప్ల్లో ఆన్లైన్ తరగతులు చెబుతున్నారు. ఇంటర్నెట్ ప్యాకేజీలను పరిశీలిస్తే.. అన్ని నెట్వర్క్ల్లో దాదాపు రోజుకు 1.5 జీబీ డాటా ఉంటుంది. దీంతో రెండు గంటల పాటు ఆన్లైన్ తరగతులు బోధిస్తే దాదాపు ఒక జీబీ డాటా వినియోగమవుతుంది. దీంతో మూడు తరగతులు మాత్రమే బోధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఉదయం రెండు, సాయంత్రం ఒక క్లాస్ ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇళ్లలో ఉన్న సమయాన్ని అంచనా వేసి ఇలా ఉదయం, సాయంత్రం తరగతులు చెబుతున్నామని, ఆన్లైన్ తరగతులను తను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ‘సాక్షి’కి చెప్పారు. 75 శాతం స్మార్ట్ఫోన్లే.. గురుకుల పాఠశాలల్లో ప్రతి తరగతిలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో గరిష్టంగా 40 మంది పిల్లలున్నారు. ఈ క్రమంలో ప్రతి సెక్షన్లో ఉన్న విద్యార్థులకు వ్యక్తిగతంగా ఫోన్లుచేసి వివరాలు సేకరించి ప్రత్యేక నమూనాలో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ పాఠశాలలు ఈ సమాచార సేకరణ పూర్తి చేశాయి. ప్రతి తరగతిలో గరిష్టంగా 75 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు లేదా అన్న, అక్కల్లో ఒకరు స్మార్ట్ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు. తరగతుల వారీగా పరిశీలిస్తే కొన్ని సెక్షన్లలోని విద్యార్థుల వద్ద నూరు శాతం స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. -
తల్లిదండ్రులకు ఐటీ నిపుణుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కనీస వయస్సు ఎనిదేళ్లు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్లను వినియోగించేందుకు ఇవ్వాలని ఐటీ కమ్యూనికేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రెండెళ్లు కూడా నిండని వారికి కూడా స్మార్ట్ఫోన్లు ఇచ్చి వారిని వ్యసన పరులుగా మారుస్తున్నారని, దీని ద్వారా వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బుధవారం జరిగిన ఓ సదస్సులో హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సైబ్- హర్ కార్యక్రమంలో భాగంగా ‘‘సాంకేతికతకు నేటి తరం పిల్లలు వ్యసన పరులవుతున్నారా’’ అనే అంశంపై ఇవాళ సాయంత్రం రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్లా స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భారతీయ సైనిక దళాలకు మీడియా శిక్షకురాలుగా ఉన్న జూహీకౌల్ ప్రధాన వక్తగా ప్రసంగించారు. ఈ సందర్బంగా జూహికౌల్ మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు అనివార్యమయ్యాయని అన్నారు. అయితే, కనీసం ఎనిమిదేళ్ల పైన వయస్సు ఉన్నపిల్లలకు మాత్రమే ఈ క్లాసులు వర్తింప చేయాలని ఆమె సూచించారు. పదేళ్ల లోపు పిల్లలకు రోజూ కనీసం ఒక గంటకన్నా ఎక్కువ సేపు ఈ ఆన్ లైన్ క్లాసులు ఉండొద్దని, ఈ వయస్సులో పిల్లలకు వివిధ అంశాలపై సహజంగా ఉండే ఆసక్తి, నిశిత పరిశీలన, ఇమాజినేషన్ లకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అధిక సమయం ప్రధానంగా అర్ద రాత్రివరకూ మొబైల్ ఫోన్లను ఉపయోగించడం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని వివరించారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయే విధంగా పేరెంట్స్ తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్, లాప్ టాప్ ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని సూచించారు. సోషల్ మీడియా పై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తీసుకురావోద్దని జూహీకౌల్ హెచ్చరించారు. టాబ్, మొబైల్, లాప్ టాప్ లలో అనవసరం , ఎప్పుడూ ఉపయోగించని యాప్ లను డిలీట్ చేయాలని అన్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందన్నారు. అనవసర యాప్లను తొలగించడంతో పాటు కేవలం విద్యా పరమైన అవసరాలకే ఇంటర్నెట్ ఉపయోగించడం, అధికంగా ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్ధమయ్యీట్టు చెప్పడం చేయాలని అన్నారు. ప్రతి రోజూ ఇంట్లోనే యోగా, సంగీత సాధన, వ్యాయామం చేయడం లాంటివి చేయించాలని ఆమె తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐడీ విభాగానికి చెందిన రవి కుమార్ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలి, నీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ తో పాటు ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడు వేలమంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఈ జూలైలో విడుదలయ్యే స్మార్ట్ఫోన్లు ఇవే.!
టెక్ ప్రపంచానికి ప్రతి ఏడాది ద్వితీయార్ధం ఎంతో కీలకమని చెప్పవచ్చు. ప్రతి ఏడాది ఆరంభంలో ఆవిష్కరించిన సాంకేతిక పరిఙ్ఙానాన్ని వాణిజ్య ఉత్పత్తుల రూపంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీలకు ఈ రెండోభాగం అత్యంత కీలకమైనదిగా టెక్ నిపుణులు భావిస్తారు. ఈ క్రమంలో దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీలైన వివో, రియల్మి, వన్ప్లస్ లాంటి దిగ్గజ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలు ఈ జూలైలో తమ స్మార్ట్ఫోన్ మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. 1. పోకో ఎం2 ప్రొ షియోమి అనుబంధ సంస్థ పోకో సంస్థ నేడు (జూలై 7న) పోకో ఎం2 ప్రొను భారత్లో విడుదల చేయనుంది. ఈ కొత్తఫోన్లను ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకొని అవకాశం కల్పించింది. ఈ ఫోన్ ధర రూ. 15వేల లోపు ఉండొచ్చు. ఈ మోడల్ రెడ్మీ నోట్ ప్రోకు రీబ్రాండ్ వర్షెన్గా ఉండొచ్చని భావిస్తున్నారు. డాట్ నాచ్ డిస్లే, క్వార్డ్ రేర్ కెమరాలు, స్నాప్డ్రాగ్ చిప్సెట్, 33వాట్ల ఫాస్ట్ ఛార్జర్తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఫీచర్లను కలిగి ఉంది. వీటితో పాటుగా 6జీబీ ర్యామ్, 5020ఎంఏహెచ్ బ్యాటరీ, 6.67 అంగుళాల డాట్ డిస్ప్లే తో పాటు ఎఫ్హెచ్డీప్లస్ రెసెల్యూషన్, 64మెగా ఫిక్చెల్ బ్యాక్ కెమెరా ఉండొచ్చు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ ను ఇందులో అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్తో ఎమ్ఐయూఐ 10 కవర్తో కూడి ఉండొచ్చు. 2. వన్ప్లస్ నోర్డ్ ఈ జూలైలో విడుదల కావచ్చు. వన్ప్లస్ 8 సీరీస్లో తదుపరి వర్షెన్గా ఈ మోడల్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు లాంచింగ్ తేది నిర్ణయించలేదు. అయితే ఈ వన్ప్లస్ నోర్డ్ స్మార్ట్ఫోన్ను మొదట భారత్, యూరప్, తర్వాత ఉత్తర అమెరికా లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. భారత్లో త్వరలో ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్లో ప్రీ-బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మోడల్ స్మార్ట్ఫోన్ ధర దాదాపు రూ.37వేలుగా ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనావేస్తున్నారు. 3. వివో ఎక్స్50 సీరీస్ వివో ఎక్స్50 సిరీస్లో భాగంగా ఇప్పటికే మేలో వివో ఎక్స్ 50 ప్రో చైనాలో విడుదలైంది. ఇప్పుడు ఇదే సీరీస్లోని తదుపరి మోడళ్లైన ఎక్స్50 ప్రో, వివో ఎక్స్50 ప్రో ప్లస్లను జూలై మధ్యభాగంలో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు వో ఎక్స్50 ప్రో విడుదల అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్50 ప్రో స్పెసిఫికేషన్లు పరిశీలిస్తే..., స్నాప్డ్రాగన్ 765జీ చిప్సెట్ ఉంది. 6.56 అంగుళాల పూర్తి హెడ్ ప్లస్ ప్లస్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. 4,135 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో ఉంది. 48 మెగా ఫిక్చెల్ సామర్థ్యంతో వెనుక వైపు గింబల్ కెమెరా ఉంది. ఈ గింబల్ కెమెరా ద్వారా ఫొటోలు తీస్తే కెమెరా షేక్ కారణంగా ఫొటోలు షేక్ అవ్వడం, బ్లర్ అవ్వడం ఉండవని వివో తెలిపింది. 4. ఒప్పో రెనో 4 ప్రో ఒప్పో గత నెలలో చైనాలో రెనో 4, రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. మనదేశంలో ఈ నెలలో ఒప్పో రెనో 4 ప్రో విడుదల కానుంది. అయితే మనదేశంలో లాంచ్ అయ్యే ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు చైనీస్ వేరియంట్ కంటే వేరుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్లో విడుదలయ్యే ఒప్పో రెనో 4 ప్రో స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే, రిఫ్రెష్ రేట్ వేరుగా ఉండనున్నాయి. డిస్ప్లే 120 హెర్ట్జ్ ఉండొచ్చు. చైనాలో లాంచ్ అయిన రెనో 4 ప్రోలో 90 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించగా, మనదేశంలో లాంచ్ కానున్న ఫోన్ లో 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఉండనున్నట్లు సమాచారం. 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765 5జీ ప్రాసెసర్ ను ఇందులో అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఇందులో అందుబాటులో ఉంది. 5. రియల్మి 6ఐ, రియల్మి సీ11 రియల్ కంపెనీ ఈ జూలైలో తన అధునాతన మోడళ్లు రియల్మి 6ఐ, రియల్మి సీ11 స్మార్ట్ఫోన్లను ఈ జూలైలో విడుదల చేయనుంది. ఈ మేలో యూరప్లో విడుదలైన రియల్మి 6ఎస్ మోడల్ ఫోన్కు రియల్మి 6ఐ సరికొత్త వర్షెన్గా ఉండొచ్చు. మీడియాటెక్ హెలియో జీ90టీ ప్రాసెసర్ను కలిగి ఉంది. 90 హెర్ట్జ్ డిస్ ప్లే, క్వాడ్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీంతోపాటు రియల్ మీ 6ఐ స్మార్ట్ ఫోన్ లో 30వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,990గా ఉండవచ్చు అని తెలుస్తోంది. ఇక రియల్మి సి11 స్పెషిఫికేషన్లను పరిశీలిస్తే.., మీడియాటెక్ హెలియో జీ35 చిప్సెట్ ప్రాసెసర్ను కలిగి ఉంది. 5000 ఎమ్హెచ్ఏ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండొచ్చు. 13 మెగా ఫిక్చెల్ డ్యూయెల్ కెమెరా సెట్అప్ కలిగి ఉండొచ్చు. -
గర్భం దాల్చే విషయంలో వారి నిర్ణయం కూడా..
న్యూఢిల్లీ: వెనుకబడిన దేశాల్లోని మహిళలకు మొబైల్ ఫోన్లు అందించడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవచ్చని మెక్గిల్ యూనివర్సిటీ(కెనడా), యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్(ఇంగ్లండ్), బొకోని యూనివర్సిటీ(ఇటలీ) పరిశోధకులు అభిప్రాయపడ్డారు. స్మార్ట్ఫోన్ల వాడకం మహిళా సాధికారికతకు దోహదపడుతుందని.. సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. లింగ వివక్ష, వ్యక్తిగత శుభ్రత, గర్భనిరోధక విధానాలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అభివృద్ధి పరంగా వెనుకబడిన దేశాలైన అంగోలా, బురుండి, ఇథియోపియా, మలావీ, టాంజానియా, ఉగాండ, జింబాబ్వే తదితర దేశాల్లో దాదాపు లక్ష మంది మహిళల అభిప్రాయాలను సేకరించి ఈ మేరకు విశ్లేషించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను ప్రఖ్యాత ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్’ జర్నల్లో పొందుపరిచారు. ఈ మార్పు హర్షణీయం ఈ నేపథ్యంలో ఉప సహారా దేశాల్లోని ఫోన్ వాడుతున్న మహిళలు మిగతా మహిళలతో పోలిస్తే, గర్భం దాల్చే విషయంలో భాగస్వామితో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం 1 శాతం ఎక్కువగా ఉందని తేలిందన్నారు. అదే విధంగా 2 శాతం మంది అవాంఛిత గర్భనిరోధక విధానాలు, 3 శాతం మంది హెచ్ఐవీ టెస్టు ఎలా చేయించుకోవాలన్న విషయాలపై ఫోన్ల వాడకం ద్వారా అవగాహన పొందుతున్నారని తెలిపారు. అదే విధంగా కుటుంబ వ్యవహారాల్లో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.(మీ ముద్దు మాకొద్దు) ముఖ్యంగా ఐసోలేటెడ్ ఏరియాల్లో నివసిస్తున్న పేద మహిళల్లో ఈ మేరకు మార్పు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక విషయం గురించి పరిశోధక బృందంలో ఒకరైన ప్రొఫెసర్ లుకా మారియా పెసాండో మాట్లాడుతూ.. ‘‘విద్యా సంస్థల స్థాపన- విస్తరణ, ఆర్థిక పురోగతికై చర్యలు తదితర అంశాలతో పాటుగా వెనుక బడిన దేశాల్లో మొబైల్ ఫోన్లు, సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని మా పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. ఆ విషయంలో కాస్త వెనుకబడే ఉన్నారు ఇదిలా ఉండగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొబైల్ నెట్వర్క్ల విస్తరణ పెరుగుతున్పప్పటికీ పురుషులతో పోలిస్తే.. సొంతంగా ఫోన్లు కలిగి ఉన్న మహిళలు తక్కువ మందే ఉన్నారని పరిశోధన బృందం పేర్కొంది. కొంతమంది మహిళల చేతిలో ఫోన్ ఉన్నా దానిని ఎలా వినియోగించాలో తెలియక తికమక పడుతున్నారని, మగవారితో పోలిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కాస్త వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడింది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ : అదిరిపోయే డీల్స్
సాక్షి, ముంబై : ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ విక్రయాలను ప్రారంభించింది. నేటి (మంగళవారం) నుంచి ఈ నెల 27వ తేదీ వరకు స్పెషల్ సేల్ కొనసాగనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అనేక ఆఫర్లను అందిస్తోంది. ఈ ఐదు రోజుల అమ్మకాల్లో వివిధ ఉత్పత్తులపై 'అత్యల్ప ధరలను' అందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్, ఆపిల్ ఐ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీలను తగ్గింపు ధరలకు అందిస్తోంది. అలాగే క్రెడిట్ , డెబిట్ కార్డుదారులకు 10 శాతం తక్షణ తగ్గింపును అందించేందుకు ఫ్లిప్కార్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో జతకట్టింది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయన్ని కూడా అందిస్తోంది. ల్యాప్టాప్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఇంకా ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్, బ్లూటూత్ ఇయర్ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, ఐప్యాడ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్వాచ్లు తదితర ఉత్పత్తులపై కస్టమర్లు రాయితీలు, ఆఫర్లను పొందవచ్చు. సోనీ బ్రావియా 65 అంగుళాల 4 కె స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 63 శాతం తగ్గింపుతో 97,999 రూపాయలకే లభ్యం (ఎంఆర్పి 2,64,900 రూపాయలు). హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. పాత టీవీ మార్పిడి ద్వారా మరో 7,000 రూపాయలు తగ్గింపు. ఐఫోన్ ఎక్స్ ఎస్ 64జీబీ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ 64 జీబీ 58,999కే లభ్యం. అసలు ధర 62,999 రూపాయలు. పాత స్మార్ట్ఫోన్ను మార్చుకుంటే అదనపు తక్షణ తగ్గింపుగా 13,950 రూపాయలు. వివో జెడ్ 1 ఎక్స్ వివో జెడ్ 1 ఎక్స్ (8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) 16,990 రూపాయలు (ఎంఆర్పి 24,990 రూపాయలు) పాత స్మార్ట్ఫోన్ను మార్పిడి చేసుకుంటే అదనపు డిస్కౌంట్గా 13,950 రూపాయలు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులు 10 శాతం అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. గూగుల్ పిక్సెల్ 3 ఏ ధర : 29,999 రూపాయలు. (ఎంఆర్పి రూ .39,999) శాంసంగ్ గెలాక్సీ ఏ80 (8జీబీ+128జీబీ స్టోరేజ్) రూ.30వేల తగ్గింపు ధరతో 21,999 రూపాయలకు లభ్యం సాన్సుయ్ 55 అంగుళాల 4 కె క్యూఎల్ఇడి స్మార్ట్ టీవీ ధర 42,999 రూపాయలు. (ఎంఆర్పి 72,590 రూపాయలు). పాత టీవీని మార్పిడి చేసినప్పుడు 7,000 రూపాయలు డిస్కౌంట్ కానన్ ఇఓఎస్ 3000 డి డిఎస్ఎల్ఆర్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో 18,999 రూపాయలు. (ఎంఆర్పి 29,495 రూపాయలు) -
గెలాక్సీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింది : క్యాష్బ్యాక్ కూడా
సాక్షి, ముంబై : ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ధరలను తగ్గించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ధరపై నాలుగువేల రూపాయల శాశ్వత తగ్గింపుతో అందుబాటులో ఉంచింది. దీనికి అదనంగా క్యాష్బ్యాక్ ఆఫర్ను కూడా అందిస్తోంది. ఆన్లైన్ సైట్లలో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని ముంబైలోని మహేష్ టెలికాంకు చెందిన మనీష్ ఖాత్రి ట్విటర్లో ధృవీకరించారు. (వాట్సాప్లో ఎర్రర్ : యూజర్లు గగ్గోలు) మొబైల్ ఫోన్లపై 12 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ రేట్ల పెంపుతో దక్షిణ కొరియా దిగ్గజం గెలాక్సీ నోట్ 10లైట్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ మార్కెటో 4 వేల రూపాయల ధర తగ్గించడంతో పాటు, అదనపు ఆఫర్లను అందించడం విశేషం. సిటీబ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా గెలాక్సీ నోట్ 10 లైట్ను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 5000 క్యాష్బ్యాక్ లభ్యం. మిగిలిన ఆన్లైన్ చెల్లింపులపై 2000 రూపాయల క్యాష్ బ్యాక్ అందివ్వనుంది. (శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్) కొనుగోలుదారులు 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్, 2 నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు జూన్ 30, 2020వరకు మాత్రమే చెల్లుతాయి. ఈ మోడల్స్ ధరలు ఇప్పటివరకు వరుసగా 41,999 రూపాయలు, 43,999 రూపాయలుగా ఉన్నాయి. జనవరిలో భారతదేశంలో లాంచ్ చేసినపుడు గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రారంభ ధర 38999 రూపాయలు. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ ప్రస్తుత ధరలు 6 జీబీ వేరియంట్ ధర 37,999 రూపాయలు 8 జీబీ మోడల్ ధర 39,999 రూపాయలు గెలాక్సీ నోట్ 10 లైట్ స్పెసిఫికేషన్లు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9810 సాక్ 6జీబీ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 12+ 12+12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
పేటీఎం మాల్ సరికొత్త వ్యూహం..
బెంగుళూరు: కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాపార వృద్ధికి కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందులో భాగంగా భారత ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ పీటీఎం మాల్ త్వరలో గ్రోసరీ మార్కెట్(సూపర్ మార్కెట్)రంగంలో ప్రవేశించనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రామాణికమైన స్థానిక వ్యాపారులతో (కిరాణా దుకాణాల) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పేటీఎం మాల్లో గ్రోసరీ మార్కెట్తో పాటు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్స్ తదితర వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఆన్లైన్ టూ ఆప్లైన్ అన్ని రకాలుగా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ఈ మాల్ సేవలందించనుంది. కాగా వస్తువుల పంపిణీకి లాజిస్టిక్స్ వ్యాపారులను(గిడ్డంగులు, ప్యాకేజింగ్) సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అయితే ఫార్మా రంగానికి చెందిన మందుల పంపిణీలో సంక్లిష్టత కారణంగా ఈ రంగంలో ప్రవేశించడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం పేటీఎమ్ మాల్ స్థానిక కిరాణా, మధ్యస్థాయి దుకాణాదారుల సమన్వయంతో వినియోగదారులను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తోంది. సంస్థ వృద్ధి చెందేందుకు సరికొత్త వ్యూహాన్ని రచిస్తుంది. పేటీఎం సంస్థ లాక్డౌన్ కారణంగా కేంద్ర కార్యాలయాన్ని బెంగుళూరుకు మార్చింది. త్వరలో ప్రారంభించబోయే పేటీఎం మాల్గ్రోసరీ మార్కెట్)ను పరుగులు పెట్టించేందుకు 10,000 కిరాణా స్టోర్స్, చిన్న మధ్య స్థాయి దుకాణాదారులతో ఒప్పందం కుదుర్చుకోనుంది. కాగా, గ్రోసరీ మార్కెట్లో వృద్ధి చెందేందుకు గ్రోఫర్స్, మిల్క్ బాస్కెట్ తదితర ఆన్లైన్ సంస్థల భాగస్వామ్యంతో పేటీఎం సంస్థ పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లాక్డౌన్ ప్రభావం వల్ల గ్రోసరీ మార్కెట్ వైపు ఈకామర్స్ కంపెనీలు దృష్టి సారించాయి. ఇదే బాటలో దిగ్గజ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ గ్రోసరీ మార్కెట్ వైపు దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. (చదవండి: వ్యాపారుల కోసం పేటీఎం ఆల్–ఇన్–వన్ క్యూఆర్) -
‘వాయువేగంతో పోకో స్మార్ట్ఫోన్ సేవలు’
ముంబై: మొబైల్ దిగ్గజం రియల్మీ జూన్ 25న ఎక్స్3 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. అయితే మరోవైపు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో (స్మార్ట్ ఫోన్)ఇండియా జనరల్ మేనేజర్ సీ.మన్మోహన్ మాత్రం రిలయ్మీ ఎక్స్3 స్మార్ట్ ఫోన్ను క్రీప్(నెమ్మదైన ఫోన్గా) అభివర్ణించాడు. ట్టిటర్లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సీ. మన్మోహన్ స్పందిస్తూ.. వాయు వేగంతో సేవలందించే పోకో ఎక్స్ 2 స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉండగా, మీరెందుకు రియల్మీ ఎక్స్2, ఎక్స్3 లాంటి నెమ్మదైన ఫోన్లను వాడడానికి ప్రయత్నిస్తారని యూజర్ను ప్రశ్నించారు. మరోవైపు పోకో మేనేజర్ గతంలో కూడా రియల్ మీ లాంచ్ చేసిన ఎక్స్ 50పప్రో (5జీ స్మార్ట్ఫోన్) నెట్వర్క్సేవలందించే ఫోన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ దేశంలో ప్రస్తుతం 5జీ సేవలను ప్రజలు కోరుకోవడం లేదని, ప్రజలు కోరుకునే అన్ని సేవలను పోకో స్మార్ట్ఫోన్ అందిస్తుందని తెలిపారు. -
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సిరీస్ : భారీ ఆఫర్లు
సాక్షి, ముంబై: లాక్ డౌన్ సడలింపులతో ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్ లైన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత ప్రముఖ మొబైల్ తయారీదారు శాంసంగ్ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించింది. లాక్డౌన్ తర్వాత స్మార్ట్ఫోన్ విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్20 సిరీస్ స్మార్ట్ఫోన్ల ప్రీ బుకింగ్స్పై ఇ-వోచర్ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. పరిమిత కాల ఆఫర్ రూ.4 వేల విలువ చేసే వోచర్ అందిస్తున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. భారత్లో గెలాక్సీ ఎస్20 సిరీస్ కోసం శాంసంగ్ ప్రీబుకింగ్స్ ప్రారంభించిన సందర్బంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్ అందుబాటులో వుంచింది. ఈ వోచర్లను శాంసంగ్ అధికారిక వెబ్సైట్ శామ్సంగ్.కామ్లో లభించే ఇతర గెలాక్సీ ఉత్పత్తుల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. ఈ నెల (మే) 20 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో వుంటుంది. గెలాక్సీఎస్ 20 ఫోన్లను ప్రీ-బుక్ చేసుకునే కొత్త వినియోగదారులందరికీ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ను భారీ తగ్గింపుతో అందిస్తోంది. గెలాక్సీ ఎస్ 20ప్లస్, ఎస్ 20 అల్ట్రా ప్రీ-బుకింగ్ చేసుకునే వినియోగదారులకు రూ.11,990 విలువైన గెలాక్సీ బడ్స్ ప్లస్ను కేవలం రూ.1,999కే పొందవచ్చు. అలాగే గెలాక్సీ ఎస్ 20 ప్రీ-బుకింగ్ వినియోగదారులు గెలాక్సీ బడ్స్ ప్లస్ ను రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ను జూన్ 15 లోపు మాత్రమే రిడీమ్ చేసుకోవాల్సి వుంటుంది. వీటితోపాటు కొనుగోలుదారులకు శాంసంగ్ కేర్ + రూ .3,999 విలువైన 1,999 లాంటి ఆఫర్లను శాంసంగ్ ప్రకటించింది. జూన్ 15 వరకు రిడీమ్ చేసుకునేలా అనేక ఇతర ఆఫర్లను శాంసంగ్ ప్రకటించింది. ‘గెలాక్సీ ఎస్ 20’ని ప్రీ-బుక్ చేసుకునే వినియోగదారులు అప్గ్రేడ్ ఆఫర్తో అదనంగా రూ. 5000 బోనస్ అందిస్తోంది. ‘గెలాక్సీ ఎస్ 20’, ‘గెలాక్సీ ఎస్ 20 ప్లస్’, ‘గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా’ ప్రీ-బుకింగ్లో ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాదు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై రూ.6 వేల క్యాష్బ్యాక్ కూడా లభ్యం. గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా 6.9 అంగుళాల భారీ డిస్ ప్లే, 1440x3200 పిక్సెల్స్ రిజల్యూషన్ (ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోలెడ్ స్క్రీన్) ,108 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్,48 ఎంపీ టెలిఫోటో, 12 ఎంపీ అల్ట్రావైడ్ టోఫ్ లెన్స్ రియర్ కెమెరా, 40 ఎంపీ సెల్పీ కెమెరా లను అమర్చింది. ముఖ్యంగా ఈ కెమెరాల్లో 100ఎక్స్ సూపర్ రిజల్యూషన్ జూమ్, ఇంకా 5జీ, ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
ఇకపై ఆ యాప్లో రిజిస్టర్ అయ్యాకే..
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్-19)పై సమగ్ర సమాచారమిచ్చే ఆరోగ్య సేతు యాప్ ఇకపై అన్ని స్మార్ట్ ఫోన్లలో కచ్చితంగా ఉండనుంది. ఫోన్ను అమ్మడానికి ముందే ఆ యాప్ను అన్ని స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయడంతో పాటు, ఆ యాప్లో రిజిస్టర్ చేసుకున్నాకే వినియోగదారుడు ఆ ఫోన్ను వాడేలా చూడాలని కేంద్రం ఆదేశాలు జారీకి సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి టెలికం సంస్థలతో సంప్రదింపులు జరిపేందుకు ఒక నోడల్ ఏజెన్సీని కూడా నియమించాలనుకుంటోందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. (ఆరోగ్య సేతు అడ్డుపెట్టి కరోనా ఆపగలమా?) కాగా కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం లాక్డౌన్ కాలంలో మినహాయింపు రంగాలతో పాటు లాక్డౌన్ తర్వాత పనిచేసే అన్ని రంగాల్లో ఆరోగ్య సేతు యాప్ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. (ప్రతి ఉద్యోగి చేతిలో ఆరోగ్యసేతు) కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పలు రకాల ప్రశ్నలకు అందులో సమాధానాలు ఎంట్రీ చేయాలి. కరోనా వైరస్ వ్యాప్తి, సంబంధీకులతో మనం కనెక్ట్ అయ్యామా? విదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చామా, కరోనా వైరస్ సోకే లక్షణాలేమైనా ఉన్నాయా అనే రీతిలో ప్రశ్నలకు జవాబులు రాయాలి. వీటి ఆధారంగా మన ఆరోగ్య పరిస్థితి ఈ యాప్లో రికార్డవుతుంది. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ఈ యాప్ సూచిస్తుంది. మన చుట్టుప్రక్కల ఎవరైనా కరోనా రోగులుంటే అలర్ట్ చేస్తుంది. ఇందుకు జీపీఎస్ను ఆన్లో ఉంచాలి. ప్రస్తుతం ఆరోగ్య వివరాలను ఒకసారి మాత్రమే ఎంట్రీ చేయాల్సి ఉండగా..త్వరలో మరింత అప్డేట్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. (సొంతూరికి దారేది?) -
మొబైల్స్ లక్ష్యంగా సైబర్ క్రైమ్స్
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలంలో సైబర్ నేరస్తుల దృష్టి స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై పడింది. లాక్ డౌన్ వల్ల అత్యధికులు స్మార్ట్ఫోన్స్ ద్వారానే ఇంటర్నెట్ను వినియోగిస్తున్న నేపథ్యంలో స్పైవేర్, రాన్సమ్వేర్ల ప్రమాదం వారికి పొంచి ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్–ఇన్)’ హెచ్చరించింది. వినియోగదారుడి ముఖ్యమైన వ్యక్తిగత డేటాను స్పైవేర్ సంగ్రహిస్తుంది. లాగిన్ వివరాల వంటి కీలక రహస్యాలను రాన్సమ్వేర్ తన అధీనంలోకి తీసుకుంటుంది. ఆ తరువాత యూజర్ నుంచి డబ్బు డిమాండ్ చేసి, ఆన్లైన్లో ఆ డబ్బు అందిన తరువాత అవి ఆ వివరాలను విడుదల చేస్తాయి. వ్యక్తిగత ఫోన్లను ఈ ప్రమాదాల నుంచి తప్పించేందుకు సెర్ట్–ఇన్ పలు సూచనలను ఇచ్చింది. అవి... 1) మొబైల్ పరికరణాలు, యాప్స్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఫోన్లోని వ్యక్తిగత డేటాను జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. 2) ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. ఓఎస్ను అందించే సంస్థలు కొన్ని అదనపు సెక్యూరిటీ ఆప్షన్స్ కూడా యూజర్స్కు అందుబాటులో ఉంచుతుంటాయి. 3) ఉపయోగించని యాప్స్ను తొలగించాలి. 4) అధికారిక యాప్ స్టోర్స్ నుంచే యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి. 5) ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఇతర యాప్స్లోకి సైన్ ఇన్ కావడంపై అప్రమత్తంగా ఉండండి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో అనుసంధానమైన యాప్స్ మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆయా సైట్ల నుంచి తీసుకునే ప్రమాదముంది. అలాగే, ఆయా యాప్స్ నుంచి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు కూడా మీ సమాచారాన్ని సంగ్రహించవచ్చు. 6) ఎస్ఎంఎస్, ఈ మెయిల్ ద్వారా వచ్చే లింక్స్ను ఓపెన్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియని సోర్స్ల ద్వారా ఆ లింక్స్ వస్తే వాటిని ఓపెన్ చేయకండి. 7) పాస్వర్డ్స్ను సేవ్ చేసుకోవాలని కొన్ని యాప్స్ కోరుతుంటాయి. అలా సేవ్ చేసుకోవడం అంత సురక్షితం కాదు. ఒకవేళ ఫోన్ పోతే, మీ వివరాలన్నీ బహిర్గతం అయ్యే ప్రమాదముంది. 8) పబ్లిక్ వైఫై నెట్వర్క్ను వాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పబ్లిక్ వైఫై వాడాల్సి వస్తే.. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసే యాప్స్ను ఓపెన్ చేయకండి. అలాగే, మీ ఫోన్లోని బ్లూటూత్ను అనవసరంగా ఆన్లో ఉంచకండి. 9) మొబైల్ డివైజ్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సెట్టింగ్స్ను మార్చకండి. 10) మీ నియంత్రణ లేని కంప్యూటర్ లేదా చార్జింగ్ స్టేషన్ ద్వారా ఫోన్ ను చార్జింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండండి. -
స్మార్ట్ఫోన్కు ‘కరోనా’ ముప్పు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కట్టడి కోసం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో దేశీ స్మార్ట్ఫోన్స్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోనుంది. ఇది సుమారు 2 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చని కౌంటర్పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్లో విక్రయాలు గణనీయంగా మందగించడం ఇందుకు కారణంగా ఉంటుందని పేర్కొంది. మార్చి మధ్య దాకా కరోనా మహమ్మారి ప్రభావం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత విజృంభిస్తుండటంతో లాక్డౌన్ అనివార్యమైందని వివరించింది. దీని ఫలితంగా 2020లో స్మార్ట్ఫోన్ల విక్రయం గతేడాది నమోదైన 15.8 కోట్లతో పోలిస్తే 3 శాతం తగ్గి 15.3 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే మార్చిలో 27 శాతం తగ్గనుండగా, ఏప్రిల్ 14 దాకా లాక్డౌన్ కొనసాగితే ఈ నెలలో దాదాపు 60 శాతం తగ్గుదల నమోదు కావొచ్చని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారికి మూలకేంద్రమైన చైనా నుంచి విడిభాగాల సరఫరా దెబ్బతినడం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు తీవ్రంగా ఇబ్బందిపడ్డాయి. లాక్డౌన్ పెంచితే మరింతగా నష్టాలు.. ఒకవేళ లాక్డౌన్ను పొడిగించిన పక్షంలో నష్టాలు మరింత పెరగవచ్చని పాఠక్ చెప్పారు. మొత్తం సరఫరా వ్యవస్థ, ఆదాయాలు, చెల్లింపులు మొదలైనవన్నీ దెబ్బతినడమే ఇందుకు కారణమన్నారు. పైపెచ్చు వినియోగదారులు ఎక్కువగా పొదుపునకు ప్రాధాన్యమిచ్చి, కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం వల్ల డిమాండ్ పడిపోవచ్చని పాఠక్ వివరించారు. భారత్ను ఎగుమతుల హబ్గా చేసుకున్న ఫ్యాక్టరీలపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే, పరిస్థితి మెరుగైతే ఉత్పత్తిని వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఫ్యాక్టరీలు.. ఉద్యోగాల్లో కోతలు విధించడానికి మొగ్గు చూపకపోవచ్చన్నారు. పండుగల సీజన్ దాకా ఇంతే.. ఈ ఏడాది ద్వితీయార్థానికి గానీ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఉండకపోవచ్చని పాఠక్ చెప్పారు. ‘ఈ ఏడాది మధ్య నాటికి పరిస్థితి మెరుగుపడినా కూడా.. పండుగల సీజన్ దాకా వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి సాధారణ స్థాయికి తిరిగొస్తే .. ఆన్లైన్ విక్రయాలూ మెరుగుపడొచ్చన్నారు. ఆఫ్లైన్ విక్రేతలకు ఆకర్షణీయ ఆఫర్లివ్వడంతో పాటు ఆన్లైన్లోనూ స్టాక్స్ సత్వరం అందుబాటులో ఉంచేందుకు స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తాయని చెప్పారు. -
హానర్ కొత్త ఫోన్ ‘30ఎస్’
బీజింగ్: చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు హానర్ సంస్థ తన 30 సిరీస్లో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. 30ఎస్ పేరుతో తయారు చేసిన ఈ స్మార్ట్ఫోన్లో అత్యధునిక ఫీచర్లు పొందుపరిచారు. కిరిన్ 820 ప్రాసెసర్ 5జీ చిప్సెట్ కలిగిన మొదటి హానర్ ఫోన్ ఇదే. 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ+ఐపీఎస్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్లో నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్పీ కెమెరా ఒకటే ఉంది. 8జీబీ, 128 జీబీ, 8జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ను చైనాలో ప్రీఆర్డర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 7న నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. నలుపు, ఆకుపచ్చ, తెలుగు రంగుల్లో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్ 10 ఓఎస్తో పనిచేసే ఈ ఫోన్ హువాయ్ మొబైల్ సర్వీసెస్(హెచ్ఎంఎస్)పై ఆధారపడుతుంది. ఇందులో గూగుల్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ప్లేస్టోర్ యాప్ ఉండదు. 30 ఎస్ ఫీచర్లు 6.5 అంగుళాల ఫుల్హెచ్డి, ఫుల్వ్యూ డిస్ప్లే కిరిన్ 820 చిప్సెట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ 64+8+8+8 ఎంపీ కెమెరాలు 16 ఎంపీ సెల్ఫీకెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర రూ. 25,500 8జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ ధర రూ. 29,000 -
స్మార్ట్గా వ్యభిచారం.. కాలేజీ యువతులు కూడా!
సాక్షి, పలమనేరు : నియోజకవర్గంలో హైటెక్ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచివారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు భోగట్టా. తొలుత సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి వారిని దించుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూస్తే తప్ప అసలు విషయం ఎవరికీ తెలియకుండా సాగుతోంది. తాజాగా నియోజకవర్గంలోని వీకోట పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యభిచార ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో మూలాలు పలమనేరు, కేజీఎఫ్, బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. తొలుత సోషల్ మీడియా ద్వారా..... ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ అవసరంగా మారింది. వయసుతో తేడా లేకుండా ఫేస్బుక్, టిక్టాక్, హలో, వాట్సాప్ వాడుతున్నారు. ఇందులోని మహిళలు, అమ్మాయిలతో కొందరు వ్యభిచార నిర్వాహకులు ఫ్రెండ్ షిప్ చేసుకుని చాటింగ్లు మొదలు పెడుతున్నారు. వీరితో పరిచయం పెరిగి కాల్స్, లైవ్ కాల్స్కు చేరుతోంది. వారి వ్యక్తిగత వివరాలే కాకుండా ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి ఉపాధి ఉద్యోగాల పేరిట తొలుత బుట్టలో వేసుకోవడం జరుగుతోంది. ఇంకొందరు స్థానికంగా ఉద్యోగాలు ఉన్నాయంటూ సంప్రదించాలని వల వేయడం సాగుతోంది. స్థానికంగా ఉన్న అమ్మాయిలు, మహిళలను ఇళ్లకు పిలిపించుకోవడం.. వారికి అండగా ఉంటామంటూ నమ్మకాన్ని కల్పిస్తున్నారు. మెల్లమెల్లగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు మళ్లీ బయటకు రావడం కష్టమే. ఆపై డేటింగ్ యాప్లలోకి... వ్యభిచార కూపంలోకి దించిన యువతులను డేటింగ్ యాప్లోకి అడ్మిట్ చేయిస్తారు. డేటింగ్ యాప్స్లో ముఖ్యమైన ఇన్స్ట్ర్రాగం, ఊ ది డేటింగ్ యాప్( రెడీ టూ మీట్ న్యూగర్ల్స్ ఫ్రం యువర్ ఏరియా), జస్ట్ ఫ్రెండ్స్, క్వాక్ క్వాక్, వీ మేట్, జిల్, స్నాప్చాట్, విగో, టిండర్, క్రస్లాంటి వాటిలోకి వెళితే వందలు కాదు వేలాదిమంది స్నేహితులుగా మారుతారు. ఇందులో నియర్ బై అనే ఆప్షన్ ద్వారా ఈ ప్రాంతంలోకి వారిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా లైవ్ కాల్స్ నుంచి డైరెక్ట్గా మీటింగులు జరుగుతుంటాయి. కళాశాల విద్యార్థినులు, ఒంటరి మహిళలు సైతం.. వ్యభిచార ఊబిలో పడిన వారిలో కళాశాల విద్యార్థినులు, బాలికలు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఆర్థిక అవసరాలు, విలాసాల కోసం జీవితాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో నిర్వాహకులు పెరుగుతూనే ఉన్నారు. పలమనేరులోని గంటావూరు, వీకోట, కర్ణాటకలోని కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన పలువురు వ్యభిచార నిర్వాహకులు రింగుగా ఏర్పడి విటులను స్మార్ట్ ఫోన్ల ద్వారా బుక్ చేస్తున్నట్టు సమాచారం. విటులు సైతం నిర్వాహకుల ఖాతాలకు గూగూల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు అన్నీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని లాడ్జిలు, అద్దె ఇళ్లు వ్యభిచారానికి అడ్డాలు నియోజకవర్గంలోని కొన్ని లాడ్జిలు, పట్టణాల్లోని అవాసప్రాంతాల్లోని ఖరీదైన ఇళ్లు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వస్తుంటారని, ఇక లాడ్జిల్లో ప్రత్యేక గదులే ఉన్నాయని సమాచారం. విటుల వద్దకు అమ్మాయిలను చేర్చేందుకు పట్టణంలోని కొందరు అద్దెకు కార్లను సైతం సిద్ధం చేస్తుంటారట. ఈ వ్యవహారంలో సూత్రధారులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వ్యభిచార నిర్వాహకుల ధనాశకు ఎందరో మహిళలు, యువతులు, విద్యార్థినుల జీవితాలు నాశనమవుతున్నా యి. ఇప్పటికైనా సంబంధిత ప్రాంతాల్లోని పోలీసులు దీనిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. -
అమెరికానే దాటేశాం..!
న్యూఢిల్లీ: భారత్లో స్మార్ట్ఫోన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్గా అవతరించింది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2019వ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలోభారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో 27శాతం మార్కెట్ షేర్తో షియోమీ మొదటి స్థానంలో నిలవగా, వివో 21 శాతం వాటాతో శాంసంగ్ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక శాంసంగ్ 19 శాతం వాటాతో 3వ స్థానానికి పడిపోయింది. అలాగే 12శాతం మార్కెట్తో ఒప్పో, 8 శాతం మార్కెట్ షేర్తో రియల్మీలు 4, 5వ స్థానాల్లో నిలిచాయి. కాగా కౌంటర్ పాయింట్ రీసెర్చి ప్రకారం గడిచిన నాలుగేళ్ల కాలంలో వివో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టడంలో ఇతర మొబైల్ తయారీ కంపెనీల కన్నా ముందుందని వెల్లడైంది. అలాగే రూ.15వేల నుంచి రూ.20వేల సెజ్మెంట్లో ఫోన్లను తయారు చేయడంలో వివో విజయవంతమైందని, ఆయా ఫోన్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయని తేలింది. -
అమెజాన్ సేల్ : వాటిపై అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్లో మరోసారి తగ్గింపుధరలు, ఆఫర్ల పండుగ మొదలైంది. గణతంత్ర దినోత్సవం (రిప్లబిక్ డే) అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్-2020 పేరుతో స్పెషల్ విక్రయాలను చేపట్టింది. జనవరి 22 వరకు కొనసాగే సేల్ ఈ రోజు (శనివారం) అర్థరాత్రి నుంచే ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి తేనుంది. ప్రధానంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లతోపాటు, పలురకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ప్రకటించింది. స్మార్ట్ఫోన్లపై 40శాతం దాకా, ల్యాప్ట్యాప్లు, కెమెరాలపై 60 శాతం తగ్గింపు లభించనుంది. దీంతో ల్యాప్టాప్లపై రూ.35వేల దాకా, కెమెరాలపై రూ. 10,000 వరకూ ప్రత్యేక తగ్గింపు లభించనుంది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కూడా అదనం. వన్ప్లస్ 7టీ, వన్ఫ్లస్ 7టీ ప్రొ, రెడ్మినోట్ 8 ప్రొ, ఒప్పో ఎఫ్ 11 వివో యూ 20లపై ఈ తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఒప్పో ఎఫ్ 11 భారీగా పదివేల దాకా డిస్కౌంట్ ధరలో లభించనుంది. ప్రస్తుత సేల్లో ఈ స్మార్ట్ ఫోన్ను రూ. 13,990 కే కొనుగోలు చేయవచ్చు. -
మీ మొబైల్ కొద్దిసేపు స్విచాఫ్ చేయండి..!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత అనుబంధాలపై అది చూపిస్తున్న ప్రభావాన్ని ‘స్విచాఫ్’ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వివో తెలియజేస్తోంది. తన బ్రాండ్ అంబాసిడర్ అమీర్ఖాన్తో కలసి ఈ కార్యక్రమాన్ని సంస్థ ఆరంభించింది. తమ మొబైల్ ఫోన్లను కొంత సమయం పాటు స్విచాఫ్ చేసి కుటుంబం, స్నేహితులతో గడపడంలో ఉన్న ఆనందాన్ని ఈ సంస్థ తన కార్యక్రమం ద్వారా భారతీయ వినియోగదారులకు తెలియజేయనుంది. ఇటీవలే వివో సంస్థ, సీఎంఆర్ భాగస్వామ్యంతో మానవ సంబంధాలపై స్మార్ట్ఫోన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. స్మార్ట్ఫోన్ వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 75 శాతం మంది తాము యుక్త వయసు నుంచే స్మార్ట్ఫోన్ను వినియోగిస్తున్నట్టు చెప్పగా.. ఇందులోనూ 41 శాతం మంది హైస్కూల్ దశ నుంచే వాడుతున్నట్టు చెప్పడం గమనార్హం. ‘‘తమ స్మార్ట్ పరికరాలకు అతుక్కుపోవడం వల్ల కుటుంబం, స్నేహితులతో వెచ్చించే సమయం గణనీయంగా తగ్గిపోతోంది. దీర్ఘకాలంలో ఈ చెడు అలవాటు ఒంటరితనానికి, ఒత్తిడికి దారితీస్తుంది. దీనికి తక్షణ చికిత్సల్లా అవసరమైనంత వరకు సమతులంగా వినియోగించుకోవాలి’’ అని మ్యాక్స్ క్యూర్ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన మానసిక వైద్య విభాగం హెడ్ డాక్టర్ సమీర్ మల్హోత్రా తెలిపారు. -
ఫ్లిప్కా(స్టా)ర్ట్ సేల్, కొత్త ఏడాది ఆఫర్లు
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ న్యూ ఇయర్ సేల్ను ప్రకటించింది. ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ పేరుతో స్మార్ట్ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. అలా 2020 ఏడాదిలో తొలి సేల్ను ప్రారంభించింది. జనవరి 1 అర్థరాత్రి ప్రారంభమైన మూడు రోజుల సేల్లో వివిధ రకాల ఉత్పత్తులపై స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రియల్మీ ఎక్స్ 2, రెడ్మి నోట్ 7 ప్రో వంటి స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, అదనపు డిస్కౌంట్లను అందించడానికి బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఫ్లిప్కార్ట్. ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం మినహాయింపుతో పాటు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. స్మార్ట్ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్లు రియల్ మి5 ఎస్ : ఆఫర్ ప్రైస్ : రూ .9,999 (క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, క్వాడ్ కెమెరా 48 ఎంపీప్రైమరీ లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపీ సూపర్ మాక్రో లెన్స్ 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ ప్రధాన ఫీచర్లు) రియల్మీ ఎక్స్ 2: ధర రూ .16,999 కు విక్రయిస్తోంది. (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 జీ సాక్ ప్రాసెసర్, 64 +82+ 2 ఎంపీ కెమెరా 32 ఎంపీ సెల్ఫీకెమరా ప్రధాన ఫీచర్లు) రెడ్మి నోట్ 7 ప్రో : రూ. 9,999 లభ్యం. (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6.3-ఇంచ్ ఫుల్ హెచ్డీ + డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 సాక్ డుబుల్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరాప్రధాన ఫీచర్లు) ల్యాప్టాప్లు, ఇతర గాడ్జెట్లపై కూడా ప్రత్యేక తగ్గింపునిస్తోంది. ఏసర్ స్విఫ్ట్ 3 (ఇంటెల్ కోర్ ఐ 5, 2 జీబీ గ్రాఫిక్స్) ను రూ. 44.990. మార్కెట్ ధర రూ. 50,000. -
5జీ వచ్చేస్తోంది..
2020లో సెల్యులర్ నెట్వర్క్ టెక్నాలజీలో 5జీని చూడబోతున్నాం. ఈ ఏడాది భారత్లోకి 5జీ వచ్చేస్తోంది. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న 4జీ కంటే ఇది 10 రెట్లు వేగంతో డేటాను డౌన్లోడ్ చేస్తుంది. అంటే ఫోటోలు, వీడియోలు క్షణాల్లోనే మన స్మార్ట్ ఫోన్లలోకి వచ్చేస్తాయి. 5జీ ద్వారా వినియోగదారులు కనీసం 100–150 ఎంబీపీఎస్ నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే మూడు గంటలు ఉన్న ఒక సినిమా సెకండ్లలోనే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ ఏడాదే 5జీ సేవలు భారత్కి అందుబాటులోకి వచ్చినా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ చేరువ కావడానికి మరో ఐదారేళ్లు పడుతుంది. -
సోషల్ మీడియాపై నిఘా
సాక్షి, పాల్వంచ: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఎది పడితే అది, ఎలా పడితే అలా పోస్టింగ్లు పెడితే అంతే సంగతులు. పోలీసులు నిఘాపెట్టి 24 గంటల్లో కేసు నమోదు చేస్తారు. ఇలా కేసుల్లో ఇరుక్కున్నవారిని రూ.లక్ష జరిమానా లేదా 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలున్నాయి. కాబట్టి.. తస్మాత్ జాగ్రత్త.. సోషల్ మీడియా పోస్టులపై సైబర్ క్రైం పోలీసులు కన్నేశారు. ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెడితే ఇట్టే బుక్కవుతారు. హైదరాబాద్లో ఇటీవటి కాలంలో జరిగిన దిశ ఎన్కౌంటర్పై సీపీఎం మాజీ ఎంపీ బృందాకరత్ స్పందిస్తూ.. ‘ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం’ అంటూ పోస్ట్ చేశారు. అ అంశంపై సోషల్ మిడియాలో వచ్చిన పోస్టింగ్లను చూసిన పాల్వంచకు చెందిన ఓ వ్యక్తి బృందాకరత్పై అసభ్యకరంగా పోస్టును షేర్ చేశాడని స్థానిక సీపీఎం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమైనట్లు సమాచారం. తప్పుడు ప్రచారం చేయొద్దు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ప్రతిఒక్కరి దగ్గరా ఉన్నాయి. ఆ ఫోన్లు వాడుతున్న వారికి కూడా నెట్ అందుబాటులో ఉంటోంది. దీంతో వారు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. అయితే, అందులో కొన్ని పోస్టింగ్లు, వార్తలు తప్పుగా ఉంటున్నాయి. మరికొన్ని దుష్ప్రచారం కోసం పెడుతున్న పోస్టింగులు ఉంటున్నాయి. పలు పోస్టులు ఆత్మహత్యలు, హత్యలను ప్రేరేపించేలా ఉంటున్నాయి. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవగాన లేని అనేక మంది ఒకరు పంపిన పోస్టింగ్లు, మెసేజ్లను ఇతరులకు పోస్టు చేయడం ద్వారా క్షణంలో వ్యాపిస్తోంది. ఇలా అనేకమంది పోస్టులు పెట్టి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అనంతరం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పోలీసుల ప్రత్యేక దృష్టి సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడితే ఇక నుంచి కుదరదు. చర్యలు తీసుకోవడంతోపాటు ప్రత్యేకంగా సైబర్క్రైం విభాగాన్ని ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పోలీసులు నిరంతరం సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై కన్నేసి ఉంచుతారు. దుష్ప్రచారం, సమాజాన్ని తప్పుదోవ పట్టించే అంశం, వ్యక్తిగత ధూషణలు, అసత్య ప్రచారాలను పోస్టు చేసిన వారిని 24 గంటల్లో గుర్తించి, ఐపీసీ 153 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదైతే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేదా రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. కేసు నిర్ధారణ జరిగితే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉద్యోగానికి అనర్హలుగా గుర్తిస్తారని పోలీసు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులూ పిల్లలపై దృష్టి సారించాలి.. తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లు వినియోగించే పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. తమ పిల్లలు ఎన్ని గంటలు స్మార్ట్ఫోన్ను వినియోగిస్తున్నారు? ఏఏ అంశాలు చూస్తున్నారు? సోషల్ మీడియాలను ఫాలో అవుతున్నారా? అందులోని అంశాలకు స్పందిస్తున్నారా? అనే అంశాలను గమనించాలి. అవగాహన లేకుండా ఇష్ట మొచ్చినట్లుగా పోస్టులు పెడితే పిల్లలతోపాటు తల్లిదండ్రులూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాట్సప్లో ఏఏ మెసేజ్లను పంపుతున్నారని నిత్యం పరిశీలించాలి. అప్పుడే పిల్లల్లో భయం ఏర్పడి అసత్య పోస్టింగ్లు, అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టకుండా కొంతమేరకు నివారించవచ్చు. అసత్య ప్రచారం చేస్తే చర్యలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టింగ్లు పెట్టవద్దని భయం చెప్పాలి. ఇష్టం వచ్చిన పోస్టింగ్ పెడితే కేసులవుతాయని భయం చెప్పి అవగాహన కల్పించాలి. సమాజానికి వ్యతిరేకంగా అశాంతి కల్గించే విధంగా, వ్యక్తిగత విమర్శలు, అసత్య ఆరోపణలు చేస్తూ వాట్సప్ పోస్టింగ్లు చేయొద్దు. అసత్య ప్రచారాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం –కేఆర్కే ప్రసాద్, డీఎస్పీ, పాల్వంచ -
ఆర్థిక సేవల్లోకి రియల్మీ
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్స్ తయారీ సంస్థ రియల్మీ తాజాగా ఆర్థిక సేవల విభాగంలోకి ప్రవేశించింది. రుణాలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ స్కోర్ రిపోర్టులు అందించేందుకు ‘రియల్మీ పైసా’ పేరిట ప్రత్యేక ప్లాట్ఫాం ప్రారంభించింది. స్మార్ట్ఫోన్స్ విభాగంలో ప్రత్యర్థి సంస్థ షావోమీ ఇటీవలే ’మి క్రెడిట్’ పేరుతో ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీ సులే ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్మీ పైసా బీటా యాప్ ద్వారా డిజిటల్ వ్యక్తిగత రుణాలు సుమారు రూ. 1 లక్ష దాకా, చిన్న.. మధ్యతరహా సంస్థలు రూ.5 లక్షల దాకా రుణాలు పొంద వచ్చు. తక్షణ ఉచిత క్రెడిట్ రిపోర్టులు, మూడు నెలల పాటు ఉచిత అప్డేట్స్, పాత.. కొత్త ఫోన్లకు స్క్రీన్ డ్యామేజ్ బీమా సరీ్వసులు ఈ యాప్ ద్వారా రియల్మీ అందించనుంది. 2020లో ఈ ప్లాట్ఫాం ద్వారా రూ. 1,000 కోట్ల దాకా రుణ వితరణ, 30–50 లక్షల మంది కొత్త కస్టమర్లకు చేరువ కావాలనేది తమ లక్ష్యమని రియల్మీ పైసా లీడ్ వరుణ్ శ్రీధర్ తెలిపారు. ‘మూడేళ్లలో బ్రేక్ ఈవెన్ వస్తుందని అంచనా వేస్తు న్నాం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న రియల్మీ పైసా యాప్.. గూగుల్ ప్లేస్టోర్తో పాటు రియల్మీ యాప్స్టోర్లో లభిస్తుంది. రానున్న 6–12 నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తాం’ అని శ్రీధర్ తెలిపారు. -
దిశ కేసు: సమాధానం చెప్పలేని ప్రశ్నలెన్నో?
#Justice_for_Disha..మనమింతే ఆవేశమున్నంతసేపే ఆలోచిస్తాం.. ఆవేశంలాగే చప్పున చల్లారిపోతాం!! భ్రమలు తొలగిపోయాయి. హైదరాబాద్ విశ్వనగరమని, దేశంలోనే అత్యంత సురక్షిత నగరమని పొద్దునలేస్తే రాజకీయ నాయకులు మొదలు పోలీసు బాసుల వరకు చెప్పిందే చెప్పారు. కానీ నగర శివార్లలో తాము నిరంతరం గస్తీ తిరిగే ప్రదేశంలో అత్యంత కిరాతకమైన ఘటన జరుగుతుంటే పోలీసులు గ్రహించలేకపోయారు. బాధితుల తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే తమ పరిధి కాదంటూ చేతులేత్తేశారు. కాపాడాల్సిన పోలీసులే మాకేం పట్టి మా పరిధి కాదంటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఇంకా ఈ సమాజానికి ఎవరు భద్రత? జస్టిస్ ఫర్ దిశ (షాద్నగర్ శివార్లలో జరిగిన అమానుష హత్యాచార బాధితురాలి మారుపేరు) కేసులో తప్పెవరిది. ఎవరిని ప్రశ్నిద్దాం. మహిళ ఒంటరిగా నిర్భయంగా బయటకు వెళ్లి వచ్చే పరిస్థితి ఇప్పటికీ లేదు. పేరుకు గొప్ప నగరమే. కానీ, నగరంలో, నగర శివార్లలో ఎన్నో గ్రే ఏరియాలు ఉన్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటి మీద పోలీసులకు ఏమైనా అవగాహన ఉందా? ఇలాంటి గ్రే ఏరియాల్లో నేరాలు జరగకుండా పోలీసులు ఏవైనా ప్రివెంటివ్ మెష్యూర్స్ తీసుకుంటున్నారా? పోలీసులు, ప్రభుత్వం, వ్యవస్థే కదా నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది. ఆపద సమయాల్లో ఒంటరి మహిళలకు ఆదుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. డయల్ 100తోపాటు అత్యవసర పరిస్థితుల్లో సత్వరమే సహాయం అందించేందుకు 112 టోల్ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్తున్నారు. 112కు డయల్ చేయలేని పరిస్థితి ఉంటే.. తమ స్మార్ట్ ఫోన్లో ‘పవర్ బటన్’ను మూడుసార్లు వెంటవెంటనే నొక్కినా కూడా హెల్ప్లైన్కు సమాచారం అందుతుందని, సాధారణ ఫోన్లలో ‘5’ లేదా ‘9’ అంకెను లాంగ్ ప్రెస్ చేసినా ఈ సేవలు పొందే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈ సేవలను ఆపద వేళల్లో మహిళలు, యువతులు నిర్భయంగా ఉపయోగించుకునేవిధంగా ఎందుకు విస్తృతంగా అవగాహన కలిగించలేకపోయారు? పోలీస్ స్టేషన్లకు వెళితే కంప్లయింట్లే తీసుకోవడం లేదు? ఇక ఫోన్ చేస్తే సమయానికి ఆదుకుంటారనే భరోసా ఎలా ఇస్తారనే అనుమానం ప్రజల్లో రాకపోదా? ఇవన్ని పోలీసులు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు. ఇకనైన, నగరం, నగర శివారు ప్రాంతాలు మహిళలకు మరింత సురక్షితంగా మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పోలీసుల ముందున్న సవాల్. దిశపై ఊహకందని అమానుషం జరిగింది. ఆ దారుణం నిజంగానే సమాజం అంతరాత్మను కదిలించింది. కానీ, ఈ ఘటనలో పోలీసులూ, వ్యవస్థ తప్పును ఎత్తిచూపుతున్నప్పుడు ప్రజలుగా మన బాధ్యతను, తప్పును గుర్తించాలి. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఇప్పటికీ భాగ్యనగరంలో ఒంటరి మహిళలకు ఏదోరూపంలో ముప్పు వెంటాడుతూనే ఉంది. కాబట్టి, ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్లు ధైర్యంగా ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇక్కడ దిశను తప్పుబట్టడమో అలా చేయాల్సి ఉండాలి ఇలా చేయాల్సి ఉండాలని చెప్పడం కాదు. ఒకానొక్క క్లిష్టస్థితిలో తను ఉన్నప్పుడు మాటువేసి పక్కా ప్లానింగ్తో మృగాళ్లు ఈ దాడికి పాల్పడినట్టు స్పష్టమవుతూనే ఉంది. ఆ భయానక రాత్రి ఒంటరై.. దిక్కుతోచని స్థితిలో ధైర్యం కోసం చెల్లెలికి ఫోన్ చేసిన దిశ.. అంతకుమించి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది. మనుషులంతా మంచివాళ్లేననుకొని.. మానవ మృగాళ్లు ముసుగులో తిరుగుతుంటారని గ్రహించి ఉండకపోవచ్చు. మృగాల అమానుషత్వానికి బలై బూడిదగా మిగిలిన దిశ సమాజానికి ఎన్నో ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. ఈ ప్రశ్నల పరంపర ఎక్కడ ఆగుతుంది? ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలెన్నో ఈ ఘటనలో.. ఈ ఘటన తర్వాత మనమేమైనా చెప్పుకోవాల్సింది ప్రశ్నించుకోవాల్సింది ఉందా? నిజాయితీగా చెప్పండి. పోలీసుల సహాయం తీసుకోవడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. ఆపద సమయాల్లో 100కు లేదా 112కు నిర్భయంగా డయల్ చేయండని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఒంటరిగా ప్రయాణించే మన బిడ్డలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నాం? మొబైల్ ఫోన్ ఇస్తున్నాం.. ఏదైనా కష్టమొస్తే మనకో మన బంధువులకో ఫోన్ చేయమంటున్నాం కరెక్టే. కానీ, ఇంకా ముందుకెళ్లి వ్యవస్థ సహాయం తీసుకోగలిగేలా ధైర్యం ఇవ్వగలుగుతున్నామా? ఒంటరి వేళలో నిర్భయంగా ఉండేగలిగే ధైర్యాన్ని, వ్యవస్థ నుంచి నిస్సంకోచంగా సహాయం కోరే పరిణతిని మనం కల్పిస్తున్నామా? ఆడపిల్లల్ని ఎన్ని కట్టుబాట్లలో పెంచుతున్నాం. నీకు ఏదైనా ఆపద వస్తే పోలీసులకు ఫోన్ చేసి సహాయం తీసుకోమని చెప్పగలుగుతున్నామా? మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ సాధనమే కాదు.. సరిగ్గా వాడుకుంటే బలమైన ఆయుధం కూడా. మొబైల్ఫోన్, ఇంటర్నెట్ ఉంటే ప్రపంచమే అరచేతుల్లో ఉంటుంది. ఎవరైనా క్షణాల్లో ఆన్లైన్లోకి రావొచ్చు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొచ్చు. చుట్టుపక్కల ఎవరైనా స్నేహితులున్నా వారి సహాయం తీసుకోవచ్చు. తన లోకేషన్ షేర్ చేసి..యావత్ ప్రపంచానికి తానున్న పరిస్థితిని వివరించవచ్చు. చెప్పలేం ఏదైనా సహాయం దొరకపోదా? కానీ, ఆపదలో ఉన్నానని చెప్పి.. సమయానుకూలంగా సహాయం తీసుకోగలిగే ధైర్యాన్నైనా మనం ఇవ్వగలుతున్నామా? ఒకవేళ ఆపద సంభవిస్తే మన ఫోన్ని ఎలా వాడాలన్నది ఎవరైనా గ్రౌండ్లెవల్లో అవగాహన కల్పిస్తున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మన బిడ్డల్ని సుశిక్షితులను చేసుకోవడం లేదు. ధైర్యంగా పెంచడం లేదు. కట్టుబాట్ల పేరిట అమాయకంగా పెంచుతున్నాం. ఆ అమాయకులను ఇలాంటి మానవ మృగాలు ఇప్పటికీ కబళిస్తూనే ఉన్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు మనవంతు బాధ్యతగా చేయాల్సింది చాలా ఉంది. ఆవేశమే కాదు ఆలోచనతో వివేచనతో ఈ దారుణ ఘటనపై చర్చించాల్సిన అవసరముంది. -శ్రీకాంత్ కాంటేకర్ -
ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్, ఆఫర్లు
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్కార్ట్ మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్ను ప్రకటించింది. బిగ్ షాపింగ్ డేస్ సేల్ -2019 లో భాగంగా స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు , ఇతర ఆఫర్లను అందించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 ఆదివారం నుండి ప్రారంభమయ్యే డిసెంబర్ 5 వరకు ఐదు రోజుల పాటుకొనసాగనుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు నవంబర్ 30, శనివారం రాత్రి 8 గంటల నుండే కొనుగోళ్లకు ముందస్తు అనుమతి లభిస్తుంది. ముఖ్యంగా రియల్మి, శాంసంగ్ గెలాకసీ, ఆపిల్ ఐ ఫోన్లపై ఆఫర్లను తీసుకొస్తోంది. టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ల్యాప్టాప్లు, కెమెరాలపై 80 శాతం తగ్గింపు లభ్యం. డిఎస్ఎల్ఆర్, డిజిటల్ కెమెరాలపై రూ.10,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్. దీంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ప్రధానంగా బిగ్ షాపింగ్ డేస్ అమ్మకం సందర్భంగా ఫ్లిప్కార్ట్ "బ్లాక్ బస్టర్ డీల్స్" కూడా అందించనుంది. ఉదయం 12, 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అదేవిధంగా తెల్లవారుజామున 2 గంటలకు "రష్ అవర్స్" లో స్పెషల్ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో ప్రధానంగా రియల్మి 5, రియల్మే ఎక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9, గెలాక్సీ ఎస్ 9 ప్లస్, గూగుల్ పిక్సెల్ 3 ఎ, ఆపిల్ ఐఫోన్ 7, ఆసుస్ 5 జెడ్ వంటి స్మార్ట్ఫోన్లపై తగ్గింపును అందించనుంది. మొబైల్ ఫోన్లపై ఆఫర్లు రియల్మి5 : అసలు ధర రూ. 9,999 డిస్కౌంట్ ధర రూ. 8,999 రియల్మి ఎక్స్: అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999 శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 : అసలు ధర రూ. 29,999 డిస్కౌంట్ ధర రూ. 27,999 గెలాక్సీ ఎస్ 9 ప్లస్ : అసలు ధర రూ. 37,999 డిస్కౌంట్ ధర రూ. 34,999 గూగుల్ పిక్సెల్ 3 ఎ : అసలు ధర రూ. 34,999 ఆఫర్ ధర రూ. 29,999 ఆపిల్ ఐఫోన్ 7: అసలు ధర రూ. 27,999 ఆఫర్ ధర రూ. 24,999 ఆసుస్ 5 జెడ్ : అసలు ధర రూ. 16,999 ఆఫర్ ధర రూ. 15,999