ఆర్జీవీ 'వ్యూహం' సినిమాకు లైన్‌ క్లియర్‌ | Vyooham Movie Clearance Censor Issue | Sakshi
Sakshi News home page

ఆర్జీవీ 'వ్యూహం' సినిమాకు లైన్‌ క్లియర్‌

Published Thu, Feb 8 2024 4:18 PM | Last Updated on Thu, Feb 8 2024 5:16 PM

Vyooham Movie Clearance Censor Issue - Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. హైకోర్టు సూచనలతో రెండోసారి కూడా సెన్సార్‌ బోర్డు వ్యూహం సినిమాకు క్లియెరెన్స్‌ ఇచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు నిర్మాత దాసరి కిరణ్‌ తెలిపారు.

వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్‌ పిటిషన్‌తో హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను గతంలో తాత్కాలికంగా నిలువరించింది. వ్యూహం సినిమాను మరొకసారి సమీక్షించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మరొకసారి సెన్సార్‌ ఇవ్వాలని గతంలో కొర్టు తెలిపింది.

(ఇదీ చదవండి: థియేటర్‌లో అలజడి రేపిన పవన్‌ ఫ్యాన్స్‌.. ఇంకెప్పుడు మారుతారో..!)

కోర్టు నిర్ణయంతో మరోసారి వ్యూహం చిత్రానికి తాజాగా సెన్సార్‌ నిర్వహించారు. చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని సెన్సార్‌ బోర్డు తెలపడంతో వ్యూహం చిత్రం ఫిబ్రవరి 16న విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని చిత్ర నిర్మాత తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement