rgv
-
సిండికేట్లో వెంకీమామ, బిగ్బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే?
ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీసిన రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) రానురానూ గతి తప్పాడు. చౌకబారు సినిమాలు తీసుకుంటూ పోయాడు. కానీ ఈ మధ్యే వర్మకు తను చేసిన తప్పు అర్థమైంది. సత్య సినిమా (Satya Movie) రీరిలీజ్ సందర్భంగా తన సినిమాను తనే మరోసారి చూసుకున్నాడు. అంత అద్భుతాన్ని తెరకెక్కించిన తాను ఆ స్థాయి సినిమాలు ఎందుకు చేయలేకపోయానని బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు.మాటిచ్చి కొత్త సినిమా ప్రకటించిన వర్మఇకమీదట సత్యలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తానని మాటిచ్చాడు. ఇది నిజమేనా? అని అందరూ అనుమానిస్తున్న సమయంలో ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటించాడు. సిండికేట్ సినిమా తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. 70వ దశకంలో వీధి రౌడీల గ్యాంగ్స్ నుంచి మొదలుకుని ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను భారత్ చూసింది. కానీ గత పదిహేనేళ్లలో చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవు. అతి భయంకరమైన జంతువు మనిషేఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు పుట్టుకొస్తే ఎలా ఉంటుందో సిండికేట్లో చూపించబోతున్నా అన్నాడు. ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ (అత్యంత క్రూరమైన మృగం మనిషి మాత్రమే) అని ఓ ట్యాగ్లైన్ కూడా జోడించాడు. ఇలా సిండికేట్ను ప్రకటించాడో లేదో నెట్టింట రూమర్లు మొదలయ్యాయి. తెలుగు నుంచి వెంకటేశ్ దగ్గుబాటి, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్ను సెలక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాలో స్టార్స్మనోజ్ బాజ్పాయ్, అనురాగ్ కశ్యప్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై వర్మ స్పందించాడు. సిండికేట్ సినిమాలో భాగం కాబోయే నటీనటుల గురించి వస్తున్న ప్రచారమంతా ఫేక్. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని వివరాలు చెప్తాను అని ట్వీట్ చేశాడు. There are all kinds of speculations going around the casting of SYNDICATE film which are all completely FALSE ..Will share the details when ready— Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2025 చదవండి: ప్రియుడితో ఆరెంజ్ హీరోయిన్ 'రోకా'.. పెళ్లెప్పుడంటే? -
రామ్గోపాల్వర్మకు మూడు నెలల జైలు శిక్ష
ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ (Ram Gopal Varma)కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరి మెజిస్ట్రేట్.. ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఏడేళ్ల క్రితంనాటి చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేల్చిన న్యాయస్థానం దర్శకుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దర్శకుడు విచారణకు గైర్హాజరవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఈ కేసు ఇప్పటిది కాదు! 2018లో రామ్గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మశ్చీంద్ర మిశ్రా తరపున శ్రీ కంపెనీ ఈ కేసు దాఖలు చేసింది. 2022 జూన్లో వర్మ ఈ కేసులో బెయిల్ కూడా తెచ్చుకున్నాడు.వర్మ రియాక్షన్దీనిపై వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇది ఏడేళ్లనాటి కేసు. నా దగ్గర పని చేసిన మాజీ ఉద్యోగితో రూ.2.38 లక్షల వివాదానికి సంబంధించినది. ప్రస్తుతం మా లాయర్లు ఈ వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అన్నాడు. With regard to the news about me and Andheri court, I want to clarify that it is to do with a 7 year old case of Rs 2 lakh 38 thousand amount , relating to my ex-employee .. My advocates are attending to it. and since the matter is in court i cannot say anything further— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2025 చదవండి: ‘సిండికేట్’తో నా పాపాలన్నీ కడిగేసుకుంటా: ఆర్జీవీ బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు -
వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో సత్య ఒకటి. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్పేయి, ఊర్మిళ మటోండ్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. 1998లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి థియేటర్లలో విడుదలైంది.ఎవర్నీ పట్టించుకోకుండా ఏడ్చేశా..రీరిలీజ్ సందర్భంగా సత్య సినిమాను వీక్షించిన దర్శకుడు ఆర్జీవీ (Ram Gopal Varma) భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. రెండు రోజుల క్రితం సత్య సినిమా చూశాను. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా చూస్తుంటే కన్నీళ్లాగలేవు. నా కన్నీళ్లు ఎవరైనా చూస్తారేమో అని కూడా పట్టించుకోకుండా ఏడ్చేశాను. సినిమా చూసి ఎమోషనలవలేదు. సత్య తర్వాత నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాను.సినిమా అంటే బిడ్డకు జన్మనివ్వడం లాంటిదేఒక సినిమా తీయడమంటే బిడ్డకు జన్మనివ్వడంలాంటిదే! సినిమాను ముక్కలు ముక్కలుగా చిత్రీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందనేది తెలియదు. షూటింగ్ అయ్యాక దాన్ని చూసినవాళ్లు ఇది హిట్టనో, ఫట్టనో చెప్తూ ఉంటారు. నేను మాత్రం నేను సృష్టించిన సినిమా అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఈ సినిమాను లక్ష్యం లేని నా ప్రయాణంలో ఓ అడుగుగా మాత్రమే భావించాను. రెండు రోజుల క్రితం వరకూ అదే అభిప్రాయంతో ఉన్నాను. నా కన్నీళ్లకు కారణం..అపారమైన తెలివితేటలు ఉన్న నేను సత్య సినిమా (Satya Movie)ను బెంచ్మార్క్గా తీసుకుని భవిష్యత్తును ఎందుకు నిర్మించుకోలేదో అర్థం కావడం లేదు. నేను సినిమాలోని విషాదం చూసి చలించిపోలేదు. నన్ను నేను చూసుకుని ఏడ్చేశాను. సత్య సినిమాతో నన్ను నమ్మినవారందరికీ చేసిన ద్రోహాన్ని తలుచుకుని అపరాధ భావనతో కుమిలిపోయాను. సక్సెస్, అహంకారం తలకెక్కించుకుని తాగుబోతునయ్యాను. రంగీలా, సత్య సినిమా సక్సెస్ వల్ల నా కళ్లు నెత్తికెక్కాయి. అప్పుడే నా విజన్ను కోల్పోయాను. కళ్లకు గంతలు కట్టుకున్నా..తర్వాత నా సినిమాల్లో ఏవో జిమ్మిక్కులు, అసభ్యకరమైన ప్రదర్శనలు.. ఇలా అర్థంపర్థం లేని ప్రయోగాలు చేశాను. అయినప్పటికీ కొన్ని సినిమాలు సక్సెసయ్యాయి. కానీ సత్య మూవీలో ఉన్నంత దమ్ము, నిజాయితీ వాటిలో లేవు. చిత్రపరిశ్రమలో కొత్త తరహా చిత్రాలు చేయాలన్న ఆలోచనతో నా కళ్లకు నేనే గంతలు కట్టుకున్నాను. నా విలువ అర్థం చేసుకోలేక దేనికోసమో పరుగులు పెట్టాను. ఈ క్రమంలో నేను సృష్టించిన అందమైన గార్డెన్ను కాళ్ల కిందే తొక్కిపెట్టాను. తప్పుల్ని సరిదిద్దుకోలేనుఅప్పుడే నా పతనం మొదలైంది. నేను చేసిన తప్పులను ఎలాగో సరిదిద్దుకోలేను. కానీ ఇకపై దర్శకుడిగా నన్ను మొదటి స్థానంలో నిలబెట్టే సినిమాలే తీస్తాను. రెండు రోజుల క్రితం నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న మాట ఇది! సత్యలాంటి సినిమాను నేను మళ్లీ తీయలేకపోవచ్చు. కానీ అలాంటి సినిమాల్ని మీ ముందుకు తీసుకురావాలని ఆలోచించకపోవడం క్షమించరాని నేరమవుతుంది. దీనర్థం నేను సత్యలాంటి సినిమాలు మాత్రమే తీస్తానని కాదు. ఇకపై ఆ రూల్ పాటిస్తాజానర్ ఏదైనా సరే, తీసుకునే అంశం ఏదైనా సరే సత్యపై చూపించినంత నిజాయితీ ఇకమీదట ప్రతి సినిమాపై చూపిస్తాను. సత్య తర్వాత నేను చేయబోయే సినిమా ఎలా ఉంటుందని నన్నెవరూ అడగలేదు. కానీ ఆ ప్రశ్న నాకు నేను వేసుకోకపోవడం దారుణం. అందుకే మళ్లీ నేను వెనక్కు వెళ్లాలనుకుంటున్నాను. ఇకపై ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ చూడాలనుకుంటున్నాను. ఇదేదో ముందు నుంచీ పాటించుంటే చాలావరకు నా సినిమాలు వచ్చేవే కాదు.ఒట్టేసి చెప్తున్నా..ప్రతి దర్శకుడికి ఇదొక మేల్కొలుపుగా చెప్తున్నాను. చివరగా నా జీవితంలో మిగిలిన భాగం.. సత్యలాంటి విలువైన సినిమాలు తీయడానికే వెచ్చిస్తానని సత్య మూవీపై ఒట్టేసి చెప్తున్నాను అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. ఆర్జీవీ కొత్త వర్షన్ కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. A SATYA CONFESSION TO MYSELF —— Ram Gopal Varma By the time SATYA was rolling to an end , while watching it 2 days back for 1st time after 27 yrs, I started choking with tears rolling down my cheeks and I dint care if anyone would see The tears were not…— Ram Gopal Varma (@RGVzoomin) January 20, 2025 చదవండి: Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు.. -
ఈ వీడియో బయటకు రాగానే మీ అందరి మీద కేసు పెడతారు..
-
రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్నెట్ లీగల్ నోటీసులు
టాలీవుడ్ సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరోసారి లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్నెట్ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా పేరుతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా వర్మతో పాటు ఆర్జీవి ఆర్వీ సంస్థ, పార్టనర్ గొట్టుముక్కల రవి శంకర్ వర్మకి నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ మాజీ ఎండి మధు సుధన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. -
మంచు ఫ్యామిలీ గొడవపై RGV కామెంట్స్
-
RGV: దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా ?
-
అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ ఘటనలో A11గా ఉన్న వ్యక్తిని నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని వర్మ గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. రేవతి కుటుంబానికి ముమ్మాటికి నష్టం జరిగిందని చెప్పిన వర్మ ఆ పేరుతో మరోక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలని ఆయన అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీ అరెస్ట్ గురించి చేసిన కామెంట్లు కూడా అభ్యంతరంగా ఉన్నాయని వర్మ అన్నారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారని అంటున్నారు... వారిపై నమోదైన కేసులకు, బన్నీ మీద నమోదు అయిన కేసుకు చాలా తేడా ఉందని ఆయన గుర్తు చేశారు.పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?.. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ వర్మ ప్రశ్నించారు. బన్నీ అరెస్ట్ గురించి ఆర్జీవీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చూడగలరు. -
అల్లు అర్జున్ అరెస్ట్ పై RGV కామెంట్స్
-
మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు: RGV
-
ఆర్జీవీపై ముందస్తు బెయిల్ పిటిషన్పై రేపు విచారణ
-
సంధ్య థియేటర్ వంటి ఘటనలు గతంలో జరగలేదా..?: ఆర్జీవీ
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం డిసెంబర్ 4న ప్రీమియర్స్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో అల్లు అర్జున్తో పాటు ఆయన అభిమానులు కూడా బాధ పడ్డారు. అయితే, రేవతి మరణానికి కారణం బన్నీనే అంటూ కొందరు సోషల్మీడియాలో ప్రచారం చేశారు.. ఆపై తెలంగాణలో బెన్ఫిట్ షోలు ఉండబోవని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాల గురించి ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్వర్మ తన అభిప్రాయాన్ని సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు.సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ను తప్పుపట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఈ కారణంతో బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడాన్ని వర్మ తప్పుపట్టారు. అయితే, రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూర్తి చేయలేరని పేర్కొన్నారు.'సినిమా సెలబ్రిటీలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు.. వారు ఎక్కడికైనా వెళ్తే అభిమానులు భారీగానే పోటెత్తుతారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాటలు చాలా సాధారణంగా జరుగుతాయి. అయితే, తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా..? నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అసమర్థత, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా..? అనేది ఒక కేసు ఆధారంగా దర్యాప్తు కోణం నుంచి మాత్రమే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సంఘటన కారణంగా బెనిఫిట్ షోలను నిషేధించడం సమాధానం కాదు.బెనిఫిట్ షోలు అనే బదులు వాటిని స్పెషల్ షో అనేది సరైన పేరు.. స్పెషల్ కాఫీ, స్పెషల్ మీల్స్ సాధారణ వాటి కంటే ఎలా ఖరీదైనవో, స్పెషల్ షో టిక్కెట్లు కూడా ఖరీదైనవిగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సభలు, ర్యాలీలు, కచేరీలు మొదలైన వాటికి తగిన అనుమతులు ఇచ్చినట్లే, థియేటర్కి కూడా వివిధ సంబంధిత అధికారులు సినిమా ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు.సినిమా నటులు థియేటర్లను సందర్శించడం అనేది కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతున్న విషయమే.. అక్కడికి జనం పోటిత్తుతారు. ఆ సమయంలో ఒక్కోసారి ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం. ఒక స్టార్ థియేటర్కు రావాడానికి పోలీసులు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి, కానీ బెనిఫిట్ షోలను ఎందుకు నిషేధించాలి..? రాజకీయ సమావేశాల తొక్కిసలాటలు ఎన్నో జరిగాయి. కుంభమేళా వంటి వాటిలో జరిగిన తొక్కిసలాటలో వ్యక్తులు చనిపోయినప్పుడు వాటిని నిషేధించారా..?' అంటూ వర్మ తన సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు.It is truly ridiculous to blame @alluarjun for the unfortunate death of a woman in a stampede outside a theatre playing #Pushpa2Celebrities by their very appeal draw huge crowds whether they are Film Stars , Rock stars and even Gods for that matter And stampedes happen very…— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2024 -
Ram Gopal Varma: ఎవరి మనోభావాలో దెబ్బతింటే కేసులు పెట్టడమేంటి?: ఆర్జీవీ
-
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మకు ఊరట
-
RGV: తొమ్మిది చోట్ల కేసులు పెట్టారు..
-
RGV: రామ్ గోపాల్ వర్మను ఈడ్చుకుని వెళ్లారు... వినడానికి నాకు బాగుంటుంది
-
గుర్తుపెట్టుకోండి! రాబోయేది మేమే వడ్డీతో ఇస్లాం
-
చంద్రబాబు మరో డైవర్షన్...
-
సోషల్ మీడియా పోస్టులపై కేసులో విచారణకు వచ్చామంటూ హల్ చల్
-
RGV పై అక్రమ కేసు.. లోకేష్ పై అంబటి రాంబాబు సెటైర్లు
-
రాంగోపాల్ వర్మ ఇంటి నుంచి వెనుదిరిగిన ఏపీ పోలీసులు
-
రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. విచారణకు రావాలని హైదరాబాద్లోని ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. ఒంగోలు పోలీసు స్టేషన్కు విచారణ నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసులే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుంటే వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో తనకు సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా వర్మ సమాధానం ఇచ్చారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా డీఎస్పీకి సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. అయినా సరే పోలీసులు వర్మ ఇంటికి రావడంలో కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే.విచారణ పేరుతో తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. -
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్ విచారణ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే.. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రామ్ గోపాల్ వర్మ అభ్యర్థనపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నుంచి అరెస్టు ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఆ అభ్యర్థనను కూడా పోలీసులు ముందు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన ఆర్జీవీ వేసిన పిటిషన్ను రెండు వారాల తర్వాతే విచారణ జరపనుంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉంది. -
హైదరాబాద్ లో ఆర్జీవీ కి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు