నంద్యాల(న్యూటౌన్): పట్టణంలో ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ సునీత తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్ పరీక్షకు 152 మందికి గాను 148 మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారన్నారు. అలాగే, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 151 మందికి గాను 140మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment