
బీహార్లోని పూర్నియా జిల్లాలో అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై బయలుదేరారు.
బీహార్లోని పూర్నియా జిల్లాలో అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై బయలుదేరారు. సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారంతా నదిలో పడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నదిపై వంతెన లేకపోవడంతో వెదురు కర్రలతో తాత్కాలికంగా ఒక తెప్పను తయారు చేసుకుని పిల్లలు, పెద్దలతో సహా సుమారు 20 మంది ఆ తెప్పపై నది దాటేందుకు ప్రయత్నించారు. ఆ తెప్పను తాడు సహాయంతో అవతలి ఒడ్డువైపు లాగేందుకు దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అధిక బరువు కారణంగా ఆ తెప్ప అదుపుతప్పింది. నదిలో పడిన వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Video: 20 Headed For Funeral On Makeshift Raft Fall Into River In Bihar pic.twitter.com/0fRdhnRdpw
— NDTV (@ndtv) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment