మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి | 7 Dead After Auto Collides With Truck In Madhya Pradesh Chhatarpur, See Details Inside | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి

Aug 20 2024 12:16 PM | Updated on Aug 20 2024 12:48 PM

7 Dead After Auto Collides With Truck In Madhya Pradesh Chhatarpur

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్న భక్తుల ఆటో రిక్షా  ఛతర్‌పూర్‌ జిల్లాలో  వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు  పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  

సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి039 (ఝాన్సీ-ఖజురహో హైవే)పై కడారి ప్రాంతంలో తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భక్తులు బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. ఆటో రిక్షాలో 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వారు మహోబా రైల్వే స్టేషన్ నుంచి భాాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్నారని ఆయన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement