
లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అరెస్టుకు నిరసనగా వచ్చే ఆదివారం (మార్చి 31) ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఇండియా ఆప్ బ్లాక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ అరెస్టుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు ప్రధాని దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్, బీహార్లో తేజస్వి యాదవ్ వంటి వారిపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు.
ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. దీనిని కూడా లెక్కచేయకుండా.. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆప్ ప్రధాన కార్యాలయానికి సీలు వేశారు. కాంగ్రెస్ ఖాతాలు సీజ్ చేశారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇంత దారుణానికి ఒడిగట్టలేదని గోపాల్ రాయ్ అన్నారు.
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం? మాకు లెవెల్ ప్లే ఫీల్డ్ లేదు. మీరు ఎన్నికైన ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారు. భారతదేశంలోని పురాతన రాజకీయ పార్టీ ఖాతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి యుద్ధం చేస్తున్నారు. ఏ సమయంలో అయినా కాంగ్రెస్ వెనక్కి తగ్గదు అని అన్నారు.
మార్చి 31న అన్ని భారత మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వస్తారని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ అన్నారు. మేము ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రజాస్వామ్యంపై దాడులను మేము సహించమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment