Ashok Gehlot: కరోనా బారినపడిన మరో సీఎం | Rajasthan Chief Minister Ashok Gehlot Tests Positive For Covid | Sakshi
Sakshi News home page

Ashok Gehlot: రాజస్థాన్‌ సీఎంకు కరోనా పాజిటివ్‌

Apr 29 2021 12:07 PM | Updated on Apr 29 2021 2:19 PM

Rajasthan Chief Minister Ashok Gehlot Tests Positive For Covid - Sakshi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కోనసాగుతుంది. ఇ‍ప్పటికే పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారినపడ్డారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోవిడ్‌ సోకింది. తాజాగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కాగా గహ్లోత్‌ గత కొన్ని రోజులుగా కోవిడ్‌ పరిస్థితిపై అధికారులతో సమావేశాలు నిర్వహించడంతో కోవిడ్‌ సోకినట్లు తెలుస్తోంది.

అయితే తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. గహ్లోత్‌తోపాటు ఆయన సతీమణికి కూడా కరోనా సోకింది. అయితే వైద్యుల సూచనల మేరకు.. సీఎం అశోక్‌ గహ్లోత్‌ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ.. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement