rajastan
-
రెండో పెళ్లితో ‘చిక్కుల్లో’ ఐపీఎస్.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..
జైపూర్ : రెండో వివాహం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని చిక్కుల్లో పడేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీనియర్ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి హోదా తగ్గించింది. ఈ నిర్ణయంతో సీనియర్ ఐపీఎస్ అధికారిగా హోదాతో పాటు తీసుకునే పేస్కేలు సైతం తగ్గింది. కొత్తగా విధుల్లో చేరిన ఐపీఎస్ ఎంత వేతనం తీసుకుంటారో.. అంతే వేతనం సదరు సీనియర్ ఐపీఎస్ అధికారికి అందుతుంది.పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ చౌదరి జైపూర్లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. అయితే పంకజ్ కుమార్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నారు. ఈ వివాదంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పంకజ్ కుటుంబ సభ్యులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పంకజ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.ఈ తరుణంలో ఐపీఎస్ అధికారి పంకజ్ కుమార్ వివాహంపై రాజస్థాన్ రాష్ట్ర ఉన్నాతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పంకజ్ కుమార్ దోషిగా తేల్చారు. విచారణ అనంతరం మూడు సంవత్సరాల పాటు ప్రస్తుతం ఉన్న తన డిజిగ్నేషన్ను తగ్గించారు. లెవల్ 11 సీనియర్ పే స్కేల్ నుండి లెవల్ 10 జూనియర్ పే స్కేల్కు కుదించారు. ఈ పేస్కేల్ కొత్తగా విధుల్లోకి చేరిన ఐపీఎస్లకు కేటాయిస్తారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా, 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పంకజ్ చౌదరి. ప్రస్తుతం,జైపూర్లో కమ్యూనిటీ పోలీసింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పని చేస్తున్నారు. హోదా తగ్గించడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (లెవల్ 10)గా కొనసాగనున్నారు. -
వికటించిన విందు భోజనం.. ఆస్పత్రికి 200 మంది
ఉదయపూర్: రాజస్థాన్లోని ఉదయపూర్లో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఒక వివాహ వేడుకకు హాజరైన అతిథులు అక్కడ వడ్డించిన విందులో పాల్గొన్నాక అనారోగ్యానికి గురయ్యారు. ఆహారం తింటున్న సమయంలోనే కొందరు వాంతులు చేసుకుని, స్పృహ తప్పి పడిపోయారు.విందు భోజనం వికటించిన ఘటన ఉదయ్పూర్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్యంపాలైనవారంతా ఆస్పత్రికి పరుగులు తీశారు. మరికొంతమంది బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరీక్షించేందుకు ఆస్పత్రిలో తగినంతమంది వైద్యులు లేకపోవడంతో ఇతర ఆస్పత్రుల నుండి వైద్యులను పిలిపించారు. బాధితులు కడుపు నొప్పితో తల్లడిల్లిపోతుండటాన్ని చూసిన వైద్యసిబ్బంది వెంటనే వారికి ప్రథమచికిత్స అందించారు. దీంతో పలువురి ఆరోగ్యం కాస్త కుదుటపడింది.సమాచారం అదుకున్న పోలీసులు ఆ పెళ్లిలో వండిన ఆహార నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. బాధితుల్లో 15 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మొత్తం 200 మంది బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. ప్రత్యేక వార్డులో 57 మందికి చికిత్స అందిస్తున్నారు. కొందరు బాధితులకు మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. నలుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నవారిలో ఉన్నారు.ఉదయపూర్లోని ధన్ మండిలోని ఓస్వాల్ భవన్లో సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మందికి విందు ఏర్పాటు చేశారు. ఉదయపూర్తో పాటు వివిధ జిల్లాల నుండి కూడా జనం ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆహారం తిన్న తర్వాత వందలమంది అస్వస్థతకు గురయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు అంబులెన్స్కు ఫోన్ చేసి బాధితులను ఎంబీ ఆస్పత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: ‘ప్రయాణికులకు విజ్ఞప్తి.. రైలు నంబరు 13228.. 72 గంటలు లేటుగా ..’ -
ఆ రాష్ట్రంలోనూ ‘లివ్ ఇన్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జైపూర్: ‘లివ్ ఇన్ రిలేషన్’ జంటల విషయంలో రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తరహా జంటలు తమ సంబంధాన్ని అధికారికంగా నమోదు చేసుకునేందుకు ఒక పోర్టల్ను ప్రారంభించాలని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.హైకోర్టులో ‘లివ్ ఇన్’ జంటలు దాఖలు చేసిన పిటిషన్లో వారు తమకు భద్రత కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ .. ‘కొందరు యువతీ యువకులు ‘లివ్-ఇన్’ సంబంధంలో ఉంటున్నారు. వారి సంబంధాన్ని పెద్దలు, ఇతరులు అంగీకరించకపోవడం వల్ల, ఆ జంటలతో పాటు వారి కుటుంబాలు సమాజంలో హేళనను, ముప్పును ఎదుర్కొంటున్నాయి. అందుకే వారు తమ జీవితాలను, స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నారు.దీనిపై చట్టం రూపొందించే వరకు ‘లివ్-ఇన్’ సంబంధాలను అధికారం కలిగిన ట్రిబ్యునల్ వద్ద నమోదు చేయాలని జస్టిస్ అనూప్ కుమార్ ధండ్ పేర్కొన్నారు. ‘లివ్-ఇన్’ సంబంధంలో ఉండే స్త్రీ భాగస్వామికి భార్య లాంటిది కాదని హైకోర్టు పేర్కొంది. ఇటువంటి సంబంధంలో జీవించాలనే ఆలోచన కొత్తగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి దీని కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి ‘లివ్ ఇన్’ సంబంధాల నమోదు విషయాన్ని పరిశీలించడానికి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, ఈ తరహా జంటల ఫిర్యాదులను పరిశీలించి, వాటిని ఆ కమిటీ పరిష్కరించాలి. ఇందుకోసం ఒక వెబ్సైట్ లేదా వెబ్ పోర్టల్ ఉండాలి" అని హైకోర్టు సింగిల్ బెంచ్ పేర్కొంది. కాగా ఉత్తరాఖండ్లో ‘లివ్ ఇన్’లో ఉంటున్న జంటలకు రాష్ట్రప్రభుత్వం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం భద్రత పెంపు -
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఉద్యోగాలు చేయ్యొచ్చు. లేదా ఇద్దరూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచెయ్యొచ్చు. ఇంకాస్త ముందుకెళ్తే తండ్రికి పై అధికారిగా కొడుకులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా తండ్రి రిటైర్మెంట్ ఆర్డర్పై కొడుకు సంతకం చేసే అవకాశం ఎవ్వరికో గానీ దక్కదు. ఇది అలాంటి ఇలాంటి గౌరవం కాదు. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం దక్కుతుందో అనిపిస్తుంది. ఈ అరుదైన ఘటన రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో చోటు చేసుకుంది.బాంద్రాలోని నోఖా, బికనేర్లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేస్తునన్న జోగరామ్ జాట్కి ఆ అరుదైన అదృష్టం, గౌరవం లభించాయి. అతడు పనిచేస్తున్న ప్రభత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలోనే కొడుకు శ్యామ్సుందర్ చౌదరి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఈ ప్రభుత్వ స్కూల్కి 2016లో ట్రాన్స్ఫర్ అయ్యారు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. జోగారామ్ 39 ఏళ్ల 2 నెలల 20 రోజులు ఉపాధ్యాయుడిగా పనిచేసి మంగళవారమే పదవీ విరమణ చేశారు. ఆ రిటైర్మ్ంట్ ఆర్డర్పై తన కొడుకే సంతకం చేయడంతో ఈ పదవీవిరమణ మర్చిపోలేని మధురాతి ఘట్టం ఆ తండ్రికి. జోగారామ్ కూడా ఇలాంటి అదృష్టం ఎవరికీ దక్కుతుందంటూ కళ్లు చెమర్చాడు. ఈ సమయంలో తనకు ఇంతకు మించి గౌరవడం ఇంకేముంటుందని భావోద్వేగం చెందాడు. ఈ మేరకు జోగరామ్ జాట్ మాట్లాడుతూ..తాను 1985ల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చిందని, అక్టోబర్ 12న విధుల్లో జాయిన్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఈ రోజు తన కొడుకు చేతుల మీదుగా పదవీవిరమణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నటికీ మర్చిపోలేని సంతోషకరమైన సందర్భం అని అన్నారు. అలాగే కొడుకు శ్యామ్ సుందర్ కూడా తన తండ్రి పదవీవిరమణ ఆర్డర్పై తానే సంతకం చేయడం అనేది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. ఇక శ్యామ్ సుందర్ 2011 అక్టోబరు 13న తనకు టీచర్న ఉద్యోగం వచ్చిందని చెప్పారు.ఆ తర్వాత జూలై20, 2015న కెమిస్ట్రీ స్కూల్ టీచర్ కెరీర్ ప్రారభించారు. అలా ఫిబ్రవరి 28, 2023న వైస్ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ తరువాత, అతను అక్టోబర్ 01, 2023 నుంచి తాత్కాలిక ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాట్లు సమాచారం. అంతేగాదు శ్యామ్ సుందర్ చౌదరి పాఠశాలలో చేసిన కృషికి 2022లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ గౌరవాన్ని కూడా పొందారు. కాగా, మరో గొప్ప విషయం ఏంటంటే.. పదవీ విరమణ తర్వాత, జోగారం జాట్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ బాంద్రాకు రూ. 31000, ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ కెడ్లికి రూ. 11000, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కెడ్లికి రూ. 5100 విరాళం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం, అదృష్టం నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో కదూ..!.(చదవండి: ఐఐటీ నిరాకరిస్తే..ఏకంగా ఎంఐటీ ఆహ్వానించింది..!) -
వీధి కుక్కలు రాసిన మరణ శాసనం
జైపూర్ : ‘తల్లి మీరిక్కడే ఆడుకోండి. నేను బజారుకెళ్లి వస్తానంటూ ఓ తాత తన మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు. కానీ ఆ చూపే తన మనువరాలిని చూసే చివరి చూపవుతుందనుకోలేదు.’ ఇంతకి ఏం జరిగిందంటే..రాజస్థాన్(rajastan)లోని అల్వార్ జిల్లాలో ఇక్రానా తన తాత, ఐదుగురు స్నేహితులతో కలిసి పొలానికి వెళ్లింది. పొలం పనిచేసిన అంనతరం తాత స్థానికంగా ఉండే మార్కెట్కు వెళ్లాడు. వెళ్లే సమయంలో మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు.తాత మాట విన్న ఆ మనువరాలు తన స్నేహితులతో పొలంలోనే ఆడుకుని సాయంత్రం ఇంటికి బయలు దేరింది. మార్గం మధ్యంలో 7-8 వీధి కుక్కలు (street dogs) ఇక్రానా,ఆమె స్నేహితులపై దాడి చేశాయి. కుక్కుల దాడితో భయాందోళనకు గురైన చిన్నారులు బిగ్గరుగా కేకలు వేశారు. చిన్నారుల కేకల విన్న పక్కనే పొలం పనులు చేస్తున్న రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్లల్ని కుక్కల దాడి నుంచి కాపాడారు. అత్యవసర చికిత్స నిమిత్తం ట్రాక్టర్లో తరలించారు.అయితే, ఆ వీధి కుక్కల్లోని ఓ కుక్క మాత్రం ఇక్రానాను వదిలి పెట్టలేదు. వెంటపడి మరీ కరిచింది. ట్రాక్టర్లో తరలిస్తున్నా ఇంకా కరించేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకే కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారుల్ని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ దుర్ఘటనలో ఇక్రానా మరణించింది. ఇక్రానాపై దాడి చేసిన కుక్క గతంలో ఇతర జంతువులపై దాడి చేసిందని, అందువల్లే బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 👉చదవండి : వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి, వైరల్ వీడియో -
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి చేతన వెలికితీత
జైపూర్ : రాజస్థాన్లోని కోట్పుత్లీ జిల్లాలో 10 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతనను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.గత డిసెంబర్ 23న మధ్యాహ్నం కోట్పుత్లీ జిల్లా కిరాత్పురా గ్రామానికి చెందిన చేతన ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 10 నిమిషాల తర్వాత బాలిక ఏడుపు విన్న కుటుంబ సభ్యులు బోరుబావిలో పరిశీలించారు. చేతన అందులో పడిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఓవైపు పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తూనే.. మరోవైపు తవ్వకాలు ప్రారంభించారు. ఇలా ఆరుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడు సారి బుధవారం రెస్య్క్యూ సిబ్బంది చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.ఈ సందర్భంగా చేతన తాత దయారామ్ మాట్లాడుతూ.. చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంత కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓపెన్ బోర్వెల్లను కవర్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. बोरवेल में फंसी बच्ची के हाथों में हलचल कैमरे में दिख रही है. #Jaipur https://t.co/7BBzFMGzHk pic.twitter.com/RD66L65NAY— Avdhesh Pareek (@Zinda_Avdhesh) December 23, 2024 -
భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్
కేన్సర్తో బాధపడుతున్న భర్తను రక్షించుకునేందుకు నేపాలీ యువతి పడిన వేదన, ప్రేమతో అతనికి సేవలు, చివరకు అతను కన్నుమూసిన తీరు పలువురి హృదయాలను కదిలించింది. భార్యభర్తల ప్రేమ అంటే ఇలా ఉండాలి అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దాదాపు ఇలాంటి మరో విషాద ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది.జైపూర్కు చెందిన దేవేంద్ర సందాల్ కోటాలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో మేనేజర్గా పని చేసేవారు.. అతని భార్య టీనా అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకువాలనే లక్ష్యంతో మూడేళ్ల పదవీకాలం ఉండగానే ముందస్తు రిటైర్మెంట్ ( వీఆర్ఎస్) తీసుకున్నారు. ఈ సందర్బంగా దేవంద్ర సహోద్యోగులు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. దండలు, శాలువాలు, స్నేహితులిచ్చిన పూల బొకేలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడి పరిస్థితి మారిపోయింది.नियति का खेल !पत्नी की तबीयत को देखते हुए पति ने लिया था VRS, रिटायरमेंट पार्टी में ही पत्नी की मौत,बीमार पत्नी की सेवा के लिए नौकरी छोड़ी, विदाई पार्टी में पत्नी ने हीं दुनिया छोड़ दी ।pic.twitter.com/yUn0xAGFch— राहुल चेची 🇮🇳 (@Rahulchechi26) December 25, 2024కళ్లు తిరుగుతున్నాయంటూ టీనా కుర్చీలో కూలబడింది. భార్య వీపుపై రుద్దుతూ సపర్యలు చేస్తూ మంచినీళ్లకు కోసం అడిగాడు. ఇంతలోనే పరిస్థితి మరింత విషమంగా మారిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధవీకరించారు.భర్తతో నవ్వుతూ, సంతోషంగా ఉన్న టీనా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించిన దృశ్యాలు సంబంధించిన వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటివరకూ హాయిగా నవ్వుతూ, అందర్నీ పలకరిస్తూ ఫొటోలు దిగిన ఆమెకు అవే చివరి క్షణాలవుతాయని ఎవరనుకుంటారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో టీనా ఈ ప్రపంచం నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. -
700 అడుగుల లోతు బోరు బావిలో చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
జైపూర్: రెండు వారాల వ్యవధిలో రాజస్థాన్లో మూడేళ్ల చిన్నారి చేతన బోరు బావిలో పడింది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది 20 గంటలుగా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. 700 అడుగుల లోతులో ఉన్న పాప ఆచూకీ కోసం బోరు బావి లోపలకు రెస్క్యూ బృందాలు కెమెరాను లోపలికి పంపాయి. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. సోమవారం రాజస్థాన్ రాష్ట్రం కోట్పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో మూడేళ్ల చేతన తన తండ్రితో కలిసి పోలానికి వెళ్లింది. తండ్రి పొలం పనులు చేస్తుండగా.. చేతన పొలంలో ఆడుకుంటుంది. ఆ సమయంలో ప్రమాదవ శాత్తూ పొలంలో ఏర్పాటు చేసిన 700 అడుగుల బోరుబావిలో పడింది. దీంతో భయాందోళన గురైన బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు చేతనను రక్షించేందుకు రంగంలోకి దిగాయి. చేతన 150 అడుగుల లోతులోకి జారినట్లు గుర్తించారు. బోరుబావి లోపల పాప ఆచూకీ కోసం కెమెరాలను పంపించారు. 20 గంటలకు బోరుబావిలో ఉన్న చేతనను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. బోరుబావి లోపల ఉన్న చేతనను సురక్షితంగా రక్షించేందుకు శాయశక్తులా రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. 700 फीट गहरे बोरवेल में फंसी बच्ची, गांव में चूल्हा नहीं जला। कैमरे में हाथ हिलाते हुए दिखी"दुआ करें, जिंदगी की ये जंग जीत जाए। 💕" pic.twitter.com/XJg5BDBDeR— Dinesh Bohra (@dineshbohrabmr) December 23, 2024 విఫలమైన ప్రయత్నం.. చివరిగా 150 అడుగుల లోతులో ఉన్న చేతనకు ఆక్సిజన్ పైపును లోపలికి పంపారు. బోరుబావికి ఓ వైపు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ వ్యవసాయం క్షేత్రం కావడంతో మట్టి తేమగా ఉంది. దీంతో తవ్వకాలను నిలిపివేశారు. అనంతరం, పొడవైన రాడ్కు బిగించిన హుక్ సాయంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతన సురక్షితంగా బోరుబావి నుంచి బయట పడుతుందని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఆర్యన్ కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ దౌస జిల్లాలోని కలిఖడ్ గ్రామాంలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ ఐదేళ్ల ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడ్డాడు. బాలుడి కోసం రెస్క్యూ బృందాలు సుమారు 57 గంటల పాటు శ్రమించాయి. చివరికి 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024 -
Jaipur Tanker Blast: మానవత్వమా.. నీవెక్కడ..?
జైపూర్ : మానవత్వానికి మాయని మచ్చ వంటి ఘటన రాజస్థాన్ జైపుర్లో చోటు చేసుకుంది. ఈ శుక్రవారం ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్ ఢీకొట్టి మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న బాధితులు తమని కాపాడాలని వేడుకుంటూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. స్థానికులు బాధితుల్ని రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు రాజస్థాన్లోని జైపుర్లో జైపుర్-అజ్మీర్ హైవేపై ఓ పెట్రోల్ బంకులో ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వ్యాపించాయి. ఆ సమయంలో బంకు వద్ద ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు.గాయపడిన వారిలో రాధేశ్యామ్ చౌదరి (32) ఒకరు. మంటల్లో చిక్కుకున్న రాధేశ్యామ్ తనని కాపాడాలని కోరుతూ 600 మీటర్లు పరిగెత్తారు. అక్కడే ఉన్న వారు రాధేశ్యామ్ను రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.రాధేశ్యామ్ చౌదరి నేషనల్ బేరింగ్స్ కంపెనీ లిమిటెడ్లో మోటార్ మెకానిక్. శుక్రవారం తెల్లవారు జామున విధులు నిమిత్తం ఇంటి నుంచి కంపెనీకి తన బైక్పై బయలు దేరాడు. ఎల్పీజీ ట్యాంకర్ను, ఓ ట్రక్ ఢీకొట్టే సమయంలో రాధేశ్యామ్ అక్కడే ఉన్నారు. మంటల్లో చిక్కుకున్నారు. తనని తాను రక్షించుకునేందుకు 600 మీటర్లు పరుగులు తీశారు. అనంతరం కుప్పుకూలాడు. కొద్ది సేపటికి స్థానికులు రాధేశ్యామ్ చౌదరి సోదరుడు అఖేరామ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాధేశ్యామ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని, వెంటనే హీరాపురా బస్ టెర్మినల్కు రావాలని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన అఖేరామ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు మీడియాకు వివరించారు. ‘నా సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలతో రోడ్డుపై ఆపస్మారస్థితిలో కనిపించాడు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 600 మీటర్లు పరిగెత్తినట్లు స్థానికులు చెప్పారు. తనని కాపాడాలని ఆర్తనాదాలు చేశారని, సాయం కోసం అర్దిస్తే ఒక్కరూ ముందుకు రాలేదని,బదులుగా చాలా మంది వీడియోలు తీశాడని విలపించారు. రాధేశ్యామ్ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాకకోసం ఎదురు చూశాం. కానీ రాలేదు. దీంతో కారులో నా సోదరుణ్ని జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించాం. అతను బ్రతుకుతాడనే నమ్మకం ఉంది. కానీ 85 శాతం కాలిన గాయాలు మరింత ఇబ్బంది పడుతున్నట్లు అఖేరామ్ కన్నీటి పర్యంతరమయ్యారు. -
ఎనిమిది సార్లు కారు బోల్తా పడితే.. తాపీగా ‘టీ ఉన్నాయా?’ అని అడిగారంట
జైపూర్ : ‘రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట’ ఓ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాల్లో ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన ఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.పోలీసుల వివరాల మేరకు.. రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ఐదుగురు ప్రయాణికులతో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంది. అయితే, మార్గం మధ్యలో జాతీయ రహదారి నుంచి మలుపు తిరుగుతుండగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఎస్యూవీ క్షణాల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది.ఊహించని పరిణామంతో స్థానికంగా ఉన్న ఇళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి. కారు తుక్కు తుక్కు అయ్యింది. ప్రమాద తీవ్రత ఉన్నప్పటికీ వాహనంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. राजस्थान के नागौर में दुर्घटना के बाद कार ने इतने पलटे खाये कि गिनती करना मुश्किल हो गया। सुखद बात यह रही कि इतना होने पर भी सब सुरक्षित रहे।#Nagaur #Rajasthan pic.twitter.com/9GC3bMoZOl— Ajit Singh Rathi (@AjitSinghRathi) December 21, 2024అన్నా.. టీ ఉన్నాయా?స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ‘కారు పల్టీలు కొట్టే సమయంలో డ్రైవర్ కారులో నుంచి దూకినట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిపోవడంతో మిగతా నలుగురు ప్రయాణికులు దిగారు. ఊహించని ఘోర ప్రమాదంలో కారు దిగిన నలుగురు ప్రయాణికులు స్థానికంగా ఉన్న కార్ షోరూంలోకి వెళ్లారు. అనంతరం, షోరూం సిబ్బందిని ‘టీ ఉన్నాయా’? అని అడిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఇంత ఘోర ప్రమాదం జరిగినా కారు ప్రయాణికులు స్పందించిన తీరుపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. నాగౌర్ నుండి బికనీర్ వరకు ప్రయాణంప్రమాద సమయంలో ఎస్యూవీ నాగౌర్ నుండి బికనీర్కు వెళ్తున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. ఫిర్యాదు ఆధారంగా ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించే పనిలో ఉండగా.. మితిమీరిన వేగం కూడా ఓ కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కారు ఎలా బోల్తా పడిందో మీరూ చూసేయండి. -
వీడియో: భయానక అగ్ని ప్రమాదం.. పలువురు సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సీఎన్జీ ట్యాంకర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. 20 మంది గాయపడ్డినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని అజ్మీర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆపి ఉంచిన సీఎన్జీ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ టెండర్లు చేరుకున్నాయి.जयपुर के अजमेर रोड भांकरोटा स्थित DPS स्कूल के सामने अलसुबह सीएनजी गैंस टैंकर में आग लगने से भीषण हादसा, कई वाहनों में आग लगने की सूचना. कई लोगों के झुलसने की सूचना.#Jaipur #Rajasthan pic.twitter.com/RjxNYyoNEA— Surendra Gurjar (@S_Gurjar_11) December 20, 2024ఘటనా స్థలంలో 22 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.#WATCH | Jaipur, Rajasthan | Jaipur DM, Jitendra Soni says, "4 people have died (in the incident). Around 40 vehicles caught the fire. Fire brigade and ambulances have reached the spot. The relief work is underway. The fire has been doused off and only 1-2 vehicles are left.… https://t.co/5l1uNq2lUd pic.twitter.com/p3XDxSJQto— ANI (@ANI) December 20, 2024 ప్రమాద స్థలికి సీఎం..ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా ప్రమాద స్థలికి చేరుకోనున్నారు.VIDEO | Rajasthan: A gas tanker caught fire on Ajmer Road in #Jaipur earlier today. Several vehicles were also gutted in fire. More details are awaited.#JaipurNews (Full video available on PTI videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/kIJcm3AQRJ— Press Trust of India (@PTI_News) December 20, 2024 -
ప్రభుత్వ అధికారిపై దాడి.. బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు మూడేళ్ల జైలు శిక్ష
జైపూర్: బీజేపీ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కారణంగా కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో, ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రజావత్, అతడి సహాయకుడు 2022లో ఫారెస్ట్ అధికారి రవి కుమార్ మీనాపై దాడి చేశారు. రాజావత్ తన మద్దతుదారులతో కలిసి డీసీఎఫ్ ఆఫీసులోకి వెళ్లి సదరు అధికారిని బెదిరింపులకు గురి చేసి... అనంతరం అధికారిపై చేయి చేసుకున్నారు. అయితే, ఓ పనికి సంబంధించి సదరు అధికారితో వాగ్వాదం తర్వాత ఆగ్రహానికి లోనైనా రజావత్.. దాడి చేశారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు అతని సహాయకుడు మహావీర్ సుమన్ కూడా ఉన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాతో వైరల్ అయ్యాయి.అయితే, ఈ ఘటనపై డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) రవికుమార్ మీనా ఫిర్యాదు మేరకు రజావత్, సుమన్లపై 2022 మార్చి 31న ఐపీసీ సెక్షన్లు 332, 353, 34, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నయాపురా పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణ సందర్బంగా తాజాగా రజావత్, సుమన్లకు ప్రత్యేక కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. సెక్షన్ 353 (ప్రభుత్వ అధికారి తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) సహా పలు సెక్షన్ల కింద కోర్టు వారిద్దరిని దోషులుగా నిర్ధారించారు. ఇదే సమయంలో దోషులకు ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా విధించింది.దోషిగా తేలిన అనంతరం మాజీ ఎమ్మెల్యే రజావత్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టు ఆదేశాలపై హైకోర్టులో అప్పీలు చేస్తాను. కోటలోని లాడ్పురా మాజీ ఎమ్మెల్యే కూడా ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్-3 కింద అభియోగాల నుంచి విముక్తి పొందారని చెప్పుకొచ్చారు. ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో రజావత్, సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!
ఒక విజయాన్ని అందుకోగానే హమ్మయ్యా..! అనుకుంటాం. ఏదో చాలా సాధించేశాం అన్నంతగా ఫోజులు కొడతాం. కానీ కొందరూ మాత్రం మహర్షి మూవీలో హీరో మహేష్ బాబు చెప్పినట్టుగా "సక్సెస్ అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం" అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతుంటారు. అబ్బా.. ! ఎన్ని విజయాలు అందుకున్నాడు..హీరో అంటే అలాంటి వాళ్లేనేమో అనే ఫీల్ కలుగుతుంటుంది మనకి. అలా వరుస విజయాలతో విస్మయానికి గురి చేస్తూ..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రాజస్థాన్కి చెందిన రోమన్ సైనీ. అతడి సక్సెస్ జర్నీ చూస్తే.. సాధించేయాలన్న పౌరుషం, కసి తన్నుకు రావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.రాజస్థాన్లో కోట్పుట్లీలోని రైకరన్పురా గ్రామానికి చెందిన రోమన్ సైనీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తల్లి గృహిణి, తండ్రి ఇంజనీర్. మన రోమన్ సక్సెస్ జర్నీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్లో అర్హత సాధించడంతో ప్రారంభమయ్యింది. అలా రోమన్ 21 ఏళ్లకి ఎంబీబీఎస్ పూర్తిచేసి, డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఏదో తెలియని వెలితి వెన్నాడుతూ ఉండేది. అప్పుడే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తొలి పోస్టింగ్ మధ్యప్రదేశ్ రావడంతో అక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేయడం ప్రారంభించారు. అయినా రోమన్ తన లక్ష్యాన్ని సాధించిన అనుభూతి కలగలేదు. ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మెదులుతూనే ఉంది. ఇక లాభం లేదనుకుని ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2015లో గౌరవ్ ముంజాల్, హేమేష్ సింగ్లతో కలిసి సొంతంగా అన్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్ని ప్రారంభించాడు.ప్రారంభంలో ఇదొక యూట్యూబ్ ఛానెల్. క్రమంగా ఇది ఒక ఎడ్టెక్గా మారి.. సివిల్స్ స్టడీ మెటీరియల్కి ప్రసిద్ధిగాంచింది. అలా ఇది కాస్త అన్ అకాడమీ సార్టింగ్ హ్యాట్ టెక్నాలజీస్ కంపెనీగా మారింది. ప్రస్తుతం దీని విలు రూ. 2600 కోట్లు. యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి సరసమైన ధరల్లో నాణ్యమైన కోచింగ్ని అందించే స్టడీ సెంటర్గా పేరుతెచ్చుకుంది. ఈ అకాడమీ నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు కోచింగ్ పొందుతున్నారు. రోమన్ అచంచలమైన కృషికి నిదర్శనంగా చాలా తక్కువ వ్యవధిలోనే మంచి కోచింగ్ సెంటర్గా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఈ అకాడమీతో రోమన్ ఆర్జించే జీతం తెలిస్తే విస్తుపోతారు. దగ్గర రూ. 88 లక్షల పైమాటే..!. ఇది కదా సక్సెస్కి సరైన నిర్వచనం..!.(చదవండి: వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..) -
57 గంటల తర్వాత బోరు బావి నుంచి బయటకు.. ప్రాణాలు కోల్పోయిన ఆర్యన్
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల పాటు శ్రమించారు. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషాదం సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ మధ్యాహ్నం 3గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ గంట తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు కదిలి వచ్చాయి. బోరుబావిలో పడ్డ బాలుడి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు, జేసీబీలు,డ్రిల్లింగ్ మెషిన్లతో ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపాయి. ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నీటి మట్టం దాదాపు 160 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేశారు. భూగర్భంలో ఆవిరి కారణంగా బాలుడి కదలికలను కెమెరాలో బంధించడంలో ఇబ్బంది మారింది. అదే సమయంలో భద్రతా సమస్యలు కూడా తలెత్తుతాయని అంచనా వేశారు. అయినప్పటికీ, 57 గంటల పాటు శ్రమించి బోరుబావి నుంచి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆర్యన్ సురక్షితంగా బయటకు తీశారు. గ్రీన్ కారిడార్ ద్వారా అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్తో కూడిన అంబులెన్స్లో ఆర్యన్ను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్ష చేసినా డాక్టర్లు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. -
150 అడుగుల బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం (డిసెంబర్9న) ఘటన చోటు చేసుకోగా మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం వరకు నిర్విరామంగా బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. #WATCH दौसा, राजस्थान: दौसा में खेलते समय एक 5 वर्षीय बच्चा बोरवेल में गिर गया। बचाव अभियान जारी है।DM देवेंद्र कुमार ने बताया, "बच्चा करीब 150 फीट गहराई में है, उसे लगातार ऑक्सीजन दिया जा रहा है। मेडिकल टीम मौके पर मौजूद है। SDRF, NDRF और सिविल डिफेंस की टीमें मौके पर पहुंच गई… pic.twitter.com/JECEDzVtxv— ANI_HindiNews (@AHindinews) December 9, 2024బోరు బావి ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ కొద్ది సేపటి క్రితం మాట్లాడుతూ.. ‘‘150 అడుగుల లోతులో ఉన్న బాలుడు ఆర్యన్ ఆరోగ్యం బాగుంది. ఆక్సీజన్ పంపుతున్నాం. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బావిలోకి కెమెరాలను పంపాము. బాలుడిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎంతవీలైతే అంత తొందరగా బాలుడిని రక్షించాలనే’’ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.బోరుబావిలో బాలుడు పడ్డాడనే సమాచారంతో స్థానికులు, జిల్లా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బాలుడి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు. ఆర్యన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. -
కిలో గోల్డ్ బిస్కెట్లు, కోట్ల నగదు.. కృష్ణుడి హుండీకి రికార్డు ఆదాయం
జైపూర్: రాజస్థాన్లోని ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. శ్రీకృష్ణుడి ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో, హుండీ ఆదాయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. రాజస్థాన్లో చిత్తోర్గఢ్ సమీపంలోని సన్వాలియా సేథ్ ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ప్రసిద్ధ శ్రీకృష్ణుడి ఆలయంలో హుండీని రెండు నెలల తర్వాత లెక్కించారు. హుండీ లెక్కింపు సందర్బంగా అందులో నుంచి కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. శ్రీకృష్ణుడికి చిన్న చిన్న బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, వెండి పిస్టల్ ప్రత్యేక వస్తువులను కూడా భక్తులు సమర్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా.. ఆలయానికి ఇప్పటివరకు వచ్చిన ఆదాయంలో ఇదే అతి పెద్ద మొత్తమని అధికారులు చెబుతున్నారు. ఇంకా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నట్టు చెప్పారు. అలాగే.. బంగారం, వెండి వస్తువులు, హుండీల నుంచి సేకరించిన వివిధ వస్తువులను తూకం వేసి వాటి విలువను లెక్కిస్తున్నట్టు తెలిపారు. ఆలయానికి భారీగా విరాళాలు భారీగా ఉండటంతో దశల వారీగా లెక్కిస్తున్నారు.Chittorgarh : श्री सांवलिया सेठ के भडांर से निकली 35 करोड़ की राशि, ढ़ाई किलो सोना, 64 किलो चांदी, सागवान की लकड़ी समेत 583 किलो चांदी का रथ भी आया चढ़ावे में, करीब 20 लाख की विदेश करेंसी भी मिली भंडार सेसिक्कों की गिनती अब भी जारीएक दर्जन से अधिक देशों की निकली विदेशी… pic.twitter.com/1Uy18JeewB— News India (@newsindia24x7_) December 6, 2024 -
ఉదయ్పూర్లో ఫ్యామిలీ డ్రామా.. ఆ వీలునామాలో అసలేముంది?
జైపూర్: మొఘలులుపై పోరాడిన మహారాణా ప్రతాప్ వారసులు ఆస్తుల కోసం, అధికారం కోసం వీధిన పడ్డారు. రాజస్థాన్లో ఉదయ్పూర్ కోట వద్ద కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ప్యాలెస్లోకి అడుగుపెట్టకుండా రాజ కుటుంబంలోని సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి.. పలువురు గాయపడ్డారు.ఏంటి ఈ మహరాణా ప్రతాప్ వారసుల గొడవమహారాణా ప్రతాప్ ప్రసిద్ధ రాజపుత్ర యోధుడు. రాజస్థాన్లోని మేవార్ రాజు. భారతదేశ స్వాంతంత్య్ర ఉద్యమంలో మహారాణా భూపాల్ సింగ్ మేవార్ రాజు. ఈయన 1955లో శ్రీ ఎక్లింగ్జీ ( Shri Eklingji Trust) ట్రస్ట్ను స్థాపించారు. ఆ ట్రస్ట్ బాధ్యతల్ని ఆయన వారసులు కొనసాగిస్తూ వచ్చారు. అయితే క్రమేపీ ఈ ట్రస్ట్ వ్యవహారాలు పాలన విషయంలో కుటుంబసభ్యుల మధ్య పొరపచ్చాలు వచ్చాయి.75వ మహారాణా విశ్వరాజ్ సింగ్ తాత భగవత్ సింగ్కు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు మహేంద్ర సింగ్ కాగా మరొకరు అరవింద్ సింగ్. తన మరణానికి ముందు ట్రస్ట్ నిర్వాహక బాధ్యతల నుంచి తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్ను తప్పించి తన చిన్న కుమారుడు అరవింద్ సింగ్కు అప్పగించారు భగవంత్ సింగ్.వీలునామాలో ఉంది ఇదే..తండ్రి నిర్ణయంతో కలత చెందిన మహేంద్ర సింగ్ కోర్టును ఆశ్రయించారు. మే 15, 1984 నాటి తన చివరి వీలునామాలో భగవత్ సింగ్ తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్ను కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు పేర్కొన్నారు. తన చిన్న కుమారుడే ట్రస్ట్ కార్యనిర్వహకుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అదే ఏడాది నవంబర్లో తండ్రి భగవత్ సింగ్ మరణించడంతో ట్రస్ట్ ఛైర్మన్గా అరవింద్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ ఏడాదిలో మహేంద్ర సింగ్ మరణానంతరం.. ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం, సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్పుర్లోని సిటీ ప్యాలెస్ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంటుంది.అయితే, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్ మేవార్ .. తన కుమారుడు లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ తమ బలగాన్ని ఉపయోగించి విశ్వరాజ్ సింగ్ మేవాడ్ను రాజభవనంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో విశ్వరాజ్ మద్దతుదారులు రాళ్లదాడికి దిగారు. లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ అనుచరులు సైతం ప్రతి దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపై పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
నాటకీయ పరిణామాల మధ్య స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
జైపూర్: రాజస్థాన్లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.అయితే.. ఈ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ కేంద్రంలో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అమిత్ చౌదరీపై ఈనియోజకర్గంలోస్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్ మీనా చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా హై డ్రామా మధ్య గురువారం నరేష్ మీనా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు బృందం ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ చేపట్టి అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి ముందు నరేష్ మీనా మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను లొంగిపోను. నా మద్దతుదారులంతా పోలీసులను చుట్టుముట్టండి. ట్రాఫిక్ జామ్ చేయండి’’అని అనుచరులకు పిలుపునిచ్చారు.‘‘ భారీగా పోలీసులు.. లాఠీలు, షీల్డ్లను ధరించి.. మేము వ్యూహాత్మకంగా అతను ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. మేం అతన్ని లొంగిపోవాలని అభ్యర్థించాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’’ అని చెప్పామని టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.మరోవైపు.. పోలింగ్ బూత్లో మూడు అదనపు ఓట్లను చేర్చేందుకు చౌదరి కుట్ర పన్నారని మీనా ఆరోపించారు. అయితే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ కొందరు ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. ఎస్డీఎం, తహసీల్ అధికారులు వారిని ఒప్పించేందుకు వెళ్లారు. చర్చల సమయంలో స్వతంత్ర అభ్యర్థి (నరేష్ మీనా) ఎస్డీఎంను చెప్పుతో కొట్టారు’’ అని ఎస్పీ సాంగ్వాన్ వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు (మీనా మద్దతుదారులు), పోలీసుల మధ్య చెలరేగిన హింసాకాండలో పోలీసు వాహనాలతో సహా ఎనిమిది కార్లు, 10పైగా మోటార్సైకిళ్లకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. -
సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్పై ఎమ్మెల్యే అభ్యర్థి దాడి
జైపూర్ : పోలింగ్ను పర్యవేక్షిస్తున్న సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్పై (ఎస్డీఎం)పై దాడి ఘటన కలకలం రేపుతుంది. పోలింగ్ బూత్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి ఎస్డీఎంపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.రాజస్థాన్లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఆ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ స్టేషన్లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్ను పర్యవేక్షిస్తున్నారు.ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్క్రుత నేత, డియోలీ-యునియారా ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి నరేష్ మీనా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఎస్డీఎం అమిత్ చౌదరిపై దాడి చేశారు. ఎస్డీఎం అమిత్ చౌదరి.. తనతో సన్నిహితంగా ఉన్న ఓ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడేలా ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు నరేష్ మీనాను పోలింగ్ కేంద్రం బయటకు తీసుకువచ్చారు. ఎస్డీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైటాయించారు. రాజస్థాన్లోని ఝుంఝును, దౌసా, డియోలి-ఉనియారా, ఖిన్వ్సర్, చౌరాసి, సాలంబెర్, రామ్గఢ్ స్థానాలు ఉప ఎన్నిక కొనసాగుతుంది. కాగా,గతేడాది రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 114 స్థానాల్లో, కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు. मैं देवली उनियारा से नरेश मीणा का समर्थन कर रहा था परंतु आज जिस प्रकार का गंदा रवैया उनके द्वारा देखा गया वह शर्मनाक है।@NareshMeena__ की अभी कोई हैसियत नहीं है कि वह एक एसडीएम के ऊपर हाथ उठाएं, यह लोकतंत्र व भारतीय प्रशासन पर कलंक है। एकतरफ देश की सबसे कठिन परीक्षा देकर आया एक… pic.twitter.com/urAxAjR3BI— Priyanshu Kumar (@priyanshu__63) November 13, 2024 -
కల్వర్టును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి
జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సికార్లో మంగళవారం మధ్యాహ్నం బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సలాసర్ నుంచి వెళ్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్గఢ్ వద్దకు రాగానే ఎదురుగా కల్వర్టును ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం లక్ష్మణ్గఢ్లోని ప్రభుత్వ సంక్షేమ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు నిర్ధారించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేంద్ర ఖిచాడ్ తెలిపారు. #Sikar: #लक्ष्मणगढ़ पुलिया के पास भीषण हादसामृतकों की संख्या पहुंची12, एक और घायल ने तोड़ा दम, 35 से अधिक लोग हुए थे घायल, सीकर अस्पताल में पांच मृतकों के शव, सात शव रखे है लक्ष्मणगढ़ अस्पताल की मोर्चरी में, घायलों का जारी है इलाज, सुजानगढ़ से नवलगढ़ आ रही थी बस #RajasthanNews pic.twitter.com/LHZCnSpscb— Manoj Bisu Sikar (@manoj_bisu) October 29, 2024 -
ఐఏఎస్ టీనా దాబీ వైరల్ .. అధికార పార్టీ నేతకు వంగి వంగి దండాలు
జైపూర్ : ఒకటి,రెండు,మూడు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఓ జిల్లా ఐఏఎస్ అధికారిణి సదరు అధికార పార్టీ నేతకు వంగి వంగి పెట్టిన దండాలు. ఇప్పుడీ అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారిణి టీనా దాబి గత నెలలో రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. నగరంలో పరిశుభ్రత, స్వచ్ఛత కోసం ‘నవో బార్మర్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నవో బార్మర్ కార్యక్రమానికి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ పూనియాను ఆహ్వానించారు."दादागिरी करके सफाई करवा रहे हो, बाड़मेर भी इंदौर जैसा हो जाएगा। आप अच्छा काम कर रही हो।"#tinadabi @DrSatishPoonia pic.twitter.com/DDc16wrtcf— Mukesh Mathur (@mukesh1275) October 24, 2024 అయితే కార్యక్రమానికి వచ్చిన సతీష్ పూనియా కాన్వాయ్ నుంచి దిగి వస్తూనే ఫోన్లో బిజీ అయ్యారు. అదే సమయంలో సతీష్ పూనియాను ఆహ్వానించేందుకు వచ్చిన టీనా దాబి ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కరించారు. కొద్ది సేపటి తర్వాత టీనా దాబి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇండోర్ మాదిరిగా బార్మర్ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సతీష్ పూనియాకు జిల్లా కలెక్టర్ టీనా దాబి వంగి వంగి దండాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టీనా దాబిరాజస్థాన్కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్గా నిలిచిన ఫీట్ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్లో టాపర్. రెండో ర్యాంకర్ అథర్ అమీర్ ఖాన్. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. 2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట..2021లో జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది.గతేడాది 2013 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్ బ్యాచ్. గ్లామర్ ఉన్న ఆఫీసర్గా ఇన్స్టాగ్రామ్లోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. టీనా దబీకి సుమారు మిలియన్న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. -
టెంపోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 11 మంది మృతి
జైపూర్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు.. టెంపును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది చిన్నారులు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని థోల్పుర్లో శనివారం అర్ధరాత్రి స్లీపర్ కోచ్ ట్రావెల్స్ బస్సు టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే, వీరంతా బరౌలీలో ఓ వివాహా వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
డ్రైవర్ లెస్ కారులో మంటలు.. వీడియో వైరల్
జైపూర్: రాజస్థాన్లో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. జైపూర్లో డ్రైవర్ లెస్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై పార్క్ చసిన బైక్లను ఢీకొడుతూ మంటలతోనే కారు ముందుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ కారు ఓనర్ అల్వార్కు చెందిన ముఖేష్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును ముఖేష్ గోస్వామి అతని స్నేహితుడు జితేంద్ర జంగిద్ నడిపారు. అయితే కారు బానెట్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటాన్ని ఆయన గమనించారు. మంటలు చెలరేగడంతో కారు హ్యాండ్బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ జితేంద్ర.. అందులో నుంచి బయటకు దూకేశారు. ఎలివేటెడ్ రోడ్డులో కారు మంటలతో అక్కడ పార్క్ చేసిన పలు బైక్లను ఢీకొడుతూ కిందికి కదిలింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారి దినేష్ కుమార్ ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. Watch Burning Car on #Jaipur Road Causes Panic Among Commuters | #Burningcar pic.twitter.com/mzEKAGCyU6— KINGSNEWS (@KINGSNEWS7) October 13, 2024చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్లో తుది ట్రయల్స్ -
ఉత్తమ పర్యాటక గ్రామంగా రాజస్థాన్ గ్రామం! అక్కడ మద్యం, మాంసం ముట్టరట!
రాజస్థాన్లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం భారతదేశంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యింది. నవంబర్ 27న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ప్రదానం చేయనుంది. భారతదేశంలోని రాష్ట్రాలలో ఎన్నో గొప్ప విశిష్టత గల గ్రామలున్నాయి. వాటన్నింటిని వెనక్కినెట్టి రాజస్థాన్లోని ఈ గ్రామమే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎలా ఎంపికయ్యిందో వింటే ఆశ్చర్యపోతారు. ఈ గ్రామానికి ఉన్న స్పెషాలిటీ తెలిస్తే.. ఈ రోజుల్లో కూడా ఇలా నియబద్ధంగా ఎవరు ఉంటున్నారు అని ఆశ్చర్యపోతారు. రాజస్తాన్లోని బీవర్ జిల్లాలోని దేవమాలి గ్రామం పేరుకి తగ్గట్టుగానే చక్కటి జీవనశైలితో దేదీప్యమానంగా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలెవ్వరూ కూడా మాంసం, చేపలు, మద్యం ముట్టరట. ఇలా అందరూ నియమబద్ధంగా ఉండటం అంత ఈజీ కాదు గదా..!. అలాగే అక్కడ వేప కలపను ఎవ్వరూ కాల్చడం వంటివి చేయరట. అంతేగాదు కిరోసిన్ ఉపయోగించడం కూడా నిషిద్ధం. ఆ గ్రామంలో దేవ్నారాయణ్ ఆలయం ప్రసిద్ధ ఆలయంగా పూజలందుకుంటోంది. ప్రతి ఏడాది లక్షలాదిమంది పర్యాటకులు సందర్శించడానికి వస్తుంటారట. మసుదా ఉపవిభాగంలోని ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ గ్రామం సుమారు మూడు వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ సిమ్మెంట్, కలపతో చేసిన పక్కా ఇళ్లు కూడా ఉండవు. అన్ని మట్టితో చేసిన ఇళ్లే ఉంటాయి. అయితే కొండపై వెలసిన దేవనారాయణుని అందమైన ఆలయం ఈ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక ఈ ఉత్తమ పర్యాటక గ్రామ పోటీని పర్యాట మంత్రిత్వ శాఖ నిర్వహించింది. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ గొప్ప సంస్కృతిని కొనసాగిస్తున్న గ్రామాలను గుర్తించి మరీ ఆ గ్రామాన్ని ఎంపిక చేశారు.. ముఖ్యంగా సమతుల్య జీవన విధానం, పర్యావరణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉత్తమ పర్యాట గ్రామలను ఎంపిక చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాటన్నింటి ఆధారంగానే 'దేవమాలి గ్రామం' ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యిందని మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "రాజస్థాన్ గర్వించదగ్గ ఘట్టం!. ఈ గ్రామం సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది." అని సోషల్ మీడియా ఎక్స్లో పేర్కొన్నారు. అలాగే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దేవమాలి గ్రామాన్ని అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అనేది రాజస్థాన్కి ఎంతో గర్వకారణం అన్నారు. (చదవండి: అసామాన్య వనిత 'అంబికా పిళ్లై'!..ఓ పక్క కేన్సర్తో పోరాటం మరోవైపు..!) -
ఇంగ్లిష్ స్పీచ్తో అదరగొట్టిన మహిళా సర్పంచ్..ఆశ్చర్యపోయిన ఐఏఎస్ ఆఫీసర్!
ఓ సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఇంగ్లీష్ స్పీచ్కి అందరూ ఫిదా అయ్యిపోయారు. ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఆమె ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఘటన రాజస్తాన్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..రాజస్తాన్ బార్మర్లో జరిగిన ఒక కార్యక్రమానికి గౌరవ అతిథిగా కలెక్టర్ టీనాదాబి విచ్చేశారు. ఆ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ సోను కన్వర్ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి కలెక్టర్కి ఆంగ్లంలో స్వాగతం పలికింది. " ఈరోజులో తాను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను. ముందుగా మా కలెక్టర్ టీనా మేడమ్ స్వాగం పలుకుతారు. ఓ మహిళగా ఆమెను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నా" అంటూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె నీటి సంరక్షణపై కూడా ప్రసంగించింది. ఆ వేదికపై మహిళా సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడిన తీరు అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. అంతేగాదు ఒక్కసారిగా ఆ వేదిక మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆ సర్పంచ్ ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి టీనా సైతం ఆశ్చర్యంగా అలా చూస్తుండిపోయారు. కాగా, 2015లో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (UPSC) పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే అగ్రస్థానంలో నిలిచి కలెక్టర్గా అజ్మీర్ నుంచి కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం టీనా దాబీ జైపూర్లో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కమిషనర్గా పనిచేస్తున్నారు. ఇటీవలే బార్మర్ జిల్లాకు కలెక్టర్గా బదిలీ అయ్యారు. बाड़मेर में IAS टीना डाबी @dabi_tina के सामने जब राजपूती पोशाक और घूँघट में जालीपा महिला सरपंच सोनू कँवर ने जब अपना उद्बोधन अंग्रेज़ी से शुरू किया तो उपस्थित सब लोग चौंक गए और टीना डाबी के चेहरे की मुस्कान बयां कर रही है l..जिला कलेक्टर खुद को ताली बजाने से नही रोक पाए pic.twitter.com/fLYuo0gqJo— Kailash Singh Sodha (@KailashSodha_94) September 14, 2024 (చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!) -
రాజకీయలపై రాజస్థాన్ మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
జైపూర్: రాజకీయాల్లో నాయకులు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సి వస్తుందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుధర రాజే అన్నారు. శనివారం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. ప్రతి నాయకుడు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సిందే. రాజకీయాల్లో మూడు ముఖ్యమైన విషయాలు ఉంటాయి. పదవి, మత్తు, స్థాయి. పదవి, మత్తు ఎప్పుడు ఉండకూడదు. పార్టీలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటే స్థాయి దానికదే పెరుగుతుంది. రాజకీయలు అంత ఈజీ కాదు. రాజకీయాల్లో ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ పార్టీ కోసం పని చేస్తూనే ఉండాలి. ప్రజలను సమన్వయం చేయటం కూడా అంత సులభం కాదు. మన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. గతంలో కొంతమంది నాయకులు అభివృద్ది చేయటంలో విఫలం అయ్యారు’’ అని అన్నారు.ఇక.. ఇటీవల ఆమెను పార్టీలో పక్కకు పెడుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఏడాది బీజేపీ అధిష్టానం మరోసారి వసుంధర రాజేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదు. జైపూర్లోని సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మను బీజేపీ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 11 స్థానాల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైంది. -
బతికున్నానని చెప్పేందుకు.. పోలీసులు సైతం షాక్ తిన్న ఘటన!
చిల్లర సొమ్ములకు, చిన్నాచితకా కారణాలకు నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజులివి. అయితే వరుస దాడులతో ఇక్కడో వ్యక్తి వార్తల్లో నిలిచాడు. అయితే అలా ఎందుకు దాడులు చేశావని అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం విని పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. రాజస్తాన్లోని బాలొత్రా గ్రామానికి చెందిన బాబురామ్ భిల్ మీద డజన్కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో దాడుల కేసులే ఎక్కువ ఉన్నాయి. కేవలం తాను బతికే ఉన్నానని నిరూపించుకోవటం కోసమే ఆయన ఆ దాడులు చేశానని చెప్పేసరికి అంతా షాక్ తిన్నారు. ‘‘నేను చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇష్యూ అయ్యింది. అది తెలిసి నాకు నోట మాట పడిపోయింది. నా ఆస్తిని లాక్కునే ప్రయత్నంలో భాగంగానే అలా దొంగ సర్టిఫికెట్ సృష్టించారు. అందుకే నేను బతికి ఉన్నానని సమాజానికి నిరూపించుకోవాలనుకున్నా. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు. ఇలా అయినా అందరికీ తెలుస్తుంది కదా’’ అని భిల్ అంటున్నారు.Villains are not born they are made pic.twitter.com/uouwZuug9y— narsa. (@rathor7_) July 24, 2024ఈ ఒక్క ఉదంతమే కాదు.. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులకు ఎక్కుతున్న కేసుల సంఖ్య మన దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఒక కారణమైతే, అవినీతి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్ల జారీ సమయాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి కేసులు వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు దోపిడీకి ఎక్కువగా గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవస్థలు సక్రమంగా పని చేయడం, అధికారుల అవినీతి కట్టడి జరిగినప్పుడే రాజస్థాన్ తరహా ఘటనలు తగ్గుతాయని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్నికల్లో ఓటమి.. మంత్రి పదవికి బీజేపీ నేత రాజీనామా
జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర మంత్రి కిరోడి లాల్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తనకు అప్పగించిన పలు స్థానాల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామాను ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు పంపించారు. ‘‘ కిరోడి లాల్ మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారు. పది రోజుల క్రితం సీఎంకు రాజీనామా లేఖను అందజేశారు’’ అని అధికారిక వర్గాలు తెలిపాయి.లోక్సభ ఎన్నికల్లో కిరోడి లాల్ మీనాకు బీజేపీ ఏడు స్థానాలను అప్పగించింది. ఈ స్థానాల్లో బీజేపీ ఓటమిపాలైంది. తన సొంత నియోజకవర్గం దౌసాలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్లో మొత్తం 25 స్థానాలకు 14 సీట్లను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 8 ఎనిమిది సీట్లు విజయం సాధించింది. మిగతా పార్టీలు మూడు సీట్లను గెలుచుకున్నాయి. -
నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్గా..!
బాల్య వివాహాల కారణంగా ఎంతోమంది అమ్మాయిల జీవితాలు చిదిగిపోతున్నాయి. వయసుకు మించిన కుటుంబ బాధ్యతలతో అనారోగ్యం పాలై జీవితాలను కోల్పోతున్నారు. అందుకే ప్రభుత్వం సైతం ఇలాంటి వాటిని కట్టడి చేసేలా చట్టాలు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా భారత్లోని ఇంకా కొన్ని గ్రామాల్లో నేటికి బాల్య వివాహాలు జరుగుతూనే ఉంటున్నాయి. అలానే రూపా యాదవ్ అనే మహిళకు ఎనిమిదేళ్ల వయసులోనే పెళ్లైపోయింది. నిజానికి రూపా చిన్ననాటి నుంచే మంచి మెరిటి స్టూడెంట్ కావడంతో ఉన్నత చదువులు చదవాలని ఎన్నో కలలకు కంది. కానీ ఈ పెళ్లితో తన ఆశలన్నీ కల్లలైపోకుండా అన్ని రకాల ఒత్తిడులను తట్టుకుంటూ అనుకున్నది సాధించింది. పైగా తన గ్రామానికి, కుటుంబానికి ఆదర్శంగా నిలిచింది.రాజస్థాన్లోని కరిరి అనే చిన్న గ్రామానికి చెందిన రూపా యాదవ్ ఎనిమిదేళ్ల ప్రాయంలోనే వివాహం అయిపోయింది. ఆమె పెదనాన్న రూపా మామాగారి ఇద్దరు కొడుకులకు తనను, ఆమె అక్కను ఇచ్చి పెళ్లి చేస్తామని వాగ్దానం చేశారు. దీంతో రూపాకి చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. అయితే రూపా తండ్రికి ఆమెను బాగా చదివించాలనే కోరిక ఉండేది. కానీ తన అన్న ఇచ్చిన మాట కారణంగా ఏమి చేయలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అయితే ఆమె చిన్నిపిల్ల కావడంతో మెచ్యూర్ అయ్యేంత వరకు పుట్టింట్లోనూ ఉండేలా పెద్దలు నిర్ణయించడంతో పదోతరగతి వరకు పుట్లింట్లో హాయిగా నిరాటకంగా చదువుకుంది. పదోతరగతిలో ఏకంగా 86 శాతం మార్కులతో పాసయ్యి అందర్నీ ఆశ్చర్యపరించింది. ఆ గ్రామంలో ఎవరికి ఇన్ని మార్కులు రాకపోవడంతో ఒక్కసారిగా గ్రామం అంతా రూపాను గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. అంతేగాదు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. బాగా చదివించమని గ్రామ ప్రజలంతా రూపా తండ్రిని ప్రోత్సహించారు. ఇంతలో రూప పెద్ద మనిషి అవ్వడం అత్తారింటికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరగడం అన్ని చకచక జరిగిపోయాయి. ఇక ఇక్కడితో ఆమె చదువు ఆగిపోతుందని తండ్రి బాగా దిగులు చెందాడు. అయితే రూపా బావగారు ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం రానివ్వమని ఆమె తండ్రికి హామి ఇచ్చారు.ఆ వాగ్దానాన్ని రూపా మెట్టినిల్లు నిలబెట్టుకుంది. అప్పులు చేసి మరీ ఆమెను ఉన్నత చదువులు చదివించారు. ఇలా చేస్తున్నందుకు సమజం నుంచి హేళనలు, అవమానాలు ఎదురయ్యేవి కూడా. అయినా వాటిని పట్టించుకోకుండా కోచింగ్ క్లాస్లకు పంపించి మరి మంచి చదువులు చదివించారు. అలా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో చేరి చదువుకుంటూ నీట్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యింది. ఆమె ఫీజుల కోసం రూపా భర్త, బావగారు ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చేది కూడా. అంతలా రూపాకు తన కుటుంబం నుంచి మంచి ప్రోత్సహం లభించింది. వారి ప్రోత్సహానికి తగ్గట్టుగానే రూపా బాగా చదివి నీట్లో పాసై బికినీర్లోని సర్దార్ పటేల్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందింది. అలా తన తన అత్తమామలు, భర్త, బావగారి సాయంతో డాక్టర్ అవ్వాలనే కలను సాకారం చేసుకుంది. ఐదేళ్ల ఎంబీబీఎస్ కోర్సును ఆ కళాశాలలో సాగిస్తుండగా..రెండేళ్లు హాయిగా గడిచిపోయాయి. లాక్డౌన్ సమయంలో ఇంటి వచ్చాక మూడో ఏడాది ఫైనల్ పరీక్షల టైంలో ప్రెగ్నెంట్ అయ్యింది. అయితే ఆమె ఇంకా రెండేళ్ల చదువు సాగించాల్సి ఉంది. అయినా ఆమె చదువుని, మాతృత్వాన్ని రెండింటిని వదులుకోకుడదని గట్టిగా నిశ్చయించుకుంది. ఫైనలియర్ పరీక్షల టైంలో రూపా కుమార్తె వయసు కేవలం 25 రోజులు. అలానే బాలింతరాలిగా కాలేజ్కి వచ్చి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాసయ్యింది. తన కూతురు పుట్టిన రోజున శస్త్ర చికిత్సకు సంబంధించిన చివరి పరీక్ష..మూడు గంటల్లో పరీక్ష రాసి వచ్చి తన కూతురు పుట్టిన రోజుని జరుపుకుంది రూపా. ఎక్కడ అటు కుటుంబ బాధ్యతలను, కెరీర్ పరంగా తన చదవుకి ఆటంకం రానివ్వకుండా రెండింటిని చాలచక్యంగా బ్యాలెన్స్ చేసింది. అలా ఆమె 2022లో సర్టిఫైడ్ డాక్టర్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సన్నద్దమవుతూనే డాక్టర్ వృత్తిని కొనసాగిస్తుంది. ఈ మేరకు రూపా మాట్లాడుతూ..మనం కోరుకున్నది చేయాలి అనుకుంటే ఎలాంటి స్థితిలోనూ వదిలిపెట్టని పట్టుదల ఉంటే అనుకున్నది సాకారం చేసుకోగలరు. అంతేగాదు ఆ పట్టుదలే ఆ ఆటంకాలు, అవాంతరాలని పక్కకు పోయేలా చేస్తుంది అని చెబుతోంది రూపా యాదవ్. చివరిగా ఎవ్వరికీ ఏది కష్టం కాదని, ప్రతిఒక్కరూ అన్ని సాధించగలరని అందుకు తానే ఓ ఉదాహరణ అని అంటోంది రూపా. రియల్లీ రూపా గ్రేట్ కదూ.! తన కలను సాకారం చేసుకుంది, అలాగే తన అత్తమామలకు, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి మంచి పేరు తెచ్చుకుంది.(చదవండి: సివిల్స్లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్! కోచింగ్ లేకుండా తొలి..) -
సివిల్స్లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!
ఓ మోడల్ గ్లామర్ రంగంలో రాణిస్తూ ప్రతిష్టాత్మకమైన సివిల్స్ ఎగ్జామ్ వైపుకి అడుగులు వేసింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గ్లామరస్ రోల్కి విభిన్నమైన రంగంలోకి అడుగుపెట్టడమే గాక ఎలాంటి కోచింగ్ లేకుండా విజయ సాధించి అందరికీ స్పూర్తిగా నిలిచింది ఈ మోడల్. ఆమె ఎవరంటే..రాజస్థాన్కు చెందిన ఐశ్వర్య షియోరాన్ సైనిక నేపథ్య కుటుంబానికి చెందింది. అందువల్లే ఆమె దేశానికి సేవ చేసే ఈ సివిల్స్ వైపుకి మళ్లింది. ఆమె తన ప్రాథమిక విద్యనంతా చాణక్యపురిలోని సంస్కతి పాఠశాల్లో పూర్తి చేసింది. ఇంటర్లో ఏకంగా 97.5 శాతం మార్కులతో పాసయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మోడలింగ్ పోటీల్లో పాల్గొంది. అలా మొదలైన ఆమె ప్రస్థానం పలు మోడలింగ్ పోటీల్లో పాల్గొనడంతో సాగిపోయింది. ఆ విధంగా ఆమె 2015లో మిస్ ఢిల్లీ కిరీటం, 2014లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్, 2016లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచింది. ఈ మోడలింగ్ అనేది ఆమె అమ్మకల అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని తెలిపింది ఐశ్వర్య. ఆ తర్వాత కెరీర్పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. 2018లో ఐఐఎం ఇండోర్కు ఎంపికైన తాను సివిల్స్ వైపే దృష్టి సారించినట్లు తెలిపారు. అలా 2018-2019లో సివిల్స్ ప్రిపరేషన్లో మునిగిపోయింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తనకు తానుగా ప్రిపేర్ అయ్యింది. తొలి ప్రయత్నలోనే సివిల్స్ 2019లో విజయం సాధించి..93వ ర్యాంక్ సాధించారు. తన ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ..ఇక తాను ఈ సివిల్స్ ప్రిపరేషన్ కోసం 10+8+6 టెక్నిక్ ఫాలో అయ్యానని చెప్పారు. అంటే పదిగంటలు నిద్ర, ఎనిమిది గంటలు నిద్ర, ఆరుగంటలు ఇతర కార్యకలాపాలు. ఇక కోచింగ్ దగ్గర కొచ్చేటప్పటికీ వారి వ్యక్తిగత అభిరుచికి సంబధించింది అని అన్నారు. ఎప్పుడైనా ఇలాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు సాధించగలమా లేదా అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే దిగాలి అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. ఇక ఆమె తండ్రి విజయ్ కుమార్ ఆర్మీలో కల్నల్. ఆమె తల్లి సుమన్ షియోరాన్ గృహిణి. రాజస్థాన్లో జన్మించిన ఐశ్వర్య ఢిల్లీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఈ మధ్యే తెలంగాణలో రాష్ట్రం కరీంనగర్కు బదిలీ అయ్యింది. కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ప్రస్తుతం ఐశ్వర్య ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోంది. మోడల్ నుంచి ప్రజలకు సేవ చేసే అత్యున్నత రంగంలోకి రావడమే గాక కేవలంలో ఇంట్లోనే జస్ట్ పదినెల్లలో ప్రిపేర్ అయ్యి సివిల్స్లో విజయం సాధించింది. తపన ఉంటే ఎలాగైనా సాధించొచ్చు అనేందుకు స్ఫూర్తి ఐశ్వర్యనే అని చెప్పొచ్చు కదూ..!(చదవండి: కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!) -
పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడిన ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. అందులో నలుగు చిన్నారులు ఉన్నారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో రాజగఢ్ పిప్లోడి వద్ద ఓ వివాహ ఊరేగింపులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన మరో 15 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలానికి చేరకుని పరిశీలించారు. రాజస్థాన్లోని మోతీపురా నుంచి కులంపూర్కు ఊరేగింపుగా వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందినవారిలో రాజస్థాన్కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్ స్పందించారు. ‘‘రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసులతో టచ్లో ఉన్నాం. రాజస్తాన్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరకున్నారు. గాయపడినవారు రాజగఢ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమందిని భోపాల్ తరలించాం’’ అని ఎక్స్లో తెలిపారు. -
రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు!
రోల్స్ రాయిస్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచే కార్లను ఉత్పత్తి చేసిన ప్రముఖ బ్రాండ్ ఇది. అందులో ఇరవై శాతం కార్లు భారత్కే దిగమతి అయ్యేవట. అంటే ఆనాడే మన భారతీయుల రాజులకు ఆ కార్లంటే ఎంత మోజు ఉండేదో క్లియర్గా తెలుస్తోంది. అలాంటి లగ్జరియస్ కార్లతో ఓ భారతీయరాజు నగరంలోని వీధులను ఊడిపించేందుకు ఉపయోగించాడట. అంత ఫేమస్ కార్లను ఇలా చెత్తను ఊడ్చేందుకు ఉపయోగించాడో వింటే ఆశ్చర్యపోతారు. అంతేగాదే ఏకంగా ఆ కంపెనీ ఏ దిగొచ్చి క్షమాపణలు చెప్పి ఆరు సరికొత్త కార్లను ఇచ్చిందట. ఏంటా కథ చూద్దామా..!ఆ భారతీయ రాజు పేరు రాజస్థాన్లోని అల్వార్కు చెందిన ప్రముఖ మహారాజు జైసింగ్. ఆయన వీటిని కొనాలని అనుకుంటే.. ఒకేసారి మూడు రోల్స్ రాయిస్లను కొనుగోలు చేసేవారట. ఆ క్రమంలోనే 1920 సంవత్సరంలో అల్వార్ మహారాజు జైసింగ్ లండన్లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నారు. ఒకసారి సాధారణ వస్త్రధారణలోనే రోల్స్ రాయిస్ షోరూమ్లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఓ బ్రిటీష్ సేల్స్ మాన్ మహారాజా జై సింగ్ను చూసి చూడనట్లు వ్యవహారించాడు. దీన్ని అవమానంగా భావించిన మహారాజు వెంటనే తన హోటల్ గదికి వెళ్లిపోయారు.తరువాత జై సింగ్ తన సేవకులతో షోరూమ్కు కాల్ చేయించి.. అల్వార్ నగర రాజువారు కొన్ని కార్లను కొనుగోలు చేయబోతున్నట్లుగా తెలయజేశారు. దీంతో రాజు రాకను పురస్కరించుకుని షోరూమ్లోని సేల్స్ మెన్స్ అందరూ బారులు తీరడంతో పాటు రెడ్ కార్పెట్ పరిచారు. అప్పుడు రాజు షోరూమ్ను సందర్శించి.. అక్కడ ఆరు కార్లు ఉంటే అన్నింటినీ ఒకేసారి కొనుగోలు చేశారు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలయ్యింది. ఆయన అక్కడ జరిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకని, ఆ ఆరు రోల్స్ రాయిస్ దేశంలో దిగుమతి అవ్వగానే వీధులను ఊడ్చేందుకు ఉపయోగించాలని మున్సిపాలిటీని ఆదేశించారు.అతి తక్కువ సమయంలోనే ఈ వార్త యావత్ ప్రపంచం అంతా వ్యాపించింది. అప్పటివరకు వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థగా ఉన్న రోల్స్ రాయిస్ గుడ్విల్, ఆదాయం ఒక్కసారిగా పతనం అయ్యాయి. దీంతో కంగుతిన్న రోల్స్ రాయిస్ వెంటనే తమ ప్రవర్తనకు క్షమాపణ చెబుతూ మహారాజా జై సింగ్ కు టెలిగ్రామ్ పంపింది. అంతేగాదు ఆయన ఆగ్రహం చల్లారేలా ఆరు సరికొత్త కార్లను ఉచితంగా అందించింది. దీంతో రోల్స్ రాయిస్ కంపెనీ క్షమాపణలు అంగీకరించిన రాజు జైసింగ్ చెత్తను సేకరించడానికి ఆ కార్లను వినియోగించడం మానేయాలని మున్సిపాలిటీకి సూచించారు. ఏదీఏమైన భారతీయ రాజు దెబ్బకు బ్రిటన్ రోల్స్ రాయిస్ కంపెనీ గడగడలాడింది కదూ.(చదవండి: ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
రాజస్థాన్ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి రాధికా ఖేరా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు.కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తనని వేధిస్తున్నారంటూ రాధికా ఖేరా సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి సైతం రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించడం తాను విమర్శలకు గురైనట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను వేధించారని, గదిలో బంధించి దుర్భాషలాడారని ఆరోపించారు. ఇదే విషయంపై పార్టీ నేతలకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో పాటు అయోధ్యలోని రామమందిరాన్ని దర్శించుకున్నందుకు అనేక విమర్శలు ఎదురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ యూనిట్ కమ్యూనికేషన్ వింగ్ ఛైర్పర్సన్ సుశీల్ ఆనంద్తో పాటు మరికొంత మంది తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని లేఖలో పేర్కొన్నారు -
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్కు చెందిన మంత్రి బాబులాల్ ఖరాడీను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వంలో బాబులాల్ ఖరాడీ గిరిజన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా(ఇన్స్స్టాగ్రామ్) వేదికగా మంత్రి బాబులాల్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మేసేజ్లో బాబులాల్ను చంపేస్తానని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. Babulal Kharadi Receives Death Threat: बाबूलाल खराड़ी को सोशल मीडिया पर मिली धमकी | Udaipur | BJP#RajasthanWithFirstIndia #BabulalKharadi #BJP #Udaipur #RajasthanNews #RajasthanPolitics #DeathThreats pic.twitter.com/s7iL3WY7Gc— First India News (@1stIndiaNews) May 4, 2024 ఈ నేపథ్యంలో మంత్రి బాబులాల్ కుమారుడు.. ఈ మెసేజ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు రోజుల క్రితం ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. అయితే, గిరిజనులను హిందూ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ మంత్రిని చంపేస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించినట్లు చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై ఉదయ్పూర్లోని కొద్దా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
రాజస్థాన్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. గెహ్లాట్కు ఎదురుదెబ్బ!
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్పై అతని మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్, రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో గెహ్లాట్పై మాజీ లోకేశ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజు తనకు సీఎం పీఎస్ఓ రాం నివాస్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. సీఎం గెహ్లాట్ నివాసానికి రావాలని చెప్పారు. దీంతో, అక్కడికి వెళ్లాను. ఈ సందర్భంగా కొన్ని ఆడియో క్లిప్లతో కూడిన పెన్ డ్రైవ్ను గెహ్లాట్ తనకు అందజేశారని, ఆ తర్వాత అవి మీడియాకు లీక్ అయ్యాయని అన్నారు. అవి ఫోన్ సంభాషణలు అని తనకు చెప్పారని, అయితే అవి చట్టబద్ధమైనవో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. తనను ఒక హోటల్కు పిలిపించి వీటి గురించి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. రీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తన సన్నిహితులకు అశోక్ గెహ్లాట్ రక్షణ కల్పించారని శర్మ ఆరోపించారు. అనంతరం, ఆడియో సంభాషణను లోకేష్ శర్మ లీక్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఇదివరకే లోకేశ్ శర్మను విచారణకు పిలిచి ప్రశ్నించారు. లోకేశ్ శర్మ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. అయితే, ఈ విషయంపై గెహ్లాట్పై లోకేశ్ శర్మ పరువు నష్టం దావా వేశారు. ఇక, ఈ ఆరోపణలపై అశోక్ గెహ్లాట్ ఇప్పటివరకు స్పందించలేదు. Gehlot, in order to save his Govt, tapped Sachin Pilot and other’s phone, and made it appear as if Gajendra Singh Sekhawat and the BJP tried to topple his Govt.- Lokesh Sharma, Ashok Gehlot’s former OSD pic.twitter.com/PuxYilQkZn— Rishi Bagree (@rishibagree) April 25, 2024 అయితే, 2020 జూలైలో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మొత్తం 19 మంది ఎమ్మెల్యేలతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న విశ్వేంద్ర సింగ్, భన్వర్ లాల్ శర్మ వంటి తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్ లాల్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ కూడా వీటిలో ఉంది. ఈ క్రమంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ రాజకీయంగా పెను దుమారం రేగింది. ఇదిలా ఉండగా.. లోకేష్ శర్మ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్వర్ణిమ్ చతుర్వేదీ స్పందిస్తూ.. లోకేష్ శర్మ ప్రభుత్వ అధికారి కాదు. పైగా అతను బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాడు. వారి సూచనలు మేరకు మాత్రమే అతను ఇలాంటి కామెంట్స్ చేశాడని చెప్పుకొచ్చారు. అయితే, రాజస్థాన్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు కాంగ్రెస్కు నష్టం కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
బీజేపీపై తిరుగుబావుటా.. ఉస్మాన్ ఘనీపై ఆరేళ్ల బహిష్కరణ వేటు
ఇటీవల రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు స్థానాల్లో పార్టీ ఓడిపోతుందంటూ బికనీర్ బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్ ఘనీ వ్యాఖ్యానించారు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద ఉస్మాన్ ఘనీని పార్టీ నుంచి బహిస్కరిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఓ ఛానెల్లో ఇంటర్వ్యూలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల్ని ఉస్మాన్ ఘని ఖండించారు.అంతేకాదు 25 స్థానాల్లో పలు స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉస్మాన్ ఘనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉస్మాన్ ఘనీ ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ అన్నారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చడానికి ఉస్మాన్ ఘనీ చేసిన చర్యను పార్టీ గుర్తించింది. క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఆరేళ్లపాటు అతన్ని బహిష్కరించింది అని లఖావత్ చెప్పారు. -
ఎన్నికల వేళ కాంగ్రెస్కు ఊహించని షాక్
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాజస్థాన్లో ఒకేసారి 400 మంది కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. రాజస్థాన్ హస్తం పార్టీ నాయకత్వం ఖంగుతింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్లో కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) మధ్య పొత్తు ఖరారైంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా నాగౌర్ లోక్సభ స్థానం నుంచి ఆర్ఎల్పీ చీఫ్ హనుమాన్ బేనివాల్ను అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ బేనివాల్ పేరును ఖరారు చేసింది. దీంతో, కాంగ్రెస్ నేతలకు బేనివాల్ ఎంపిక నచ్చలేదు. ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ నేతలు.. బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధాకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసి బేనివాల్.. కాంగ్రెస్ నేతలు వ్యవహారాన్ని హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. అసలు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ దిద్దుబాటులో చర్యలో భాగంగా ముగ్గురు కాంగ్రెస్ నేతలను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే భరరామ్, కుచేరా మున్సిపాలిటీ చైర్పర్సన్ తేజ్పాల్ మీర్జా, సుఖరామ్ దొడ్వాడియాలు ఉన్నారు. దీంతో, హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముగ్గురు కాంగ్రెస్ నేతలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే వీరికి మద్దతు తెలుపుతూ సుమారు 400 మంది హస్తం కార్యకర్తలు తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు సమాచారం. Rajasthan News 🚨 - 400 Congress workers resigned from party and joined BJP to support Jyoti Mirdha against RLP Chief Hanuman Beniwal. Mirdha is getting stronger in Nagaur since last couple of weeks. — The Insert News (@InsertNews) April 13, 2024 ఈ సందర్భంగా తేజ్ పాల్ మీర్జా మీడియతో మాట్లాడుతూ..‘నాగౌర్లో కాంగ్రెస్ను నాశనం చేయడానికి బేనివాల్ ప్రయత్నిస్తున్నాడు. అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇష్టం లేదు. అందుకే వారంతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అభ్యర్థిని ఖరారు చేసే ముందు హైకమాండ్ మా అభిప్రాయం తెలుసుకోవాల్సింది. కాంగ్రెస్ను ఓడిచేందుకు మాత్రమే ఆర్ఎల్పీ పనిచేస్తుంది’ అని ఆరోపణలు చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ పార్టీ కార్యకర్తలు రాజీనామా చేయలేదన్నారు. ఇదంతా బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామా అని కొట్టిపారేశారు. -
‘కాంగ్రెస్ డీఎన్ఏలోనే కర్ఫ్యూ’.. యోగి తీవ్ర విమర్శలు
జైపూర్: కాంగ్రెస్ పార్టీపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రమైన విమర్శలు చేశారు. రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ‘దేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్య. కర్ఫ్యూలు విధించటం కాంగ్రెస్ డీఎన్ఏలో ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమతిస్తే.. కాంగ్రెస్ ఉగ్రవాదులకు జైలులో బిర్యానీ పెట్టింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థులను ప్రటించిన తర్వాత మొదటిసారి రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘రామమందిరం నిర్మాణం పక్కనపెడితే.. ముందు శ్రీరాముడు, కృష్ణుడిని కాంగ్రెస్ ఊహాజనిత వ్యక్తులుగా భావించింది. కాంగ్రెస్ పాలనలో పేదల హక్కులు హరించారు. ప్రస్తుతం దేశం మొత్తం మరోసారి మోదీ ప్రభుత్వం రావాలని నినాదం చేస్తుంది. గత పదేళ్లలో ప్రధాని మోదీ పరిపాలనలో దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయి. గతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు జరిగేవి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడటానికి సహసం చేయటం లేదు. ఎందుకుంటే వారికి వైమానిక దాడి భయం ఉంది. ప్రస్తుతం ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం లేదు. దేవం నక్సలిజం, ఉగ్రవాదం, కశ్మీర్లో రాళ్లు విసిరే ఘటనలు తగ్గించాం’ అని యోగి అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజలు ఆకలితో ఉంటే ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టారు. అదే ప్రధాని మోదీ గత నాలుగేళ్లుగా దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సిద్దాతం, బలమైన నేత లేరు. కాంగ్రెస్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. మీరు వేసే ఓటు రామ మందిర నిర్మాణానికి మద్దతు మాత్రమే కాదు. మన దేశ సరిహద్దులకు కచ్చితమైన రక్షణ’అని యోగి తెలిపారు. -
చిన్న పార్టీనే.. కానీ చుక్కలు చూపించింది!
జైపూర్: రాజస్థాన్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికలకు వేరువేరుగా తమ సొంత అభ్యర్థులను ప్రకటించుకున్న తర్వాత కాంగ్రెస్, భారతీయ ఆదివాసీ పార్టీ (BAP) చివరకు సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకుని పొత్తు కుదుర్చుకున్నాయి. సోషల్ మీడియాలో ప్రకటన చేస్తూ, కాంగ్రెస్ నాయకుడు సుఖ్జీందర్ సింగ్ రంధావా "రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కాంగ్రెస్ ప్రాథమిక లక్ష్యం" అని అన్నారు. బన్స్వారా లోక్సభ స్థానంలో మద్దతు కోసం బీఏపీ అభ్యర్థి రాజ్కుమార్ రావత్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసిన గంటలోపే ఏప్రిల్ 4న నామినేషన్ను దాఖలు చేసిన కాంగ్రెస్కు చెందిన అరవింద్ దామోర్ ఇప్పుడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్తో సీట్ల పంపకంలో భాగంగా భారతీయ ఆదివాసీ పార్టీ బన్స్వారా, బగిదోర లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్నికల ఫలితాల్లో గిరిజనులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న చిత్తోర్గఢ్, జలోర్ నుండి తమ అభ్యర్థులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. గిరిజనుల్లో గట్టి పట్టు గుజరాత్లో 2017లో ఛోటుభాయ్ వాసవా భారతీయ గిరిజన పార్టీని స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే రావత్, రాంప్రసాద్ దిండోర్ రాజస్థాన్లోని చోరాసి, సగ్వాడ నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గెలిచిన తర్వాత వారు పార్టీని వీడారు. ఆ తర్వాత వీరిద్దరూ 2023 సెప్టెంబరులో మళ్లీ బీఏపీలోకి వచ్చారు. ఆ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది. దాని అభ్యర్థులు మరో నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచి కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, గిరిజనులు రాజస్థాన్ రాష్ట్ర జనాభాలో దాదాపు 14 శాతం ఉన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రతాప్గఢ్, బన్స్వారా దుంగార్పూర్, ఉదయపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కూడిన వాగడ్ ప్రాంతంలో కనీసం 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారతీయ గిరిజన పార్టీకి గణనీయమైన ఓటర్లు ఉన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర , జార్ఖండ్, దాద్రా నగర్ హవేలీలలో భారతీయ గిరిజన పార్టీ మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. -
రాజసమంద్ బరిలో మేవార్ రాజ కుటుంబీకురాలు
రానున్న లోక్సభ ఎన్నికల కోసం రాజస్థాన్లో బీజేపీ తన అభ్యర్థుల ఐదో జాబితాను ప్రకటించింది. ఇందులో రాజసమంద్ సీటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మహిమా విశేష్వర్ సింగ్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఈ స్థానం నుంచి దియా కుమారి ఎంపీగా ఉన్నారు. 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఈ స్థానానికి సుదర్శన్ రావత్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఎవరీ మహిమా విశేష్వర్ సింగ్? మేవార్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవార్ సతీమణే ఈ మహిమా విశేష్వర్ సింగ్. మహిమా సింగ్ భర్త విశ్వరాజ్ సింగ్ మేవార్ నాథ్ద్వారా బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో మహిమ తన భర్త విజయానికి విశేష కృషి చేశారు. రాజ్సమంద్ పార్లమెంటరీ సీటులో 2019లో జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని పోటీకి దింపిన బీజేపీ ఇప్పుడు మేవార్ రాజకుటుంబానికి మహిమా సింగ్ బరిలోకి దించింది. జగదీశ్వరి ప్రసాద్ సింగ్ ఇంట్లో 1972 జూలై 22న జన్మించిన మహిమా సింగ్ మేవార్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నగరంలో ఉన్న సింధియా కన్యా విద్యాలయంలో చదివారు. కాలేజీ విద్యను ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో పూర్తి చేశారు. ఆమె మనస్తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. -
Lok Sabha Polls: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు మరో 5 మంది అభ్యర్థులతో ఆరో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్ధుల జాబితాను ఏఐసిసి ఎక్స్ వేదికగా విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి నలుగురు, తమిళనాడు నుంచ ఒకరి ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. గత ఐదు జాబితాల్లో 186 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తాజా జాబితాతో మొత్తం ఇప్పటివరకు 190 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినట్లైంది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎటువంటి కేటాయింపులు లేవు. రాజస్థాన్ అజ్మీర్- రామచంద్ర చౌదరీ రాజ్సమంద్- సుదర్శన్ రావత్ బిల్వారా- డా. దమోదర్ గుర్జార్ కోటా- ప్రహ్లాద్ గుంజాల్ తమిళనాడు తిరునెల్వేలి- సీ. రాబెర్ట్ బ్రూస్ कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की छठवीं लिस्ट। pic.twitter.com/KoXyKzYH87 — Congress (@INCIndia) March 25, 2024 -
‘జైపూర్ డైలాగ్స్’తో సంబంధం లేదు..సునీల్ శర్మ వివరణ
జైపూర్: లోక్సభ ఎన్నికలు సమీస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో రాజస్థాన్లోని జైపూర్ నియోజకవర్గంలో సునీల్ శర్మకు అవకాశం కల్పించింది కాంగ్రెస్. అయితే బీజేపీకి సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానెల్తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఉన్న సునీల్ శర్మకు కీలకమైన జైపూర్ స్థానాన్నికేటాయించటం చర్చనీయాంశం అయింది. తరచూ కాంగ్రెస్పై విమర్శలు చేసే.. బీజేపీ అనుకూలమైన వార్తలు ప్రసారం చేసే ‘జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్ను ఆయన 2016లో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ దిక్షిత్తో కలిసి ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్ శర్మ జైపూర్ అభ్యర్థిత్వంపై పునరాలోచించాలని కోరుతున్నారు. I am in no way related to the Jaipur dialogues YouTube channel or Twitter handle. This is completely fake news and false propaganda being floated to diminish the prospects of the Congress Party. — Sunil Sharma (@I_SunilSharma) March 23, 2024 ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై సునీల్ శర్మ స్వయంగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్ లేదా ట్విటర్ హాండిల్తో ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీని అపహాస్యం చేయడానికి వ్యాప్తి చేస్తున్న తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం’ అని సునీల్ శర్మ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నాకు జైపూర్ డైలాగ్స్ యూట్యూబ్ ఛానెల్తో ఎటువంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, భావాలు తెలియజేయటం కోసం నేను టీవీ, యూట్యూట్ ఛానెల్స్ ఆహ్వానిస్తే వెళ్తుంటాను. అదే విధంగా జైపూర్ డైలాగ్స్ కూడా సామాజిక సమస్యలపై కాంగ్రెస్ పార్టీ విజన్ గురించి మాట్లాడటానికి నన్ను ఆహ్వానించింది. నేను మతం పేరుతో జరిగే ఉన్మాదాన్ని బలంగా వ్యతిరేకిస్తాను’ అని సునీల్ శర్మ అన్నారు. జైపూర్ డైలాగ్స్కు సునీల్ శర్మ డైరెక్టర్ అంటూ.. సోషల్ మీడియా ప్రచారం జరుగుతోందని అది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు. -
23 ఏళ్లలో తొలిసారి.. కుప్పకూలిన తేజస్ ఎయిర్క్రాఫ్ట్
జైపూర్: రాజస్థాన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన తేజస్ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జైసల్మేర్లోని ఓ స్టూడెంట్ హాస్టల్ భవనం వద్ద తేజస్ ఎయిర్క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. దీంతో ఆ ప్రదేశంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. జెట్ కూలకముందే పారాచూట్తో దూకడంతో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పేర్కొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే తేజస్ సింగిల్ సీటర్ ఫైటర్ జట్ 23 ఏళ్ల చరిత్రలో కూలిపోవడం ఇదే తొలిసారి. 2001లో తేజస్ ఎయిర్క్రాఫ్ట్ సేవలు ప్రారంభమైన తర్వాత ఇలాంటి ప్రమాదం చోటుచేసుకోవటం ఇప్పటి వరకు జరగలేదని అని అధికారులు తెలిపారు. One Tejas aircraft of the Indian Air Force met with an accident at Jaisalmer, today during an operational training sortie. The pilot ejected safely. A Court of Inquiry has been constituted to find out the cause of the accident. — Indian Air Force (@IAF_MCC) March 12, 2024 -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్లో చేరిన ఎంపీ రాహుల్ కుశ్వాన్
జైపూర్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీల మారుతూ సార్వత్రిక సమరాన్ని మరింత ఆసక్తి రేపుతున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి.. బీజేపీ నేతలు కాంగ్రెస్లోకి వరుస కడుతున్నారు. తాజాగా రాజస్తాన్లోని చురూ సెగ్మెంట్కు చెందిన ఎంపీ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాహుల్ కుశ్వాన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవకి రాజీనామా చేసి.. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సొనియా గాంధీ, రాహుల్ గాంధీ, గోవింద్ సింగ్ దోస్తారా, ఇతర నేతలకు ధన్యవాదాలు’ అని కాంగ్రెస్ చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతకంటే ముందు.. ప్రజాజీవితంగా గురించి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని రాహుల్ కుశ్వాన్ ‘ఎక్స్’(ట్వీటర్) వేదికగా వెల్లడించారు. ‘కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఈ రోజు కీలక పరిణామం జరగబోతుంది. నేను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా’అని పేర్కొన్నారు. అదేవిధంగా చురూ నియోజకవర్గ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్సభలో ఎన్నికల్లో చురూ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ తిరస్కరించిన నేపథ్యంలో రాహుల్ కుశ్వాన్ పార్టీ మారటం గమనార్హం. బీజేపీ మొదటి జాబితాలో చురూ లోక్సభ స్థానంలో రాహుల్ కుశ్వాన్ బదులు పారా ఒలింపియన్ దేవేంద్ర ఝఝరియాను బరిలోకి దించిన విషయం తెలిసిందే. చదవండి: డీప్ఫేక్ బారినపడ్డ యోగి ఆదిత్యనాథ్ -
కాంగ్రెస్కు షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు
లోక్సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ రోజు (ఆదివారం) బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రిచ్పాల్ మిర్ధా, విజయపాల్ మిర్ధా, ఖిలాడీ బైర్వా, స్వతంత్ర మాజీ ఎమ్మెల్యే అలోక్ బెనివాల్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సేవాదళ్ సురేష్ చౌదరి, రాంపాల్ శర్మ, రిజుజున్వాలా తదితర నేతలు కూడా రాష్ట్రంలో అధికార పార్టీలో చేరారు. వీరందరికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్లు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా మంత్రులుగా ఉన్నారు. రిచ్పాల్ మిర్ధా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ ఎంపీ జ్యోతి మిర్ధా మామ. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అభ్యర్థులు వెల్లడించారు. దేశం కోసం మోదీ కస్టపడి పని చేస్తున్న తీరు వారికి బాగా నచ్చిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై కూడా భారత్ ప్రధాని నాయకత్వంలో మంచి పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. -
ఏమిటి నేను చేసిన నేరం? బీజేపీ ఎంపీ తీవ్ర ఆవేదన!
భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. రాజస్థాన్లోని చురు లోక్సభ స్థానం నుంచి కొత్త వ్యక్తి దేవేంద్ర ఝజారియాకు టిక్కెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం చురు ఎంపీగా ఉన్న రాహుల్ కశ్వాన్.. తనను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు తన చురు స్థానం నుంచి మరో అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించగా రాహుల్ కశ్వాన్ సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. కస్వాన్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. "నా నేరం ఏమిటి? నేను నిజాయితీగా లేనా? కష్టపడి పనిచేయలేదా? విధేయుడిని కాదా? నేను ఏమి కళంకం తెచ్చాను? చురు లోక్సభలో పనిచేయలేదా? ఏదైనా పొరపాటు జరిగిందా?" అంటూ ప్రశ్నలు సంధించారు. "ప్రధానమంత్రి అన్ని పథకాల అమలులో నేను ముందంజలో ఉన్నాను. ఇంకా ఏమి కావాలి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మౌనమే వినిపిస్తోంది. ఎవరూ సమాధానం చెప్పలేక పోతున్నారు" అంటూ వాపోయారు. అయితే రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని, టిక్కెట్ దక్కలేదన్న నైరాశ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. కాగా రాహుల్ కస్వాన్ తండ్రి రామ్ సింగ్ కూడా చురు నుంచి బీజేపీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే రాహుల్ తల్లి కమలా కశ్వాన్ కూడా సాదుల్పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికలకు రాజస్థాన్లోని 25 స్థానాలకు గాను 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు నలుగురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. -
Devendra Jhajaria: పార్లమెంట్ బరిలో పతకాల వీరుడు
Paralympian Devendra Jhajaria: రానున్న లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. క్రీడా ప్రపంచంలో పేరుగాంచిన అథ్లెట్ దేవేంద్ర ఝజారియా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పారాలింపిక్స్లో రెండు బంగారు, ఒక రజత పతకం సాధించిన రాజస్థాన్కు చెందిన దేవేంద్ర ఝజారియా 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్లోని చురు లోక్సభ స్థానం నుంచి ఆయనకు బీజేపీ అవకాశం కల్పించింది. భారత పారాలింపియన్ దేవేంద్ర ఝజారియా జావెలిన్ త్రోయర్. 2004 ఏథెన్స్లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్లో జావెలిన్ త్రోలో తన మొదటి బంగారు పతకాన్ని సాధించారు. అంతేకాదు దేశానికి రెండో పారాలింపిక్ బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడు దేవేంద్ర ఝజారియా. ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్లో రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు కూడా ఈయనే. రాజస్థాన్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో పారాలింపియన్ దేవేంద్ర ఝజారియాతోపాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. దేవేంద్ర ఝజారియాకు టికెట్ ఇవ్వడం కోసం చురు నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ కశ్వాన్ను బీజేపీ పక్కన పెట్టింది. ఈసారి ఆయనకు ఇక్కడి నుంచి టిక్కెట్ దక్కలేదు. క్రీడా క్షేత్రంలో పతకాలు గెలిచిన దేవేంద్ర ఝజారియా ప్రజా క్షేత్రంలో గెలుస్తాడో లేదో చూడాలి. -
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్కి మరోసారి జాక్పాట్!
రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానానికి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ను భారతీయ జనతా పార్టీ వరుసగా మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానానికి ఆయన పోటీ చేయడం ఇది వరుసగా నాలుగోసారి. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత బికనీర్ చేరుకున్న మేఘ్వాల్కు పార్టీ మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. మేఘ్వాల్ 2009లో తొలిసారిగా బికనీర్ నియోజకవర్గం నుండి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు . 2019 లోక్సభ ఎన్నికల్లో అర్జున్ రామ్ మేఘ్వాల్ తన బంధువు, కాంగ్రెస్ నాయకుడు మదన్ గోపాల్ మేఘ్వాల్ను ఓడించి బికనీర్ స్థానాన్ని గెలుచుకున్నారు . తనపై నమ్మకం ఉంచి నాలుగోసారి సీట్ ఇచ్చినందుకు అర్జున్ రామ్ మేఘ్వాల్ బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజస్థాన్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు, ఒక పారాలింపియన్ ఉన్నారు. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మహేంద్రజిత్ మాల్వియా, జ్యోతి మిర్ధాలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు, సిట్టింగ్ ఎంపీ దుష్యంత్ సింగ్కు కూడా పార్టీ ఝలావర్ బరన్ నుంచి మరోసారి టిక్కెట్లు ఇచ్చింది. -
కోటాలో విద్యార్థి అదృశ్యం కలకలం.. వారంలో రెండో ఘటన
జేఈఈ (JEE) విద్యార్థి రచిత్ అదృశ్యం మరవక ముందే రాజస్థాన్లోని కోటాలో 18 ఏళ్ల నీట్(NEET) కోచింగ్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపతోంది. రెండు రోజుల క్రితం సికార్ జిల్లాకు చెందిన యవరాజ్ అనే విద్యార్థి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను నీట్ మెడికల్ ప్రవేక్ష పరీక్ష కోసం కోటాలో కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువరాజు కోటాలోని ట్రాన్స్పోర్టు నగరలోని హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు క్లాస్కు హాజరయ్యేందుకు బయటకు వెళ్లి యూవరాజ్ అదృశ్యం అయ్యాడు. అతను తన మొబైల్ ఫోన్ను హాస్టల్లోనే వదిలి వెళ్లాడు. వారం రోజుల క్రితమే రచిత్ సోంధ్య అనే విద్యార్థి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల జేఈఈ(JEE) విద్యార్థి రచిత్.. హాస్టల్ నుంచి క్లాస్కు బయలుదేరి అదృశ్యం అయ్యారు. సీసీటీవీ ఫుటేజుల వివరాల ప్రకారంలో కోటాలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్కు చెందిన రచిత్ .. హాస్టల్ నుంచి బయటకు వచ్చి.. ఒక క్యాబ్లో అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గత సోమవారం రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, హాస్టల్ రూం తాళం చెవిని అటవీ ప్రాంతానికి సమీపంలోని గరడియా మహాదేవ్ ఆలయం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. వెతుకుతున్నారు. వారికోసం పోలీసులు ప్రత్యేకంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. -
యువరాణికి పట్టం.. డిప్యూటీ సీఎంగా దియాకుమారి
జైపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ.. చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అనుహ్యంగా కొత్తవారిని ముఖ్యమంత్రులుగా ప్రకటించి సరికొత్త వ్యూహాన్ని అమలు పరిచింది. అయితే తాజాగా కూడా అదే ఫార్ములా ప్రయోగించింది. రాజస్థాన్లో కేవలం మొదటిసారి గెలిచిన భజన్లాల్ శర్మను సీఎంగా బీజేపీ ప్రకటించింది. అయితే ఇక్కడ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ప్రేమ్ చంద్ భైరవ, దియా కుమారిలను డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజస్థాన్లో రాజ కుంటుబానికి చెందిన దియా కుమారికి.. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఈసారీ బీజేపీ హైకమాండ్ రాజస్థాన్ సీఎంగా దియా కుమారికి అవకాశం కల్పిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. సీఎం పదవి కోసం వసుంధర రాజే, అర్జున్రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి సీనియర్ నేతలతో పోటీపడ్డ దియా కుమారి.. డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకుంది. ప్రస్తుతంగా ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జైపూర్ మహారాజ కుటుంబంలో ఆమె 1971లో జన్మించారు. తాత మాన్ సింగ్-2 బ్రిటీష్ ఇండియా కాలంలో చివరి జైపూర్ మహారాజు. తండ్రి బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్ మహావీర చక్ర అవార్డు గ్రహిత. ఆయన 1971లో ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. మహారాణి గాయత్రీ దేవి పాఠశాల విద్య, జైపూర్లోని మహారాణి కళాశాలలో కాలేజీ చదువును పూర్తి చేసుకున్నారు. నరేంద్ర సింగ్ను వివాహం చేసుకున్న దియాకుమారికి.. ముగ్గురు పిల్లలు. ఆమె 2018లో నరేంద్ర సింగ్తో విడాకులు తీసుకుంది. రాజకీయం జీవితం.. రాజకీయలపై ఆసక్తితో దియాకుమారి 2013లో అసెంబ్లీ ఎన్నికల్లో మాధోపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మొదటిసారి గెలుపొందగానే పలు ప్రాంతాలను అభివృద్ధి చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాజసమంద్ నియోజకవర్గం నుంచి పోటీ ఎంపీగా గెలుపోందారు. రాజకీయాలతో పాటు దియా కుమారి అనేక బిజినెస్ వెంచర్లు, రెండు స్కూల్స్, మ్యూజియం, ట్రస్టు, హోటల్, ఎన్జీఓలను నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాల ద్వారా ఆమె స్త్రీల అభ్యున్నతికి కృషి చేస్తారు. పలు ఎన్జీఓ ద్వారా సేవ చేసినందుకు.. ఆమె ఇటీవల జైపూర్లోని అమిటీ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు. 2023 రాజస్థాన్ అసెంబ్లీలో విధ్యాదర్నగర్లో నియోజకవర్గలో పోటీ చేసి 71,368 భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవ ఈ యువరాణి(దియా కుమారి) మహిళలకు భద్రతకు కృషి చేస్తానని, యూవతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల కష్టాలను తీర్చుతానని ప్రచారంలో హామీలు ఇచ్చారు. చదవండి: రాజస్థాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్లాల్ శర్మ -
Bhajanlal: ఓడిపోతారనుకున్నారు.. కానీ సీఎంగా ఎంపిక!
జైపూర్: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే కాదు.. ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపికలోనూ బీజేపీ కొత్త స్ట్రాటజీని ప్రదర్శించింది. ఛత్తీస్గఢ్లో గిరిజనుడ్ని, మధ్యప్రదేశ్లో బీసీ(యాదవ్)ని, అలాగే.. తాజాగా రాజస్థాన్లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. తద్వారా సీనియర్లకు షాక్ ఇవ్వడంతో పాటు కొత్త తరహా రాజకీయానికి తెర లేపింది బీజేపీ. అయితే.. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. భజన్లాల్ మొదటిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. పైగా ఆయన గెలుస్తారని బీజేపీ శ్రేణులు కూడా అనుకోలేదట!. భజన్లాల్ శర్మ.. మొదటిసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. చివరి నిమిషంలో సీఎం అభ్యర్థుల జాబితాలో ఆయన పేరును చేర్చి.. అదే పేరును ప్రకటించింది బీజేపీ. అయితే ఆయన గెలవరని పార్టీ భావించిందట. అందుకు కారణం లేకపోలేదు. ► భజన్లాల్ స్వస్థలం భరత్పూర్. కానీ, ఆయనకు ఆ టికెట్ను బీజేపీ ఇవ్వలేదు. అక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఆయన ఓడిపోతారని బీజేపీ భావించింది. అందుకే సంగనేర్ టికెట్ ఇచ్చింది. అక్కడా ఆయన నెగ్గుతారని ఊహించలేదట. అయితే.. సంగనేర్ టికెట్ మీద పోటీ చేసి భజన్లాల్ 48వేలపైగా మెజారిటీతో నెగ్గారు. ► భజన్లాల్ మొదటి నుంచి బీజేపీ పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొనేవారు. అత్యంత ఎక్కువ కాలం బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. ► రాజకీయాల్లోకి రాకముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీలో విద్యార్థి నాయకుడి పనిచేశారు. ► ఓసీ సామాజికవర్గానికి చెందిన భజన్ లాల్ రాజస్థాన్ వ్యాప్తంగా నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పార్టీలో ఉన్న అన్ని వర్గాల కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగేవారు. ► 56 ఏళ్ల భజన్లాల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో రూ. 1.5కోట్ల ఆస్తులను చూపించారు. ఇదీ చదవండి: రాజస్థాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే -
రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం వైపే మొగ్గు చూపించింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షనేతగా భజన్లాల్ శర్మను మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్లాల్ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం గమనార్హం. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని ఎంపిక చేసిదంది. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్లాల్ శర్మ పేరును రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు. ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ లాంటి సీనియరల పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్లాల్ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది. 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. భజన్ లాల్ రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్పై 48,081 ఓట్లతో విజయం సాధించారు. చదవండి: నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ కౌంటర్ -
బీజేపీ సీఎంల ఎంపికపై గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు
జైపూర్:రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారం తర్వాత కూడా ముఖ్యమంత్రిని నిర్ణయించుకోలేకపోతున్నారని రాజస్థాన్ కేర్టేకర్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష సందర్భంగా గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎంను డిసైడ్ చేయడంలో ఇంత ఆలస్యం చేసి ఉంటే బీజేపీ నేతలు తమపై అరుపులు, కేకలు పెట్టేవాళ్లని గెహ్లాట్ ఎద్దేవా చేశారు. కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గొగామెడి కేసులో విచారణ జరిపేందుకుగాను ఎన్ఐకు ఎన్ఓసీ ఇచ్చే ఫైల్పై తాను సంతకం చేయలేదని చెప్పారు. ‘ఎన్నికల్లో గెలిచి వారం దాటినా ఇప్పటికీ కొత్త ముఖ్యమంత్రి రాలేదు. కొత్త సీఎం ఎన్ఐఏ ఫైల్పై సంతకం చేయాల్సి ఉంటుంది. త్వరగా సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకోండి’అని గెహ్లాట్ కోరారు. ‘బీజేపీలో క్రమశిక్షణ లేదు. వారం రోజులు గడుస్తున్నా మూడు రాష్ట్రాల్లో ఇంత వరకు సీఎంను ఎంపిక చేయలేదు. ఇదే పని మేం చేసి ఉంటే ఎన్ని మాపై వారు ఎన్ని విమర్శలు చేసి ఉండే వాళ్లో తెలియదు. ఎన్నికల్లో వారు ఓట్లు పోలరైజ్ చేసి గెలిచారు. అయినా కొత్త ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది’ అని గెహ్లాట్ తెలిపారు. #WATCH | Congress leader and Rajasthan caretaker CM Ashok Gehlot arrives in Delhi to take part in a meeting to review the party's performance in recently held assembly polls in the state "...For around seven days now, they (BJP) have not been able to announce CM faces in the… pic.twitter.com/BIv6B8kd0J — ANI (@ANI) December 9, 2023 ఇదీచదవండి..అమెరికన్ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..! -
రాజస్థాన్ బంద్.. నాలుగు జిల్లాల్లో హైఅలర్ట్
జైపూర్: రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగామేడీ దారుణ హత్య నేపథ్యంలో రాజస్థాన్ అట్టుడుకుతోంది. హత్యకు నిరసనగా సుఖ్దేవ్ సింగ్ మద్దతుదారులు బుధవారం రాజస్థాన్ బంద్కు పిలుపునిచ్చారు. ఘటన విషయం గురించి తెలియగానే పెద్ద ఎత్తున రాజ్పుత్ సామాజిక వర్గం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చురు, ఉదయ్పూర్, అల్వార్, జోధ్పూర్ జిల్లాల్లోనూ నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, సుఖ్దేవ్ సింగ్ గోగామేడీ పట్టపగలే దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. రాజధాని జైపుర్లోని శ్యామ్నగర్లో ఆయన నివాసంలోనే గోగామేడీ హత్యకు గురయ్యారు. ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సుఖ్దేవ్ నివాసానికి వెళ్లి దారుణానికి పాల్పడ్డారు. గోగామేడీతో మాట్లాడాల్సి ఉందని భద్రతా సిబ్బందికి చెప్పి లోపలికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. #SukhdevSinghGogamedi Murder | Rajasthan DGP Umesh Mishra appeals for peace; stating that raids are underway on potential hideouts of criminals. Gogamedi's supporters have called for a #RajasthanBandh today after the leader's fatal shooting in Jaipur. pic.twitter.com/Ph6k37iNoI — NDTV (@ndtv) December 6, 2023 మరోవైపు.. రాజస్థాన్లో ఉద్రికత్తలపై డీజీపీ ఉమేశ్ మిశ్రా స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. నేరస్థుల రహస్య స్థావరాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. నేరుస్తులను వదిలిపెట్టమని హామీ ఇచ్చారు. ఇక, దుండగుల్లో ఒకడైన నవీన్ షెకావత్ను సుఖ్దేవ్ సింగ్ సహచరులు కాల్చి చంపారు. గోగామేడీ భద్రతా సిబ్బంది కాల్పుల్లో నవీన్ చనిపోయినట్టు జైపుర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ వెల్లడించారు. అయితే, రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే హత్య జరగడం కలకలం సృష్టించింది. Rajasthan | Members of the Rajput community sit in protest against the murder of Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena, in Jaipur The Rajput community outfits supporting Sukhdev Singh Gogamedi have called for a state-wide bandh today pic.twitter.com/T0FTFVJMSm — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 6, 2023 -
కర్ణిసేన చీఫ్ హత్య..గెహ్లాట్పై బీజేపీ సంచలన ఆరోపణలు!
జైపూర్: రాజస్థాన్లో కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గొగామెడి హత్యపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగిన ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఓటమికి ప్రతీకారంగానే కాంగ్రెస్ పార్టీ ఈ హత్యకు పాల్పడినట్లుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గెహ్లాట్ కావాలనే సుఖ్దేవ్ భద్రత తగ్గించారని, ఇదే ఈ హత్య జరిగేందుకు కారణమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. సుఖ్దేవ్కు ప్రాణాపాయం ఉందని పోలీసులకు సమాచారం ఉండి కూడా భద్రత తగ్గించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల ట్వీట్ చేశారు. ఎన్నికల్లో కర్ణిసేన బీజేపీకి మద్దతిచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బైక్ మీద వచ్చిన ముగ్గురు దుండగులు మంగళవారం ఉదయం సుఖ్దేవ్ను ఆయన ఇంట్లోనే కాల్చి చంపారు. ఈ హత్య ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాల్పులు జరిపిన వారిలో ఒక దుండగుడు అతని సహచరుల కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సుఖ్దేవ్ సెక్యూరిటీ గార్డు కాల్పుల్లో దుండగుడు చనిపోలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. Congress has a caretaker government in place right now. BJP govt is not in office Also security of the said victim was reduced by Gehlot Hear the victim blame anti Hindu Congress govt & stop peddling your lies https://t.co/C7uldNmGUH pic.twitter.com/BSaMkhfExZ — Shehzad Jai Hind (@Shehzad_Ind) December 5, 2023 ఇదీచదవండి..‘ఎక్స్’లో హాట్టాపిక్గా దోశ ధర..! -
బీజేపీ విజయానికి.. కాంగ్రెస్ ఓటమికి.. ఐదు కారణాలివే!
రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఏడు డివిజన్లలో భిన్నమైన తీరుతెన్నులు కనిపించాయి. జైపూర్ డివిజన్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డివిజన్లోని 50 స్థానాలకు గాను గతసారి బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి 26 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ను వెనక్కు నెట్టివేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ విజయానికి కారణాలేమిటి? కాంగ్రెస్ ఓటమికి కారణాలేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ నిపుణులు దీనిపై విశ్లేషణ అందించారు. బీజేపీ విజయానికి ఐదు కారణాలు పార్టీలో ఐక్యత నెలకొంది. నేతలంతా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసుకున్నారు. ప్రధాని మోదీ పాలనే అజెండాగా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీకి దిగడం లాభదాయకంగా మారింది. టికెట్ల కేటాయింపులో రాష్ట్రానికి చెందిన నేతలందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రయోజనకరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా అన్ని ప్రాంతాలలో పర్యటించారు. ‘సనాతనం’ అంశంతో ఓట్లర్లను ఆకర్షించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం కలిసివచ్చింది. కాంగ్రెస్ ఓటమికి ఐదు కారణాలు రాష్ట్రంలోని సీనియర్ నేతల మధ్య తలెత్తిన వర్గపోరు కారణంగా కార్యకర్తల ఐక్యతలో చీలిక ఏర్పడింది. టిక్కెట్ల కేటాయింపులో సీనియర్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రత్యక్షంగా నష్టపోయారనే వాదన వినిపిస్తోంది. బ్యాడ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా టిక్కెట్లు కేటాయించారు. పార్టీ నేతలు మితిమీరిన ప్రకటనలు చేయడంతో ప్రజలు వాటిని నమ్మలేదు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరగడం కాంగ్రెస్ పాలనపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇది కూడా చదవండి: రాజస్థాన్కు యూపీ సీఎం.. కారణమిదే! -
కాంగ్రెస్ ఓటమికి వారే కారణం.. అక్కడ స్వేచ్ఛ ఇవ్వలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలకంగా వ్యవహరించారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి.. కాంగ్రెస్ను గెలిపించిన విషయం తెలిసిందే. ఆదివారం విడుదలైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ... కేవలం తెలంగాణలోనే విజయం సాధించి మిగిలిన మూడు రాష్ట్రాల్లో పరాజయం పాలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించిన సునీల్ అక్కడ కాంగ్రెస్ను విజయతీరాలకు తీసుకెళ్లడంలో విఫలమాయ్యారు. అయితే దానికి రాజస్తాన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలే కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రాజస్తాన్, మధ్యప్రదేశ్లో వ్యూహకర్త పనిచేసినా.. ఆయా రాష్ట్రాల అగ్రనేతలైన అశోక్ గహ్లోత్, కమల్నాథన్లు సహకరించనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజస్థాన్లో పలు చోట్ల సర్వేలు చేసి కొంత మంది అభ్యుర్థుల మార్పును సూచించినా అశోక్ గహ్లోత్ అంగీకరించలేదంట. అదీకాక నరేష్ అరోరా ఎన్నికల వ్యూహాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సహరించినట్లుగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వ్యూహాల అమలు, అంతర్గత సర్వేల వంటి విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏఐసీసీ ఎన్నికల వ్యూహ కమిటీ ఛైర్మన్గా కూడా నియమితులైన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో కూడా తన మార్క్ వ్యూహాలతో కాంగ్రెస్ గెలుపును సునాయాసం చేశారు. గతంలో బీజేపీకి కూడా సునీల్ పలు ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014లో నరేంద్రమోదీకి ఎన్నికల ప్రచారంలో సేవలందించారు. ఉత్తరప్రదేశ్, గుజరాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పని చేశారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు ఆయాన వ్యూహకర్తగా సేవలందించారు. కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుపొందారు. అయితే.. ఆయన గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలకసభ్యుడిగా పనిచేశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం సునీల్కు.. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్కు తాత్కాలిక ఓటమే.. లోక్సభకు సిద్ధమవుతాం: ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్లో తెలంగాణ మినహా.. మూడు రాష్ట్రాల్లో గెలుపును బీజేపీ సుస్థిరం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, తెలంగాణలో.. రాజస్థాన్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్, చత్తీస్గఢ్లో అధికారం నిలబెట్టుకొని.. తెలంగాణలో గెలిచి.. మధ్యప్రదేశ్లో గట్టి పోటీ ఇస్తామనుకున్న కాంగ్రెస్ గట్టి షాక్ తగిలింది. తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. మూడు రాష్ట్రాల ఓటమిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే స్పందించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఓటమిని తాత్కాలిక పరాజయంగా భావిస్తామని తెలిపారు. ఈ ఓటమిని నుంచి బయటపడి.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గెలపే లక్ష్యంగా సన్నద్ధం అవుతుందని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో(రాజస్తాన్, చత్తీస్గఢ్) అధికారం కోల్పోయింది. అదే విధంగా మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని మూటకట్టుకుంది. అయితే ముందు నుంచి ఊహించినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేసింది. మొత్తగా చూసుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గెలుపు కొంత ఉపశమనం కలిగించింది. -
కాంగ్రెస్- బీజేపీలతో స్వతంత్ర అభ్యర్థుల ఢీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ప్రస్తుతం బీజేపీ 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలు విజయానికి దారితీస్తే గెహ్లాట్ ప్రభుత్వం నిష్క్రమణ ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే రాజస్థాన్ ఎన్నికల లెక్కింపులో ఇద్దరు స్వతంత్ర ముస్లిం అభ్యర్థులతో సహా 15 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ముందంజలో ఉండటం విశేషం. భరత్పూర్ జిల్లాలోని కమాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముస్లిం అభ్యర్థి ముఖ్తార్ అహ్మద్ 17,748 ఓట్ల ఆధిక్యంతో ఉండగా, మరో ముస్లిం అభ్యర్థి యూనస్ ఖాన్.. దీద్వానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భరత్పూర్ జిల్లాలోని కమాన్ అసెంబ్లీ స్థానం ముస్లిం ప్రాబల్యం ఉన్న సీటుగా గుర్తింపు పొందింది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున నౌక్షం చౌదరి, కాంగ్రెస్ నుంచి జాహిదాఖాన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడి ముక్కోణపు పోటీలో ముఖ్తార్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. 2018లో జహీదా ఖాన్ 40 వేలకు పైగా ఓట్లతో గెలుపొందగా, ఈసారి మాత్రం వెనుకంజలో ఉన్నారు. బీజేపీ తన అభ్యర్థిగా హర్యానాకు చెందిన నౌక్షం చౌదరిని ఎన్నికల బరిలో నిలిపింది. ఇది కూడా చదవండి: ‘జై శ్రీరాం’ నినాదాలతో కాంగ్రెస్ సంబరాలు -
Rajastan: ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ కాంగ్రెస్దే అధికారం.. సీఎం గెహ్లాట్
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవబోదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్కు కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఇదివరకే పోలింగ్ పూర్తవగా తెలంగాణలో ఈరోజు పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా రాజస్థాన్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం గెహ్లాట్ అన్నారు. పార్టీ ఎన్నికల అవకాశాల గురించి సీఎం గెహ్లాట్ విలేకరులతో మాట్లాడుతూ, "ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవలేదు" అన్నారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మధ్యప్రదేశ్. 2018లో రాజస్థాన్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు సాధించింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. కాగా ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
Rajasthan Elections 2023: స్టయిల్ మారింది!
మూడేళ్ల నాటి విఫల తిరుగుబాటు. సీఎం కుర్చీలో ఉన్న ప్రత్యర్థి నుంచి చీటికీ మాటికీ సూటిపోటి మాటలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించినా ఈసారి మాత్రం ప్రచారంతో సహా ఎందులోనూ పెద్దగా ప్రాధాన్యం దక్కని వైనం. అన్నింటినీ ఓపికగా సహిస్తూ సాగుతున్నారు రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. అసమ్మతి నేతగా ముద్ర తప్ప తిరుగుబాటుతో సాధించిందేమీ లేకపోవడంతో ఈ యువ నేత తెలివిగా రూటు మార్చారు. అసమ్మతి రాగాలకు, సొంత ప్రభుత్వంపై విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా అధిష్టానానికి విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. విధేయత, వెయిటింగ్ గేమ్ అంతిమంగా తనను అందలమెక్కిస్తాయని ఆశిస్తున్నారు... రాజస్తాన్లో 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ పీసీసీ చీఫ్గా పార్టీ బరువు బాధ్యతలన్నింటినీ తన భుజాలపై మోశారు పైలట్. అన్నీ తానై వ్యవహరించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆయనే సీఎం అని అంతా భావించారు. కానీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా సీనియర్ అశోక్ గహ్లోత్కే పట్టం కట్టింది. కొంతకాలం తర్వాత చాన్సిస్తామన్న అధిష్టానం మాట తప్పడంతో పైలట్ ఆగ్రహించి 21 మంది ఎమ్మెల్యేలతో పైలట్ తిరుగుబాటుకు దిగడం, అగ్ర నేత రాహుల్గాంధీ జోక్యంతో వెనక్కు తగ్గడం చకచకా జరిగిపోయాయి. డిప్యూటీ సీఎంగిరీ, పీసీసీ చీఫ్ పదవి రెండూ ఊడటం మినహా ఆయన సాధించిందంటూ ఏమీ లేకపోయింది. అయినా వెనక్కు తగ్గలేదాయన. గహ్లోత్ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు ఎక్కుపెట్టడం, ధిక్కార స్వరం విని్పంచడం వంటివి చేస్తూనే వచ్చారు. ఈ ఏడాది మొదట్లో ఏకంగా సొంత ప్రభుత్వ పనితీరునే విమర్శిస్తూ ధర్నాకు దిగడమే గాక పాదయాత్ర తలపెట్టి సంచలనం సృష్టించారు. తీరు మారింది... కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పైలట్ తీరే పూర్తిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే సహనమూర్తిగా మారారు. ప్రచారంలో తనకు ముఖ్య బాధ్యతలేవీ అప్పగించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా గహ్లోత్ సర్కారుపై బీజేపీ విమర్శలను పైలట్ దీటుగా తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలనే ఆశ్చర్యపరుస్తున్నారు! అంతేగాక ఇటీవల గహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లను, పీసీసీ చీఫ్ గోవింద్సింగ్ నివాసంపై ఈడీ దాడులను కూడా పైలట్ తీవ్రంగా ఖండించారు. గహ్లోత్పై విమర్శలు, ఆరోపణలకు పూర్తిగా ఫుల్స్టాపే పెట్టడమే గాక ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. వాటిని గహ్లోత్ పట్టించుకోకపోయినా, చాన్స్ దొరికినప్పుడల్లా తనకు చురకలు వేస్తున్నా, పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని పదేపదే ప్రశి్నస్తున్నా వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల ప్రచారమంతా గహ్లోత్ వన్ మ్యాన్ షోగానే సాగుతున్నా ఇదేమని ప్రశ్నించడం లేదు. పార్టీ గెలిస్తే సీఎం పదవి డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించినా అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమని ఆచితూచి బదులిస్తున్నారు. అదే సమయంలో, వ్యక్తిగత ప్రతిష్ట కోసం సీఎం కావాలన్న దుగ్ధ తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఇటు గహ్లోత్కు, అటు అధిష్టానానికి ఇవ్వాల్సిన సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నారన్నది పరిశీలకుల అభిప్రాయం. ఫలిస్తున్న వ్యూహం! పైలట్ విధేయత వ్యూహం బాగానే ఫలిస్తోందంటున్నారు. గాంధీ త్రయం సోనియా, రాహుల్, ప్రియాంక కొద్ది రోజులుగా ఆయన అభిప్రాయానికి బాగా విలువ ఇస్తున్నారని పీసీసీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. పైలట్ విధేయత, గహ్లోత్ గతేడాది చూపిన అవిధేయత రెండింటినీ అధిష్టానం బేరీజు వేసుకుంటోందని కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగిరీ వదులుకోవాల్సి వస్తుందనే కారణంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న సోనియా ఆదేశాలను గహ్లోత్ బేఖాతరు చేయడం తెలిసిందే. ఆయన కోసం మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత సెపె్టంబర్లో ఏకంగా తిరుగుబాటుకు సిద్ధపడటం అధిష్టానానికి తలవంపులుగా మారింది. ఈ నేపథ్యంలో ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చేసే రాజస్థాన్లో ఈసారి కాంగ్రెస్ ఓడితే రాష్ట్ర పార్టీ పైలట్ చేతుల్లోకి రావచ్చు. నెగ్గితే మాత్రం సీఎం పీఠం కోసం గహ్లోత్, పైలట్ మధ్య పెనుగులాట తప్పకపోవచ్చు. అప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rajasthan Elections 2023: ఫేక్ అని మహిళలను అవమానిస్తారా?
పాలి (రాజస్థాన్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పేదలకు, రైతులకు, మహిళలకు వ్యతిరేకమని, గెహ్లాట్ హయాంలో మహిళలపై నేరాల్లో ఆ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని ఆరోపించారు. రాజస్థాన్లోని పాలీలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళలపై నేరాల్లో కాంగ్రెస్ రాజస్థాన్ను నంబర్ వన్గా నిలిపిందని, పైగా మహిళలు ఇచ్చిన ఫిర్యాదులే ఫేక్ అని సీఎం గెహ్లాట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నరాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు త్వరితగతిన, సమర్థంగా అమలవుతన్నాయని మోదీ పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అదనంగా రూ. 6,000 అందిస్తున్నాయని, రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ కూడా రూ.6 వేలు అదనంగా అందిస్తామన్నారు. ఇక సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విపక్షాల కూటమిపైనా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అది ‘దురహంకార కూటమి’ అని అభివర్ణించారు. వారు సనాతన ధర్మాన్ని అవమానించడం ఇది మొదటిసారి కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ ప్రయోజనాల కోసం దళితులను వాడుకుంటోందన్నారు. దళితులు, మహిళలపై కాంగ్రెస్ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మీరూ చూస్తున్నారు కదా అక్కడి మహిళలకు గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే 'నారీశక్తి వందన్ చట్టం' ఆమోదించినప్పటి నుంచి మహిళలపై వారి దురహంకారం మరింత ఎక్కువైందన్నారు. ఆ దురహంకార కూటమి నాయకులు మహిళల గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనన నియంత్రణపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను ఏ ఒక్క కాంగ్రెస్ నేత ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
80 వేల కిలోల గంటను బిగిస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి
రాజస్థాన్లోని కోటా నగరంలో చంబల్ రివర్ ఫ్రంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. అయితే దానిని బిగిస్తున్న సమయంలో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఇంజినీరుతో పాటు మరో కార్మికుడు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోటా జిల్లా యంత్రాంగం, రివర్ ఫ్రంట్ అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున 80 వేల కిలోల బరువున్న గంటను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గంట చేసే శబ్దం 8 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ గంట ప్రపంచంలోనే అతిపెద్ద గంటగా గుర్తింపు పొందింది. ఈ గంట ఐదువేల సంవత్సరాల వరకు నిలిచివుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ గంటను రివర్ ఫ్రంట్కు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. ఈ గంటను నిర్దేశిత స్థానంలో అమరుస్తుండగా ఇంజనీర్ దేవేంద్ర ఆర్య, మరో కార్మికుడు 35 అడుగుల ఎత్తునుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవేంద్ర కన్నుమూశారని వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
Rajasthan elections 2023: మియో వర్సెస్ ‘రక్షక్’
రాజస్తాన్లోని ఆళ్వార్ జిల్లా ఆవుల స్మగ్లింగ్, సంబంధిత హింసాకాండతో గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మత ఘర్షణలు కూడా అక్కడ పరిపాటి. ఈ నేపథ్యంలో ఆవులను కాపాడేందుకు అక్కడ కొన్నేళ్లుగా గో రక్షకులు కూడా తెరపైకి రావడంతో పరిస్థితి కాస్తా ముదురు పాకాన పడింది. స్థానిక మియో ముస్లింలు ఆవులను లక్ష్యంగా చేసుకున్నారన్నది వారి ఆరోపణ. కానీ ఆవుల స్మగ్లింగ్, వధతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ముస్లింలు వాదిస్తున్నారు. నవంబర్ 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల పట్ల వారిలో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. నిత్యం తమపై బురదజల్లడం బీజేపీ నైజమని మియో ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కమలం పారీ్టయే రాష్ట్రానికి ఆశా కిరణమన్నది గో రక్షకుల అభిప్రాయంగా కని్పస్తోంది. బీజేపీ అలా.. కాంగ్రెస్ ఇలా...! మియో ముస్లింలకు ప్రధానంగా పశు పోషణే జీవనాధారం. అభివృద్ధి, మెరుగైన ఉపాధి లభిస్తే తప్ప తమ జీవితాల్లో మార్పు రాబోదన్న నిశి్చతాభిప్రాయం వారి మాటల్లో ప్రతిఫలిస్తోంది. ఈ ముస్లిం ప్రాబల్య గ్రామాలు చాలావరకు వెనకబడే ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక వసతులు, స్కూళ్లు తదితర సదుపాయాలకు దూరంగా ఉండిపోయాయి. బీజేపీ నిత్యం తమను దోషుల్లా చిత్రిస్తుందన్నది వారి ప్రధాన ఆవేదన. ‘‘అందుకే మా జీవితాలను ఎంతో కొతం మెరుగు పరుస్తుందని పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేశాం. కానీ ఐదేళ్లయినా ఏ మార్పూ లేదు’’ అంటూ మొహమ్మద్ రఫీక్ వాపోయాడు. ‘‘ఓ 30 ఏళ్ల క్రితం దాకా మతపరమైన సమస్యలేవీ పెద్దగా ఉండేవి కాదు. హిందువులు, మేం కలసిమెలసి బతికేవాళ్లం. కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మొదలయ్యాక పరిస్థితులు బాగు చేయలేనంతగా పాడయ్యాయి’’ అని అన్సారీ అనే వృద్ధుడు ఆవేదన వెలిబుచ్చాడు. గూండాలన్నా పట్టించుకోం! ఇక గో రక్షకుల వాదన మరోలా ఉంది. సనాతన ధర్మంలో గోవును మాతగా పూజించడం సంప్రదాయం. వాటికి అవమానం, ప్రాణాపాయం జరిగితే ఊరుకునేది లేదు’’ అని ఒక గో రక్షక్ స్పష్టం చేశారు. ‘‘నేను ఎనిమిదేళ్లుగా గో రక్షక్గా ఉంటున్నా. మాపై దొంగలు, బందిపోట్లు అని ముద్ర వేశారు. గూండాలని కూడా నిందిస్తున్నారు. అయినా దేనికీ భయపడేది లేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఆవుల స్మగ్లర్లు పోలీసుల సమక్షంలోనే మాపై దాడులకు దిగుతున్నా అడ్డుకునే దిక్కు లేదు. ఎప్పుడు ఏ కారును ఆపినా ఆవుల కళేబరాలే కని్పస్తున్నాయి. మేమెలా సహించేది?’’ అని ప్రశ్నించారాయన. ముస్లిం సంతుïÙ్టకరణతో కూడిన పేరు గొప్ప సోదరభావం తమకు అక్కర్లేదని మరో గో రక్షక్ స్పష్టం చేశారు. మత రాజకీయాలు ‘వారికి’ అలవాటేనని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దాలంటే బీజేపీ రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్పై అసంతృప్తి అయితే కులమతాలతో నిమిత్తం లేకుండా ఆళ్వార్ ప్రజల్లో చాలామంది కాంగ్రెస్ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలూ జరగలేదన్నది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ నేతల మాటలు చేతల్లో ఎక్కడా కని్పంచలేదని వారు వాపోతున్నారు. ‘‘అందుకే కాంగ్రెస్కు మరోసారి ఓటేయాలని లేదు. అలాగని చూస్తూ చూస్తూ మమ్మల్ని అడుగడుగునా అనుమానించి అవమానిస్తున్న బీజేపీకి ఓటేయలేం. మా పరిస్థితి అయోమయంగానే ఉంది’’ అని స్థానిక ముస్లిం యువకుడొకరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి మియో ముస్లింలు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rajasthan Assembly elections 2023: బీజేపీ గుండెల్లో రె‘బెల్స్’
రాజస్తాన్లో తిరుగుబాటు నేతలు బీజేపీకి దడ పుట్టిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేసిన చరిత్ర వారిది! ఆ ఎన్నికల్లో చివరి క్షణంలో పార్టీ మొండి చేయి చూపడంతో ఆగ్రహించి డజను మంది నేతలు స్వతంత్రులుగా బరిలో దిగారు. తాము ఓడటమే గాక బీజేపీ అభ్యర్థులను కూడా ఓడించి కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. అదే సమయంలో 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసిన 13 మందిలో ఏకంగా 12 మంది విజయం సాధించడం విశేషం. పైగా ఫలితాలు వెలువడగానే వారంతా కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. అలా నికరంగా ఆ పార్టీకి పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఈసారి కూడా రెండు పార్టీల నుంచీ రెబెల్స్ రంగంలో ఉన్న నేపథ్యంలో వారు ఎవరికి చేటు చేస్తారోనన్న చర్చ జరుగుతోంది...! రాజస్తాన్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 830 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో 13 మంది కాంగ్రెస్, 12 మంది బీజేపీ నేతలున్నారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో వారు తిరుగుబావుటా ఎగరేశారు. కాంగ్రెస్ రెబెల్స్లో ఏకంగా 12 మంది గెలవడమే గాక ఆ వెంటనే కాంగ్రెస్లో చేరారు. ఈసారి వారిలో 10 మందికి సీఎం అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ టికెట్లు కూడా ఇప్పించారు. మరోవైపు 12 మంది బీజేపీ రెబల్స్లో ఒక్కరు కూడా నెగ్గలేదు. కుల్దీప్ ధన్ఖడ్, దేవీసింగ్ షెకావత్, ధన్సింగ్ రావత్, హేమ్సింగ్ భడానా వంటి పెద్ద నాయకులు కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాకపోతే ఈ 12 మందీ తమ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులందరినీ ఓడించారు. అలా రెబెల్స్ దెబ్బకు బీజేపీ బాగా నష్టపోయింది. బీజేపీకి 73 సీట్లు రాగా కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడం తెలిసిందే. 2013లో కూడా కాంగ్రెస్ రెబెల్స్లో చాలామంది నెగ్గగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల్లో అత్యధికులు ఓటమి చవిచూశారు. ఈసారి కూడా రాష్ట్రంలో ఏకంగా 737 మంది స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తమ్మీద 18 మంది బీజేపీ రెబెల్స్, 14 మంది కాంగ్రెస్ రెబెల్స్ స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం ఆ పారీ్టలపై ఎలా ఉంటుందన్నది ఫలితాల అనంతరమే తేలనుంది. రాష్ట్రంలో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మిగతా 4 రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3న వెల్లడవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ హై కమాండ్కు ఏటీంఎంలా రాజస్థాన్ : అమిత్ షా
జైపూర్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్ను కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఏటీఎమ్లా వాడుకున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్డు గీకి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. సీఎం అశోక్గెహ్లాట్ ఆయన పార్టీ ఢిల్లీ పెద్దలకు రాజస్థాన్ను ఏటీఎంలాగా వాడుకునే సదుపాయాన్ని కల్పించారని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్మీర్లోని విజయనగర్లో జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. అవినీతిలో రాజస్థాన్ దేశంలోనే నెంబర్వన్గా ఉందని అమిత్ షా విమర్శించారు. మహిళల పట్ల నేరాల్లో,సైబర్ నేరాల్లో రాజస్థాన్ టాప్లో ఉందన్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో గెహ్లాట్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసిందని అమిత్ షా ఫైర్ అయ్యారు. కన్హయ్యలాల్ను పట్టపగలు చంపితే ప్రభుత్వ పెద్దలు ఒక్కరూ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. రాజస్థాన్ను గెహ్లాట్ అల్లర్ల రాష్ట్రంగా మార్చారన్నారు. ఇదీచదవండి.. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం -
పైలట్తో కుస్తీకి బై బై..కలిసి గెలుస్తున్నాం: అశోక్ గెహ్లాట్
జైపూర్ : ఆ ఇద్దరు కాంగ్రెస్ అగ్రనేతలు మొన్నటిదాకా ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకున్నారు. ఎవరికి వారే అన్నట్టు గ్రూపు రాజకీయాలు నడిపారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు రాగానే పార్టీ కోసం ఒక్కటయ్యారు. తమ మధ్య ఏమీ లేదని,పార్టీ గెలుపే తమ ఉమ్మడి లక్ష్యమని చెబుతున్నారు.ఇద్దరు నేతల్లో ఒకరు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాగా, మరొకరు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్. తామిద్దరం ఒక్కటే అన్న సంకేతాలను ఇటు పార్టీ క్యాడర్కు,అటు ప్రజల్లోకి బలంగా పంపేందుకు బుధవారం ఉదయం రాజస్థాన్ సీఎం అశోక్గెహ్లాట్ ఎక్స్(ట్విటర్)లో ఒక ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోకు టు గెదర్ విన్నింగ్ అగెయిన్(కలిసి గెలుస్తున్నాం) అనే క్యాప్షన్ను జోడించారు. ఈ ఫొటోలో సచిన్ పైలట్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కలిసి అశోక్ గెహ్లాట్ చర్చిస్తున్నారు. అటు సచిన్ పైలట్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకు గెహ్లాట్కు మధ్య ఎలాంటి వివాదాలు లేవని రాజకీయ నాయకులుగా తాము హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. గతంలో పైలట్, గెహ్లాట్పై చేసిన విమర్శలను గుర్తు చేయగా ‘నేనలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదు..ఎవరన్నారో వారే బాధ్యత వహిస్తారు’ అని తోసిపుచ్చారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్లో ఈ నెల23న పోలింగ్ జరగనుంది. एक साथ जीत रहे हैं फिर से#कांग्रेस_फिर_से pic.twitter.com/saWIdZ0SGl — Ashok Gehlot (@ashokgehlot51) November 15, 2023 ఇదీ చదవండి..ఒక్కసారి డిసైడ్ అయితే.. తగ్గేదేలే! రైతు బిడ్డ ఘనత -
రాహుల్ ఎక్కడ?
సాక్షి: రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ ప్రచారకుల జాబితాలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ తర్వాత మూడో స్థానంలో ఉన్నది రాహులే. ఖర్గే రెండు మూడుసార్లు రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ కూడా రెండు ర్యాలీల్లో ప్రసంగించారు. కానీ రాహుల్ మాత్రం రాష్ట్రంలో అడుగు పెట్టి ఏకంగా నెలన్నర దాటింది! ఆయన చివరిసారిగా సెప్టెంబర్ 23న జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల భేటీలో పాల్గొన్నారు. ఇంత హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ తరఫున అన్నీ తానై ప్రచార భారం మోయాల్సిన ఆయన ఎందుకిలా దూరంగా ఉంటున్నారన్న దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది... తెలంగాణకు వెళ్లారుగా: బీజేపీ రాహుల్ గైర్హాజరీకి రాజస్థాన్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న కారణాలు కూడా పెద్దగా నమ్మశక్యంగా లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజస్థాన్ కంటే ముందుగా పోలింగ్ జరుగుతున్న మిగతా రాష్ట్రాల్లో ప్రచారంలో రాహుల్ బిజీగా ఉన్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సుఖీందర్సింగ్ రణ్ధవా చెప్పుకొచ్చారు. అందుకే ప్రస్తుతానికి ఆయన రాష్ట్రంపై దృష్టి పెట్టడం లేదన్నారు. కానీ ఇది సాకు మాత్రమేనని బీజేపీ అంటోంది. రాజస్థాన్ తర్వాత ఐదు రోజులకు నవంబర్ 30న పోలింగ్ జరగనున్న తెలంగాణలో రాహుల్ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తోంది. రాజస్థాన్లో కాంగ్రెస్ విజయంపై రాహుల్కు పెద్దగా నమ్మకం లేనట్టుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే సాగుతోంది! సెప్టెంబర్లో ఢిల్లీలో ఓ కార్యక్రమంలో రాహుల్ మాటలు కూడా దీన్ని బలపరిచేవిగానే ఉండటం విశేషం. ‘మేం మధ్యప్రదేశ్, ఛత్తీస్ల్లో కచ్చితంగా గెలుస్తున్నాం. తెలంగాణలోనూ విజయ సూచనలున్నాయి’ అని చెప్పిన ఆయన, ‘రాజస్థాన్లో బహుశా గెలుస్తామేమో’ అంటూ ముక్తాయించారు. ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలను ఊహించలేదంటూ అప్పట్లోనే రాజస్థాన్ కాంగ్రెస్ వర్గాలు ఆవేదన వెలిబుచ్చాయి! ఆనవాయితీ మార్చాలనుకుంటే... నిజానికి రాజస్థాన్లో ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వం మారడం ఆనవాయితీ. కానీ ఈసారి ఎన్నికలకు ముందు దాకా విపక్ష బీజేపీలో అంతర్గత పోరు గట్టిగానే కొనసాగింది. దానికి తోడు సీఎం అశోక్ గహ్లోత్ కొద్ది నెలలుగా వరుసబెట్టి ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు. కనుక అధికార పార్టీ ఓడిపోయే ఆనవాయితీని ఈసారి మార్చగలమని రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు అప్పట్లో భావించారు. తీరా ఎన్నికలు సమీపించే సమయానికి బీజేపీలో ఇంటి పోరు సద్దుమణిగింది. ఇటు చూస్తే ప్రధాన నాయకుడే రాష్ట్రం వైపు తొంగి కూడా చూడకపోవడం వారిలో నిరాశను పెంచుతోంది. గహ్లోత్–పైలట్ కుమ్ములాటలూ కారణమే! రాజస్థాన్కు రాహుల్ కాస్త దూరంగా ఉండటానికి సీఎం గహ్లోత్, యువ నేత సచిన్ పైలట్ మధ్య తీవ్ర విభేదాలు కూడా కారణమని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎవరికి పట్టున్న ప్రాంతంలో ప్రచారానికి వెళ్లినా రెండోవారిని బాధపెట్టినట్టు అవుతుందన్న భావన బహుశా ఆయనలో ఉండవచ్చని చెబుతున్నారు. పైగా గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలన్న సోనియా ఆదేశాన్ని కూడా గహ్లోత్ బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపైనా రాహుల్ అసంతృప్తిగా ఉన్నారని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. కారణమేదైనా ప్రచార పర్వంలో రాహుల్ గైర్హాజరు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం ద్వారా కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీస్తోందన్న ఆందోళన ఆ పార్టీ నేతలతో పాటు కార్యకర్తల్లో కూడా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన దీపావళి అనంతరం నిజంగానే ప్రచారానికి వచి్చనా పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటూ పలువురు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ నైరాశ్యానికి అద్దం పట్టేలానే ఉన్నాయి! -
ప్రైవేట్ లాకర్లలో భారీగా బ్లాక్ మనీ.. కొనసాగుతున్న సోదాలు
రాజస్తాన్లోని జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో మళ్లీ లక్షల్లో బ్లాక్ మనీ దొరికింది. ఆ లాకర్లలో కోట్లాది రూపాయల నల్ల డబ్బు దాచారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. శుక్రవారం ఇక్కడికి చేరుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల బృందం రైడ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఒక లాకర్లో రూ.7.5 లక్షల అనధికార సొమ్మును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో లాకర్లోనూ భారీగా నగదును గుర్తించారు. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది. అధికారులు మరిన్ని లాకర్లను తెరవనున్నారు. అదంతా పేపర్లీక్ సొమ్ము రాజస్తాన్లో గత డిసెంబర్లో గ్రేడ్-2 టీచర్ నియామకానికి సంబంధించిన పేపర్లీక్ ఉదంతం బయటపడింది. 37 మంది అభ్యర్థులు సహా మొత్తం 55 మంది నిందితులు అరెస్టయ్యారు. కాగా ఈ పేపర్లీక్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మునంతా జైపూర్ గణపతి ప్లాజా ప్రైవేటు లాకర్లలో దాచారని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు కిరోరిలాల్ మీనా సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా రూ.7 కోట్ల నగదు, 12 కేజీల బంగారం జైపూర్ గణపతి ప్లాజాలో మొత్తం 1100 లాకర్లు ఉన్నాయి. గత అక్టోబర్ 17న చేసిన సోదాల్లో రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ బృందం.. అక్టోబర్ 21న చేపట్టిన సోదాల్లో ఏకంగా రూ.2.46 కోట్లు స్వాధీనపరుచుకున్నారు. ఆ లాకర్లు నుంచి ఇప్పటిదాకా రూ.7 కోట్లకు పైగా నగదు, 12 కేజీలకు పైగా బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ స్వాధీనం చేసుకుంది. -
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ నేతకు బిగ్ షాక్
జైపూర్: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సందర్బంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొందరు నేతలు ప్రచారంలో హద్దులు మీరడంతో పార్టీలు వారిపై చర్యలకు దిగుతున్నాయి. తాజాగా రాజస్థాన్కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన సందీప్ దయమాపై బీజేపీ కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సందీప్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించింది. అయితే, రాజస్థాన్లోని అల్వార్లో జరిగిన ర్యాలీలో పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై చర్యలు తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. Sandeep Dayma, BJP leader who called for destroying Masjids& Gurdwaras, has been expelled Reflects 'tushtikaran' of Sikhs, but not of Muslims BJP will become a national party only when it stops 'tushtikaran' of Hindus, Buddhists, Jains and Sikhs and treats everyone equally pic.twitter.com/WnGgT3Fezk — Ashok Singh (@AshokSGarcha) November 5, 2023 కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సందీప్ దయమా ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదులు, గురుద్వారాలను ఉద్దేశించి సందీప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకుంది. మరోవైపు.. సందీప్ వ్యాఖ్యలపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్సింగ్, ఇతర పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సందీప్ దయమాను పార్టీ నుంచి బహిష్కరిస్తూ రాజస్థాన్ బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఓంకార్ సింగ్ లఖావత్ నిర్ణయం తీసుకున్నారు. -
పాలిటిక్స్ నుంచి వసుంధర రిటైర్మెంట్..! క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం
కోట: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్టేట్ మాజీ సీఎం వసుంధర రాజే కీలక ప్రకటన చేశారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదని ఇప్పట్లో పాలిటిక్స్లో నుంచి తన రిటైర్మెంట్ లేదని క్లారిటీ ఇచ్చారు. జలావర్ జిల్లాలోని జల్రాపటాన్ నియోజకవర్గం నుంచి వసుంధర శనివారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. పాలిటిక్స్లో నుంచి తాను రిటైర్ అవనున్నట్లు వస్తున్న ఊహాగానాలకు ఈ సందర్భంగా ఆమె తెరదించారు.తానెక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం జరిగిన ఒక ప్రచార బహిరంగ సభలో వసుంధర చేసిన వ్యాఖ్యలు ఆమె రిటైర్మెంట్పై ఊహాగానాలు రావడానికి కారణమయ్యాయి. తన కుమారుడు ఎంపీ దుశ్యంత్ సింగ్ మంచి లీడర్గా తయారయ్యాడని, ఇక రిటైర్ అవ్వాల్సిన టైమ్ వచ్చిందని వసుంధర ఆ మీటింగ్లో అన్నారు. -
రాజస్తాన్ సీఎం గెహ్లోత్ కుమారుడికి ఈడీ సమన్లు
జైపూర్: రాజస్తాన్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యండరింగ్ ఆరోపణలపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, పాఠశాల విద్యాశాఖ మాజీ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరిపింది. అదేవిధంగా, విదేశీ కరెన్సీ నిబంధనల ఉల్లంఘన కేసులో సీఎం అశోక్ గెహ్లోత్ కుమారుడు వైభవ్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆయన్ను కోరింది. సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు నడుమ గురువారం ఈడీ అధికారుల బృందం జైపూర్, సికార్లలోని గోవింద్ సింగ్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన సికార్ జిల్లాలోని లచ్చమన్గఢ్ నుంచి పోటీలో ఉన్నారు. అదేవిధంగా, దౌసా జిల్లాలోని మహువా సీటుకు పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఓం ప్రకాశ్ హుడ్లా, మరికొందరి ఇళ్లలో కూడా సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 2022 డిసెంబర్లో రాజస్తాన్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ నిర్వహించిన సీనియర్ టీచర్ గ్రేడ్–2 పరీక్షలో జనరల్ నాలెడ్జి ప్రశ్నపత్రం లీకైంది. అప్పటి విద్యాశాఖ మంత్రి గోవింద్సింగ్ తదితరులు కలిసి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసి, ఈ దందాకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. వైభవ్పై ఆరోపణలేంటీ? సీఎం గెహ్లోత్ కుమారుడు వైభవ్ విదేశీ మాదక ద్రవ్య మారి్పడి చట్టం కేసును ఎదుర్కొంటున్నారు. 2011 నుంచి ఈ కేసుకు సంబంధించిన పత్రాలను సమకూర్చుకోవాల్సి ఉన్నందున వైభవ్ శుక్రవారం విచారణకు హాజరుకాకపోవచ్చని ఈడీ అంటోంది. విచారణ వాయిదా కోరవచ్చని భావిస్తోంది. రాజస్తాన్కు చెందిన ట్రిటాన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, వార్ధా ఎంటర్ ప్రైజెస్ సంస్థల ప్రమోటర్లకు చెందిన జైపూర్, ఉదయ్పూర్, ఢిల్లీల్లోని పలు ప్రాంతాల్లో ఆగస్ట్లో ఈడీ సోదాలు జరిపింది. వీరికి వైభవ్ గెహ్లోత్తో సంబంధాలున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. దాడుల్లో రూ.1.2 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించింది. -
బీజేపీలో బిగ్ ట్విస్ట్.. తన తండ్రికి టికెట్ ఇవ్వొదన్న కూతురు..
జైపూర్: ఈ ఏడాది చివరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్లోని బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన తండ్రికి టికెట్ ఇవ్వొదంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూతురు నిరసనలు తెలిపింది. దీంతో, అక్కడ పొలిటికల్ వాతావరణం హాట్ టాపిక్గా మారింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనకు ముందే బీజేపీలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రికి పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఆయన కుమార్తెనే అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చింది. ఒకవేళ టిక్కెట్ ఇస్తే తన తండ్రిపై రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపి, ఇతర టిక్కెట్ ఆశావహులతో కలిసి ఓడిస్తానని హెచ్చరించడం రాజస్థాన్ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయరామ్ జాటవ్ కూతురు మీనా జాటవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన తండ్రికి టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు. దీంతో, వీరి వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. తన ఆస్తులను కొట్టేసేందుకు స్వయానా తన తండ్రే కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. అంతేకాకుండా తన కొడుకును కూడా చంపించాలని చూస్తున్నాడని మీనా జాటవ్ ఆరోపించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ సహా బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు రాజస్థాన్లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు కోరారు. ఇక, కాంగ్రెస్ నేతలు కూడా రాజస్థాన్లో పర్యటిస్తున్నారు. అక్కడ గెలుపే లక్ష్యంగా హస్తం నేతలు ప్లాన్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: గగన్యాన్లో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం -
కులగణన అంటే మోదీకి భయమెందుకు?
జైపూర్: దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కుల గణనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని పునద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా కల్సించాలని అన్నారు. రాహుల్ శనివారం రాజస్తాన్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. మహిళా రిజర్వేషన్లను ఇప్పటికిప్పుడు అమలు చేయడం సాధ్యమేనని రాహుల్ స్పష్టం చేశారు. జనగణన, నియోజకవర్గాల పునరి్వభజన ముసుగులో ఈ రిజర్వేషన్లను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఓబీసీల గురించి నిత్యం మాట్లాడే ప్రధానమంత్రి కుల గణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియడం లేదని చెప్పారు. దయచేసి ఓబీసీలను మోసం చేయకండి అని కోరారు. కుల గణన గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రయతి్నస్తే బీజేపీ సభ్యులు తన గొంతుకను అణచివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ బబ్బర్ షేర్స్ (సింహాలు)గా అభివరి్ణంచారు. అదానీతో ప్రధాని మోదీ సంబంధాలను రాహుల్ మరోసారి ప్రస్తావించారు. -
పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?
Parineeti Chopra-Raghav Chadha Weddingబాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లి సందడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్లో కీలకమైన మెహీందీ, హల్దీ వేడుకు ఫోటోలు నెట్లో సందడి చేస్తున్నాయి. ఈ జంట సెప్టెంబర్ 24న రాజస్థాన్ ఉదయ్పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace) వేదికగా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే వధూవరులతోపాటు బంధుమిత్ర సపరివారం ఉదయ్పూర్లో ల్యాండ్ అయ్యారు. ముఖ్యంగా బఈ వివాహ వేడుక నిమిత్తం ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఉదయ్పూర్ చేరుకున్నారు. రాఘవ్ , పరిణీతి వారి జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇవాళ రేపు(శని, ఆది) వివాహ వేడుకలు జరుగాయని వెల్లడించారు. ఈసందర్బంగా ఉదయ్పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.ఈ సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్లను లాక్ చేసుకున్నారు. వీరి పెళ్లికి బుక్ చేసిన హోటల్లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దెఎంత అనేది ఆసక్తికరంగా మారింది. హోటల్ సూట్ ఒక రాత్రికి రూ. 10 లక్షలు వసూలు చేస్తుందట. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ ట్రావెల్ ప్లస్ లీజర్ వరల్డ్ సర్వే అవార్డ్స్ – 2023లో ర్యాంక్ .అంతేకాదు లీలా ప్యాలెస్ ప్రపంచంలోని అత్యుత్తమ 100 మరియు భారతదేశానికి ఇష్టమైన 5 హోటళ్లలో కూడా స్థానాన్ని కూడా సంపాదించింది. శిల్పకళా సౌందర్యానికి పాపులర్ అయిన లీలా ప్యాలెస్ హోటల్అతిథులకు రుచికరమైన వంటల్ని వడ్డించనున్నారు. VIDEO | “Raghav and Parineeti are set to step into a new chapter of their lives for which I want to extend my heartiest congratulations to them,” says AAP leader Sanjay Singh as he arrives in Udaipur to attend Raghav Chadha and Parineeti Chopra’s wedding. pic.twitter.com/vRn0MGcRmH — Press Trust of India (@PTI_News) September 23, 2023 డిజైనర్ దుస్తుల్లో పరిణీతి, రాఘవ్ చద్దా జంట , అతిథులకు నో- ఫోన్ రాఘవ్ మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేసినట్టు వెల్లడించారు. ఇక పెళ్లి కూతురు పరిణీతి మనీష్ మల్హోత్రా సమిష్టిని ధరించనుంది. బేసిక్ సాలిడ్ పాస్టెల్ కలర్ లెహంగా, స్టేట్మెంట్ జ్యువెలరీ స్పెషల్ లుక్లో ఎట్రాక్షన్గా కనిపించనుందని టాక్. అంతేకాదు ఈ గ్రాండ్ వెడ్డింగ్కు హాజరయ్యే అతిథులు గోప్యతను పాటించాల్సి ఉంది. అందుకే నో-ఫోన్ విధానాన్ని పాటించాలని వారికి సూచించినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
కాలం కలిసి వస్తే డంప్యార్డ్ కూడా నందనవనం అవుతుంది!
కాలం కలిసే వస్తే... కంపు కొట్టే డంపు యార్డ్ కూడా కనుల విందు చేసే పార్క్ అవుతుంది. రాజస్థాన్లోని రాజ్గఢ్లో ఒక డంప్ యార్డ్ ఉండేది. దుర్వాసన వల్ల ఆ చుట్టుపక్కల నుంచి నడిచి వెళ్లాలంటే జనాలు జడుసుకునేవారు. అలాంటి చోటుకు ఇప్పుడు జనాలు వెదుక్కుంటు వస్తున్నారు. దీనికి కారణం ఈ డంప్యార్డ్ను మున్సిపాలిటీ సిబ్బంది అందమైన పార్క్గా తయారుచేయడమే. వాటర్ ఫౌంటెన్లు, పచ్చటి గడ్డితో ఈ పార్క్ కనువిందు చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సవిత దావియా ఈ క్లిప్ను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఎన్నో పట్టణాలలో ఎన్నో డంప్యార్డ్లు భయపెడుతున్నాయి. అవి కూడా ఇలాగే నందనవనంలా మారితే ఎంత బాగుంటుంది’ అంటూ ఒక ఎక్స్ యూజర్ స్పందించాడు. A former dumpyard converted to this public park on Municipality land by #ForestDept #Churu in 3 months#Motivation - Kids like mine hv a place to go, staff learnt new skill, dept got recognition & a public asset created 🌿#urban #Forestry@ParveenKaswan@RajGovOfficial pic.twitter.com/SG0OVigORS — God's Favourite Child (@Savi_IFS) September 7, 2023 (చదవండి: బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో టాపర్) -
ఆ మరణాలపై ఆనంద్ మహీంద్రా ఆవేదన
కోచింగ్ హబ్గా పేరొందిన రాజస్థాన్ రాష్ట్రం కోటా పట్టణంలో విద్యార్ధుల ఆత్మహత్యలు తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోటీ పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయేమోనని భయం, ఫెయిల్ అవుతావేమోనన్న ఆందోళనలతో విద్యా కుసుమాలు రాలుతున్నాయి. తాజాగా, గంటల వ్యవధిలో విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడగా.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం 24 మంది విద్యార్ధులు అర్ధాంతరంగా తనువు చాలించారు. తమ తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచేస్తున్నారు. ఈ తరుణంలో కోటా విద్యార్ధుల మరణాలపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధులు గురవుతున్న ఒత్తిడిపై ఆందోళన చెందారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మీరేంటో నిరూపించుకోవడం కంటే.. మీ గురించి మీరు తెలుసుకోవాలని సూచించారు. ‘ఈ వార్త చూసి కలత చెందాను. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరం. పంచుకోవడానికి నా దగ్గర గొప్ప జ్ఞానం లేదు. కానీ మీ అందరికి (కోటా విద్యార్ధులను ఉద్దేశిస్తూ) ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ దశలో మీ లక్ష్యం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు గుర్తించడం. పరీక్షలో విజయం సాధించకపోవడం అనేది కేవలం స్వీయ అన్వేషణ ప్రయాణంలో భాగం. మీ నిజమైన ప్రతిభ మరెక్కడో ఉందని అర్థం. శోధిస్తూ ఉండండి, ప్రయాణం చేస్తూ ఉండండి. చివరికి ఎందులో ప్రతిభావంతులో మీరే గుర్తిస్తారు. అనుకున్నది సాధిస్తారు’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. I am as disturbed as you are by this news. Tragic to see so many bright futures being extinguished. I don’t have any great wisdom to share. But I would want to tell every student in Kota that your goal at this stage of life is not to prove yourself but to FIND yourself. Lack of… https://t.co/2zWUUnEE6X — anand mahindra (@anandmahindra) August 29, 2023 ఈ ఏడాది అత్యధికంగా పలు నివేదికల ప్రకారం..కోటా పట్టణం పోటీ ప్రవేశ పరీక్షలకు ప్రసిద్ధి. ప్రతి ఏడు ఆయా రాష్ట్రాల్లో పోటీ ప్రవేశ పరీక్షల్లో కోచింగ్ తీసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ప్రస్తుతం కోటాలో దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు మూడు లక్షల మంది విద్యార్ధులున్నారు. వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. తల్లిదండ్రులకు భారం కాకూడదని, లక్ష్యాన్ని చేరుకుంటామో? లేదో’నని ఒత్తిడికి గురవుతున్నారు. తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ధోరణి విద్యార్ధులు మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి ఎంత ప్రభావం చూపిస్తుందో అర్ధమవుతుంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఆగస్ట్ 27న (గత ఆదివారం), కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇద్దరు విద్యార్థులు కొన్ని గంటల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం 2023లో ఇప్పటివరకు అత్యధికంగా ముక్కుపచ్చలారని 24 మంది విద్యార్ధుల జీవితాలు బలైపోయాయి. -
విక్రేతల మధ్య సమాన పోటీ ఉండాలి
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఈ–కామర్స్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే సమయంలో ఈ రంగంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద విక్రేతల మధ్య సమాన పోటీ ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం రాజస్తాన్లోని జైపూర్లో జరిగిన జీ20 దేశాల వాణిజ్య, పెట్టుబడి శాఖ మంత్రుల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ధరలు, ఫిర్యాదుల విషయంలో వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. డిజిటలీకరణ ద్వారా ఈ–కామర్స్ రంగంలో దేశాల మధ్య కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) అనేది ఒక గేమ్–చేంజర్ అని మోదీ అభివరి్ణంచారు. దీనిద్వారా డిజిటల్ మార్కెట్ప్లేస్ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, సానుకూలతను ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం.. మునేశ్ గుర్జర్ సస్పెండ్
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేశ్ గుర్జర్కు బిగ్ షాక్ తగిలింది. గుర్జర్పై రాజస్థాన్ ప్రభుత్వం వేటువేసింది. ఓ భూమి లీజ్ వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ గెహ్లాట్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మేయర్ మునేశ్ గుర్జర్ భర్త సుశీల్ గుర్జర్ ఓ భూమి లీజ్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీక అధికారులకు చిక్కాడు. మేయర్ స్వగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మేయర్ మునేశ్ గుర్జర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక, ఆమె ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం వ్యవహారంలో మేయర్ హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నంబర్ 43 కార్పొరేటర్ పదవి నుంచి కూడా సస్పెండ్ చేసింది. మరోవైపు.. ఈ కేసులో నారాయణ్ సింగ్, అనిల్ దూబే అనే మరో ఇద్దరిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నారాయణ్ సింగ్ నివాసంలోనూ మరో రూ.8 లక్షల నగదు లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రాజస్థాన్లోని కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్లో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మేయర్ లంచం కేసు వ్యవహారం హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. Breaking News: Mayor Munesh Gurjar निलंबित। कहा, 'कांग्रेस के बड़े नेता ने साज़िश कर फंसाया है'! pic.twitter.com/AajGDCt6IO — Rajasthan Tak (@Rajasthan_Tak) August 6, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..? -
రాజస్థాన్ కోటలో ఆత్మహత్యల పరంపర.. ఈ ఏడాది ఇప్పటికే 18.. ఆందోళనలో నిపుణులు!
రాజస్థాన్లోని కోట జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర నిరంతరం కొనసాగుతోంది. తాజాగా బీహార్కు చెందిన భార్గవ్ ఆత్మహత్యతో కోట కోచింగ్ సెంటర్లలో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల జాబితాలో మారోపేరు చేరింది. తమ కుమారుడు భార్గవ్ మిశ్రా మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కోటకు వచ్చిన మృతుని కుటుంబ సభ్యుల రోదన అక్కడున్నవారి హృదయాలను కలచివేసింది. జేఈఈ కోచింగ్ కోసం వచ్చి.. 17 ఏళ్ల భార్గవ్ మిశ్రా ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ కోసం 4 నెలల క్రితమే బీహార్లోని చంపారణ్ నుంచి కోట నగరానికి వచ్చాడు. ఇక్కడి మహావీర్ నగర్ ప్రాంతంలోని పీజీలో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో జేఈఈ కాంపిటీటివ్ పరీక్ష కోసం సిద్ధం అవుతున్నాడు. తాజాగా భార్గవ్ తండ్రి కుమారునికి ఫోన్ చేయగా, కుమారుడు ఫోన్ తీయలేదు. ఎంతసేపు ప్రయత్నించినా కుమారుడు ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో తండ్రి కుమారుని ఇంటి యజమానికి ఈ విషయం తెలిపాడు. ఉరి వేసుకున్న స్థితిలో భార్గవ్ వెంటనే ఇంటి యజమాని గది తలుపులు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని కిటికీలో నుంచి గదిలోనికి తొంగిచూడగా, భార్గవ్ మిశ్రా ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే అతను ఈ సమాచారాన్ని మహావీర్ నగర్ పోలీసులకు తెలియజేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారి అవధేష్ కుమార్ మాట్లాడుతూ గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం దానిని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వైట్హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం! మెడికల్, ఇంజినీరింగ్ కోచింగ్ సెంటర్ల ఫ్యాక్టరీలు నడిచే కోటకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు తరలివస్తుంటారు. వీరు ఇంజినీర్లు లేదా డాక్టర్లు కావాలన్న తమ కలను నెరవేర్చుకునేందుకు తాపత్రయ పడుతుంటారు. ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే హామీలను నమ్మి, ఇక్కడ కోచింగ్ తీసుకుంటుంటారు. ఈ ఏడాది ఈ ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపధ్యంలో కోట కోచింగ్ సెంటర్ల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. 18కి చేరిన విద్యార్థుల ఆత్మహత్యలు భార్గవ్ మిశ్ర ఆత్మహత్యతో ఈ ఏడాది ఇక్కడ విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 18కి చేరింది. ఇది అందరిలోనూ ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోచింగ్ సెంటర్లకు పలు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులలో మోటివేషన్ తీసుకు వచ్చే చర్యలు చేపట్టాలని కోరింది. జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసి నిపుణుల సాయంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. స్థానిక పోలీసులు కూడా డెడికేటెడ్ స్టూడెంట్ సెల్ను ప్రారంభించారు. దీని ద్వారా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. ఏ సమయంలోనైనా తమకు ఫోన్ చేసి, తమ సహాయం తీసుకోవచ్చని విద్యార్థులకు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం 2లక్షలకు పైగా విద్యార్థులు కోటలో వివిధ కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారని సమాచారం. ఇది కూడా చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్కు దేహశుద్ది!