
జైపూర్ : పోలింగ్ను పర్యవేక్షిస్తున్న సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్పై (ఎస్డీఎం)పై దాడి ఘటన కలకలం రేపుతుంది. పోలింగ్ బూత్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి ఎస్డీఎంపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
రాజస్థాన్లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఆ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ స్టేషన్లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్ను పర్యవేక్షిస్తున్నారు.
ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్క్రుత నేత, డియోలీ-యునియారా ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి నరేష్ మీనా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఎస్డీఎం అమిత్ చౌదరిపై దాడి చేశారు. ఎస్డీఎం అమిత్ చౌదరి.. తనతో సన్నిహితంగా ఉన్న ఓ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడేలా ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు నరేష్ మీనాను పోలింగ్ కేంద్రం బయటకు తీసుకువచ్చారు. ఎస్డీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైటాయించారు.
రాజస్థాన్లోని ఝుంఝును, దౌసా, డియోలి-ఉనియారా, ఖిన్వ్సర్, చౌరాసి, సాలంబెర్, రామ్గఢ్ స్థానాలు ఉప ఎన్నిక కొనసాగుతుంది. కాగా,గతేడాది రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 114 స్థానాల్లో, కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు.
मैं देवली उनियारा से नरेश मीणा का समर्थन कर रहा था परंतु आज जिस प्रकार का गंदा रवैया उनके द्वारा देखा गया वह शर्मनाक है।@NareshMeena__ की अभी कोई हैसियत नहीं है कि वह एक एसडीएम के ऊपर हाथ उठाएं, यह लोकतंत्र व भारतीय प्रशासन पर कलंक है। एकतरफ देश की सबसे कठिन परीक्षा देकर आया एक… pic.twitter.com/urAxAjR3BI
— Priyanshu Kumar (@priyanshu__63) November 13, 2024
Comments
Please login to add a commentAdd a comment