4 లక్షల రోడ్డు ప్రమాదాలు | Road Accidents rises in india records 412432 in 2021 | Sakshi
Sakshi News home page

4 లక్షల రోడ్డు ప్రమాదాలు

Dec 23 2022 5:52 AM | Updated on Dec 23 2022 5:52 AM

Road Accidents rises in india records 412432 in 2021 - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో 2021 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. 2020లో 3,66,138 ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా 2021లో ఇవి 4,12,432కు చేరాయని వివరించింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపారు.

ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు ఇంజనీరింగ్‌ నిపుణుల సూచనల ప్రకారం రహదారుల పునర్నిర్మాణం, రహదారి భద్రతను పటిష్టం చేయడం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏ ఒక్క జాతీయ రహదారిని కూడా మూసివేసే ప్రతిపాదన లేదని తెలిపారు. రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ ఫెసిలిటీస్‌ వద్ద ఇప్పటి వరకు 5,215 వాహనాలను తుక్కుగా మార్చినట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement