Transport Minister
-
చట్టాలంటే ప్రజలకు గౌరవం లేదు, భయం లేదు
న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తంచేశారు. చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం, చట్టం అంటే ఏమాత్రం భయం లేకపోవడమే ఇందుకు కారణమని ఆక్షేపించారు. గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని చెప్పారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని, తన కాలు నాలుగుచోట్ల విరిగిపోయిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే నాలుగు కీలక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఏటా 30 వేల మందిమృత్యువాత పడుతున్నారని తెలిపారు. జరిమానాలు పెంచినా... ఈ ఏడాది ఇప్పటివరకు 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని గడ్కరీ వివరించారు. మృతుల్లో 60 శాతం మంది యువతీ యువకులే ఉండడం బాధాకరమని చెప్పారు. జరిమానాలు పెంచుతున్నా ప్రజలు లెక్కచేయడం లేదని, నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో తన కళ్లెదుటే ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి వెళ్లిందని అన్నారు. మరణాలు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో చాలాచోట్ల రోడ్లపై బ్లాక్స్పాట్లు ఉన్నాయని, వీటిని సరి చేయడానికి రూ.40,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
సెల్ఫోన్ ఫ్రాడ్ కేసులో బ్రిటన్ మంత్రి రాజీనామా
లండన్: సెల్ఫోన్ చోరీకి గురైందంటూ దశాబ్దం క్రితం తప్పుడు ఫిర్యాదు చేసిన కేసులో యూకే రవాణా శాఖ మంత్రి లూయీజ్ హే(37) శుక్రవారం పదవికి రాజీనామా చేశారు. 2013లో లూయాజ్ను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. తను పోగొట్టుకున్న వాటిలో సెల్ఫోన్ కూడా ఉందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె సెల్ఫోన్ దొరికింది. దీనిపై పోలీసుల విచారణలో ఆమె..దోపిడీకి గురైనవాటిలో మొబైల్ ఉందంటూ పొరపాటున ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కోర్టులో కూడా ఆమె తన తప్పిదాన్ని అంగీకరించారు. మొదటి తప్పుగా భావించి కోర్టు ఆమెను విడుదల చేసింది. రవాణా మంత్రి లూయీజ్ ఫ్రాడ్ చేసినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో లాయర్ సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజా పరిస్థితుల్లో రాజీనామా చేయడమే ఉత్తమమని భావిస్తున్నానని, ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు కొనసాగిస్తానని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎంపీగా షెఫీల్డ్ నుంచి లూయీజ్ హే ఎన్నికయ్యారు. -
అమెరికా రవాణామంత్రిగా ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత
వాషింగ్టన్: అమెరికా రవాణా మంత్రిగా ఫాక్స్ న్యూస్ హోస్ట్ సాన్ డఫీని నామినేట్ చేస్తున్నట్లు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ న్యూస్కు సంబంధించి ట్రంప్ యంత్రాంగంలో ఇది రెండో నియామకం కావడం విశేషం. ఫాక్స్న్యూస్ హోస్ట్ పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ట్రంప్ ఇప్పటికే నామినేట్ చేయడం తెలిసిందే. డఫీ నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయాలు, మీడియా, రియాలిటీ, టీవీ రంగాల్లో విస్తరించిన వైవిధ్యమైన కెరీర్ ఆయన సొంతం. 1990ల చివర్లో ఎంటీవీ ‘ది రియల్ వరల్డ్: బోస్టన్’లో కాస్ట్ మెంబర్గా ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. తరువాత ‘రోడ్ రూల్స్: ఆల్ స్టార్స్’లో కనిపించారు. 2010లో విస్కాన్సిన్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికవడంతో డఫీ రాజకీయ జీవితం మొదలైంది. 2019లో రాజీనామా చేసి ఫాక్స్ న్యూస్ కంట్రిబ్యూటర్గా చేరారు. ప్రస్తుతం ఫాక్స్ బిజినెస్లో ‘ది బాటమ్ లైన్’ వ్యాఖ్యాతగా ఉన్నారు. 2022లో విస్కాన్సిన్ గవర్నర్ పదవిని తిరస్కరించారు. -
లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చివరిది కావొచ్చనే విశ్లేషకుల అంచనా తప్పింది. మరికొంత మందిని విచారించాలని ఈడీ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. తాజాగా.. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్కు విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్కు కైలాష్ మద్దతు ఉందనే ఆరోపణ మీద ఆయనకు సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా శనివారమే తమ ఎదుటకు రావాలని సమన్లలో ఈడీ కోరింది. అంతేకాదు.. రవాణా శాఖ మంత్రిగా ఉన్న కైలాష్ నాటి లిక్కర్ పాలసీ ముసాయిదా రూపకల్పనలో సభ్యుడిగా ఉన్నారు. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల విచారణ మొదలయ్యాక.. తరచూ ఆయన ఫోన్ నెంబర్లు మార్చినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళే(శనివారం) తమ ఎదుట హాజరు కావాలని ఈడీ మంత్రి కైలాష్కు సమన్లలో స్పష్టం చేసింది. -
బాబుకు బిగ్ షాక్..అవినీతి కేసులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఔట్
-
Iswaran: బాబు సింగపూర్ పార్ట్నర్ రాజీనామా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడిగా, సింగపూర్ పార్ట్నర్గా పేరొందిన సుబ్రమణియం ఈశ్వరన్.. బాబు బాటలోనే పయనిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంట్ సభ్యత్వానికి, అలాగే పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి (PAP)కి సైతం రాజీనామా సమర్పించారు. అవినీతి కేసులో సింగపూర్ మంత్రి పదవికి ఈశ్వరన్ రాజీనామా చేసి.. జైలుకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(CPIB) ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కిందటి ఏడాది జులై 11వ తేదీన ఆయన్ని అరెస్ట్ కూడా చేసింది(వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చారు). ఇక దర్యాప్తు నేపథ్యంలో.. సింగపూర్ ప్రధాని, ఈశ్వరన్ను సెలవుల మీద పక్కకు పెట్టారు. మరోవైపు గతేదాడి సెప్టెంబర్లో ఈ కేసులో దర్యాప్తు ఓ కొలిక్కి రావడంతో సింగపూర్ పార్లమెంట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై సస్పెన్షన్వేటు వేసింది. తాజాగా నేరారోపణలు నమోదు కావడం, ఆ వెంటనే సీపీఐబీ నుంచి నోటీసులు అందుకోవడంతో ఈశ్వరన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈశ్వరన్ రాజీనామాను ధృవీకరిస్తూ గురువారం సింగపూర్ ప్రధాని కార్యాలయం ఆ దేశ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: చిక్కుల్లో ఈశ్వరన్.. కేసు నేపథ్యం ఇదే! భారీ అక్రమ లావాదేవీలు నడిపారన్న అభియోగాలతో ఈశ్వరన్పై గురువారం న్యాయస్థానంలో 27 రకాల నేరారోపణల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి దర్యాప్తు సంస్థ సీపీఐబీ కూడా నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. 2025లో సింగపూర్లో ఎన్నికలు ఉండడంతో అక్కడి ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణిస్తూ వస్తోంది. తాజా రాజీనామా పరిణామంతో.. గత ఐదు నెలలుగా ఆయన మంత్రి పదవితో పాటు ఎంపీ హోదాలో అందుకున్న జీతభత్యాల్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుతో లింకేంటీ? చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించారు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించారు. Delighted to have met Second Minister (Trade & Industry) S. Iswaran on opportunities in AP. pic.twitter.com/s8kf19f00g — N Chandrababu Naidu (@ncbn) November 12, 2014 అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్బ్రిడ్జి–సెంబ్కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న నాడు సింగపూర్ వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఈశ్వరన్తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అమరావతి పేరుతో అంతర్జాతీయ నాటకం.. రాష్ట్ర విభజన సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని సింగపూర్ ప్రభుత్వ సహకారంతో దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నూతన నగరాన్ని నిర్మిస్తానంటూ నమ్మబలికారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై వందిమాగధులకు లీకులిచ్చి భారీ ఎత్తున భూములను కాజేశారు. ఆ తర్వాత తాపీగా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ను ముందు పెట్టి గ్రాఫిక్స్ చూపిస్తూ అందరినీ మభ్యపుచ్చారు. ఈ క్రమంలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ముసుగులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిపి రూ.లక్ష కోట్లు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారు. సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం అన్నట్లుగా.. రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలు అసెండాస్–సిన్బ్రిడ్జి–సెంబ్కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ ఈశ్వరన్తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రాజెక్టులో పెట్టుబడి సహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కలిసి 15 ఏళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా గ్రాస్ టర్నోవర్లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే సరిపోతుందని నాటి చంద్రబాబు కేబినెట్ అంగీకరించింది. ఈ ముసుగులో రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి స్కెచ్ వేశారు. అక్రమాల ఒప్పందం రద్దు.. 2019లో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో అసెండాస్–సిన్బ్రిడ్జి–సెంబ్కార్ప్ కన్సార్టియంతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ అక్రమాల ఒప్పందం రద్దు అయింది. బాబు తరహా మనిషే! సుబ్రమణియం ఈశ్వరన్ వ్యవహార శైలిపై మొదటి నుంచే విమర్శలు ఉన్నాయి. ఈశ్వరన్ 1997లో తొలిసారి అక్కడి ఎన్నికల్లో నెగ్గారు. ఆపై 2021లో రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యలో ప్రధాని కార్యాలయంతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. అయితే.. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. మన దగ్గర సీఎంగా చంద్రబాబు చేసిన అవినీతి పుట్ట ఎలాగైతే సీఐడీ దర్యాప్తు ద్వారా బద్ధలయ్యిందో.. సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సింగపూర్ దర్యాప్తు సంస్థ సీపీఐబీ నిర్ధారించింది. ఇక ఈ కేసులో ఈశ్వరన్కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్ బెంగ్ సెంగ్ సైతం సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో హూంగ్ బెంగ్ను సైతం దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ చేసి విచారించింది. -
ఆరు నెలల బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచి.. డ్రైవర్ కన్నీటి పర్యంతం!
సాక్షి, చైన్నె: ఆరు నెలల బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచి తనను తేనికి బదిలీ చేయాలని ఓ డ్రైవర్ పట్టుబట్టడం కోయంబత్తూరు రవాణా సంస్థలో కలకలం రేపింది. వివరాలు.. కోయంబత్తూరులో బుధవారం రవాణ శాఖ మంత్రి శివశంకర్ కార్యక్రమం జరిగింది. ఇందులో కొత్త భవనాల ప్రారంభోత్సవం, కారుణ్య నియామక ఉత్తర్వులు, పది, ప్లస్–2లో రాణించి రవాణా కార్మికుల పిలల్లకు సత్కారం జరిగింది. ఈ సందర్భంగా వేదిక మీదకు వచ్చిన ఓ డ్రైవర్ హఠాత్తుగా ఆరు నెలల తన బిడ్డను మంత్రి పాదాల వద్ద ఉంచాడు. తాను సైతం పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన మంత్రి ఆ చంటి బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నారు. అతడి చర్యలతో మంత్రి షాక్కు గురయ్యాడు. చివరకు తన వేదనను మంత్రికి వివరించాడు. కోయంబత్తూరులో తాను ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ వచ్చినట్టు పేర్కొన్నారు. 'பணியிட மாறுதல் வேண்டும்' தன் குழந்தையுடன் அமைச்சர் சிவசங்கர் காலில் விழுந்து கோரிக்கை வைத்த ஓட்டுநர் #Kovai | #Coimbatore |#MinisterSivasankar | #Driver pic.twitter.com/cCLm8RJHAb — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) August 16, 2023 ఇటీవల తన భార్య బిడ్డకు జన్మనిచ్చి మరణించినట్లు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలను తాను చూసుకోలేని పరిస్థితి ఉందని, దీంతో స్వగ్రామం తేనిలో ఉన్న తన తల్లికి అప్పగించానని పేర్కొన్నాడు. చిన్న పిల్లలను చూసుకునేందుకు అవకాశం కల్పించాలని, తనను కోయంబత్తూరు నుంచి తేనికి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని వేడుకున్నారు. అతడి విజ్ఞప్తిని స్వీకరించిన మంత్రి పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
తెలంగాణ అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలు హాస్యాస్పదం
-
4 లక్షల రోడ్డు ప్రమాదాలు
న్యూఢిల్లీ: దేశంలో 2021 ఏడాదిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని కేంద్రం తెలిపింది. 2020లో 3,66,138 ప్రమాద ఘటనలు చోటుచేసుకోగా 2021లో ఇవి 4,12,432కు చేరాయని వివరించింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గురువారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపారు. ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు ఇంజనీరింగ్ నిపుణుల సూచనల ప్రకారం రహదారుల పునర్నిర్మాణం, రహదారి భద్రతను పటిష్టం చేయడం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏ ఒక్క జాతీయ రహదారిని కూడా మూసివేసే ప్రతిపాదన లేదని తెలిపారు. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ వద్ద ఇప్పటి వరకు 5,215 వాహనాలను తుక్కుగా మార్చినట్లు చెప్పారు. -
సరకు రవాణా ఖర్చులు తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ : వాటాదారులు మధ్య సహకారం, సమన్వయం, కమ్యునికేషన్లతో సరకు రవాణా ధరను 14 శాతం, 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్గడ్కరీ పిలుపునిచ్చారు. తద్వారా ఎగుమతుల్లో 50 శాతం పెరుగుదల సాధించొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో‘ క్లైమేట్ గోల్స్: టెక్నలాజికల్ రోడ్ మ్యాప్ టు నెట్ జీరో ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సమాజానికి ముఖ్యమైన మూలస్తంభాలని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు ఒక బృందంగా కలిపి పని చేస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరసం ఉందన్నారు. భారతదేశంలో యువ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ మానవశక్తితోపాటు తక్కువ కార్మిక వ్యయంతో దేశీయ మార్కెట్ ఉందన్నారు. బయో ఇథనాల్, బయో సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ఆవశ్యకత వివరించారు. ఏటా 16 లక్షల కోట్ల శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి 27 గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలు రూపొందించాలని నిర్ణయించామని కేంద్రమంత్రి గడ్కరీ వివరించారు. చదవండి: అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది! -
ఫోటో కొట్టండి రివార్డు పట్టండి.. రాంగ్ పార్కింగ్పై త్వరలో కొత్త చట్టం
న్యూఢిల్లీ : పెరుగుతున్న వాహనాలతో ప్రస్తుతం పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ సమస్య నేపథ్యంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నది. ఈ క్రమంలో రాంగ్ పార్కింగ్కు సంబంధించి త్వరలో కేంద్రం చట్టం తేనున్నది. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను పంపిన వ్యక్తికి సైతం రివార్డ్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. రాంగ్ పార్కింగ్కు రూ.1000 జరిమానా విధిస్తే.. ఫొటో పంపిన వ్యక్తికి రూ.500 రివార్డగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాలకు అడ్డకట్ట వేసేలా చట్టాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాంగ్ పార్కింగ్ కారణంగా తరచూ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతున్నాయన్నారు. రాంగ్ పార్కింగ్కు సంబంధించి మొబైల్లో ఫొటో తీసి పంపితే.. సదరు వాహనదారుడికి రూ.1000 జరిమానా విధిస్తామని, ఫొటోను పంపిన వ్యక్తికి రూ.500 రివార్డ్ ఇస్తామన్నారు. దీంతో పార్కింగ్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రజలు వాహనాలకు సంబంధించి పార్కింగ్ స్థలం కల్పించుకోకపోవడం, రోడ్లను ఆక్రమించడంపై కేంద్రమంత్రి విచారం వ్యక్తం చేశారు. -
రాజకీయాల్లో రాక ముందే బెంజ్ కారులో తిరిగా: మంత్రి
ఖమ్మం (రఘునాథపాలెం) : ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో హైదరాబాద్కు చెందిన కొందరు దరిద్రులు కట్టుకథలు, ఆరోపణలు మొదలుపెట్టారని మండిపడ్డారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో శనివారం సాయంత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. ‘రఘునాథపాలెం మండలంలో మల్లెమడుగు గ్రామమే లేకపోగా.. నాకు ఈ గ్రామంలో 32ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని వారికి సవాల్ చేస్తున్నా.. ఒక్క ఎకరం భూమి ఉందని నిరూపించినా ఇక్కడిక్కడే పేదలకు రాసిస్తా’ అని వెల్లడించారు. ‘రాజకీయాల్లోకి రాక ముందే నేను బెంజ్ కారులో తిరిగా... కానీ ఇప్పుడు పార్చునర్ కారుకు వచ్చింది పరిస్థితి. వచ్చే ఎన్నికల తర్వాత అంబాడిసర్ కారుకో పోతదో, స్కూటర్కు పోతదో తెల్వదు’ అని పేర్కొన్నారు. అయితే, తనను ఎంత టార్గెట్ చేస్తే అంత వేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తానని స్పష్టం చేశారు. ఒకరికి ఇచ్చే వాడినే తప్ప పుచ్చుకునే వాడిని కాదని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి చూసి కొందరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. -
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా: పినిపే విశ్వరూప్
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ చోటు దక్కడంతో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ తన రాజకీయ ప్రయాణంలో నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సాయంత్రానికి అమలాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్తో ‘సాక్షి’ ముచ్చటించింది. ప్రశ్న: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. డీజిల్ ధర పెరిగి సంస్థకు భారమవుతున్న తరుణంలో మీ ప్రణాళికలు ఏంటి? మంత్రి: డీజిల్ ధరల పెరుగుదలే ఆర్టీసీకి పెనుభారం. ఉన్నతాధికారులతో సమీక్షించి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రశ్న: ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి సంస్థకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. తదుపరి మీ చర్యలు ఎలా ఉంటాయి? జవాబు: ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం చరిత్రాత్మకం. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్టీసీని మరింత సంరక్షిస్తాను. ప్రశ్న: శాఖాపరంగా కొత్త నిర్ణయాలుంటాయా? జవాబు: వాహన కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెడతాం. దశల వారీగా విద్యుత్ బస్సులను ప్రవేశపెడతాం. టీటీడీ బస్సుల నుంచే ఈ విధానానికి శ్రీకారం చుడతాం. కొండ పైన, కిందన 50 చొప్పున వంద బస్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. మే 15వ తేదీ నుంచి స్వామివారి సన్నిధి నుంచే తొలి బస్సును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ప్రశ్న: విద్యుత్ బస్సుల ప్రయోగాన్ని ఎలా కొనసాగిస్తారు? జవాబు: తిరుపతిలో విజయవంతమైతే వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో దశల వారీగా ఎంపిక చేసిన నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ బస్సులను ప్రారంభిస్తాం. ప్రశ్న: రవాణా రంగంలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలేమిటి? జవాబు: ఆర్టీఏ లేదా అధికారిక కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ– బ్రేక్ ఇన్స్పెక్టర్లు) పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. త్వరలోనే 90 పోస్టులను భర్తీ చేస్తాం. ప్రశ్న: ప్రైవేటు రంగ రవాణా, హైటెక్ బస్సులకు అనుమతులు తదితర విషయాల్లో అక్రమాల నివారణకు చర్యలేమిటి? జవాబు: ప్రైవేటు ట్రాన్స్పోర్టుపై తొలుత ప్రత్యేక దృష్టి పెడతాను. బస్సులకు నిర్ణీత కాలంలో అనుమతులు (పర్మిట్లు) తీసుకోకుండా ఒకే నంబరుతో నాలుగైదు రిజిస్ట్రేషన్లు చేయించి, హైటెక్ బస్సులను అక్రమంగా నడపడానికి అడ్డుకట్ట వేస్తాను. ప్రశ్న: ఆటో, చిన్న రవాణా వాహనాలతో జీవనోపాధి పొందే చిన్న కుటుంబాల వారి విషయంలో? జవాబు: ప్యాసింజర్ ఆటోలు, గూడ్స్ ఆటోల వంటి వాహనాలు రవాణా రంగంపై ఆధారపడి వేలాది వాహనదారులు, కారి్మకులు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి పోలీసులు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వేధింపులు లేకుండా సాధ్యమైనంత వరకూ మానవతా దృక్పథంతో చూసేలా అధికారులతో సమీక్షించి ఆదేశాలిస్తాను. ప్రశ్న: వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రెండోసారి మంత్రి అయ్యారు. మీ స్పందన? జవాబు: చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ నాపై ఉంచిన బాధ్యతలను అప్పుడు ప్రతిపక్షంలో.. ఇప్పుడు ప్రభుత్వంలో నెరవేర్చాను. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూనే విధేయుడిగా ఉంటాను. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విశ్వరూప్
-
రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ బాధ్యతలు
సాక్షి అమరావతి: రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ సచివాలయంలో మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు, ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: తండ్రి, తనయుడి కేబినెట్లలో ఆ నలుగురు.. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా.. బాధ్యతలు స్వీకరణ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రవాణా శాఖ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 998 కొత్త బస్సులను ఆర్టీసీలోకి తీసుకొచ్చామన్నారు. కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలకు మరింత రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తిరుమలలో కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారని.. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ అన్నారు. మంత్రి విశ్వరూప్ రాజకీయ నేపథ్యం.. 1987లో కాంగ్రెస్ నాయకుడిగా పినిపే విశ్వరూప్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998 ఉప ఎన్నికల్లో, 1999 సాధారణ ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2004లో అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. 2019లో వైఎస్సార్పీసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలి కేబినెట్లో ఉన్న విశ్వరూప్ను రెండోసారి కేబినెట్లోకి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. -
దేశ్ముఖ్, పరబ్లకు 40 కోట్లు ఇచ్చారు
ముంబై: బదిలీ ఉత్తర్వులను నిలిపివేసేందుకు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్కు 10 మంది డీసీపీలు కలసి రూ. 40 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్గా ఉన్న పరమ్ బీర్ సింగ్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవడానికి ఈ సొమ్ములు ముట్టజెప్పినట్టుగా వాజే ఈడీతో చెప్పారు. దేశ్ముఖ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్లపై నమోదైన కేసుకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీటులో వాజే చేసిన ఆరోపణల్ని ప్రస్తావించారు. జులై 2020లో ముంబైలో 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ పరమ్ బీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులపై అప్పటి హోంమంత్రి దేశ్ముఖ్, రవాణా మంత్రి పరబ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని వాజే పేర్కొన్నారు. -
కరోనా బారినపడ్డ రాజస్తాన్ మంత్రి
జైపూర్ : కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా రాజస్తాన్లో రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నాని, ఈ సందర్భంగా కరోనా వచ్చినట్లు తేలిందని మంత్రి ప్రతాప్ సింగ్ స్వయంగా ట్వీట్ చేశారు. గతకొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. కాగా మంత్రి ప్రతాప్సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. (మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్) Wishing my ministerial colleague, Pratap Singh Khachariyawas ji speedy recovery from #COVID19. May he get well soon. @PSKhachariyawas — Ashok Gehlot (@ashokgehlot51) August 30, 2020 -
తమిళనాడు రవాణాశాఖ మంత్రికి కరోనా
చెన్నై : దేశంలో మహారాష్ర్ట తర్వాత తమిళనాడులో అత్యధిక కోవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువరు రాజకీయ నేతలు సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ రాష్ర్ట రవాణాశాఖ మంత్రి విజయ భాస్కర్కు కరోనా సోకింది. ఆయనతో పాటు భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వీరంతా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రాష్ర్ట వ్యాప్తంగా కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 6000 మార్క్ను దాటేసింది. ఇందులో గడిచిన 24 గంటల్లోనే 121 మంది మరణించారు. కొత్తగా 5709 కరోనా కేసులు నమోదవగా, వీటిలో చెన్నైలోనే 1,182 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులసంఖ్య 3,49,654కు చేరింది. (జార్ఖండ్ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్) -
'సమ్మె ప్రభావం ప్రజలపై పడనీయొద్దు'
సాక్షి, మంచిర్యాల : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణ, పోలీసు శాఖ అధికారులతో సమ్మె ప్రభావంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుందని ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అసవరమైన చర్యలు తీసుకుంటుందని ఇప్పటి వరకు 50 శాతం బస్సులు నడుస్తున్నాయని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి డిపోకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, అద్దె బస్సులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని 100 శాతం బస్సులు నడిచేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇదే క్రమంలో అధిక చార్జీలు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు బస్సులు నడిపించడంతో పాటు అధిక చార్జీలు వసూలు చేయకుండా అధికారులతో కలిసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుమార్దీపక్, జిల్లా రవాణశాఖ అధికారులు కిష్టయ్య, వివేకానంద రెడ్డి, ఆర్టీసీ డీఎం మల్లేష్, రామగుండం అడిషనల్ డీసీపీ రవికుమార్, మంచిర్యాల డీసీపీ గౌస్బాబ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని చెప్పలేదు: పువ్వాడ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారని, వారి ఆందోళన అసంబద్ధబమని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని, అది తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చర్చల నుంచి ఏకపక్షంగా వైదొలగి సమ్మెను బలవంతంగా ప్రజలపై రుద్దారని విమర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యామని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా 7,358 వాహనాలు నడుపుతున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ప్రభుత్వంపై విపక్షాలు చేసే విమర్శలను ప్రజలు ఈసడించుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఆర్టీసీకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తప్పుడు ప్రచారం సరికాదని, రూ.4,416 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఆర్టీసీ బతకాలంటే లాభాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నించారు. 5 వతేదీ సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉన్నవాళ్లనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రతిపాదికన మరింత మంది ఉద్యోగులను తీసుకుంటామని, బస్సు సర్వీసులను పెంచుతామని ప్రకటించారు. అన్ని రకాల బస్సు పాస్లను అనుమతించాలని ఆదేశించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విలీనం చేస్తామని అనలేదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పునరుద్ఘాటించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మెరుగైన జీతాలు ఇస్తామని కేసీఆర్ హామీయిచ్చారు తప్పా విలీనం చేస్తామని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆర్టిసి కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసీ కార్మికులందరూ సమ్మె చేస్తున్నా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు తిప్పుతున్నందుకు తమ ప్రభుత్వాన్ని అభినందించాలన్నారు. స్కూల్, కాలేజీ బస్సులను వినియోగించాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: దారుణంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కార్) -
రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే
సాక్షి, ఖమ్మం: ఉద్యమాల గుమ్మం ఖమ్మంకు ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పువ్వాడ అజయ్కుమార్ను మంత్రి పదవి వరించింది. ఆదివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పువ్వాడ అజయ్ పదవీ ప్రమాణం చేశారు. ఆయనకు రవాణా శాఖను కేటాయించారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన అజయ్ రెండుసార్లు ఖమ్మం నిజయోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాక 2018లో ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా రాష్ట్ర పార్టీ దృష్టిని ఆకర్షించారు. కేసీఆర్ తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పువ్వాడ అజయ్కుమార్కు తొలి మంత్రివర్గ విస్తరణలోనే అవకాశం లభిస్తుందని భావించారు. అయితే సామాజిక సమీకరణలు, ఇతర కారణాల వల్ల కేసీఆర్ రెండోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా పువ్వాడ అజయ్కు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని పార్టీ వర్గాలు గత కొంతకాలంగా పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. అయితే జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వివిధ సమీకరణల తర్వాత పార్టీ గుర్తుపై గెలిచినందుకు ప్రోత్సాహకంగా అజయ్ను కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టిన పువ్వాడ అజయ్కుమార్ మరో అరుదైన రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. అ‘జై..’: ఖమ్మం నియోజకవర్గం నుంచి తొలి మంత్రిగా ఖ్యాతి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వివిధ నియోజకవర్గాల్లో గెలుపొంది ఆయా ప్రభుత్వాలు అనేక మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఏ ఒక్కరూ ఇప్పటి వరకు మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. ఖమ్మం నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా అయ్యే అరుదైన అవకాశం అజయ్ సొంతం చేసుకోవడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో మంత్రులుగా పని చేసిన జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు, కోనేరు నాగేశ్వరరావు, సంబాని చంద్రశేఖర్, రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులు మంత్రులుగా పని చేసినప్పటికీ వారు జిల్లాలోని సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల నుంచి ఎన్నిక కావడం విశేషం. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించినా ఆయన ఆ సమయంలో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఖమ్మం నియోజకవర్గానికి తొలిసారి మంత్రి పదవి లభించినట్లయింది. గత కొంత కాలంగా మంత్రి పదవి అజయ్ను వరిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆయనకు మంత్రి పదవి లభించడంతో జిల్లా అభివృద్ధి మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కమ్యూనిస్ట్ కుటుంబానికి చెందిన పువ్వాడ అజయ్ 2014, 2018 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఆయన ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. సీపీఐ సీనియర్ నేతగా ఉన్న ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సైతం ఖమ్మం నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా ఉమ్మడి జిల్లాకు ఇప్పటివరకు మంత్రి పదవి లేకపోవడంతో అభివృద్ధి పరంగా కొంత వెనుకబడినట్లు అయింది. పువ్వాడ అజయ్కుమార్కు మంత్రి పదవి లభించడంతో జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి కృషి ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని జిల్లా నుంచి నూతనంగా మంత్రిగా నియమితులైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్లో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని, జిల్లాప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ప్రాంతప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, జిల్లాపై పూర్తి అవగాహన ఉందని, జిల్లా అభివృద్ధి పథంలో పయనింపచేయడానికి అందరి సహకారం తీసుకుంటానని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి సైతం తన వంతు కృషి చేస్తానని అజయ్ తెలిపారు. అలాగే తనపై నమ్మకం ఉంచి రవాణా శాఖను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా శాఖను సమర్థవంతంగా నిర్వహించి ప్రజా రవాణా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో త్వరలో ఒక సమావేశం నిర్వహించి శాఖ పరంగా చేయవలసిన పనులపై ఒక నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. తనకు లభించిన పదవి జిల్లాలోని ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు లభించినట్లు అని, అందరి ఆశీస్సులతో ఈ పదవి లభించిందని భావిస్తున్నాని, ప్రతి కార్యకర్తకు మరింత అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. ప్రొఫైల్.. పేరు: పువ్వాడ అజయ్కుమార్ చదువు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్ కుటుంబం: భార్య వసంతలక్ష్మి, కొడుకు నయన్రాజ్ రాజకీయ ప్రస్థానం: పువ్వాడ అజయ్కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ సీనియర్ నేత. పువ్వాడ అజయ్కుమార్ 2012 నుంచి 2013 ఏప్రిల్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్గా వ్యవహరించారు. అనంతరం 2013లో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఖమ్మం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
‘అన్యాయం జరిగితే నన్ను కలవండి’
సాక్షి, అమరావతి : రవాణాశాఖలో ప్రమోషన్లు, బదిలీలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, ఎవరికైనా అర్హత ఉండి అన్యాయం జరిగితే నేరుగా తనను కలవొచ్చని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇకపై నెలలో ఓ శుక్రవారం రవాణా ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వ్యవస్థల్లో అవినీతిపరులు ఉన్నారని, అంతమాత్రాన వ్యవస్థ మొత్తానికి అవినీతిని ఆపాదించడం సరికాదన్నారు. ఏపీలో ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. గతంలో పోలిస్తే ఆటో ప్రమాదాల సంఖ్య కొంతవరకు తగ్గాయని తెలిపారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాలు, మరణాలు బాగా పెరిగాయన్నారు. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు వాహనాలు తోలుతూ.. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టామని, దీనిపై అధికారుల్లో ప్రజల్లో అవగాహనా కల్పించాలని, జాతీయ రహదారిపై డ్రంకెన్ డ్రైవ్ ను విస్తృతం చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేశామని, రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. -
ఆర్టీసీని కష్టాల నుంచి గట్టేక్కించమని ఆర్థిక మంత్రిని కోరాం
-
అవినీతిపై కొరడా
ఓ ఆటో డ్రైవర్...రవాణా శాఖ మంత్రికి ఫోన్ చేయవచ్చా.. చేసినా ఆ బడుగుజీవుల ఆక్రందన అమాత్యులు వింటారా...? ఇన్నాళ్లూ అందరికీ ఇదే సందేహముండేది. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లోని మంత్రులంతా సామాన్యుల సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగానే అనంతపురంలోని కొందరు ఆటో డ్రైవర్లు బుధవారం రవాణాశాఖ మంత్రికి ఫోన్ చేసి ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేయడం...వెంటనే స్పందించిన మంత్రి ఆరా తీయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా...ఇది జనసామాన్యుల ప్రభుత్వమని జనం ఆనందపడుతున్నారు. – అనంతపురం టవర్క్లాక్ సాక్షి, అనంతపురం: అవినీతి రహిత పాలనే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అన్ని శాఖల్లో ప్రక్షాళనకు మంత్రులు సిద్ధమయ్యారు. అంతేకాకుండా సామాన్యులు ఫోన్ చేసినా అందుబాటులోకి వస్తూ అవినీతిపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలోనే అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో అవినీతికి అంతే లేకుండా పోతోందని రవాణాశాఖలో అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని బుధవారం జిల్లాకు చెందిన కొంతమంది ఆటో డ్రైవర్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి ఫోన్చేసి ఫిర్యాదు చేశారు. వారి సమస్యలన్నీ ఓపికగా విన్న మంత్రి పేర్నినాని...అవినీతికి పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన అనంతపురం ఆర్టీఏ అధికారులకు ఫోన్చేసి ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో పాలన అదుపుతప్పినట్లు తెలిసి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి...అవినీతికి పాల్పడుతున్న అధికారులపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక నుంచి రవాణాశాఖపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకూడదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇంకోసారి ఎవరైనా అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తే...విచారించి అధికారులపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు లైసెన్సుల కోసం కార్యాలయానికి వస్తే... అధికారులు ఎవరూ స్పందించడం లేదని, బ్రోకర్లను కలిసి లైసెన్సులు పొందేలా సూచనలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి విధానం మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. సేవలన్నీ పారదర్శకంగా ఉండాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ ఉన్నతాధికారికి ఫోన్లో ఆదేశించిట్లు తెలుస్తోంది. -
వారిపై కఠిన చర్యలు తీసుకోండి : సచిన్
న్యూఢిల్లీ : నాణ్యత లేని హెల్మెట్లను తయారీ చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. భద్రత కోసం వాడే వస్తువులు చాలా నాణ్యతగా ఉండాలని, క్రికెటర్లు మైదానంలో వాడే వస్తువులంతా నాణ్యమైనవిగా ఉండాలని సచిన్ లేఖలో ప్రస్తావించారు. ఇక దేశంలోని 70 శాతం ద్విచక్ర వాహనదారులు నకిలీ హెల్మెట్లు వాడుతున్నారని, చాలా కంపెనీలు ఎలాంటి నాణ్యమైన ప్రమాణాలు పాటించకుండా నకిలీ ఐఎస్ఐ ముద్రను ముద్రించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇవి వాహనదారుల భద్రతకు ప్రమాదమని, ప్రమాదాల తీవ్రతను మరింత పెంచేలా చేస్తాయన్నారు. నకిలీ హెల్మెట్లు తలకు అయ్యే గాయల నుంచి రక్షించలేవన్నారు. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా టూవీలర్స్ రైడర్సే మరణిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రజా రక్షణ కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని తాను భావిస్తున్నానని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కంపెనీల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. తక్కువ ధరలోనే నాణ్యమైన హెల్మెట్లు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఉపయోగించేలా ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ విషయంలో తనవంతు సాయం చేస్తానని సచిన్ స్పష్టం చేశారు. నకిలీ హెల్మెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సచిన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా సచిన్ ద్విచక్రవాహన దారులు హెల్మెట్ ధరించాలని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలుసార్లు ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
అనుపమ అదరలేదు.. బెదరలేదు
సాక్షి, తిరువనంతపురం : భూకబ్జాల వివాదాలతో గత కొన్ని నెలలుగా ఆ మంత్రివర్యులు వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పైగా అందమైన సరస్సును పూడ్చి మరీ విలాసానికి రిసార్ట్ కట్టుకున్నారు. అధికారంలో ఉన్నాం కదా ఏం ఫర్వాలేదన్న ధీమా. కానీ, నిజాయితీ ముందు ఏదీ నిలబడదు కదా. థామస్ చాందీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) కేరళ రవాణాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యవహారం గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన గద్దెదిగడానికి కారణం ఓ మహిళా కలెక్టర్. ఆమె పేరు టీవీ అనుపమ. ప్రస్తుతం అలప్పుఝా జిల్లా కలెక్టర్గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రకృతి అందాలతో విరజిల్లే మార్తాండం సరస్సును పూడ్చి మంత్రి థామస్ అక్రమంగా లేక్ ప్యాలెస్ నిర్మించటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై మంత్రి-కలెక్టర్ మధ్య విమర్శలు-ప్రతి విమర్శలు కూడా కొనసాగాయి. దీంతో రెవెన్యూ శాఖ నుంచి పూర్తి నివేదికలు తెప్పించుకున్న ఆమె అందులో అవినీతి జరిగిందన్న విషయం నిర్థారించుకున్నాకే రెవెన్యూ కార్యదర్శికి తుది నివేదికను సమర్పించారు. ఆ సమయంలో ఆమెపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి.. బెదిరింపులు ఎదురయ్యాయి. కానీ, ఆమె మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. దీంతో నివేదికను తప్పుబడుతూ సదరు మంత్రి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు వేశారు. అయితే ఆయన వ్యవహారాన్ని పనిపై స్థానిక మీడియాలు వరుస కథనాలు ప్రసారం చేయటంతో ప్రజలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ఎల్డీఎఫ్ కూటమి భాగస్వామ్య పార్టీలు ఆయన రాజీనామాను పట్టుబట్టడం.. అదే సమయంలో కోర్టు కూడా ఆయన తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేయటంతో చివరకు గత బుధవారం రాజీనామా చేస్తూ లేఖను ముఖ్యమంత్రికి అందజేశారు. ప్రస్తుతం ఆయన కబ్జా కట్టడాలను కూల్చివేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే ధ్యేయంగా.. అధికారానికి ఎదురొడ్డి మరీ అనుపమ చూపించిన తెగువకు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. అనుపమ నేపథ్యం... మళప్పురం జిల్లా పొన్నానిలోని మారంచెరీకి చెందిన అనుపమకు చిన్నప్పటికీ సివిల్స్ సాధించాలన్నది కలగా ఉండేది. గోవా బిట్స్ పిలానీ క్యాంస్లో ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. బీఈలో 92 శాతం ఉత్తీర్ణత సాధించటం విశేషం. 2010 సివిల్స్ పరీక్షలో నాలుగో ర్యాంక్ను ఆమె సాధించారు. -
మహిళతో అశ్లీల వ్యాఖ్యలు.. మంత్రి రాజీనామా
తిరువనంతపురం: ఓ మహిళను కేరళ రవాణాశాఖ మంత్రి ఏకే శశింద్రన్ లైంగికంగా వేధిస్తూ అసభ్యంగా సంభాషించిన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం మంత్రి చర్యను తప్పుబట్టగా ఆదివారం మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. విషయం ఏంటంటే.. సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ నేత ఏకే శశింద్రన్(71) రవాణా మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి శశింద్రన్ గత కొన్ని రోజులుగా ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళకు తరచుగా ఫోన్ చేస్తూ తన కోరికను తీర్చాలంటూ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను మంగళం అనే స్థానిక మీడియో ప్రసారం చేసి మంత్రి వ్యవహారాన్ని బటయపెట్టింది. తనకు సాయం చేయాలని కోరుతూ బాధిత మహిళ మంత్రి శశింద్రన్ వద్దకు వెళ్లగా అప్పటినుంచీ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారని ఆడియో టేపుల సారాంశం. ఇది తీవ్రమైన చర్య అని మంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. బాధిత మహిళ నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆడియో టేపుల సాక్ష్యాలున్నాయని.. ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ నేతలు మంత్రి శశింద్రన్ రాజీనామాకు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉత్తర కేరళ కోజీకోడ్లో ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆడియో టేపుల వివాదంపై మంత్రి శశింద్రన్ వివరణ ఇచ్చారు. 'నేను ఎవరితోనూ ఆ విధంగా సంభాషించలేదు. నా పదవికి రాజీనామా చేశాను. ప్రభుత్వంలో మా పార్టీ వల్ల ఎలాంటి విభేదాలు తలెత్తకూడాదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆడియో టేపుల ఆరోపణలపై సీఎం పినరయి విజయన్ ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాను' అని శశింద్రన్ అన్నారు. -
అమరావతి టు అనంతపూర్కు ఆరు లైన్ల రోడ్డు
శ్రీశైలం: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఆర్అండ్బీ శాఖ ద్వారా రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అమరావతి టు అనంతపూర్కు ఆరు లైన్ల రోడ్లు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు ఆర్అండ్బీ, రవాణా శాఖ మంత్రి సిద్దా రాఘవరావు తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉండేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి నుంచి మండల, తాలూకా, జిల్లా స్థాయి వరకు.. అక్కడి నుంచి రాజధానికి రోడ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించామన్నారు. అనంతపురం నుంచి అమరావతి వరకు రోడ్లు నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. కేవలం 8గంటల వ్యవధిలో రాజధానికి చేరుకునేలా రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో కారిడార్లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. -
ఆర్టీచీ..!
• ఆర్టీసీ ప్రకాశం రీజియన్లో అన్నీ అక్రమాలే • వినతులకు చెల్లుచీటీ సిఫార్సులకే పెద్దపీఠ • వెల్లువెత్తుతున్న విమర్శలు స్పందించని అధికారులు ‘రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నాం.. నష్టాలు తగ్గించి లాభాల బాటలోకి తీసుకొస్తున్నాం.. అధికారులు, సిబ్బంది, కార్మికులతో పాటు ప్రజలు కూడా సహకరించాలి. ఆర్టీసీని ఆదరించాలి’... ఇవీ.. రవాణా శాఖామంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారులు నిత్యం వల్లెవేసే మాటలు. కానీ, వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారుు. సంస్థలో అంతర్గతంగా అన్నీ అక్రమాలు జరుగుతున్నారుు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పైరవీల కారణంగా ఆర్టీసీకి మరింత నష్టం జరుగుతోంది. ప్రతిభ గల వారికి బదులుగా అసమర్థులకే ఆర్టీసీలో పెద్దపీఠ పడుతోంది. ఫలితంగా సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. రాష్ట్ర రవాణా శాఖామంత్రి జిల్లాలోనే ఇలా జరుగుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఒంగోలు : ‘వినతులకు చెల్లుచీటి.. సిఫార్సులకే పెద్దపీఠ’ అన్న చందంగా మారింది ఆర్టీసీ ప్రకాశం రీజియన్లో పరిస్థితి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు పడరాని పాట్లు పడుతున్నామంటూ ఆ సంస్థ ఉన్నతాధికారులు మొదలు ప్రజాప్రతినిధుల వరకూ ప్రతిఒక్కరూ ఆర్భాటంగా ప్రకటిస్తున్నప్పటికీ, ఎక్కడా ఆచరిస్తున్న దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే.. ఆదాయ మార్గాలను సైతం పెడచెవిన పెట్టి సిఫార్సులకు వారంతా పెద్దపీఠ వేస్తున్నారు. ఈ క్రమంలో ఏవైనా అక్రమాలు జరిగితే కనీసం వాటిపై కచ్చితమైన విచారణ చేసేవారు కూడా లేకపోతుండడం గమనార్హం. ఇటీవల ఆర్టీసీ ప్రకాశం రీజియన్లో జరిగిన పలు ఘటనలే అందుకు నిదర్శనంగా ఉన్నారుు... ⇔ ఆర్టీసీలో నైపుణ్యం గల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం నెలకు రూ.17 వేలు మాత్రమే. కానీ, కేవలం కార్గోలో పనిచేసేందుకు ఒక టీడీపీ నేత కుమారుడిని రూ.20 వేలు వేతనంతో తీసుకోవాలని సాక్షాత్తూ ఆర్టీసీ ఎండీ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అతని నియూమకం కూడా జరిగింది. అరుుతే, అనంతరం అధికారుల తనిఖీల్లో ఒకేరోజు రూ.2 వేల వరకు అతని వద్ద లెక్కల్లో తేడాలు బయటపడ్డారుు. దీంతో అతనిని విధుల నుంచి తప్పించారు. దీనికి సంబంధించి ఆర్టీసీ కార్గోలో ఒక రికార్డే మాయమైందంటే ఆర్టీసీలో అక్రమాలు ఏ స్థారుులో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ⇔ ఆర్టీసీలో కార్గో సర్వీసులకు సంబంధించి ప్రస్తుతం ఒక మేనేజర్, ఇద్దరు అధికారులు, మరికొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉంటారు. కాగా, తమకు అవకాశమిస్తే ఆర్టీసీకి లక్ష రూపాయలు అడ్వాన్స్ చెల్లించి తామే విధులు నిర్వహించుకుంటామని, ఏరోజుకారోజు అధికారులకు లెక్కలు చూపిస్తామని సుబ్బారావు అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. రోజుకు 3 షిఫ్టుల చొప్పున 24 గంటలపాటు సేవలకు అందుబాటులో సిబ్బందిని కూడా ఉంచుతామన్నారు. అందుకు విరుద్ధంగా కేవలం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉండేలా రూ.20 వేలు అడ్వాన్స్ చెల్లించిన వ్యక్తికి ఆ అవకాశం కల్పించారు ఆర్టీసీ అధికారులు. దీనివెనుక కూడా అక్రమాలు జరిగాయన్నది బహిరంగ రహస్యం. ⇔ ఆర్టీసీలో వాటర్ ట్యాంకర్కు ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన ఒక డ్రైవర్ను నియమించారు. అతని జీతం సుమారు రూ.50 వేలు ఉంటుంది. ఇది కాకుండా ఇతరత్రా ఖర్చులు కలుపుకుని ఆర్టీసీ రూ.85 వేల వరకు ఆర్టీసీ ఖర్చుచేస్తోంది. ఇదిలా ఉండగా, ట్యాంకర్కు రూ.340 చొప్పున ఇస్తే తామే నీరు సరఫరా చేస్తామంటూ కొంతమంది ముందుకొచ్చారు. దీని ప్రకారం ఆర్టీసీ చెల్లించే మొత్తం సుమారుగా నెలకు రూ.40 వేలు. దీన్ని అమలుచేస్తే నెలకు రూ.45 వేల వరకూ ఆర్టీసీకి మిగిలే అవకాశం ఉంది. దీనిపై ఆరు నెలలుగా చర్చిస్తున్న అధికారులు నేటికీ ఓ నిర్ణయం తీసుకోలేదు. ⇔ చివరకు సాక్షాత్తూ ప్రస్తుత రవాణాశాఖామంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఒంగోలు సిటీ సర్వీసులను సైతం ఆర్టీసీ అధికారులు తొలగించారు. వాటిపై మంత్రి సైతం మాట్లాడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనికోసం బస్టాండ్లు, తదితరాల కోసం వెచ్చించిన నిధులు వృథా అయ్యూరుు. ఇక పబ్లిక్ టాయిలెట్ల వద్ద టోకెన్లు ఇవ్వాలని అధికారులు హెచ్చరించినా..నేటికీ అమలుకాకపోవడంపై కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ⇔ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో రెండు ఆధునిక మెషిన్లను ఇటీవల ప్రారంభించారు. వాటిలో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో చూసుకునే సౌలభ్యాన్ని ప్రయాణికులకు కలిగిస్తున్నట్లు ఆర్భాటంగా అధికారులు ప్రకటించారు. తీరా చూస్తే అవి ఎప్పుడు పనిచేస్తాయో, ఎప్పుడు పనిచేయవో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. -
వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో పేద వైశ్యుల అభివృద్ధి కోసం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషిచేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక బంగారు వారి వాసవీ ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటుచేసిన తటవర్తి కృష్ణమూర్తి, సరస్వతి ఏసీ ఫంక్షన్ హాల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు స్వగ్రామం జువ్వల దిన్నెను అభివృద్ధి చేసేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. పాలకొల్లు పట్టణంలో సత్రాల ద్వారా పేద విద్యార్థులకు భోజన సదుపాయం, కళాశాలల ద్వారా విద్యాభివృద్ధికి వైశ్యులు తోడ్పడుతున్నారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ వైశ్యుల సేవలను కొనియాడారు. నిడమర్రు మండలం భువనపల్లి గ్రామంలో ఇటీవల ఆగ్నికి ఆహుతైన ఫ్యాన్సీషాపు యజమానికి వైశ్య సంఘం తరఫున ఆర్థిక సాయం అందజేశారు. శ్రీదేవీ ఆర్యవైశ్య మహిళా సేవా మండలి, కొత్త వెంకటేశ్వర్లు, కనకరత్నమాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలుగురు మహిళలకు కుట్టుమెషీన్లు, క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి టూ వీలర్ కుర్చీని అందజేశారు. తటవర్తి కృష్ణమూర్తి సభకు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జయవరపు శ్రీరామమూర్తి, వైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రవాణా శాఖ మంత్రి రాయ్ రాజీనామా
న్యూఢిల్లీ: ఆరోగ్య కారణాల దృష్ట్యా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో సర్జరీ చేయించుకున్న రాయ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. గత శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన ఆయన రాజీనామాను సమర్పించారు. రాయ్ స్థానంలో ఢిల్లీ పబ్లిక్ వెల్త్ అండ్ డెవలప్ మెంట్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను బాధ్యతలు తీసుకున్నారు. కాగా, యాప్ బేస్డ్ ప్రీమియం బస్ సర్వీసెస్ లో అవినీతి ఆరోపణలు వచ్చిన కొద్ది రోజుల్లోనే రాయ్ రాజీనామా చేశారు. దీనిపై బీజేపీ నేత విజేందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కి ఫిర్యాదు చేశారు. ప్రీమియం బస్ సర్వీసెస్ లో నియమాల ఉల్లంఘనతో పాటు అవినీతి జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బస్ సర్వీసుల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని రాయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆర్టీసీని ఎలా బాగుచేద్దాం!
♦ పూర్తిస్థాయిలో సమీక్షించి నిర్ణయిద్దాం ♦ రవాణా మంత్రి, ఆర్టీసీ చైర్మన్లకు సీఎం ఫోన్ సాక్షి, హైదరాబాద్:ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో అస్తవ్యస్తంగా తయారైన రోడ్డు రవాణా సంస్థపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దృష్టి సారించారు. జేఎండీ నుంచి డిపో మేనేజర్ స్థాయి వరకు సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణలతో ఫోన్లో మాట్లాడిన సీఎం.. ఇందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండటానికి గల కారణాలను డిపోల వారీగా తనకు ముందస్తుగా లెక్కలు అందజేయాలని ఆయన పేర్కొన్నారు. డిపోల్లోని బస్సుల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. అయితే వచ్చే సోమవారం సమావేశం ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. గతంలో ఇలాగే చెప్పి... గతేడాది వేతన సవరణ జరిగి 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన రోజున స్వయంగా ముఖ్యమంత్రే మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ నష్టాల నివారణపై ఓ రోజు మొత్తం సమీక్ష నిర్వహిస్తానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత దాని ఊసే లేకుండా పోయింది. చండీ యాగానికి నెల ముందు మరోసారి సమీక్షవిషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయటంలో వారు అన్నీ సిద్ధం చేశారు. కానీ సీఎం ఇప్పటి వరకు సమీక్ష తేదీ ప్రకటించలేదు. సమీక్ష సంగతి దేవుడెరుగు కనీసం ఆర్టీసీని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత నష్టాలను మూటగట్టుకుంది. సిబ్బంది జీతాలకు కూడా డబ్బులు లేక దివాళా దిశగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో సమీక్ష ఉంటుందని సీఎం ప్రకటించటంతో.. ఈసారైనా ఆర్టీసీని ‘బాగు’ చేయడానికి చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమావేశంలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలని కోరాయి. -
కొత్తగా రెండు జిల్లాలు: మహేందర్ రెడ్డి
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం నిధులు, నీళ్లు రాబట్టడంలో సఫలమయ్యాం జిల్లాను రెండుగా విభజించాలని ప్రతిపాదిస్తున్నాం ‘సాక్షి’ఇంటర్వ్యూలో మంత్రి మహేందర్రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం మంత్రి మహేందర్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రగతిమార్గాలు రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశాం. దారి ఉన్న గ్రామాలు ప్రగతికి సూచికలనే మాటను నిజం చేసేలా.. పంచాయతీరాజ్ రోడ్లకు అత్యధిక నిధులు విడుదల చేశాం. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసే పల్లెల రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ.800 కోట్లు మంజూరు చేశాం. జిల్లా చరిత్రలోనే తొలిసారి ఆర్అండ్బీ రోడ్లకు రూ.2వేల కోట్లను కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో సంప్రదింపులు జరపడం ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్- బీజాపూర్ హైవేకు జాతీయ హోదా సాధించగలిగాం. జలం.. దక్కింది ఫలం జలవనరులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోవడం... వ ర్షపు నీరు భూమిలోకి ఇంకేలా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాం. కనుమరుగవుతున్న నీటివనరులను కాపాడుకోవడమే ధ్యేయంగా మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టాం. రెండే ళ్లలో రూ.360 కోట్లతో 1,145 చెరువులను బాగు చేశాం. పూడిక తీత, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు అతిత్వరలోనే మనకు కనిపించనున్నాయి. ‘మా గ్రామం-మా చెరువు’ నినాదంతో ప్రతి చెరువును అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో నిధులు విడుదల చేస్తున్నాం. కోట్పల్లి ప్రాజెక్టు విస్తరణకు రూ.86 కోట్లు కేటాయించాం. ‘భగీరథ’ ప్రయత్నం సఫలం ఆడపడుచు బిందె పట్టుకొని బయటకు వెళ్లకూడదనే ఏకైక సంకల్పంతో అమలు చేస్తున్న మిషన్ భగీరథ కార్యరూపం దాల్చింది. జిల్లాలో రూ.2 వేల కోట్లతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే పనులకు టెండ ర్లను కూడా ఖరారు చేశాం. జూన్ మొదటి వారంలో మేడ్చల్ మండలంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ ఖ్యాతి గూగుల్, మైక్రోమ్యాక్స్, అమెజాన్, ఆపిల్ లాంటి సంస్థలకు జిల్లా కేంద్రబిందువైంది. నూతన పారిశ్రామిక విధానంతో జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల భద్రత లక్ష్యంగా... ‘షీ’ క్యాబ్లను ప్రవేశపెట్టాం. ప్రత్యేకంగా వారికోసం ఏసీ బస్సులను నడుపుతున్నాం. రూ.40 కోట్లు నష్టం వచ్చినా వారి రక్షణ దృష్ట్యా ఆర్డీనరీ బస్సుల్లోనూ క్యాబిన్లను ఏర్పాటు చేశాం. కృష్ణమ్మతో సస్యశ్యామలం సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లలో గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించింది. గోదావరి జలాలను జిల్లాకు తరలించాలనే ఉద్దేశంతో డిజైన్ చేసిన చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా 2.40 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించింది. తద్వారా చివరి ప్రాజెక్టులో ఉన్న చివరలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు నీరందడం కనాకష్టమే. ఈ పరిణామాలను గమనించే పక్కనే ఉన్న కృష్ణానది జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేయాలని నిర్ణయించాం. ఫలితంగా డిండి, పాలమూరు- రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుల కింద 5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నాం. కొత్తగా రెండు జిల్లాలు జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత పాటిస్తాం. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. లోక్సభ నియోజకవర్గాలకు అనుగుణంగా జిల్లాను రెండుగా విభజించాలని ప్రతిపాదిస్తున్నాం. నాతోపాటు పర్యాద కృష్ణమూర్తి సభ్యులుగా వ్యవహరిస్తున్న పున ర్విభజన కమిటీ ద్వారా కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించాం. అయితే, జిల్లాను మూడు ముక్కలు చేయాలనే అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులు వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. -
'గ్రేటర్లో గులాబీ జెండా ఎగురవేస్తాం'
రాయదుర్గం: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడాన్ని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబా నామినేషన్ దాఖలు సందర్భంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పది డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను చూసి ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టతారని చెప్పారు. కాగా, గచ్చిబౌలి డివిజన్లోని టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని ఎంపీ జితేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ర్యాలీలో పాల్గొన్న ఆయన... ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. -
నష్టాలు తగ్గుముఖం పట్టాయి
తెలంగాణ ఆర్టీసీ నష్టాలు తగ్గు ముఖం పట్టాయని రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి చెప్పారు. గతేడాది రూ.10 కోట్ల నష్టంతో ఉన్న ఆర్టీసీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలతో రూ.9 కోట్లకు దిగి వచ్చిందని అన్నారు. మంత్రి శనివారం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తూ నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్లో ఆగారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 బస్డిపోలు ఉండగా 22 డిపోలు లాభాలను సాధించేలా కృషి చేశామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.10వేల కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల కు రూ.5వేల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. రోడ్డు లేని గ్రామాలకు స్థానిక ఎమ్మెల్యేలు నిధులు మంజూరు చేస్తే బస్సులు నడుపుతామన్నారు. సీఎం కేసీఆర్ కొత్త బస్సుల కొనుగోలుకు రూ.150 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఈ నిధులతో 400 పల్లె వెలుగు బస్సులు, 100 ఏసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. -
ఆర్టీసీ చార్జీలు పెంచబోం: మహేందర్ రెడ్డి
మరో 400 పల్లె వెలుగు బస్సుల కొనుగోలు ఇందూరు: తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచబోమని రోడ్డు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెడతామన్నారు. ఇందుకు గాను రూ.కోట్లు వెచ్చించి బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 500 అద్దె బస్సులను తీసుకున్నామని, పల్లె వెలుగు కోసం 400 వరకు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని పది జిల్లాల్లో 95 బస్సు డిపోల్లో 21 డిపోలు లాభాల్లో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి అవసరమైన నిధులు కూడా ఇస్తున్నారని, ఇటీవలే రూ. 18 కోట్ల ఇంక్రిమెంట్లు, 44 శాతం పీఆర్సీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు బంగారు తెలంగాణ కోసం 8 గంటలకు బదులు 12 గంటలు విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. బస్ డిపోల్లో, బస్టాండ్లలో సీసీరోడ్లు వేయించడానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపల్లెకు బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఇందుకుగాను గ్రామీణ రోడ్లు వేయించేందుకు రూ.10 వేల కోట్లు మం జూరు చేశామని చెప్పారు. జిల్లా, నియోజవర్గ కేంద్రాల నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపనున్నామన్నారు. -
మంత్రిపై వేటు వేసిన జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీకి ఉద్వాసన పలికారు. జయలలిత సూచన మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్య.. సెంథిల్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. సోమవారం రాజ్భవన్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కరూర్ జిల్లా అన్నా డీఎంకే కార్యదర్శిగా ఉన్న సెంథిల్ను పార్టీ పదవి నుంచి కూడా జయలలిత తొలగించారు. ఇదిలావుండగా, తమిళనాడు పరిశ్రమల మంత్రి తంగమణికి రవాణ శాఖ బాధ్యతలు అప్పగించారు. -
బాబు వస్తే... బడికి సెలవే
అరగంట దాటింది...ఇంతవరకూ బస్సు రాలేదు...అసలు వస్తుందా..రాదా అంటూ ఓ తల్లి పాఠశాలకు ఫోన్. సారీ...బస్సు బాబు మీటింగ్ కోసం జనాన్ని తరలించడానికి వెళ్ళింది...ఈ రోజు బస్సు రాదంటూ పాఠశాల నుంచి సమాధానం. మీ బస్సు రాలేదు... టైం అవుతోందని మా పాపాయిని ఆటోలో పంపించా. పాపాయి ...బడికి చేరుకుందో లేదో వెంటనే కాస్త చూసి చెప్పండంటూ ఆందోళనతో మరో తల్లి ఫోన్. మీ పాపాయి వచ్చింది కానీ సీఎం సభకు బస్సులు వెళ్ళడంతో అత్యవసరంగా సెలవు నిర్ణయం తీసుకున్నాం. దీంతో విషయం తెలియజేయలేకపోయాం. సారీ..మీరు వచ్చి పాపాయిని తీసుకువెళ్ళండి... ఇలా ఒక్కో స్కూల్కు ఫోన్ల పరంపర సాగింది. దీనికి కారణం విద్యార్థులను తీసుకువెళ్లాల్సిన బస్సులన్నీ చలో చంద్రబాబు సభ బాట పట్టాయి. దీంతో విద్యార్థుల్లోను, తల్లిదండ్రుల్లోనూ ఒకటే టెన్షన్. ఒంగోలు: బాబు వస్తే చాలు...బడికి సెలవే అన్నట్లుగా తయారైంది జిల్లాలో పరిస్థితి. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి కూడా జిల్లావాసే కావడంతో రవాణా శాఖ అధికారులు తమ శక్తివంచన లేకుండా కృషి చేసి పార్టీ కార్యకర్తలకు భారం లేకుండా సాయం అందించారు. ప్రైవేటు యాజమాన్యాలపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చి వారిచేతే కొండపిలో జరిగిన రైతు సాధికారత సదస్సులకు పాఠశాల బస్సులను తరలించారు. దీంతో అర్థ సంవత్సర పరీక్షలు జరగాల్సి ఉన్నా ప్రైవేటు విద్యా సంస్థలు పరీక్షలను వాయిదా వేసుకోవడం చూస్తుంటే బాబు వస్తారంటే చాలు...ఇక బడికి సెలవే అన్న నానుడి జోరందుకుంటోంది. కనీసం ముందస్తు సమాచారం లేకుండా బస్సులు తరలించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయం ముందుగా తెలియదని, రవాణాశాఖ అధికారులు బలవంతం చేయడంతో బస్సులు పెట్టక తప్పలేదనేది ప్రైవేటు విద్యా సంస్థల వాదన. ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం సృష్టించుకునేకంటే తల్లిదండ్రులకు ఏదోలా నచ్చజెప్పుకోవచ్చునన్న ధీమాతో అలా చేయాల్సి వచ్చిందని సంబంధిత ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. రైతులు రారని తెలిసే... ఆర్టీసీ బస్సులు కేటాయింపు రుణమాఫీపై రైతులు ఇప్పటికే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వచ్చినా రైతులను సమీకరించడం కష్టం . అందువల్ల రైతు సాధికారత సదస్సుకు డ్వాక్రా మహిళలను తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే దీనికి నేరుగా డ్వాక్రా మహిళలను తరలిస్తే డబ్బులకు లెక్కలు చూపించేందుకు కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలకు రుణాల పంపిణీని కూడా జత చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 105 కోట్ల రూపాయల చెక్కులను డ్వాక్రా మహిళలకు అందజేసే ఏర్పాటు చేశారు. దీంతో కనిగిరి, కందుకూరు, సింగరాయకొండ, పొన్నలూరు, చీమకుర్తిల నుంచి పదేసి బస్సుల చొప్పున 50 బస్సులను డీఆర్డీఏ ఏర్పాటు చేసింది. లెక్క ప్రకారమైతే రూ.7 లక్షలు వెచ్చించాల్సిందే. -
ప్రతి పల్లెకూ బస్సు
ఖమ్మం: రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సు వెళ్లేలా చర్యలు తీసుకుంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మంలో పర్యటించారు. రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన పశుసంవర్థకశాఖ జేడీఏ కార్యాలయం, రూ.కోటితో నిర్మించిన గిరిజన బాలుర వసతి గృహ సముదాయాలను ప్రారంభించారు. రూ. కోటి వ్యయంతో నిర్మించే 33/11 సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖమ్మం బస్టాండ్ను పరిశీలించి ప్రయాణికుల సౌకర్యాలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. గత 30 సంవత్సరాలుగా ఆర్టీసీలో ప్రమాదాలు జరగకుండా పనిచేసిన పలువురు డ్రైవర్లను సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో రూ.150 కోట్లు రవాణా శాఖకు కేటాయించారని చెప్పారు. వీటితో 100 ఏసీ, 400 పల్లెవెలుగు బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఈ బస్సుల్లో 30 ఏసీ బస్సులు ఖమ్మం జిల్లాకు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 1300 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదని గుర్తించామని, జిల్లాలో 65 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని చెప్పారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలోని రోడ్ల మరమ్మతు, బీటీ రోడ్లు వేయడం కోసం రూ. 100 కోట్లు కేటాయించామని, రోడ్ల నిర్మాణం పూర్తి కాగానే ఆయా ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. నాలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఖమ్మం బస్టాండు ప్రయాణికులకు సరిపడా లేదని, దీన్ని మరోచోటుకు మార్చే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిప ల్లి కవిత మాట్లాడుతూ జిల్లాలో గిరిజన ఆ వా స ప్రాంతాలు అధికంగా ఉన్నాయని, మారుమూల ప్రాంతాలకు బస్సులు వెళ్లకపోవడం తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తేవాలి... ఆర్టీసీ, ఆర్టీవో అధికాారులు సమన్వయంతో పనిచేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తేవాలని మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇరు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఆరు డిపోల పరిధిలో 634 బస్సులు నడుస్తున్నాయని, రోజుకు మూడు లక్షల మంది ప్రయాణికులు బస్సులను వినియోగించుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోజుకు ఆర్టీసీకి రూ. 10 కోట్ల ఆదాయం వస్తోందని, ఖర్చు రూ. 12 కోట్లు అవుతోందని చెప్పారు. నష్టాల్లో ఉన్నా ప్రజలపై భారం మోపొద్దనే ఉద్దేశంతోనే చార్జీలు పెంచడం లేదన్నారు. ప్రైవేట్ వాహనాలు అధికంగా తిరగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ ద్వారా మరిన్ని సౌకర్యాలు అందించేందుకు రాష్ట్రంలోని 94 డిపోల మేనేజర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రైతుల పక్షపాతిగా ప్రభుత్వం.. నవ తెలంగాణలో రైతులు సంక్షేమానికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖలకు అదనపు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని మంత్రి అన్నారు. రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన పశుసంవర్థకశాఖ జేడీఏ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కల్తీపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మేలిమి పాలకోసం రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి గేదెను ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. కలెక్టర్ ఇలంబరితి మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. ఇందుకోసం నూతన విధానాలు, కృత్రిమ గర్భధారణ కేంత్రాలను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా ఎమ్మెల్యే మదన్లాల్, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్కుమార్, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్, ఖమ్మం ఇన్చార్జీ ఆర్జేసీ కృష్ణ, ట్రాన్సుకో ఎస్ఈ తిరుమలరావు, డ్వామా పీడీ జగత్కుమార్రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ఈఈ శంకర్, పశుసంవర్థక శాఖ జేడీఏ అంజయ్య, ఆర్టీఏ మోహిమిన్, ఆర్టీసీ ఈడీ పురుషోత్తమ నాయక్, ఆర్ఎం చావా అజయ్కుమార్, డీప్యూటీ సీటీఎం విజయగీతా, సీఎంఈ షతర్కుమార్, డీఎం వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వేణుమనోహర్, ఎంవీఐలు ఈశ్వర్, రవీందర్, ఎఎంవీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆర్టీసీని ఆదరిస్తేనే అందరికీ ఉపయోగం
ఒంగోలు నగరంలో సిటీ బస్సు సర్వీసులను మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. సిటీ బస్సులు నిలిపే బస్షెల్టర్లు కూడా ఆయన ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని సిటీ సర్వీసులు నడుపుతామని చెప్పారు. ఒంగోలు: ఆర్టీసీని ఆదరిస్తేనే అందరికీ ఉపయోగంగా ఉంటుందని రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండులో నూతనంగా ఏర్పాటు చేసిన 5 సిటీ సర్వీసులను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రి వద్ద, దక్షిణ బైపాస్లో ఏర్పాటు చేసిన బస్షెల్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు పేద వర్గాలకు సైతం అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సిటీ సర్వీసులను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా మరిన్ని సిటీ సర్వీసులు నగరానికి తీసుకువస్తామన్నారు. అదనంగా సిటీ బస్సులు వస్తే అప్పుడు మరిన్ని రూట్లలో ప్రవేశపెడతామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం వీ.నాగశివుడు మాట్లాడుతూ సిటీ సర్వీసుల కోసం ఎన్నాళ్ల నుంచో ప్రజాసంఘాలు తీవ్ర పోరాటం చేశాయన్నారు. రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నూతన బస్సులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో రూట్ల ఎంపిక చేపడతామన్నారు. సిటీ బస్సుల కోసం ప్రత్యేక స్టూడెంట్ పాసులు ఉంటాయని, అదే విధంగా ఉద్యోగులకు కూడా ప్రత్యేక బస్సు పాసులు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, సీఎంఈ రవికాంత్,ఒంగోలు డిపో మేనేజర్ మురళీ బాబు, అసిస్టెంట్ మేనేజర్ శ్యామల, ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూని యన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బస్సుల సమయాలు ఇలా: మొత్తం 5 మార్గాల్లో ఏర్పాటు చేసిన ఈ సర్వీసులు పలు ముఖ్యమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే సమయాలు విధంగా ఉన్నాయి. సూరారెడ్డిపాలెం: 5.45, 6.15, 6.45, 8.15, 8.35, 9.15, 10.45, 10.55, 11.45, 13.15, 13.15, 14.15, 15.00, 16.00, 17.15, 17.30, 18.20, 19.45, 20.00, 22.15 మద్దిపాడు: 6.30, 7.00, 8.30, 9.30, 10.30, 12.00, 12.30, 14.15, 15.00, 16.15, 17.00, 18.45, 19.00, 21.00 ,21.15, సంతనూతలపాడు: 5.30, 7.30, 8.00, 9.30, 10.30, 11.30,13.00, 13.30, 16.00, 16.00, 18.00, 18.30, 20.00, 21.00, 21.55 కరువది: 7.20, 9.40, 12.00, 14.15, 17.05,19.25, 21.45. యరజర్ల: 6.45, 9.15, 11.45, 14.15, 17.00, 19.30, 21.55. మంగమూరు: 5.30,8.00, 10.30, 13.00, 15.45, 18.15, 20.45. -
పరిశ్రమలకు జిల్లా అనుకూలం
తాండూరు: కొత్త పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు జిల్లాలో భూములు సిద్ధంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ పిలుపుతో అనేక పరిశ్రమలు తరలివస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాండూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్లు పెద్ద కంపెనీలకు ఆహ్వానం పంపగా వారి నుంచి సానుకూల స్పందన వస్తున్నదని, అదే ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేస్తే అధిక మొత్తంలో భూములు ఇస్తామన్నా కంపెనీలు ఆసక్తి చూపడంలేదని అన్నారు. కొత్త కంపెనీల ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా అనుకూలంగా ఉంటుందని, ఆయా కంపెనీలకు అన్ని రకాల అనుమతులు త్వరితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. జిల్లాలోని భూములను గుర్తించి, పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధం చేశామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విభజన ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, కేంద్రం ఆర్టీసీ విభజన, ఆస్తుల పంపకంపై ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసిందని, ఈ విషయమై కేంద్రంతో చర్చించేందుకు త్వరలో ఢిల్లీ వెళ్తున్నామని మంత్రి చెప్పారు. రూ.1,061కోట్ల రుణాలు మాఫీ జిల్లాలో 2.15లక్షల మంది రైతులకు సుమారు రూ.1,061కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని మంత్రి వెల్లడించారు. తాండూరు నియోజకవర్గ పరిధిలో 30,549మంది రైతులకు సుమారు రూ.151కోట్ల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. అదే విధంగా జిల్లాలోని పలు మండలాల్లో కొత్తగా మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్రావుతో మాట్లాడినట్టు వివరించారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, కోట్పల్లిలో కొత్తగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు కానున్నాయని, మిగితా నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించామని మంత్రి చెప్పారు. రెండు, మూడు నెలల్లో కొత్త మార్కెట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పత్తి, మొక్కజొన్న, జొన్న, పసుపు, పెసర్లు, మినములు, కంది, ఆముదాల పంటలను ప్రభుత్వం సాధారణ పంటలుగా గుర్తించి, పంట బీమా సదుపాయాన్ని ఈనెల 30వరకు పొడిగించినట్టు వివరించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా రూ.50కోట్లతో పాఠశాలల భవనాలు, మౌలిక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. టీచర్ల కొరత తీర్చేందుకు సర్కారు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. -
త్వరలో మోనో రైలు
►అసెంబ్లీలో మంత్రి వెల్లడి ►కొత్తగా ఐదు వృత్తి శిక్షణ కేంద్రాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు మోనోరైలు సేవలను సైతం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. మోనో రైలు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జయలలిత త్వరలో శంకుస్థాపన చేయనున్నారని బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు.నగరంలో ఇప్పటికే జరుగుతున్న మెట్రోరైలు పనులు పూర్తిదశకు వచ్చాయి. ఈ ఏడాది చివరిలో తొలిదశ, వచ్చే ఏడాది పూర్తిగా సేవలు అందుబాటులోకి రావచ్చని అంచనా. మరోవైపు మోనో రైలును కూడా చెన్నై నగర ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్లు ఆయన తెలిపారు. డీఎండీకే సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ, మోనో రైలుపై ప్రభుత్వం గతంలో ఒక ప్రకటన చేసింది, ఆ విషయం గుర్తుందా అంటూ ప్రశ్నించారు. ఇందుకు మంత్రి బదులిస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సీఎంకు సాటిలేరని అన్నారు. మోనో రైలు పథకం అమలుకు ప్రాథమిక పరిశీలనలు సాగుతున్నాయని, నిర్మాణ పనుల ఒప్పందాలు తుదిదశకు చేరకున్నాయని తెలిపారు. ఇవి పూర్తికాగానే 43.48 కిలోమీటర్ల దూరం ప్రయాణ సేవలు అందించేలా ఈ పథకానికి త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని చెప్పారు. పథకం 1 కింద పూందమల్లి-కత్తిపార, పోరూరు- వడపళని మార్గాల్లో 20.68 కిలోమీటర్లు, పథకం 2 కింద వండలూరు- వేలాచ్చేరికి 22.20 కిలోమీటర్లు మధ్యన మార్గం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఐదు వృత్తి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జయ తెలిపారు. మానవ వనరులను మరింతగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి పథంలో నడుస్తున్నామని చెప్పారు. అలాగే నిరుద్యోగ నిర్మూలనపై మరింత దృష్టి సారిస్తూ రూ.8.25 కోట్లతో కాంచీపురం, విళుపురం, తిరువారూరు, తిరువళ్లూరు, ధర్మపురిలలో ఉపాధి కల్పనా కార్యాలయాలను నిర్మించనున్నట్లు జయ ప్రకటించారు. 15 వేల ఉపాధ్యాయ ఖాళ్లీను మూడువారాల్లోగా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖా మంత్రి వీరమణి ప్రకటించారు. శివంగై జిల్లాకు కొత్త సిప్కాట్ను మంజూరు చేసినట్లు మంత్రి తంగమణి తెలిపారు. -
బస్సు ఎరుగని బస్టాండ్!
జగదేవ్పూర్: కొత్త రాష్ట్రం.. కొత్త పరిపాలన.. కొత్త పనులు..అపై సీఎం ఇలాకా..అభివృద్ధికి అడ్డు ఉంటుందా.. ఇలాంటి మాటలు ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పల్లె ప్రజల మనస్సుల్లో మెదులుతున్నాయి. కానీ జగదేవ్పూర్ మండల ప్రజల్లో మాత్రం అశలు రెట్టింపులోనే ఉన్నాయి. ఎందుకంటే సీఎం ఫాంహౌస్ మండల పరిధి ఎర్రవల్లి గ్రామంలో ఉండడమే. మండల కేంద్రంలో నాడు కేసీఆర్ రవాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బస్టాండ్ ప్రారంభించారు. నేటికి బస్సు వచ్చింది లేదు. పస్తుతం బస్టాండ్ యాచకులకు నిలయంగా మారింది. జగదేవపూర్లో బస్టాండ్ నిర్మాణానికి అప్పటి రవాణశాఖ మంత్రి కేసీఆర్ బస్టాండ్ను ప్రారంభించారు. రెండు మూడు సార్లు మాత్రమే ఆర్టీసీ బస్సులు బస్టాండ్లోకి వచ్చినట్లు గ్రామస్థులు చెప్పుతున్నారు. 14 ఏళ్లుగా బస్టాండ్ నిరుపయోగంగా మారి యాచకులకు అడ్డాగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం బస్సులను రోడ్డుపై నుంచే నడిపిస్తున్నారు తప్ప బస్టాండ్లోకి రావడం లేదంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల బస్సులు, ఆటోలు ఒకచోటి నుంచే మలుపుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ప్రయాణికులు హోటళ్లు, కిరాణ, వస్త్రాల దుకాణాలలో తల దాచుకుంటున్నారు. పలుసార్లు జగదేవపూర్ గ్రామ ప్రజలు బస్టాండ్ను పునరుద్ధరించాలని ప్రజాప్రతినిధులను, ఆర్టీసీ అధికారులకు కోరినా ఫలితం లేకుండా పోయింది. నెలకొన్న బస్టాండ్ దుస్థితితో ప్రయాణికులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ప్రసుత్తం కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారని, ఇప్పుడైనా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
కొత్త డిపోలు ఏర్పాటయ్యేనా!
హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలోని సగం పల్లెలకు, తండాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎక్కువ. విద్యార్థులు అధికంగా బస్సులను ఆశ్రయిస్తారు. కానీ అరకొర బస్సుల కారణంగా వారంతా ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లాలో కొన్ని చోట్ల డిపోలను నిర్మిస్తామని గతంలో నాయకులు హామీలిచ్చారు. కానీ వాటిల్లో ఏవీ నెరవేర్చలేదు. శరవేగంగా పెరుగుతున్న జిల్లా జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడటం లేదు. తాండూరు ఎమ్మెల్యే పి.మహేందర్రెడ్డి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో రవాణా వ్యవస్థ మెరుగవుతుందని ప్రజలు ఆశపడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతారని, డొక్కు బస్సుల స్థానంలో కొత్తవి ఇస్తారని, బస్టాండ్లను ఆధునికీకరిస్తారని, కొత్త డిపోలను ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్రెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో జిల్లా ప్రజలు రవాణా సౌకర్యాలు మెరుగు పడతాయని ఆశపడుతున్నారు. జిల్లాలో సుమారు 150కిపైగా ఉన్నతవిద్యా కళాశాలలున్నాయి. వీటితోపాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో చదివే విద్యార్థులు నిత్యం పలు ప్రాంతాలనుంచి రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 30వేలకు పైగా విద్యార్థులు నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తారని అంచనా. కానీ ప్రస్తుతం జిల్లాలో అరకొర బస్సులే తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో బస్సు డిపోలను సైతం నిర్మించాల్సి ఉంది. ఉన్న బస్టాండ్లలో అనేక సమస్యలున్నాయి. కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉండదు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. చిన్నగా ఉన్న బస్టాండ్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. దామరగిద్ద బస్డిపో నిర్మాణమెప్పుడో.. చేవెళ్ల, పరిసర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్నాయి. దీంతో బస్సుల అవసరం కూడా అధికమే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2012 డిసెంబరులో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి చేవెళ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని దామరగిద్ద వద్ద బస్డిపో నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. కానీ అక్కడ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ డిపో నిర్మాణానికి రెవెన్యూ అధికారులు రైతుల నంచి 8 ఎకరాలు తీసుకుని ఆర్టీసీకి ఇచ్చేశారు. కానీ రైతులకు మాత్రం ఇప్పటికీ పైసా పరిహారం ఇవ్వలేదు. ఇదే రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొయినాబాద్, శంకర్పల్లిలలో కూడా బస్డిపోలు ఏర్పాటుచేస్తామని నాయకులు హామీలిచ్చారు. మొయినాబాద్ సమీపంలో డిపో నిర్మాణానికి ముర్తుజగూడ వద్ద 18 ఎకరాల స్థలాన్ని చూశారు. ఆ పనులు ముందుకు సాగడం లేదు. బస్స్టేషన్లలో సమస్యలు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్స్టేషన్ల విస్తరణ చేపట్టాల్సి ఉన్నా.. ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే చేవెళ్ల బస్స్టేషన్లో అనేక సమస్యలున్నాయి. 1969లో అప్పటి సీఎం డాక్టర్. మర్రి చెన్నారెడ్డి కృషితో ఆరు ఫ్లాట్ఫాంల బస్స్టేషన్ నిర్మాణమైంది. అప్పటి నుంచి ఒక్క ప్లాట్ఫాంను విస్తరించలేదు. తాగడానికి నీళ్లుండవు. కంపుకొడుతున్న మూత్రశాలలే దిక్కు. అదే విధంగా షాబాద్, నాగరగూడ ప్రయాణ ప్రాంగణాలు చిన్నవిగా, సౌకర్యాలలేమితో ఉన్నాయి. నిత్యం వందలాది మంది విద్యార్థులు కళాశాలలకు వచ్చిపోతున్నా మొయినాబాద్లో కనీసం బస్స్టేషన్ కూడా లేదు. ఖానాపూర్, చిట్టెంపల్లి, కేతిరెడ్డిపల్లి, తదితర బస్స్టేజీల వద్ద బస్షెల్టర్లు నిర్మించాల్సి ఉంది. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్పల్లి, మొయినాబాద్లలో డిపోలు నిర్మిస్తామని గత పాలకులు హామీలిచ్చారు. కానీ నెరవేర్చలేదు. ఘట్కేసర్ మండలం కొండాపూర్లో డిపో నిర్మాణానికి ఆరు ఎకరాల భూమిని కేటాయించారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మహేశ్వరంలో బస్డిపో ప్రారంభమైనా సరిపోను బస్సులను కేటాయించలేదు. ఇచ్చిన కొన్ని కూడా డొక్కువే. మేడ్చల్ నియోజకవర్గం శామీర్పేట మండలం జవహర్నగర్లో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు 2012లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నేటికీ పనులు చేపట్టలేదు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్పహాడ్లో ఆర్టీసీ డిపో నిర్మాణానికి అధికారులు భూసేకరణ కోసం అన్వేషించారు. ఇందిరా ప్రియదర్శిని సొసైటీలో భూమిని అధికారులు పరిశీలించినా ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. -
వికారాబాద్ను జిల్లా కేంద్రం చేస్తాం
రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి తాండూరు, న్యూస్లైన్: వికారాబాద్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గురువారం పట్టణంలోని నిర్వహించిన పౌరసన్మాన కార్యక్రమానికి ఆయన తొలిసారి తాండూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న వికారాబాద్ను కచ్చితంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరైతే అది తాండూరులో ఏర్పాటయ్యేలా చూస్తానని, చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్న కార్మిక బీమా ఆస్పత్రి ఏర్పాటుకు సైతం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమ రంగారెడ్డిని విద్యాపరంగా అభివృద్ధి చేస్తానని, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పాటుపడతానన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తారని పేర్కొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, మైనార్టీలతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తారన్నారు. తాండూరు, యాలాల పీఏసీఎస్ చైర్మన్లు నారాయణగౌడ్, సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా రుణాల మాఫీ చేయించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, రవిగౌడ్, రవూఫ్, నరేందర్గౌడ్, వెంకటయ్య, అయూబ్ఖాన్, బాల్రెడ్డి, పి.నర్సింహులు, అజయ్ప్రసాద్, గాజీపూర్ నారాయణరెడ్డి, భరత్భూషన్, మున్సిపల్ కౌన్సిలర్లు విజయలక్ష్మి, నీరజ, శోభారాణి, పరిమళ, రజాక్, ఖవి, విజయాదేవి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. మంత్రికి ఘన స్వాగతం తాండూరు టౌన్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా గురువారం తాండూరుకు వచ్చిన మహేందర్రె డ్డికి టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. స్థానిక విలియంమూన్ చౌరస్తా నుంచి బైకు ర్యాలీ నిర్వహించారు పట్టణ మున్సిపల్ కమిషనర్ గోపయ్య తన సిబ్బందితో కలిసి కార్యాలయం వద్ద బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఓపెన్టాప్ జీపులో పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం స్థానిక క్లాసిక్ గార్డెన్స్లో పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు, కులసంఘాల నాయకులు, పలు అసోసియేషన్ల ప్రతినిధులు మంత్రిని ఘనంగా సన్మానించారు. భూకైలాస్ సందర్శన తాండూరు రూరల్: మండల పరిధిలోని అంతారం తండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానాన్ని మంత్రి మహేందర్రెడ్డి దర్శించుకున్నారు. తాండూరులో నిర్వహించిన సన్మాన సభ అనంతరం ఆయన భూకైలాస్ను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు వాసు నాయక్ పవార్ మంత్రిని సన్మానించారు. మంత్రి వెంట తాండూరు జెడ్పీటీసీ రవిగౌడ్, మాజీ ఎంపీపీ రాంలింగారెడ్డి, నాయకులు మాధవరెడ్డి, వడ్డె శ్రీను, శేఖర్ తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీ విభజనకు ఆమోదం
- హైదరాబాద్లోని ఆస్తుల పంపిణీపై పాలకమండలి చర్చ - కార్మిక సంఘాల అభిప్రాయాలను - ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం - అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా చర్యలు - కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు పచ్చజెండా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ(ఎపీఎస్ఆర్టీసీ)ను రెండుగా విభిజించేందుకు ఆర్టీసీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ(ఏపీఎస్ ఆర్టీసీ), తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ ఆర్టీసీ)గా విభజిస్తూ ఆర్టీసీ విభజన కమిటీ చేసిన ప్రతిపాదనకు గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈ మేరకు విభజన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు పంపారు. అక్కడి నుంచి అది గవర్నర్ కార్యాలయానికి చేరుతుంది. విభజన నేపథ్యంలో ఏ ప్రాంతంలోని ఆస్తులను ఆ ప్రాంతానికే కేటాయించే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు రాకున్నా, ఉమ్మడి రాజధానిగా ఉంటున్న హైదరాబాద్, దాని శివారులోని ఆర్టీసీ ఆస్తుల పంపకం విషయంలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాలపై పాలక మండలి చర్చించింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఆదాయం ద్వారా ఏర్పాటైన ఆస్తుల్లో జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలకు వాటా కల్పించే అంశంపై తెలంగాణ ప్రాంత కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తమకు వాటా ఉండాల్సిందేనని సీమాంధ్ర ప్రాంత కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బోర్డు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించింది. ప్రభుత్వం సూచనల మేరకు నడుచుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ప్రధాన పరిపాలనా భవనం, ఆర్టీసీ ఆసుపత్రి, కల్యాణమండపం, ప్రింటింగ్ ప్రెస్, బస్ బాడీ కేంద్రం తదితరాలను సీమాంధ్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో నిర్మించి ఆర్టీసీకి అందజేసిన పక్షంలో హైదరాబాద్లోని ఆస్తుల్లో వాటా అవసరం లేదంటూ సీమాంధ్ర సిబ్బంది పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం ముందుంచాలని బోర్డు నిర్ణయించింది. కాగా, తెలంగాణ రాష్ర్ట ఆర్టీసీకి ప్రత్యేక పాలకమండలి ఏర్పాటుకానుంది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులకు అందాల్సిన బకాయిలన్నింటినీ ఈ నెలాఖరులోపు చెల్లించాలని కార్మిక సంఘాల పక్షాన గుర్తింపు యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ పాలకమండలి సభ్యుడు పద్మాకర్ పేర్కొన్నారు. దీనికి బోర్డు సానుకూలంగా స్పందించింది. గత ఏడాది ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా మిగిలిన 1792 మంది కండక్టర్లు, 1655 మంది కాంట్రాక్టు డ్రైవర్ల సర్వీసుల క్రమబద్ధీకరణకు కూడా పాలకమండలి పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ వచ్చే సెప్టెంబరులో పూర్తికానుంది. తొలి విడతలో క్రమబద్ధీకరణ పొందిన వారికి చెల్లించాల్సిన దాదాపు రూ. 13 కోట్ల వేతన బకాయిల చెల్లింపునకూ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ లేనందున ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పాలక మండలి భేటీ జరిగింది. -
ప్రైవేటు వాహనాలకు అనుమతిస్తే...ఆర్టీసీకి నష్టాలే వస్తాయి!
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ప్రయివేటు వాహనాలకు రవాణ శాఖ మంత్రి ఇష్టానుసారంగా అనుమతినిస్తుంటే ఆర్టీసీకి న ష్టాలు కాకుండా లాభాలు ఎలా వస్తాయని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మయ్య ప్రశ్నించారు. ఎస్డబ్ల్యూఎఫ్ రీజియన్ కమిటీ సమావేశం శనివారం ఖమ్మంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రయివేటు వాహనాలకు రవాణ శాఖ మంత్రి అక్రమంగా పర్మిట్ ఇస్తున్నారని, ఆర్టీసీకి నష్టం వస్తున్నా పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాలైన టీఎంయూ, ఈయూ.. ప్రత్యేక తెలంగాణ-సమైక్యాంధ్ర సాధ్యమేనంటూ రెండుచోట్ల ఆందోళనకు దిగి, కార్మికులను మోసగిస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే ఐదువేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ విడిపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆ సంఘాలు చెప్పాలని డిమాండ్ చేశాశారు. సమావేశంలో రీజియన్ కార్యదర్శి గడ్డం లింగమూర్తి, రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎంఎన్.రెడ్డి, కార్యదర్శి సుందరయ్య, సహాయ కార్యదర్శి పిల్లి రమేష్, కోశాధికారి గుండు మాధవరావు, నాయకులు తోకల బాబు, సుధాకర్, నర్సింహారావు, సిహెచ్వికె.రెడ్డి, జాకబ్, ప్రతాప్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.