‘గడ్డి మందు’పై పోరాటం | - | Sakshi
Sakshi News home page

‘గడ్డి మందు’పై పోరాటం

Published Sun, Apr 13 2025 12:11 AM | Last Updated on Sun, Apr 13 2025 12:11 AM

‘గడ్డి మందు’పై పోరాటం

‘గడ్డి మందు’పై పోరాటం

● పారాక్వాట్‌ నిషేధానికి డాక్టర్ల సంఘం ఏర్పాటు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: దేశంలో ఎంతోమంది నిండు ప్రాణాలను బలితీసుకుంటు న్న గడ్డి మందు(పారా క్వాట్‌) నిషేధమే లక్ష్యంగా పోరాటానికి ఓ సంఘం ఏర్పాటైంది. రాష్ట్రంలో పలువురు ప్రైవేటు వైద్యులు కలిసి ‘డాక్టర్స్‌ అసోసియేషన్‌ అగెనెస్ట్‌ పారాక్వాట్‌ పాయిజనింగ్‌’ పేరుతో ఓ సొసైటీని రిజిస్ట్రేషన్‌ చేయించారు. మంచిర్యాల కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఖమ్మంకు చెందిన డాక్టర్‌ సతీశ్‌ నారాయణచౌదరి, ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెంది న డాక్ట రాకేశ్‌ చెన్న, ప్రధాన కార్యదర్శిగా వరంగల్‌కు చెందిన డాక్టర్‌ మానస మామిడాలతో సహా మరో ఆరుగురి వైద్యులతో కార్యవర్గం ఏర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ క్షణికావేశంలో గడ్డిమందు తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అనేక దేశాల్లో నిషేధించినా ఇక్కడ విరివిరిగా వాడకంతో అనర్థాలు ఉన్నాయని పేర్కొన్నా రు. ఈ విష రసాయన అమ్మకాలు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఈ పోరాటానికి స్వచ్ఛంద సంస్థలు, పౌరులు తమతో కలసి రావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement