మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

Published Wed, Apr 9 2025 1:07 AM | Last Updated on Wed, Apr 9 2025 1:07 AM

మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

భువనేశ్వర్‌: పోలీసు బ్యారక్‌ లోపల మహిళా (యువతి) కానిస్టేబుల్‌ మృతి అనుమానాస్పదంగా మారుతోంది. మృతురాలిని యశోద దాస్‌గా గుర్తించారు. ఈమె స్వస్థలం రెముణా పోలీస్‌ ఠాణా పరిధిలోని మందొర్‌పూర్‌ గ్రామం. బాలాసోర్‌ జిల్లా పోలీసు బ్యారక్‌ లోపలి ప్రాంగణంలో మంగళవారం ఈ విషాద సంఘటన హృదయం కలచి వేసిందని తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. తెల్లవారు జామున బ్యారక్‌ లోపల యశోద వేలాడుతూ ఉండటాన్ని తోటి కానిస్టేబుళ్లు గమనించారు. వారు ఆమెను రక్షించడానికి సమయం వృధా చేయకుండా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు.

మృతురాలి సోదరుడు టుటు దాస్‌ మాట్లాడుతూ .... పోలీసులు ఆమె ఫోన్‌, చాట్‌ వివరాలను పరిశీలించాలని అభ్యర్థించాడు. తన సోదరితో సంబంధం ఉన్న వారి కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని భోరుమన్నాడు. ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభ్యం కాలేదని పోలీసులు ప్రకటించారు. బాలాసోర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని, ప్రారంభ పరిశోధనల ప్రకారం ఈ విషాదం వెనుక వ్యక్తిగత కారణాన్ని సూచిస్తున్నాయని ఆయన ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement