కోనసీమలో మంత్రి అచ్చెన్నకు జనసేన కార్యకర్తల షాక్ | Jana Sena Workers Shock Minister Atchannaidu In Konaseema | Sakshi
Sakshi News home page

కోనసీమలో మంత్రి అచ్చెన్నకు జనసేన కార్యకర్తల షాక్

Published Wed, Feb 5 2025 7:43 PM | Last Updated on Wed, Feb 5 2025 8:03 PM

Jana Sena Workers Shock Minister Atchannaidu In Konaseema

సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి  జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చారు. పి.గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది.

జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్‌ పేరు పలకరా అంటూ నిరసన వ్యక్తం చేశారు.

జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించక పోవడంతో టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. దీంతో వివాదం మరింత ముదిరింది. షాక్‌ తిన్న అచ్చెన్నాయుడు సభ నుంచి వెళ్లిపోయారు.

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement