ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారు | People Rejected BJP In CESS Elections: Says KTR | Sakshi
Sakshi News home page

ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారు

Dec 27 2022 1:12 AM | Updated on Dec 27 2022 1:12 AM

People Rejected BJP In CESS Elections: Says KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్ల సహ­కార విద్యుత్‌ సరఫరా సొసైటీ (సెస్‌) ఎన్నికల్లో బీజేపీ­ని ప్రజలు మళ్లీ తిరస్కరించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి­డెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవా­రం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.  అడ్డదారిలో గెలుపుకోసం బీజేపీ చేసిన కుటిల ప్రయత్నాలకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారన్నారు.

సంస్కరణల పేరిట విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించి, కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయ త్నాలకు ఇది చెంపపెట్టులాంటిందన్నారు. వ్యవ సాయ మోటార్లకు మీటర్లు, ఉచిత విద్యుత్‌ రద్దు, సబ్సిడీ విద్యుత్‌ ఉండదని ప్రజలు భావించినందునే బీజే పీని తిరస్కరించారని పేర్కొ న్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ బీజేపీ పట్ల వ్యతిరే కత ఉందనేందుకు సెస్‌ ఎన్ని కల ఫలితాలే నిదర్శనమన్నారు.

సెస్‌ ఎన్నికల్లో విజయంతో బీఆర్‌­ఎస్‌ నాయ కత్వం, ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. సెస్‌ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, మౌలిక వసతుల కల్పన.. తదిత­రాలపై దృష్టి సారిస్తామన్నారు. రైతులు, కుల వృత్తుల వారికి, దళిత, గిరిజనులకు రాయి­తీలు ఇస్తూ, మరోవైపు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తు­న్నామన్నా­రు. భవిష్యత్తు అవసరాల­ను దృష్టిలో పెట్టుకుని భారీగా మౌలిక వసతు­ల కల్పన, విద్యుత్‌ ఉత్పత్తి వంటి అంశాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులు, నాయకు­లకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement