ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద హైటెన్షన్‌ | Police Security At Mla Arikepudi Gandhi House | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు

Published Sun, Sep 15 2024 11:43 AM | Last Updated on Sun, Sep 15 2024 1:01 PM

Police Security At Mla Arikepudi Gandhi House

సాక్షి,హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం(సెప్టెంబర్‌15) పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. డీసీపీ, ఏసీపీలతో పాటు భారీగా పోలీసులు గాంధీ నివాసం వద్ద మోహరించారు.  గాంధీ నివాసానికి రావాలని బీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ శ్రేణులకు ఫోన్లు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. 

గాంధీ ఇంటి వద్ద  దాదాపు 300 మంది ఫోర్స్ ను అందుబాటులో ఉంచారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కసారిగా రావొచ్చని ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకే భద్రత పెంచినట్లు తెలుస్తోంది. గాంధీ నివాసం పరిసరాల్లో గత నాలుగు రోజులుగా పోలీసుల ఆంక్షలతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.  గాంధీకి ఇంటి వెళ్లే దారిలో మొత్తం మూడు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో సవాళ్లు, ప్రతిసవాళ్ల తర్వాత గాంధీ అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలు గాంధీ ఇంట్లో భేటీ అవుతామని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్‌  నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు చేశారు. దీంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు అనిపించినప్పటికీ తాజాగా బీఆర్‌ఎస్‌ నాయకులు మళ్లీ గాంధీ ఇంటికి రావొచ్చనే సమాచారంతో పోలీసులు మళ్లీ అప్రమత్తమయ్యారు. 

ఇదీ చదవండి.. ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్తత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement