సాక్షి, ఆదిలాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్ ఖేల్ ఖతం అవుతుందని, దుకాణం బంద్ అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తుందని,6గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నిర్వహించిన విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు.
ఆ రెండేళ్లు రైతుబంధు ఎలా ఇచ్చారు?
‘ప్రజలకు ఏమీ చేయని బీఆర్ఎస్కు ఓటెందుకు వేయాలి? తెలంగాణ వచ్చినా ఇక్కడి ప్రజలకు నీళ్లు.. నిధులు అందలేదు.. నియామకాలు జరగలే దు. సీఎం అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. ధరణి రాకముందు రెండేళ్లు రైతుబంధు ఎలా ఇచ్చారు? వైఎస్ హయాంలో రైతులకు రుణమాఫీ చేయలేదా? పైగా ధరణి తెచ్చి దందాలు చేసి భూములు కొల్లగొట్టారు.
అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో కొత్త మెరుగైన సాంకేతికతను తీసుకొస్తాం. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని నిరూపిస్తే మేము నామినేషన్లు కూడా వేయం. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది కాంగ్రెస్సే. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు, హనుమంతుడి గుడి లేని ఊరు లేదు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మేము ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగండి..’అని రేవంత్ సవాల్ చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒకటే..
‘బీజేపీకి ఓటు వేసినా బీఆర్ఎస్కు వేసినట్టే. ఈ రెండు పారీ్టలు ఒకటే. కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం అని గతంలో మాట్లాడిన మోదీ.. నిన్న మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేసీఆర్ను చూసి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారు? కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తెలంగాణకు వచ్చి మోదీ తొండను కూడా పట్టలేకపోయారు. కమీషన్ల కక్కుర్తితోనే మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయింది.. సుందిళ్ల త్వరలో పోతుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్..’అని ఆరోపించారు.
గుజరాత్లో బీసీని సీఎం చేయాలి..
‘బీజేపీ పది రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఒక్క రాష్ట్రంలోనే బీసీని సీఎం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముగ్గురు బీసీలను ముఖ్యమంత్రుల్ని చేసింది. తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని చెబుతున్న మోదీ.. ముందు గుజరాత్లో బీసీని సీఎం చేయాలి. తెలంగాణలో బీజేపీకి వంద స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు. కాంగ్రెస్లో కోట్లు ఉన్నోళ్లకే టిక్కెట్లు ఇస్తారని బీఆర్ఎస్ సన్నాసులు ప్రచారం చేస్తున్నారు. డబ్బులు లేకపోయినా ఖానాపూర్లో వెడ్మ బొజ్జుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కనిపించడం లేదా?..’అని రేవంత్ ప్రశ్నించారు.
ఆదివాసీ, లంబాడాల పంచాయితీ తెంచేస్తాం
‘దళిత, గిరిజనులపై కాంగ్రెస్కు ఉన్న ప్రేమ ఇంకెవరికీ లేదు. లంబాడాలు, ఆదివాసీలు నాకు రెండు కళ్ల లాంటివారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీరి మధ్య ఉన్న పంచాయతీ తెంచుతాం. పోడు భూములకు పట్టాలిచ్చి వాటిని అమ్ముకునే హక్కు కల్పిస్తాం. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత మాది. గిరిజనేతరుల భూములకు రక్షణ కల్పిస్తాం. కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఇస్తే పదేళ్లయినా ఈ ప్రభుత్వం వర్సిటీ ఏర్పాటు చేయలేదు. కేసీఆర్ ధన దాహానికి ప్రాణహిత–చేవెళ్ల బలైపోయింది. కడెం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కడితే.. ఈ ప్రభుత్వం దాని నిర్వహణ చూసుకోలేకపోతోంది..’అని విమర్శించారు.
టికెట్ రానివారికి సముచిత స్థానం
‘కాంగ్రెస్ టికెట్ రాని వారికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎవరూ భావోద్వేగానికి లోను కావద్దు.. క్షణికావేశానికి గురికావద్దు.. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో ఓటర్లు తేల్చుకోవాలి. కేసీఆర్ను పొలిమేరలు దాటే వరకు తరమాలి..’అని రేవంత్ అన్నారు. ఖానాపూర్ అభ్యర్థి వెడ్మ బొజ్జు, ఎమ్మెల్యే రేఖానాయక్, ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలతో కేసీఆర్ ఖేల్ ఖతం: రేవంత్రెడ్డి
Published Thu, Nov 9 2023 5:07 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Kalki 2898 AD : ప్రమోషన్స్కి భారీ ప్లాన్..నెల రోజుల్లో ఎన్నో సర్ప్రైజెస్!
నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
పిల్లలు నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు: శ్రీకాంత్
లెహంగాలో అదిరిపోతున్న జాన్వీ..ఆ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటంటే..!
దిశ ఎఫెక్ట్: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా
కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరీక పోకడనా?: కేటీఆర్ కౌంటర్
చిరుత హీరోయిన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్తోనే భయపెట్టేశారు!
మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డ్...
Janhvi Kapoor: మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్లో జాన్వీ బిజీ బిజీ..క్రికెట్ థీమ్ నెక్లెస్..!
తప్పక చదవండి
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
- ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
- అంతర్జాతీయ బర్గర్ దినోత్సవం: ఎలా తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసా..!
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- పపువా న్యూ గినియా విపత్తుపై ప్రధాని మోదీ ట్వీట్
- తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
- ప్రజా భవన్లో ముగిసిన తనిఖీలు..
- పడిలేసిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
Advertisement